-
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్సీపీ లీగల్ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు. -
తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం
తాడిపత్రి టౌన్: ‘ఏమ్మా.. నీకొడుకు ఇంట్లో లేడా వస్తే ఓ సారి స్టేషన్కు రమ్మను...ఏరా ఎక్కడున్నావ్..సార్ పిలుస్తున్నాడు స్టేషన్కు వచ్చి కనపడు’ అని పోలీసులు చెబుతుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం గ్రామాల్లో జల్లెడపడుతున్నారు. దీంతో పోలీస్ బూటు చప్పుళ్ల మధ్య పల్లెల్లో భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది.ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో నెలకొన్న అల్లర్ల కేసులతో పల్లెల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. యువకులు కనిపిస్తే చాలు పోలీస్ స్టేషన్కు తీసుకు వెళుతుండడంతో గ్రామాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు గ్రామాలు వదిలి పారిపోతున్నారు. దీంతో గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు మాత్రమే కనిపిస్తూ గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.తమ పిల్లలు ఎక్కడున్నారో..ఏం చేస్తున్నారో..ఎప్పుడు ఏం జరుగుతుందోనని వృద్ధ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లకు తమ పిల్లలకు ఏం సంబంధమని కొంతమంది యువకుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, ఏకపక్ష ధోరణి, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే తాడిపత్రిలో అల్లర్లు జరిగాయని జనం చెబుతున్నారు. ఎప్పుడు ఈ సమస్య సద్దుమణుగుతుందో..తమ పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారోనని పల్లెల్లో వృద్ధులు ఎదురు చూస్తున్నారు. -
తాడిపత్రి ఘటనలో 91 మందికి రిమాండ్
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు. -
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
విత్తుపై దృష్టి సారించని వ్యవసాయశాఖ
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సమీపిస్తున్నా... విత్తన పంపిణీ ఏర్పాట్లపై వ్యవసాయశాఖ ఇంకా దృష్టి సారించలేదు. జూన్ నుంచి కీలకమైన ‘ముంగారు’ మొదలు కానుంది. రైతులకు అవసరమైన వేరుశనగ, కందులు, పచ్చిరొట్ట, పెసలు, అలసంద, రాగులు, సజ్జ, మొక్కజొన్న తదితర విత్తనాలు ఏటా రాయితీతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా మే చివరి వారం నుంచి పంపిణీ కొనసాగించారు. అయితే ఈ సారి సాధారణ ఎన్నికలు ఉన్నందున రాయితీ విత్తనం గురించి పట్టించుకోలేదు. ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విత్తన సన్నాహక చర్యలపై దృష్టి సారించాల్సిన వ్యవసాయ శాఖ ఇంకా ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాలేదని చెబుతున్నారు. దీంతో ఈ సారి విత్తన పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో లక్ష క్వింటాళ్ల వరకు కే–6, 1812–రకం విత్తన వేరుశనగ అవసరం ఉంది. ఈ పాటికి వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో విత్తన సేకరణ, ప్రాసెసింగ్ కార్యక్రమం జరగాల్సి ఉంది. విత్తన సేకరణ (ప్రొక్యూర్మెంట్) ధర క్వింటా రూ.9,700 ప్రకారం నిర్ణయించినట్లు అనధికారిక సమాచారం. ఇందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులు రైతుల నుంచి విత్తనం సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాట్మెంట్, సేల్స్ ప్రైసెస్, సబ్సిడీ, పంపిణీ మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురవడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. కొందరు జూన్ రెండు, మూడో వారంలోనే ముందస్తుగా వేరుశనగ విత్తనం వేసే అవకాశం ఉన్నందున వారికి విత్తనం అందించడానికి వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ -
డ్రోన్.. ఖర్చులు తగ్గించెన్!
బొమ్మనహాళ్: అన్నదాతలు సాగులో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. సంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునికత వైపు వేగంగా అడుగులు వేస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. లాభసాటి వ్యవసాయం దిశగా సాగుతున్నారు. ఇప్పటికే కాడెద్దుల స్థానంలో ట్రాక్టర్లు వచ్చేశాయి. నాట్లు, కలుపుతో పాటు వరి కోతల వరకూ యంత్రాల ద్వారానే జరుగుతోంది. తాజాగా రసాయన ఎరువులు, మందుల పిచికారీలో సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పొలాల్లో పురుగుల మందును చల్లేందుకు డ్రోన్లను వినియోగిస్తూ హైటెక్ సాగుకు బాటలు వేస్తున్నారు. బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు మోహన్రెడ్డి తన పొలంలో సాగు చేసిన పత్తి పంటకు బుధవారం డ్రోన్ సహాయంతో పురుగుల మందును పిచికారీ చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. 8 ఎకరాల పత్తి పంటకు ఏటా కూలీలతో క్రిమి సంహారక మందు పిచికారీ చేయించేవాడు. దీంతో కొంతమేర నష్టం కలిగేది. ఈ క్రమంలోనే డ్రోన్ సహాయంతో పిచికారీ చేయవచ్చని తెలుసుకొని కణేకల్లు మండలం యర్రగుంట గ్రామానికి చెందిన కొందరిని సంప్రదించాడు. గంటకు రూ.400 చొప్పున ఒప్పందం చేసుకుని పత్తి పంటకు మందు పిచికారీ చేయించాడు. డ్రోన్ వినియోగంతో కూలీల కొరత తీరడంతో పాటు పురుగుల మందు నష్టం కూడా తగ్గిందని రైతు తెలిపాడు. సాగు ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నట్లు చెప్పాడు. సమయం కూడా కలిసి వస్తోందని పేర్కొన్నాడు. -
హోరాహోరీగా ‘ఏసీఎల్ –2’
అనంతపురం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనంతపురం క్రికెట్ లీగ్ –2 హోరాహోరీగా సాగుతోంది. బుధవారం దినేష్ గ్రానైట్స్, యునైటెడ్ చాంపియన్ క్రికెట్ క్లబ్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచి దినేష్ జట్టు బ్యాటింగ్ చేసింది. 18.5 ఓవర్లలో 144 పరుగులు వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని బ్యాటర్ ఆష్రఫ్ 47 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. యునైటెడ్ జట్టు బౌలర్ రాజకుల్లాయప్ప నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యునైటెడ్ జట్టు 17.5 ఓవర్లలో 118 పరుగుల వద్ద చతికిలబడింది. జట్టులో అర్జున్టెండూల్కర్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆష్రఫ్కు ప్రకటించారు. అలాగే అనంత రైజింగ్ స్టార్, ఇండియన్ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ స్టార్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేష్ వర్మ 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 37 పరుగులు, బి. ప్రశాంత్ 46 బంతుల్లో 52 పరుగులు, ఎంకే దత్తారెడ్డి 23 బంతుల్లో 33 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇండియన్ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించి ఓటమి పాలైంది. -
భవిష్యత్తులో మరిన్ని సీట్లు
పీజీ సీట్ల పెంపుతో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది. ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు తనిఖీ చేసినప్పుడు ఇక్కడి మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారానే పీజీ సీట్లు వంద దాటాయి. రానున్న రోజుల్లో మరిన్ని పీజీ సీట్లు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మాణిక్యరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత స్వల్పంగా తగ్గింది. ఆగ్నేయం నుంచి నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు వీచాయి.
నిఘా నీడలో జీజీహెచ్ ● నూతనంగా 109 కెమెరాల ఏర్పాటు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిఘా వ్యవస్థ పటిష్టమవుతోంది. సర్వజనాస్పత్రిలోని వివిధ విభాగాల్లో మొత్తం 109 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్, లేబర్, గైనిక్ వార్డులు, ఓపీ, ఐపీ బ్లాక్, సర్జరీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆర్థో, ఎఫ్ఎం, ఎంఎం, చెస్ట్ వార్డు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో వైద్యులు, రోగి బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. వైద్యులు, రోగి సహాయకులు దాడులు చేసుకునే పరిస్థితి తలెత్తింది. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరిది తప్పో తెలియక చర్యలు తీసుకోలేని పరిస్థితి. అదేవిధంగా పలు విభాగాల వద్ద వాహనాలు చోరీకి గురవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈఎన్టీ వార్డులో ఓ పీజీ విద్యార్థి సెల్ఫోన్ చోరీకి గురైంది. ఇలాంటి వాటన్నింటికీ ఇకపై చెక్ పడనుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో రోగులు, వైద్యులకు మరింత భద్రత ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. -
ఖాకీ సహకారం.. పచ్చమూక స్వైరవిహారం!
తాడిపత్రి అర్బన్: కొందరు పోలీసుల నిర్లక్ష్యపు తీరు కారణంగానే తాడిపత్రివాసుల ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పోలింగ్ రోజున టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి వంద మంది యువకులను బైకుల్లో వెంట బెట్టుకుని వీధుల్లో హంగామా చేయడం, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి చంద్ర ఓబుళరెడ్డికి చెందిన వాహనంలో తిరుగుతూ పచ్చ మూకను వెంటేసుకుని వీధుల్లో స్వైరవిహారం చేయడమే పట్టణంలో శాంతిభద్రతల విఘాతానికి కారణమైన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా విహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి అడ్డు చెప్పాల్సిన పోలీసులు ఎక్కడా ఆ పని మాత్రం చేయలేదు. కానీ, వైఎస్సార్ సీపీ నాయకులను మాత్రం టార్గెట్ చేసినట్లు వ్యవహరించారు. ఏఎస్పీ రామకృష్ణ అయితే ఒక అడుగు ముందుకు వేసినట్లుగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి హర్షవర్దన్రెడ్డి అనుమతులకు లోబడే వాహనంలో ప్రయాణిస్తున్నా పలుమార్లు అడ్డుకుని అభ్యంతరం చెప్పారు. ఇదే క్రమంలో పచ్చ గూండాలు రెచ్చిపోయి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడికి పాల్పడినా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం ఎక్కడిక్కడ అడ్డుకుని బలవంతపు ఆంక్షలు విధించారు. ఇలా అడుగడుగునా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే తాడిపత్రిలో ఉద్రిక్తతలకు కారణమైంది. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా స్థానికులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ.. పోలీసులకు మూడో నేత్రంగా భావించే నిఘా వ్యవస్థ తాడిపత్రిలో నిద్రావస్థలోకి జారుకుంది. తాడిపత్రి పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది ఫ్యాక్షన్. జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా తాడిపత్రి పోలీసు రికార్డుల్లోకెక్కింది. ఎన్నికలంటేనే తాడిపత్రిలో దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటాయి. అలాంటి తాడిపత్రిలో నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన నిఘా వ్యవస్థ నిద్రావస్థలో జారుకుందనడానికి సోమ, మంగళవారాల్లో జరిగిన అల్లర్లే నిదర్శనం. పోలింగ్ ఏజెంట్పై దాడి జరిగిన వెంటనే జరగబోయే పరిణామాలను ముందే పసిగట్టి, పరిస్థితులను ఉన్నతాధికారులకు చేరవేసి ఇరుపార్టీల వారిని నిలువరించాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోనే లేదు. దీంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయి పచ్చ మూక తో కలిసి ప్రశాంత పట్టణంలో నిప్పు రాజేశారు. ఉన్నతాధికారులనూ తప్పుదోవ పట్టించి.. నిఘా విభాగంలో పని చేసే కొందరు అధికారులు తమకు ముందస్తుగా వచ్చిన సమాచారాన్ని పై అధికారులకు చేరవేయకుండా ఏమీ జరగదు, జరగలేదని తప్పుడు సమాచారమిస్తూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించి పబ్బం గడుపుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాడిపత్రిలో నిఘా విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు ఫైర్ అయినట్లు తెలిసింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే తాడిపత్రిలో ప్రశాంతతకు భంగం అనుచరులతో జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి హల్చల్ చేస్తున్నా పట్టని ఏఎస్పీ రామకృష్ణ దాడులు, అల్లర్లను ముందస్తుగా పసిగట్టి నియంత్రించడంలో నిఘా వ్యవస్థ విఫలం -
No Headline
అనంతపురం మెడికల్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనంతపురం బోధనాస్పత్రికి మహర్దశ వచ్చింది. 2000 సంవత్సరంలో ఏర్పాటైన బోధనాస్పత్రికి పీజీ సీట్లు రావడానికి 18 ఏళ్లు పట్టింది. మౌలిక వసతులు సమకూర్చకపోవడంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో పీజీ సీట్లు రాలేదు. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల సంక్షేమమే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేసి మౌలిక వసతులు కల్పించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పీజీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. దాదాపు 70 వరకూ సీట్లు మంజూరయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వైద్య కళాశాలలో పీజీ సీట్ల సంఖ్య 112కు చేరింది. ప్రైవేటుకు దీటుగా సేవలు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాకే ప్రభుత్వ బోధనాస్పత్రి బలోపేతమైందంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కోవిడ్ విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు పెద్ద సంఖ్యలో వైద్యులు, స్టాఫ్నర్సులు, పారామెడికల్, క్లాస్ 4 సిబ్బందిని నియమించింది. ఇదే క్రమంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్ల ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయడంతో ప్రైవేటుకు దీటుగా 7 రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 24 గంటలూ మెరుగైన వైద్యం ప్రస్తుతం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోజూ 2,500 ఓపీ(అవుట్పేషెంట్), 1,300 ఐపీ (ఇన్పేషెంట్) సేవలందుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, చిత్తూరు, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి రోగులు వచ్చి సేవలు పొందుతున్నారు. రూ.లక్షలతో కూడుకున్న ఖరీదైన వైద్యం ప్రజలకు ఉచితంగా అందుతోంది. గైనిక్ విభాగంలో రోజూ 20 నుంచి 25 ప్రసవాలు జరుగుతున్నాయి. సర్జరీ, ఆర్థో, ఈఎన్టీ తదితర విభాగాలకు సంబంధించి రోజూ 30 వరకూ సర్జరీలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనతోనే ఇదంతా సాధ్యమవుతోంది. వీటన్నింటినీ పరిశీలించిన ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) బోధనాస్పత్రికి గణనీయ సంఖ్యలో పీజీ సీట్లు మంజూరు చేసింది. ఇకపై పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు 24 గంటలూ సేవలందించేందుకు వీలుంటుంది. దీంతో సర్వజనాస్పత్రిలో వివిధ విభాగాల ద్వారా రోగులకు, ప్రత్యేకంగా గైనిక్, ఆర్థో, సర్జరీ, అనస్తీషియా తదితర విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందనున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బోధనాస్పత్రికి మహర్దశ పెరుగుతూనే ఉన్న ‘పీజీ’ సీట్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 70 సీట్ల దాకా పెంపు ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించడంతోనే భారీగా సీట్ల మంజూరు రోగులకు ఉత్తమ సేవలందేలా చొరవ -
ఓట్ల పండుగ.. అతివలదే హవా
అనంతపురం అర్బన్: ఓటు వేసే విషయంలో మహిళలు ఎప్పుడూ ముందంజలో ఉంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ విషయం రుజువైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 20,18,162 ఉండగా 26,54,257 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషుల ఓట్లు 8,17,536 (49.95 శాతం), మహిళల ఒట్లు 13,11,031 (50.05 శాతం) పోలయ్యాయి. పురుషల ఓట్లు కంటే మహిళల ఓట్లు 0.10 శాతం ఎక్కువ ఉండడం గమనార్హం. 2014 ఎన్నికల్లో... 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో 29,81,914 మంది ఓటర్లు ఉండగా, అప్పట్లో 23,75,318 ఓట్లు పోలయ్యాయి. పురుషుల ఓట్లు 12,11,213 (50.99 శాతం), మహిళల ఓట్లు 11,64,105 (49.01 శాతం) పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్ల్లు కేవలం 1.98 శాతం తక్కువ. అతివల ఓట్లే కీలకం.. మహిళలు ప్రలోభాలకు లొంగరు. వారు చాలా విజ్ఞతతో వ్యవహరిస్తారు. నాయకులు తమకు ఇచ్చిన హామీలు ఏమిటి..? అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎంత వరకు నెరవేర్చారు..? దాని వల్ల ఎంత మేర తాము ప్రయోజనం పొందాము..? ఎంత మేర నష్టపోయాము..? ఇలా ప్రతిదీ బేరీజు వేసుకుంటారు. తదనుగుణంగా తమ ఓటు ఎవరికి అనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చి ఆ మేరకు ఓటు వేస్తారనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో అతివల ఓట్లే అభ్యర్థుల భవితవ్యం తేల్చడంలో కీలకం కానున్నాయి. ఎన్నికల్లో మహిళల ఓటింగ్ 50.04 శాతం నమోదు పురుషుల కంటే ఎక్కువగానే ఓట్లు -
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం
తాడిపత్రి అర్బన్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం జరిగిన అల్లర్ల అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోని గదులకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఎవరూ ఊహించని రీతిలో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ నిద్రిస్తున్న పని మనుషులను నిద్రలేపి ఇంటి తలుపులు తీయాలని బలవంతం చేశారు. తమ వద్ద తాళాలు లేవని చెప్పడంతో పోలీసులు అక్కడే ఉన్న వంట చేసే కబ్గిరి(పెద్ద పొడవైన గరిటె)తో ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను పగులగొట్టి హార్డ్ డిస్క్లను మాయం చేశారు. కాన్ఫరెన్స్ హాలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడున్న ఫ్యాన్, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులుపోలింగ్ రోజు నుంచి తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీ గూండాలను రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. పోలింగ్ రోజున కూడా టీడీపీ నేతల వైపు వారు కన్నెత్తి చూడకుండా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి వందలాది మంది అనుచరులను వెంటేసుకుని రోడ్లపై హల్చల్ చేసినా వారించలేదు. ప్రభాకర్రెడ్డి అల్లుడు దీపక్రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని తిరిగినా పోలీసులు ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా టీడీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నా ఆయన ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. మంగళవారం ఘర్షణల అనంతరం డీఐజీతో సహా రాయలసీమ జిల్లాల నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకున్నాయి. కానీ ఎమ్మెల్యే ఇంటి ముందు మాత్రం నామమాత్రపు బందోబస్తు ఏర్పాటు చేసి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు. అంతేగాకుండా సోమ, మంగళవారాల్లో జరిగిన దాడులతో ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. వారిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరికొందరిని కౌన్సెలింగ్ పేరిట ఇష్టారాజ్యంగా కొడుతున్నట్లు సమాచారం. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష వైఖరి, తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.మీడియాపై ఎస్పీ ఆంక్షలుతాడిపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిథులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గొడవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకూడదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాస సమీపంలో అదనపు ఎస్పీ రామకృష్ణతో బందోబస్తుపై ఆయన సమీక్షిస్తుండగా ఫొటోలు తీస్తున్న ఓ విలేకరిపై ఆయన చిందులు తొక్కారు. సెల్ ఫోన్ తీసుకోండంటూ అక్కడే ఉన్న తన గన్మన్లను ఆదేశించారు. -
ఏపీలో అరుదైన క్షీరదం గుర్తింపు
అనంతపురం: కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ బాలసుబ్రమణ్యం గుర్తించారు. అరుదైన జాతికి చెందిన క్షీరదంగా నిర్ధారించారు. పొడుచుకు వచ్చినట్టు ఏనుగు తొండంలా, కదలికలు గల మూతి భాగం(రోష్ట్రం) నిర్మాణ శైలిని కలిగి వెడల్పాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం కలిగి ఉంది.సొరిసిడే కుటుంబానికి చెందిన ఈ క్షీరదం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని సహజ నివాసం ఉష్ణ లేదా ఉష్ణమండల పొడి అడవులు మాత్రమే. డీఎన్ఏ అనాలిసిస్ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డెహ్రాడూన్)కు పంపించారు. ఇప్పటి దాకా పేరు లేని జీవి» ప్రస్తుతం గుర్తించిన ఈ అరుదైన జీవికి ఇప్పటి దాకా ఎలాంటి పేరు లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీవ వైవిధ్యం పెంపొందించేలా మియావాకీ అడవులను పెంచుతున్నారు. ఇందులోనే దీనిని గుర్తించారు. » ఈ జాతి అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, మానవ కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తుంది. రక్షిత ఆవాసాలలో గూడు కట్టుకుని నివసిస్తుంది. ఆకులు, అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర గూడు పదార్థాలను సేకరించి, ఆపై గూడును నిర్మించడానికి ఒక రహస్య ప్రాంతాన్ని కనుగొంటాయి. » చిట్టెలుకలు ప్రధానంగా కీటకాహారులు. ఇవి 82 శాతం కీటకాలను తింటాయి. కొన్ని సార్లు మొక్కలను, విత్తనాలను తింటాయి. అలాగే అనేక రకాల అకశేరుకాలు, మానవ ఆహార పదార్థాలను కూడా తింటాయి. » ఇవి రాత్రి పూట ఎక్కువగా అడవులు, సాగు చేసిన పొలాలు, మానవ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటాయి. కీటకాలు, తెగుళ్లు రాకుండా అరికడతాయి. రైతులకు కీటకాలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.పొడి అడవుల్లో మాత్రమేజీవించే అరుదైన జీవికొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని ఎస్కేయూలో గుర్తించాం. పొడి అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన జీవి ఇది. డీఎన్ఏ అనాలిసిస్ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డెహ్రాడూన్)కు పంపాము.– డాక్టర్ బాలసుబ్రమణ్యం, జువాలజీ విభాగం టీచింగ్ అసిస్టెంట్, ఎస్కేయూ -
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్:ఓట్ల లెక్కింపు(కౌంటింగ్) కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జేఎన్టీయూలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సిద్ధం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు, ఆర్ఓ టేబుల్, కౌంటింగ్ టేబుళ్లు, కేంద్రంలో ఇనుప కంచె, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చే మార్గం లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. అక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించి తగిన సూచనలు, ఆదేశాలిచ్చారు. ఎలుగుబంటి కలకలం బొమ్మనహాళ్: మండలంలోని దేవగిరి, ఉద్దేహాళ్, శ్రీనివాస్ క్యాంపు గ్రామాల శివార్లలో ఓ ఎలుగుబంటి మంగళవారం కలకలం సృష్టించింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో చెట్టుపైకి ఎక్కింది. కాసేపటికే దేవగిరి కొండల్లోకి పరుగులు తీసింది. ఎలుగుబంటి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. రైతులు పత్తి పొలాల్లోకి వెళ్లాలంటే ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. న్యూస్రీల్ -
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. దరఖాస్తులకు జూన్ 14 వరకూ అవకాశం కల్పించారు. రూ.1,000 అపరాధ రుసుంతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 3,000 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో జూలై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతపురం కేఎస్ఎన్ డిగ్రీ బాలికల కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ● ఒక్కో సబ్జెక్టుకు రూ.1000, రెండు సబ్జెక్టులు రూ.3,000, మూడు సబ్జెక్టులు ఆపైన ఫెయిల్ అయి ఉంటే రూ.4,000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం ఉత్తీర్ణులై, మూడో సంవత్సరంలో పరీక్షలు రాయకుండా ఉంటే రూ.3,000 అదనంగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ● 1994–95 విద్యా సంవత్సరం నుంచి 2014–15 విద్యా సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ● 2008–09 విద్యా సంవత్సరం నుంచి రాయలసీమ వర్సిటీ ఏర్పాటైన నేపథ్యంలో.. అంతకుముందు ఎస్కేయూ పరిధిలో చదువు కున్న కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ● అభ్యర్థులు గతంలో పరీక్ష రాసిన హాల్టికెట్ గానీ, మార్క్స్కార్డు గానీ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఎంతోమందికి ఊరట.. గతంలో అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేని వారు, బ్యాక్లాగ్స్ (ఫెయిల్ అయినవారు) ఉన్నవారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని ఇటీవలే ఎస్కేయూ ఉన్నతాధికారులు తీసుకున్నారు. డిగ్రీ ఫెయిల్ అయి పట్టా పొందలేని పరిస్థితుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యే సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా, వాటిన్నింటినీ రాయడానికి వీలు కల్పించారు. -
కాయ్ రాజా కాయ్..
● జిల్లాలో జోరుగా బెట్టింగ్లు సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపునకు 20 రోజులు గడువు ఉండగా, అప్పుడే బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా వైఎఎస్సార్పీ అభ్యర్థులు గెలుస్తారనే మెజార్టీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలకు తోడు పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి పనులతో జన మంతా అధికార పార్టీ వైపే మొగ్గు చూపారని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆ పార్టీ గెలుస్తుందనే పందేలు వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడు స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ గెలుస్తుందని బెట్టింగ్ కడుతున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకవాసులు కూడా మన జిల్లాకు సంబంధించి పలు స్థానాలపై బెట్టింగ్లు వేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు గెలుస్తారనే దానిపైనే కాకుండా ఆయా స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, కూటమి అభ్యర్థులు ఎంత చిత్తుగా ఓడతారనే దానిపై కూడా పందెం కాస్తున్నట్లు సమాచారం. ఎన్ఎస్జీ కమాండర్ ఆత్మహత్య కొత్తచెరువు: ఎన్ఎస్జీ కమాండర్గా పనిచేసే మండలానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన బోయ నరసింహులు కుమారుడు చెన్నుడు (34) ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సాం రైఫిల్స్లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన చెన్నుడు...ఆ తర్వాత వీవీఐపీల రక్షణ బాధ్యతలు చూసే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) విభాగానికి బదిలీ అయ్యారు. శిక్షణ నిమిత్తం రెండు నెలల క్రితం ఢిల్లీకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీ రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తడి కారణంగానే చెన్నుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మంగళవారం చెన్నుడు మృతదేహాన్ని స్వగ్రామం ఎర్రబల్లికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
ట్రాలీ బోల్తా – వ్యక్తి మృతి
వజ్రకరూరు: ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన బోయ సురేష్ (30)కు భార్య సునీత, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్న సురేష్ మంగళవారం ఉదయం తన సహచరులు వన్నూరు స్వామి, చిన్నమల్లితో కలసి ట్రాక్టర్లో బండలు వేసుకుని వజ్రకరూరుకు బయలుదేరారు. మరి కాసేపట్లో గమ్య స్థానానికి చేరుకుంటారనగా... ట్రాక్టర్ ఇంజన్కు సంబంధించిన పెద్ద టైర్ బరస్ట్ కావడంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ట్రాలీ బోల్తాపడడంతో సురేష్పై బండలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మళ్లీ మా ప్రభుత్వమే
