టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్‌సీపీలోకి వీరశివారెడ్డి | Sakshi
Sakshi News home page

టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్‌సీపీలోకి వీరశివారెడ్డి

Published Thu, Apr 25 2024 2:11 PM

Kamalapuram Ex MLA Veera Siva Reddy Joined YSRCP CM Jagan Presence

వైఎస్‌ఆర్‌, సాక్షి: ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి షాకిస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు.

ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్‌ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైఎస్సార్‌సీపీలో చేరా. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. వైఎస్సార్‌సీపీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే. ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తా. 

.. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు. ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి రావడమే ఖాయం.  

Advertisement
Advertisement