ముంబై లోకల్‌ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల | Sakshi
Sakshi News home page

ముంబై లోకల్‌ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల

Published Sun, Feb 25 2024 5:47 AM

Nirmala Sitharaman takes Mumbai local train, clicks selfies with passengers - Sakshi

ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ముంబై లోకల్‌ ట్రైన్‌లో ఘాట్‌కోపర్‌ నుంచి కళ్యాణ్‌ దాకా దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణికులంతా ఆమెతో సెలీ్ఫలు తీసుకున్నారు. ముంబై సబర్బన్‌ రైళ్లలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

నిర్మలతో ప్రయాణికుల సెలీ్ఫలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. లోకల్‌ రైలు ప్రయాణ కష్టాలను కొందరు మహిళా ప్రయాణికులు ఆమెకు ఏకరవు పెట్టారు. గతేడాది నవంబర్‌లో కేరళలో నిర్మల వందేభారత్‌ రైలులో ప్రయాణించి
అందులోని ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు.

Advertisement
Advertisement