అనంతపురం కార్పొరేషన్: మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమే అని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ అండగా నిలిచారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పోలింగ్ రోజు రాత్రి 11 గంటల వరకూ కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారన్నారు. జగనన్నకు జై కొట్టిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కృషితో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందన్నారు. జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని, లేకుంటే బీజేపీలో విలీనమవుతుందని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్న జిల్లా పోలీసులకు అభినందనలు తెలియజేశారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఛీ కొట్టినా పచ్చ మూకలకు బుద్ధి రావడం లేదన్నారు. సమావేశంలో తాడిపత్రి మార్కెట్యార్డు చైర్మన్ హరినాథ్ రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగు : పార్టీ అధ్యక్షుడు పైలా -
ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. జేఎన్టీయూలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో ఆయా నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు మంగళవారం తెల్లవారుజాముకు వాహనాల ద్వారా జేఎన్టీయూకు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు వాటిని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో స్వాధీనం చేశారు. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే ప్రక్రియను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్, ఎన్నికల కమిషన్ సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్నాథ్ ఝ సమక్షంలో అధికారులు మంగళవారం నిర్వహించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి వాటికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ల్లో ఉంచిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. వాటికి సంబంధించిన ఫారాలను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్రూమ్లకు కలెక్టర్, పరిశీలకులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేశారు. సీల్పై కలెక్టర్, పరిశీలకులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. పటిష్ట బందోబస్తు నిర్వహించాలి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 24 గంటలూ నిఘా ఉంచాలన్నారు. స్ట్రాంగ్రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలన్నారు. గదులవైపు ఏ ఒక్కరూ రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు ఉన్నారు. ‘అసెంబ్లీ’ల్లో 81.10.. ‘పార్లమెంట్’ 80.53 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగిందంటే ఓటు వేసేందుకు ప్రజలు ఏస్థాయిలో ఉత్సాహం చూపారనేది స్పష్టమవుతోంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ 81.10 శాతం నమోదైంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం (ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు) పరిధిలో 80.53 శాతం పోలింగ్ నమోదయ్యింది. 2019 ఎన్నికల కంటే ఈ ఎనికల్లో పోలింగ్ శాతం 0.3 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం. అప్పటి ఎన్నికల్లో 80.80 శాతం పోలింగ్ కాగా ఈ ఎన్నికల్లో 81.10 శాతం నమోదయ్యింది. కళ్యాణదుర్గంలో అత్యధికం.. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20,18,161 ఓట్లు ఉండగా 16,36,648 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుఫులు 8,17,536 మంది(49.95శాతం),మహిళలు 8,19,004 మంది (50.04 శాతం), ఇతరులు 108 మంది(0.01శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అత్యధికంగా 88.89 శాతం పోలింగ్ నమోదయ్యింది. అధిక సంఖ్యలో మహిళల ఓట్లే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పురుషుల ఓట్లు 49.89 శాతం, మహిళల ఓట్లు 50.10 శాతం, ఇతరుల ఓట్లు 0.08 శాతంగా నమోదయ్యాయి. అనంతపురం పార్లమెంట్ పరిధిలోకి రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురం పార్లమెంట్ పరిధిలోకి వెళుతుంది. రాప్తాడు మినహా ఏడు నియోజకవర్గాల పరిధిలో 17,67,591 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 14,23,441 మంది (80.53 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 7,10,187 మంది(49.89 శాతం), మహిళలు 7,13,148 మంది (50.10 శాతం), ఇతరులు 106 మంది (0.08 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
No Headline
● ఒత్తిళ్లకు కాసింత విరామం ఎన్నికల దృష్ట్యా ఒకట్రెండు నెలలు కాదు... దాదాపు ఎనిమిది నెలలుగా వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యనే గడిపిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోలింగ్ ముగియడంతో మంగళవారం కాస్త రిలాక్స్ అయ్యారు. కుటుంబసభ్యులతో కలసి ఆహ్లాదంగా గడిపారు. వంట చేయడంలో సిద్ధహస్తులైన వారు స్వయం పాకం చేసి ఇంటిల్లిపాదికి పెట్టి ఆనందించారు. కొన్ని నెలలుగా తాము పడిన ఒత్తిడికి విరామం ప్రకటిస్తూ ఆనందోత్సాహాలతో సందడి చేశారు. -
సౌకర్యవంతంగా వైద్య సేవలు
అనంతపురం మెడికల్: ఇటీవల ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన ఓపీ, ఐపీ బ్లాక్ ఎంతో ఉపయోగకరంగా మారింది. సర్వజనాస్పత్రిలో వివిధ విభాగాల్లో పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.3.5 కోట్ల నిధులు కేటాయించింది.ఈ నిధులతో అన్ని విభాగాలు అధునాతనంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఆస్పత్రిలో ఉన్న ఓపీ బ్లాక్లో ఓపీ టికెట్ పొందాలంటే పురుషులు, మహిళలు చాలా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు చెక్క పెడుతూ ఆస్పత్రి ఆవరణలోని ఓపీ బ్లాక్లో రెండు గదుల్లో పురుషులు, మహిళలు, వికలాంగులు, తదితరుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నూతన ఓపీ బ్లాక్ ఏర్పాటుపై రోగులు, వారి సహాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం కల్చరల్: బ్రాహ్మణ విద్యార్థినీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా ప్రతిభ గల పేద బ్రాహ్మణ విద్యార్థినులకు ఉపకార వేతనాలందిస్తున్నారు. ఈ మేరకు ఆ సంఘం కార్యదర్శి రమాదేవి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 6వ తరగతి నుంచి పీజీ చదువుతున్న ప్రతిభ కల్గిన పేద విద్యార్థినులు అర్హులు. పూర్తి వివరాలకు 9703789201, 9490130999లో సంప్రదించవచ్చు. -
పథకం ప్రకారం అంతమొందించేందుకు కుట్ర
తాడిపత్రిరూరల్: పథకం ప్రకారం తనను అంతమొందించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగించాడని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ పనిచేశారని ఆరోపించారు. నా ఓటమి చూడాలన్న లక్ష్యంతో పనిచేసిన ఆయన త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలకు ప్రత్యక్షంగా జేసీ ప్రభాకర్రెడ్డి కారణమైతే, వారికి రామకృష్ణ మద్దతిచ్చి పరోక్షంగా కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు జేసీ ప్రభాకర్రెడ్డిని రానీయొ ద్దని రిటర్నింగ్ అధికారి చెప్పినా రామకృష్ణ పట్టించుకోలేదన్నారు. వందలాది మంది అనుచరులతో పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించాడన్నారు. పోలింగ్ ఏజెంట్గా ఉన్న తన పెద్దకుమారుడు హర్షవర్దన్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసి డ్రైవర్ తప్ప మరెవరు ఉండకూడదని హెచ్చరించాడన్నారు. ఒక పథకం ప్రకారం తనతోపాటు తన కుటుంబాన్ని అంతమొందించడానికి జేసీతో పాటు కుట్ర పన్నారని మండిపడ్డారు. దాడులకు దిగిన పచ్చ మూకపై కాకుండా తనపై అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. ఇలాంటి అధికారిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. టీడీపీ వర్గీయులు రాళ్ల దాడులకు దిగుతున్నా ఎంతో సహనంతో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను భయపడితే ఓటింగ్కు రారన్న భ్రమలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయాడని, అయితే, ఆయన భ్రమలను తారుమారు చేస్తూ ఓటర్లు తండోపతండోలుగా తరలివచ్చి వైఎస్సార్ సీపీకి మద్దతు ప్రకటించారన్నారు. ఇలాంటి ప్రజా చైతన్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ‘జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా నా తలలో వెంట్రుక కూడా పీకలేకపోయారు. గతంలో నాపై కక్ష కట్టిన అధికారులు ఇప్పుడు ఏమయ్యారో, ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. ప్రజల అండతో త్వరలో మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది. నేడు రాక్షసంగా వ్యవహరించిన పచ్చ మూకను, వారికి సహకరించిన ఏ ఒక్క అధికారినీ వదిలి పెట్టేది లేదు. నాపై బనాయించిన కేసులపై కోర్టులో న్యాయ పోరాటం చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి జేసీ అరాచకాలకు చరమగీతం పాడుతా’ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగడానికి కారణమైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. జేసీ ప్రభాకర్ తొత్తులా ఏఎస్పీ రామకృష్ణ ఇలాంటి పోలీసును నా రాజకీయ జీవితంలో చూడలేదు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధ్వజం -
అందరి సహకారంతో..
రోటరీ క్లబ్ అంటే అంతర్జాతీయంగా సేవా తత్పరతకు చిరునామాగా నిలిచింది. సేవాభావం ఉన్న వారు రోటరీ క్లబ్లో సభ్యులవుతున్నారు. ఆ సభ్యుల భార్యలు ఇన్నర్వీల్ సంస్థలో సభ్యులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము స్వతంత్రంగా ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను ఇప్పటి వరకూ విజయవంతంగా నిర్వహించాం. మరెన్నో కార్యక్రమాలను రూపొందించాం. కలెక్టర్తో పాటూ అధికారులందరి సహకారం తీసుకుంటున్నాం. సేవలో సంతృప్తి పొందాలనుకునేవారికి ఇన్నర్వీల్ క్లబ్ చక్కటి మార్గం. – పీటీ పద్మ, చైర్పర్సన్, ఇన్నర్వీల్ క్లబ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement