-
ముహూర్త బలం
● నేటి నుంచి 25వ తేదీ వరకు స్వీకరణ ● మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాట్లుసాక్షి, సిద్దిపేట: లోక్సభ ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహూర్తాలను చూసుకుంటున్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెదక్ కలెక్టరేట్లో, జహీరాబాద్ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థుల నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీకరిస్తారు. నిర్ణీత సమయాల్లో సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు సమాయత్తం.. అభ్యర్థులు వారి పేరు మీద ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులు సూచించిన తేదీల్లో సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. మంచి రోజు మొదటి సెట్ వేసి తర్వాత భారీ ర్యాలీల ద్వారా వెళ్లి మిగతా సెట్లను వేయనున్నారు. బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్ గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను అయోధ్యలోని బాలరాముడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 20న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేయనున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే స్వతంత్రులు కూడా ముహూర్తాలను చూసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ : ఏప్రిల్ 18 తేదీ నుంచి.. చివరి గడువు : ఏప్రిల్ 25 పరిశీలన : ఏప్రిల్ 26ప్రక్రియ ఇలా.. ఓట్ల లెక్కింపు : జూన్ 4 పోలింగ్ తేదీ : మే 13 ఉపసంహరణకు గడువు : ఏప్రిల్ 29రానున్న ముఖ్యనేతలు ప్రధాన పార్టీలు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థుల వెంట ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థులు పలువురిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు హాజరు కానున్నారు. 20న మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు, మంత్రులు హాజరుకానున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ర్యాలీ చేపట్టనున్నారు. కార్యక్రమానికి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు రానున్నారు. -
కల్యాణ వైభోగమే..
బాజా భజంత్రీలు, భక్తజన హర్షధ్వానాలు, బ్రహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదిన వేళ మెదక్లోని కోదండ రామాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతులు సైతం కల్యాణ మహోత్సవంలో భాగస్వాములయ్యారు. పలువురు దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. – మెదక్మున్సిపాలిటీ -
నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు
ఎస్పీ బాలస్వామి మెదక్మున్సిపాలిటీ: నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఇందుకోసం సెంట్రల్ ఫోర్స్, ఆర్ముడ్, సివిల్ ఫోర్స్తో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్ నుంచి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హామీలను అమలు చేస్తాం పెద్దశంకరంపేట(మెదక్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉత్తులూర్కు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, రాంచందర్, పెరుమాండ్లుగౌడ్, ఎంపీటీసీ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం హవేళిఘణాపూర్(మెదక్)/నిజాంపేట: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హవేళిఘణాపూర్ మండలంలోని గాజుల్వయి తండాలో ఈదురుగాలులకు కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తండావాసులు రాత్రంతా చీకట్లోనే గడిపారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సరిహద్దుల్లో పటిష్ట నిఘా కంగ్టి(నారాయణఖేడ్): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రఫీయొద్దీన్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిఽహద్దుల్లో ఉన్న మండల పరిధిలోని దెగుల్వాడి చెక్పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. ఎకై ్సజ్ పోలీసు కానిస్టేబుల్ సాయులు, ఏఈఓ సంతోష్ ఉన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు గజ్వేల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్పూర్ సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కిషన్రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్, అహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
సన్నాలకు ఫుల్ డిమాండ్
● క్వింటాల్కు రూ.2,500 చెల్లింపు ● జోరుగా ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సన్న ధాన్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. క్వింటాల్కు మద్దతు ధర రూ. 2,500 చొప్పున చెల్లించి వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర కంటే క్వింటాల్కు రూ. 297 అధికంగా రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 2.63 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందుకు గానూ 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అంచనా వేసిన అధికారులు 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 2.3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు కాగా 60 వేల ఎకరాల్లో సన్న రకం సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర రూ. 2,203 చొప్పున చెల్లిస్తోంది. సన్నరకం సాగు చేసిన రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.2,500 చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు క్వింటాల్కు రూ. 2,203 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాల్పై రైతుకు రూ.297 అదనంగా వస్తుండడంతో అన్నదాతలు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. మార్కెట్లో సన్న బియ్యం ధరలు సైతం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశం ప్రస్తుతం వ్యాపారులు సన్నాలను క్వింటాల్ రూ. 2,500 చెల్లించి కొనుగోలు చేస్తుండగా 10 రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాలకు పైగా సన్నాలను సాగు చేశారు. ధాన్యం చేతికందిన మొదట్లో వ్యాపారులు క్వింటాల్కు రూ. 2,400 చొప్పున చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేశారు. అనంతరం మరో 15 రోజుల తర్వాత క్వింటాల్కు రూ. 2,800 చెల్లించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో క్వింటాల్కు రూ.400 ధర పెరిగింది. తగ్గనున్న ధాన్యం దిగుబడి యాసంగి సీజన్లో 1.34 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. రైతులు ఎక్కువగా బోరుబావుల ఆధారంగా వరి సాగు చేశారు. భూగర్భజలాలు అడిగంటిపోవడంతో చాలా వరకు బోర్లలో నీటి ఊటలు తగ్గి పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. నాలుగెకరాల్లో సన్నాలు సాగు చేశా నాలుగెకరాల్లో ఆర్ఎన్ఆర్ సన్న రకం వరి పంట సాగు చేశాను. సుమారు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ. 2,500 చొప్పున విక్రయించాను. కొనుగోలు కేంద్రాల కంటే క్వింటాల్కు రూ. 297 అదనంగా లాభం వచ్చింది. – బాబు, గవ్వలపల్లి తండా -
నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి తుది ఓటరు జాబితా సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఓటర్ స్లిప్పులు ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అలాగే మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వన్షి బుధవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. సమావేశంలో డీఆర్ఓ పద్మ, ఆర్డీఓలు రమా దేవి, జయచంద్రారెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బియ్యానికే పరిమితం!
ఎక్కువ ధరకు బయట కొంటున్నాంకంట్రోల్ షాపుల్లో చక్కెర కిలో ధర రూ.13.50 ఉండేది. ప్రస్తుతం బయట రూ. 40 కిలోకు కొంటున్నాం. గతంలో కందిపప్పు, ఫాం ఆయిల్, గోదుమలు, కిరోసిన్, చింతపండు, కారం ఇచ్చే వారు. కాని ఇప్పుడు అవి కనిపించడం లేదు. ధరలు ఎక్కువైనా బయట కొంటున్నాం. ఇప్పటికై నా జొన్నలు, గోదుమలు, నూనెలు సరఫరా చేయాలి. – శ్రీశైలం, ముద్దాపురం పాపన్నపేట(మెదక్): నిరుపేదలకు చౌక ధరలకే నిత్యావసర వస్తువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం రాను రాను నీరు గారి పోతుంది. రేషన్ షా పులను సూపర్ మార్కెట్లుగా మారుస్తామన్న వాగ్దానాలు నీటి మూటలవుతున్నాయి. కేవలం ఉచిత బియ్యం పంపిణీకే రేషన్ షాపులు పరిమితం అవుతున్నాయి. చక్కెర గోధుమలు కాన రావడం లేదు. పప్పులు, కిరోసిన్ మాటే మరిచారు. ఒకప్పుడు పంపిణీ చేసిన ఆరురకాల నిత్యావసరాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. దీంతో ధరలు మండుతున్నా పేదలు కిరాణ దుకాణాలను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 520 రేషన్షాపులు 2,13,863 రేషన్కార్డులు, 6,85,901 లబ్ధిదారులు ఉన్నారు. నెలకు 36,264 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. గతంలో నిరుపేదలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించే వారు. గతంలో చక్కెర, మంచి నూనె, కిరోసిన్, గోధుమలు సరఫరా చేసేవారు. మధ్యలో కంది పప్పు, చింత పండు, కారం,ఉప్పు లాంటి నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు. చక్కెర ధరకు రెక్కలు రేషన్షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు పంపిణీ చేయాల్సి ఉంది. చౌకధరల దుకాణంలో కిలో చక్కెర రూ.13.50, అదే బహిరంగ మార్కెట్లో రూ.40 ఉంది. అంటే దాదాపు మూడు రెట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అలాగే గోధుమలు కిలో రూ.7 ఉండగా, బయట మార్కెట్లో రూ.30 నుంచి 35 వరకు పలుకుతుంది. అంత్యోదయ కార్డు ఉన్నవారికి 35 కిలోల బియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు ఇవ్వాలి. కాని కేవలం కొన్ని పట్టణాల్లో మాత్రమే గోధుమలు, చక్కెర సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పల్లెల్లో మాత్రం బియ్యం తప్ప ఇతర వస్తువులు కనిపించడం లేదు. గతంలో పండగల పూట చక్కెర డబుల్ కోటా ఇచ్చే వారు. కానీ ఇప్పుడు చక్కెర జాడే కనిపించడం లేదు. సమతులిత ఆహారంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు, పప్పులు, నూనెలు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తే నిరుపేదలకు మేలు చేకూతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. చౌక ధరల దుకాణాలను సూపర్ మార్కెట్లుగా మారుస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. కాని ప్రస్తుతం ఉన్నవే మూత బడే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పాపన్నపేట ఎమ్మార్వో లక్ష్మణ్బాబును వివరణ కోరగా గోదాంల నుంచి చక్కెర రావడం లేదని తెలిపారు. బియ్యం తప్ప ఇతర వస్తువులు సరఫరా కావడం లేదన్నారు. ● రేషన్ దుకాణాల్లో కానరాని చక్కెర, గోధుమలు ● మరిచిన పప్పులు, కిరోసిన్ రేషన్ కార్డులు : 2,13,863 లబ్ధిదారులు : 6,85,901 -
మొక్కుతున్న..
● సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను పండవెట్టిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి ● లిల్లీపుట్ ప్రభుత్వం మెదక్కు సింగూరు నీళ్లివ్వలేదు ● సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ బహిరంగసభబుధవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024సభలో పాల్గొన్న జనంఎన్ని జన్మలెత్తినా ఈ గడ్డ రుణం తీర్చుకోలేను : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు నీటిని తెచ్చి నిర్మించతలపెట్టిన ఈ రెండు ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ఎందుకు ఎండబెట్టాలని చూస్తుందో ప్రజ లు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూరు మండలం సుల్తాన్పూర్ శివారులో మంగళవారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాళేశ్వరం జలాలు రావాలన్నా.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు పూర్తి కావాలన్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. గతంలో అధికారంలో లిల్లీపుట్ కాంగ్రెస్ ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు నీటిని హైదరాబాద్కు తరలించి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చుక్కనీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సింగూరు జలాల కోసం ఎన్ని ధర్నాలు, ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. మెతుకుసీమ రుణం తీర్చుకోలేను రాజకీయంగా తాను ఎంతో ఎత్తుకు ఎదగడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఈ మెదక్ జిల్లా తనకు బలమిచ్చిందని, ఈ మెతుకు సీమకు రెండు చేతులెత్తి మొక్కుతున్నానని కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. ఈ జిల్లా ప్రజల ఆశీర్వాదం లేకపోతే తనకు ఈ స్థాయి వచ్చేదే కాదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్రావు నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యే స్థానాలను సాధించిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే తెలంగాణ హక్కుల సాధన సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్ని జన్మలెత్తినా మెతుకు సీమ రుణం తీర్చుకోలేనన్నారు. తెలివి ఉన్నోడు, లేనోడు బీఆర్ఎస్కు ఇప్పుడు ఓట్లేందుకు.. సీట్లేందుకు అని అంటున్నారని, ఇప్పుడే బీఆర్ఎస్కు ఓట్లు, సీట్లు కావాలని కోరారు. తనను ఆనాడు గెలిపించకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. పాలిచ్చే బర్రెను వదిలేసి.. దున్నపోతుకు గడ్డేస్తే ప్రయోజనం ఉండదని, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు ఓటేస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. న్యూస్రీల్ మెతుకుసీమకు -
రేపటి నుంచి నామినేషన్లు
మెదక్జోన్/మెదక్కలెక్టరేట్: రేపటి నుంచి ఈనెల 25వరకు నామినేషన్ల పక్రియ కొనసాగుతుందని ప్రతిఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నామినేషన్లకు మెదక్ కలెక్టరేట్లోని సమావేశ హాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3వరకు పనిదినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీక రించనున్నట్టు తెలిపారు. అభ్యర్థితో పాటు మొత్తం ఐదుగురు మాత్రమే రావచ్చని, వంద గజాల దూరంలోనే ర్యాలీలు, వాహనాలు నిలిపివేయాలన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్లో వారి ఆస్తులు, కేసుల గురించి వెల్లడించాలన్నారు. క్రిమినల్ కేసులు ఉన్నవారు వివరాలను 29లోపు మూడు సార్లు దినపత్రికలతో పాటు, లోకల్ ఛానల్స్లో విధిగా అడ్వటైజ్మెంట్ ఇవ్వా లని చెప్పారు. రాజకీయపార్టీల నాయకులు అధికారులకు సహకరించాలని, అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఎప్పటి కప్పుడు లెక్కలు కట్టేందుకు ప్రత్యేక నిఘాపెడతారన్నారు. నిఘా ముమ్మరం.. నామినేషన్ల పక్రియ ప్రారంభం అయ్యాక చెక్ పోస్టుల వద్ద మరింత నిఘా ముమ్మరం చేయనున్నట్టు కలెక్టర్ చెప్పారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు 19మంది వద్ద నుంచి మొత్తం రూ.28,89,830 సీజ్ చేయగా అందులో 11మంది సరైన డాక్యుమెంట్లు చూపించడంతో రూ. 15,21, 730ల నగదును విడుదల చేశామని, మరో 8 మందికి సంబంధించి రూ.13,68,100 ఉందని.. డాక్యు మెంట్లు చూపిస్తే విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులపై 4కేసులు నమోదు చేశారని, అందులో ఒక్క అభ్యర్థి ఓటర్లకు రూ.200 చొప్పున పంచుతుండగా కేసు నమోదు చేయగా, మరో అభ్యర్థిపై 3 కేసులు పెట్టామన్నారు. అలాగే కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 98,490లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని, దాని విలువ రూ.93,53,003 ఉందన్నారు. అభ్యర్థిఖర్చు రూ.95లక్షలు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రూ.95లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని కలెక్టర్ తెలిపారు. అభ్య ర్థులు రూ.10వేల వరకు మాత్రమే క్యాష్రూపంలో ఖర్చు చేయవచ్చని అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడితే చెక్రూపంలో లేదా ఆన్లైన్ ద్వారా మాత్రమే ఖర్చు చేయాలని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ నిర్వణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మెదక్ ఆర్డీఓ రమాదేవి, తూప్రాన్ ఆర్డీఓ జై చంద్రారెడ్డితో కలిసి కలెక్టరేట్ ఆవరణలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలిచ్చారు. నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, వందమీటర్ల దూరం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్ల పూర్తి ప్రక్రియను సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ మధ్య చేపట్టాలని ఆదేశించారు. 18నుంచి 25 వరకు అవకాశం అభ్యర్థితోపాటు ఐదుగురికే అనుమతి అఫిడవిట్లో ఆస్తులు, కేసులు వెల్లడించాలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ -
ఆరుగ్యారంటీల అమలులో విఫలం
నర్సాపూర్: అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీల అమలులో విఫలం చెందిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డితోపాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినప్పటికీ కార్యకర్తలంతా తమ వెంటే ఉన్నారన్నారు. కొందరు వారి స్వార్థం కోసం కాంగ్రెస్లోకి వెళ్లారని ఆరోపించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం కోసం కష్టపడి పని చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు డిసెంబరులో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పడు ఆగస్టులో చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు. సమావేశంలో చంద్రాగౌడ్, శేఖర్, సత్యంగౌడ్, సూరారం నర్సింహులు, గోవర్దన్రెడ్డి, మహేందర్రెడ్డి, శ్రీశైలం, విఠల్, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు మా వెంటే.. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
చెక్పోస్టులు పెంచుతాం
పెద్దశంకరంపేట(మెదక్): ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మరిన్ని చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ బాలస్వామి చెప్పారు. మంగళవారం రాత్రి పెద్దశంకరంపేట మండలం కోళాపల్లి 161వ జాతీయ ప్రధాన రహదారి పాత టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో అదనంగా మూడు చెక్పోస్టులను ఏర్పా టు చేస్తామని, ఇప్పటి వరకు 7చెక్పోస్టులుండగా 10కి పెంచుతామన్నారు. డీఎస్పీ డాక్టర్ రాజేశ్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐ శంకర్ తదితరులున్నారు. -
నీటి ఎద్దడిపై స్పందించరా?
మెదక్ కలెక్టరేట్: అధికారుల నిర్లక్ష్యంతో వారం రోజులుగా టేక్మాల్ మండలం కుసంగి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు అల్లాడిపోతున్నారని, పనిచేయని అధికారులపై చర్యలు తీసుకొని తాగునీటి సమస్య పరిష్కరించాలని టేక్మాల్ కోఆప్షన్ సభ్యుడు సర్దార్ డిమాండ్ చేశారు. జెడ్పీచైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టేక్మాల్ కో ఆప్షన్ సభ్యుడు యూసుఫ్ మాట్లాడుతూ మండుతున్న ఎండలతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే స్పందించని అధికారులు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా బ్యాంకుల అధికారులు వృద్ధుల పెన్షన్ ఇవ్వకుండా బాకీలలో జమ చేసుకుంటున్నారని, దీంతో వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఎమ్మెల్సీ శేరి సుభాస్రెడ్డి స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులను హెచ్చరించారు. అనంతరం పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిజాంపేట జెడ్పీటీసీ పంజావిజయ్కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయశాఖ అధికారి గోవింద్ స్పందించి త్వరలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ‘భగీరథ’ అధికారులపై సభ్యులు ఆగ్రహం వాడీవేడిగా జెడ్పీ సమావేశం ఉచిత విద్యుత్ బిల్లులు రావడం లేదు అర్హులందరికీ ఉచిత విద్యుత్ బిల్లులు రావడం లేదని నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. గొల్లకుర్మలు డీడీలు కట్టి ఏడాది అవుతున్నా గొర్రెలు ఇవ్వక పోవడం దారుణమని సభ్యులు వెటర్నరీ అధికారి వెంకటయ్యను నిలదీశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కోసం తమను నిలదీస్తున్నారని వెంటనే వారికి జీతాలు ఇప్పించాలని డీపీఓను కోరారు. కోరం లేకపోవడంతో జెడ్పీ సమావేశం రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, సుభాస్రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే..
సాక్షి, సిద్దిపేట: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమన్వయకర్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డికి ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఏర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరుకు మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, నర్సాపూర్కు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్కు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డిని నియమించారు. అలాగే దుబ్బాకకు మనోహర్రావు, గజ్వేల్కు జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, సిద్దిపేటకు ఫారూఖ్ హుస్సేన్లు నియమితులయ్యారు. జహీరాబాద్కు దేవిశ్రీప్రసాద్ రావు, అందోల్కు డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నారాయణఖేడ్కు మఠం భిక్షపతి, కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, ఎల్లా రెడ్డికి తిరుమల్ రెడ్డి, బాన్సువాడ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, జుక్కల్కు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు. -
అబద్ధాలతో రేవంత్ పాలన :హరీశ్
సంగారెడ్డి : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలైతే కాంగ్రెస్కు ఓటెయ్యాలని.. లేదంటే కారు గుర్తు ఓటేసి గెలిపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ కోరారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్తేనే హామీల అమలుకు కొట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ చాలాచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ చేశారని, 24 గంటల కరెంటు నుంచి 12 గంటలకు తగ్గించారని పేర్కొన్నారు. తాగునీటి కష్టాలు పెరిగిపోయాయని చెప్పారు. రేవంత్ అబద్దాలతోనే పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనలో ఒక్క మంచి కార్యక్రమమైనా చేసిందా అని ప్రశ్నించారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్కటైనా తెలంగాణకు ఇచ్చారా అని నిలదీశారు. విదేశాల్లో నుంచి నల్ల ధనం తెచ్చి పంచుతామన్నారు.. 20 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందన్నారు. మతాలతో బీజేపీ పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డిని తానే ఒప్పించి బరిలో ఉంచానని చెప్పారు. గాలి అనిల్కుమార్ ఉద్యమకారుడు అని.. వీళ్లిద్దరిఇని గెలిస్తే ప్రజలకు సేవ చేస్తారని పేర్కొన్నారు. -
తప్పుడు ఆరోపణలతో కేసులు
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చేగుంట(తూప్రాన్): బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు తనపై తప్పుడు ఆరోపణలతో ఎన్నికల కమిషన్, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వడియారంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం చేగుంట, నార్సింగి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ తరఫున తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు నియోజకవర్గ కేంద్రాల ను అభివృద్ధి చేయిస్తానని హామీఇచ్చారు. పేదలకోసం ఫంక్షన్ హాళ్లను నిర్మించి ఒక్కరూపా యికే ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మాట్లాడు తూ ఈ ఎన్నికల్లో రఘునందన్రావు ఓటమి ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు నారాయణరెడ్డి, బాబు, ఎంపీపీ సబిత, జెడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టొద్దు జిల్లా వ్యవసాయాధికారి గోవిందు చిలప్చెడ్(నర్సాపూర్): వచ్చే సీజన్ ప్రారంభం నాటికి ఎరువుల దుకాణాల నిర్వాహకులు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి గోవిందు సూచించారు. మంగళవారం ఆయన ఏడీఏ పుణ్యవతితో కలసి మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రం, పీఏసీఎస్ సోమక్కపేట్, ఫైజాబాద్ గ్రామంలో గల రైతు ఉత్పత్తిదారుల కేంద్రాలను సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బాల్రెడ్డి, ఏఈఓ భూపాల్, పీఏసీఎస్ సీఈఓ పోచయ్య, ఫర్టిలైజర్ నిర్వాహకులు శ్రీనివాస్, రమేశ్, నర్సింహులు, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు ఆటంకం కల్గించడం నేరం జూనియర్ సివిల్ జడ్జి అనిత నర్సాపూర్: ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకుండా అడ్డుకోవడం చట్టరీత్యానేరమని జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ కె.అనిత హెచ్చరించారు. మంగళవారం ఆమె మా ట్లాడుతూ ఈ విషయమై చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీంతో తమ కమిటీ ప్రతినిధులు న్యాయవాది స్వరూపరాణి, ఎస్ఐ పుష్పరాజ్ తదితరులను ఆయా పాఠశాలలకు పంపి విచారణ చేయించినట్లు చెప్పారు. ఫీజుల కోసం విద్యార్థులను క్లాసు బయట కూర్చుండ పెట్టడం, పరీక్షలకు అనుమతించబోమని హెచ్చరించడం సరికాదని ఆయా యాజామాన్యాలకు వివరించారని ఆమె తెలిపారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు పాఠశాల ల వివరాలు ఎంఈఓకు అందజేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విద్యను పొందేహక్కు ఉంటుందని, ఫీజుల పేరుతో వారి హక్కులను హరించి చదువుకు ఆటంకం కల్గిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఆయా పాఠశాలలపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని జడ్జి కె.అనిత హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన రామాయంపేట(మెదక్): పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, తొనిగండ్లలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట సహకార సంఘం సీఈవో నర్సింహులు, రైతులు ఉన్నారు. -
కొనుగోలులో జాప్యం చేయొద్దు
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు నర్సాపూర్: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లు తేమశాతం 16కు రాగానే వాటిని తూకంవేసి కొనుగోలు చేయడంలో జాప్యం చేయొద్దని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం సాక్షిలో వచ్చిన కొను ‘గోడు’ కథనానికి ఆయన స్పందించి నర్సాపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వడ్లలో తేమ శాతం చూడాలని సిబ్బందికి ఆదేశించి తేమ శాతం 16వస్తే వెంటనే వడ్లను తూకం వేయాలని పీఏసీఎస్ సీఈఓ వెంకటస్వామిని ఆదేశించారు. తేమ ఎక్కువగా వడ్లను బాగా ఆరబెట్టాలని ఆయన రైతులకు సూచించారు. అనంతరం మండలంలోని చిప్పల్తుర్తిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి సూచనలిచ్చారు. ఆయన వెంట స్థానిక ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎఫెక్ట్ -
అమలు కాని హామీలతో మోసం
● మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వట్పల్లి(అందోల్): అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న తొలి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 70 లక్షల మంది రైతులకు, 50 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ హామీలకు ఏడాదికి రూ.3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. అమర వీరుల స్థూపం వద్ద దండ వేయకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ అవమాన పరిచారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే రేవంత్కు ద్వేషమని చెప్పారు. తెలంగాణ నుంచి చంద్రబాబును కేసీఆర్ వెళ్లేలా చేశాడని రేవంత్కు కోపమని.. సీఎం నరనరాల్లో బాబు ఉన్నాడన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: మే 1వ తేదీ నుంచి 31 వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి, అర్హత గల పీడీ, పీఈటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలి పారు. గ్రామీణ ప్రాంతంలో స్థానికంగా ఉండి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించగలిగే ఆసక్తి గల వారు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా కలెక్టరేట్లోని జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మరింత సమాచారం కోసం 9347344440, 9493594388 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మార్కులను ఆన్లైన్ చేయండి
డీఈఓ రాధాకిషన్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరుగుతున్న సమ్మెటీవ్ పరీక్షలకు సంబంధించి ఆయా పాఠశాలల సబ్జెక్ట్ ఉపాధ్యాయులు వెంట వెంటనే వ్యాల్యువేషన్ చేసి రికార్డులు రూపొందించాలని డీఈఓ రాధాకిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్– 2 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 19 వరకు ప్రాథమిక పాఠశాలలకు, 22వ తేదీతో ఉన్నత పాఠశాలలకు పరీక్షలు ముగియనున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల ప్రశ్నపత్రాలను ఎప్పటికప్పుడు వ్యాల్యుయేషన్ పూర్తి చేయించి సంబంధిత మార్కులను ఆన్లైన్లో పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 24న తప్పనిసరిగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని తెలిపారు. అన్ని పాఠశాలల హెచ్ఎంలు బాధ్యతగా ఈ విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. -
యూటర్న్
నాడు బీఆర్ఎస్లో చేరిన వారు తిరిగి హస్తం గూటికిఅంతా అనుకున్నట్లుగానే.. అండగా ఉంటా.. ఆందోళన వద్దు పార్టీ శ్రేణులకు హరీశ్ భరోసా మెదక్జోన్: సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాడు బీఆర్ఎస్లో చేరిన నేతలంతా నేడు యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో పాటు కౌన్సిలర్లు నర్మద, లక్ష్మీనారాయణ, రుక్ష్మిణి, గోదల మానస, రాగి వనజ, ముఖ్య నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 15 రోజుల క్రితం ఆరుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే రోహిత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. 2020 జనవరిలో జరిగిన బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిచిన చంద్రపాల్ చైర్మన్ కాగా అదేపార్టీకి చెందిన మల్లికార్జున్గౌడ్ వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీతో పాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి వీరంతా హస్తం గూటికి చేరుతున్నారు. వీరి చేరికతో బల్దియాలో కాంగ్రెస్ బలం 18కి చేరింది. ఈ సంఖ్య మరో రెండు రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే త్వరలోనే మెదక్ బల్దియా పీఠం కాంగ్రెస్ పరం కానుంది. చైర్మన్గా చంద్రపాల్ను అలాగే కొనసాగిస్తారా..? మరొకరికి పదవి కట్టబెడతారా? అనేది అప్పుడే తెలనుంది. కాగా చైర్మన్ పదవికి మరో 9 నెలల సమయం ఉంది. వీరు కాంగ్రెస్లో చేరేలా మైనంపల్లి హన్మంతరావు ముఖ్య అనుచరుడు మాజీ కౌన్సిలర్ వెంకటరమణ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. తిరుపతిరెడ్డి, అనుచరుల చేరికకు బ్రేక్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించగా కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. దీంతో తిరుపతిరెడ్డి ఎన్నికల ముందు బీఆర్ఎస్లోకి వెళ్లాడు. ఆయనతో పాటు నియోజకవర్గంలో ముఖ్య నాయకులను సైతం తీసుకెళ్లాడు. ప్రస్తుతం తిరుపతిరెడ్డి, ఆయన వర్గం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్లో చేర్చుకునేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం. జిల్లాలో అన్నీతానై వ్యవహరిస్తున్న ఓ ప్రధాన నాయకుడు వీరి చేరికను అడ్డుకుంటున్నట్లు తెలిసింది. నర్సాపూర్: అంతా అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. గత నెల చివరి వారం నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డిని సైతం కలిసి పార్టీలో చేరే అంశంపై చర్చించారు. కాగా సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించినా అవకాశం కుదరకపోవడంతో చివరికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రోహిత్ చౌదరి, మైన ంపల్లి హన్మంతరావు సమక్షంలో సోమవారం కాంగ్రెస్లో చేరారు. ఆయన వెంట నర్సాపూర్ పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మా జీ ఎంపీపీ అధ్యక్షురాలు లలిత, ఎంపీటీసీ సంధ్యరాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ హబీబ్కాన్, కౌడిపల్లి మండలం మహ్మద్నగర్ పీఎసీఎస్ చైర్మన్ గోవర్దన్రెడ్డి, వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, శివ్వంపేట పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌడిపల్లి మాజీ ఎంపీపీ పద్మ, చిలప్చెడ్ ఎంపీపీ అధ్యక్షురాలు వినోద, కొల్చారం ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సావిత్రి, హత్నూర బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డితో పాటు పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కాంగ్రెస్లో చేరారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్లోకి మదన్రెడ్డినర్సాపూర్: ఎవరు పార్టీని వీడినా ఆందోళన చెందవద్దని, కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్లో మదన్రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చామని, కేసీఆర్ రెండుసార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. కేసీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆయన పార్టీని వీడి వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు వారిని గెలిపిచేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం ఆందోల్ నియోజకవర్గం చౌటకూర్ సమీపంలో నిర్వహించే కేసీఆర్ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 20 వేల మంది కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటలు ఆడేదెలా?
చిన్నశంకరంపేట(మెదక్): క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. చాలా వరకు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట్ల ఆటలకు అనువుగా లేని చోట క్రీడా పరికరాలు బిగించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, 81 మధిర గ్రామాలు ఉండగా మొత్తం 504 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కనీసం అర ఎకరంలో మైదానం ఏర్పాటు చేసి వ్యాయాయం చేసేందుకు సింగిల్ బార్, డబుల్బార్, వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలి. కాని ఎక్కడా సరైన స్థలం లేకుండానే క్రీడా పరికరాలు బిగించారు. ఒక్కో క్రీడా ప్రాంగణం పేరుతో కొందరు అధికారులు లక్షల రూపాయలు జేబులు నింపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో క్రీడా ప్రాంగణం అరగుంటలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ● ఒకవైపు వాటర్ ట్యాంక్, మరోవైపు పెద్ద బండరాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు యువకులు ఆటలు ఆడింది లేదు. ● మండలంలోని కొర్విపల్లిలో పాఠశాల గోడకు ఆనుకొని క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. ● గవ్వలపల్లిలో గ్రామానికి దూరంగా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో అక్కడ ఆటలు ఆడడం లేదు. ● ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ● మెదక్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సరైన చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయలేదు. ● పట్టణంలో అయితే కనీసం సగం వార్డుల్లో కూడా ఏర్పాటు చేయలేదు. చేసినవి కూడా పాఠశాలల్లో మాత్రమే ఉన్నాయి. ● నార్సింగి, తూప్రాన్, రామాయంపేట, చేగుంట, పాపన్నపేట మండలాల్లో చాలా వరకు ఊరికి దూరంగా ఉన్నాయి. ● నూతనంగా ఏర్పడిన ప్రభుత్వమైన క్రీడలకు అనువైన స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు. అలంకారప్రాయంగా క్రీడా ప్రాంగణాలు -
సభకు సర్వం సిద్ధం
● సుల్తాన్పూర్లో నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ ● హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ● ఏర్పాట్లు పూర్తి చేసిన నాయకులు ● జన సమీకరణకు కసరత్తుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో జరుగనున్న బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు గులాబీ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు ఇటు మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల నుంచి కూడా జనసమీకరణ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం షురూ కానున్న నేపథ్యంలో ఈ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గులాబీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. రెండు లోక్సభ స్థానాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధినేత బహిరంగ సభ మరింత ఊపునిస్తుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఐదు గంటలకు కేసీఆర్ రాక.. కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగసభ స్థలానికి చేరుకుంటారని ఆ పార్టీ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా స్థలానికి చేరుకుంటారని, బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్తారని చెబుతున్నారు. మండిపోతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని సాయంత్రం వేళల్లో ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. భారీ జనసమీకరణే లక్ష్యం.. కేసీఆర్ హాజరుకానున్న ఈ బహిరంగ సభను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం భారీగా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించాలని భావిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 20 వేలకు పైగా జనాలను తరలించాలని చూస్తున్నారు. అలాగే నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ శ్రేణులు ఈ సభకు తరలిరానున్నారు. ఈ మేరకు అన్ని గ్రామాలకు వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.విజయవంతం చేయండి : చింతాబహిరంగసభ స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు హాజరయ్యే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని కోరారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్తో ఒరిగేదేమిలేదు
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు తూప్రాన్: బీఆర్ఎస్, కాంగ్రెస్తో ఒరిగేదేమిలేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం తూప్రాన్లో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే పేదరికం, నిరుద్యోగం తగ్గించడంతో పాటు రైతులు, మహిళల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ పెద్ద కొడుకు అని నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిహిస్తున్న నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రూ.4 వేల పెన్షన్, రెండు లక్షల రుణమాఫీ ఏమైందని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాజ్పుష్ప కంపెనీ పేరుతో రూ.100 కోట్లకు ఎకరా చొప్పున రూ. వెయ్యి కోట్లు పెట్టి పదెకరాలు కొనుగోలు చేసిన వెంకట్రామిరెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివన్నారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడనా? లేక చర్యలు తీసుకోకుండా కొత్త ప్రభాకర్రెడ్డి రాయభారం నడిపిస్తున్నారా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయకుండా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాలో కొత్త ఓటర్లు 4,778
మెదక్జోన్: కేవలం నాలుగున్నర నెలల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా కొత్తగా 4,778 మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఈనెల 15 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,18,464కు చేరుకుంది. ఈలెక్కన 1,716 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,593 మంది ఉండగా ప్రస్తుతం 2,26,655కి చేరుకుంది. కొత్తగా 3,062 మంది కొత్త ఓటర్లుగా చేరారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి పెద్దశంకరంపేట(మెదక్): కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్లో పెద్దశంకరంపేట మండలానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు వీణ, స్వప్న, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు సురేందర్రెడ్డి, నారాగౌడ్, రాజేందర్గౌడ్, జైహింద్రెడ్డి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి పాపన్నపేట(మెదక్): బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ పిలుపునిచ్చారు. సోమ వారం మండల పరిధిలోని యూసుఫ్పేటలో నిర్వహించిన బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బీఆర్ఎ స్ బలంగా ఉందని, అందరూ శ్రమిస్తే గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. పాపన్నపేట మండల ఎన్నికల కో ఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఎలక్షన్ ఇన్చార్జి శ్రీనివాస్ యాదవ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు సోములు, మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివి మెదక్జోన్: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద కొనియాడారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె అంబేడ్కర్ జీవిత చరిత్ర, బాల్యంలో ఎదుర్కొన్న అడ్డంకులు, సాధించిన ఘనత, రాజ్యాంగ నిర్మాతగా అందించిన సేవలను వివరించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి రీటాలాల్చంద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన జహీరాబాద్ టౌన్: అగ్నిమాపక శాఖ వారోత్సవాల (ఫైర్ సర్వీసెస్ వీక్) సందర్భంగా సోమవారం అధికారులు పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో ఉన్న పరికరాలను ఎలా వినియోగించాలో వివరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సంచరించే ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు. -
కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు
మెదక్ కలెక్టరేట్: కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యానికి వెంట వెంటనే చెల్లింపులు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. హవేళీఘణాపూర్ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి 108 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామని వివరించారు. రవాణా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు దళారులు కొనుగోలు చేస్తే పోలీస్ కేసు నమోదు చేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసర అధికారులు బ్రహ్మారావు, హరికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సమీక్ష
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మరో రెండ్రోజులు వానలు
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
రోజు రూ.2 కోట్లకుపైగానే..
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అన్నదాతల అగచాట్లు
రోజు రూ.2 కోట్లకుపైగానే..
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement