కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆపకుండా ముందుకు వెళ్దాం అని భీష్మించారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు. ఈ మేరకు నిరవధిక సమ్మె చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగల్ రెడ్డి, కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్, కో-చైర్మన్ సంపత్కుమార్, కోశాధికారి శ్రీరాములు నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, ట్రెజరీ, పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖల ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది.
వివిధ ఉద్యోగ సంఘాలు ర్యాలీ, ధర్నాలు నిర్వహించి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వివిధ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-చైర్మన్ సంపత్కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సోనియా చేతిలో కీలుబొమ్మలుగా మారారన్నారు. వారి చేతగానితనంతోనే రాష్ట్రం రెండు ముక్కలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రం రెండు ముక్కలు కాకుండా ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పదవులను త్యాగం చేసి ప్రజా ఉద్యమంలో కలసిరావాలని పిలుపునిచ్చారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే కేసీఆర్, తెలంగాణ ఉద్యోగ సంఘాలు సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నారని, రాష్ట్రం విడిపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చైర్మన్ వీసీహెచ్.వెంగల్రెడ్డి మాట్లాడుతూ ఒక్కరోజు, రెండు రోజుల సమ్మెతో లక్ష్యాన్ని సాధించలేమని, కేంద్రం దిగివచ్చేంతవరకు పాలనను స్తంభింపజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరసనలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సర్దార్ అబ్దుల్ హమీద్, నాగేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నేత ఉస్మాన్, జేఏసీ నేతలు లక్ష్మన్న, జయరామకృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జవహర్లాల్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
పదండి ముందుకు.. ప్రభుత్వం దిగొచ్చే వరకు
Published Thu, Aug 15 2013 3:14 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
వారెవ్వా అర్ష్దీప్.. ఏమైనా బాల్ వేశాడా? చూస్తే మైండ్ బ్లాంక్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)
రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
చంద్రునిపై చైనా ల్యాండర్
ఉన్న ఉద్యోగం వదిలి.. రూ.8000 కోట్ల కంపెనీ స్థాపించి..
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు
T20 WC 2024: బంగ్లాదేశ్కు ఊహించని షాక్.. స్టార్ ఆటగాడికి గాయం
నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
- T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!
- ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
- ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement