-
మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా..?
ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు అనేవి కామన్ అయిపోయాయి. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ సైతం రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇద్దరికీ విడాకులిచ్చాడు. మొదట 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ అనే కుమారుడు, ఇరా ఖాన్ అనే కూతురు సంతానం. అంతా బానే ఉందనుకున్న సమయంలో 2002లో ఆమిర్ దంపతులు విడాకులు తీసుకున్నారు.విడాకులు2005లో ఆమిర్.. కిరణ్ రావును పెళ్లాడాడు. సరోగసి ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. కానీ ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడిపోయారు. ఇద్దరు భార్యలతో వైవాహిక బంధాన్ని తెంచుకున్నప్పటికీ స్నేహ బంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు. ఎటువంటి గొడవలు, చికాకులు లేకుండా ఇప్పటికీ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటారు. తాజాగా నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి ఆమిర్ హాజరయ్యాడు.షోలో ఆమిర్ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో ఆమిర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తను నటించిన లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్.. రెండు సినిమాలూ వర్కవుట్ కాలేదన్నాడు. అక్కడున్న హోస్ట్ కపిల్ శర్మ.. అవి పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు రిలీజ్ చేసే సినిమాల బిజినెస్ మాత్రం బాగానే జరుగుతోంది కదా అని పంచ్ వేశాడు.టైం వేస్ట్!ఇంతలో అర్చన పూరన్ సింగ్ మాట్లాడుతూ.. అవార్డు షోలకు ఎందుకు రారని ప్రశ్నించింది. ఇందుకు ఆమిర్.. సమయం చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ దాన్ని కచ్చితంగా వాడుకోవాలి అని చెప్పుకొచ్చాడు. ఇంతలో కపిల్.. సెటిల్ అవుదామని అనుకోవడం లేదా? అంటూ పరోక్షంగా మూడో పెళ్లి గురించి ప్రస్తావించాడు. అందుకు ఆమిర్ పెద్దగా నవ్వేసి ఊరుకున్నాడు. ప్రస్తుతం ఆమిర్ లాహోర్ 1947 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. Ab hogi comedy ki dangal with one and only Aamir Khan 😁Dekho #TheGreatIndianKapilShow this Saturday 8 pm sirf Netflix par ✨ pic.twitter.com/ukDIKk0U2D— Netflix India (@NetflixIndia) April 24, 2024 చదవండి: పెద్ద కూతురి పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన దర్శకనటుడు -
నాకు చాలాసార్లు అబార్షన్ అయింది: స్టార్ హీరో మాజీ భార్య
దర్శకనిర్మాత కిరణ్రావు.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్కు మాజీ భార్య. 2005లో ఆమిర్.. కిరణ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐవీఎఫ్- సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. ఏళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఆమిర్ దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అప్పుడే ఆజాద్.. తాజాగా కిరణ్ రావు.. పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. దోబి ఘాట్ సినిమా (2011) సమయంలో ఆజాద్ పుట్టాడు. అప్పటికే నేను పిల్లలు కావాలని ఎంతగా ప్రయత్నించానో..! ఆ ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్ అయింది. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఒక పిల్లాడు/పాపను పొందడం ఇంత కష్టమా.. అనిపించింది. పదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరం బిడ్డను కనాలని చూస్తున్న నాకు ఐవీఎఫ్- సరోగసి ద్వారా ఆజాద్ జన్మించడంతో సంతోషమేసింది. తల్లిగా తనను ప్రేమగా పెంచాలని డిసైడయ్యాను. తనతో జీవితాన్ని ఆనందంగా గడిపాను. అవి నా జీవితంలోనే ఉత్తమమైన రోజులు. పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే ఆ రోజుల్ని నేను ఆజాద్కి కేటాయించాను అని చెప్పుకొచ్చింది. కాగా కిరణ్ రావు ఇటీవలే లాపతా లేడీస్ సినిమాతో దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: నూకరాజు- ఆసియా బ్రేకప్? జబర్దస్త్ కమెడియన్ ఏమన్నాడంటే.. -
అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' రాబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఖాన్ స్పందించారు. బాలీవుడ్ నటుడు 'అమీర్ ఖాన్' రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న వీడియోలు ఫేక్ అని కొట్టి పారేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 2024 లోక్సభ ఎన్నికల కోసం ఓటర్లకు అమీర్ ఖాన్ సందేశం ఇచ్చారు. భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని కోరారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది. भारत का हर नागरिक लखपति है क्योंकि सबके पास काम से कम 15 लाख तो होने ही चाहिए .. क्या कहा आपके अकाउंट में 15 लाख नहीं है.. तो आपके 15 लाख गए कहां ??? तो ऐसे जुमलेबाजों से रहे सावधान नहीं तो होगा तुम्हारा नुकसान 🇮🇳🇮🇳🇮🇳देशहित में जारी🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/hJkEFEL5vG — Mini Nagrare (@MiniforIYC) April 14, 2024 -
టాలీవుడ్ డైరెక్టర్ గురించి విన్నా.. ఆ సినిమా తప్పకుండా చూస్తా: కిరణ్ రావు
బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్రావు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల లపట్టా లేడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ రావు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతని క్రాఫ్ట్ అద్భతంగా ఉంటుందని.. యానిమల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తన సినిమా లపట్టా లేడీస్కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపింది. కిరణ్ రావు మాట్లాడుతూ..'లాపట్టా లేడీస్ సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ఈ రోజుల్లో ప్రేక్షకులు యాక్షన్తో కూడిన భారీ చిత్రాలనే ఇష్టపడుతున్నారు. యానిమల్ లాంటి సినిమాను నేను చూడాలనుకుంటున్నా. అది అవసరం. ప్రజలు ఇష్టపడినందున యానిమల్ హిట్గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా క్రాఫ్ట్ చాలా బాగుందని విన్నాను. రణబీర్ కపూర్ కూడా మంచి నటుడు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నా.' అని అన్నారు. -
నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?) ''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది. లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు) -
అంబానీ ప్రీవెడ్డింగ్.. త్రీ ఖాన్స్కు భారీగా పారితోషికం?!
బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్ డ్యాన్స్ చేయడమే! స్టేజీపై డ్యాన్స్.. ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్ చేయడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్చరణ్కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్తో పాటు ఈ ఖాన్స్ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట! సంతోషంతోనే.. 'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్ కాబట్టి డిమాండ్ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #RamCharan kaha hai tu.. They are treating him like his own. How beautiful 😍. pic.twitter.com/s7hXwrBP6N — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 3, 2024 చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
తెలుగు పాటకు 'త్రీ ఖాన్స్' డ్యాన్స్.. ఫిదా అవుతున్న బాలీవుడ్
జామ్నగర్లో భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్కోర్ హెల్త్కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికతో వివాహం జరగనుండగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు గుజరాత్లోని జామ్నగర్ చేరుకున్నారు. మార్చి 1 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్స్టోన్ సందడి చేశారు. బాలీవుడ్లో త్రీ ఖాన్స్గా గుర్తింపు ఉన్న షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఒకే ఫ్రేమ్లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో బాలీవుడ్ సినీ అభిమానులు సంతోషిస్తున్నారు. వారి ముగ్గురిని ఒకే స్టేజీపై కలపగల వ్యక్తి అంబానీ మాత్రమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ నటించిన RRR చిత్రంలోని 'నాటు నాటు' పాటకు త్రీ ఖాన్స్ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఇకపోతే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
దంగల్ ఆడిషన్.. నన్ను సెలక్ట్ చేయలేదు: హీరోయిన్
ఎక్కువ ఏళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం అనేది అంత ఈజీ కాదు! కానీ అది అసాధ్యమేమీ కాదని, తలుచుకుంటే సుసాధ్యమవుతుందని నిరూపించింది బాలీవుడ్ నటి అవనీత్ కౌర్. చిన్నప్పుడు 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోలో చిన్ని డ్యాన్సర్గా అలరించింది. ఎనిమిదేళ్ల వయసులోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. తర్వాతి కాలంలో డ్యాన్సర్గానే కాకుండా నటిగానూ అలరిస్తూ వస్తోంది. ఆ సినిమాలకు రిజెక్ట్.. మేరీ మా, సావిత్రి ఏక్ ప్రేమ్ కహాని సీరియల్స్తో ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. అలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 వంటి సినిమాలతో పాటు పలు సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. అయితే కొన్ని ఆడిషన్స్లో తనను రిజెక్ట్ చేశారంటోందీ బ్యూటీ. తాజాగా ఆమె స్టార్ హీరో నిర్మించిన లాల్పట్టా లేడీస్ సినిమా ప్రీమియర్కు హాజరైంది. ఈ క్రమంలో అక్కడున్న ఆమిర్ను కలిసింది. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు కలిశా అయితే ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చింది. దంగల్, సీక్రెట్ సూపర్స్టార్ సినిమాల ఆడిషన్స్కు వెళ్లానని, అప్పుడు ఆయన్ను కలిశానంది. ఆ రెండు సినిమాలకు ఆడిషన్ ఇచ్చానని, వర్క్షాప్కు కూడా వెళ్లానని కానీ తనను సెలక్ట్ చేయలేదని తెలిపింది. అయితే ఆమిర్ మాత్రం తనను మెచ్చుకున్నాడని చెప్తూ ఉబ్బితబ్బిబైపోయింది. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
ఒకరంటే ఒకరికి గౌరవం.. ఒక్కసారి కూడా గొడవపడలే!
విడాకులెందుకు తీసుకుంటారు? సఖ్యత లేకో, భేదాభిప్రాయాలు రావడం వల్లో, గొడవలు తలెత్తడం వల్లో, ప్రేమ తగ్గిపోవడం వల్లో.. దూరమవుతూ ఉంటారు. కానీ ఈ మాజీ సెలబ్రిటీ జంట మాత్రం మాకసలు గొడవలే లేవని, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమంటోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్, నిర్మాత కిరణ్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమిర్.. రీనా దత్తాను ళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. ఇది అతడికి రెండో పెళ్లి. విడాకులు తీసుకునేముందు గొడవ? ఆమిర్-కిరణ్.. సరోగసి ద్వారా 2011లో ఆజాద్ రావుకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఏమైందో ఏమోకానీ 2021లో వీరు విడిపోయారు. విడాకులు తీసుకునేముందు గొడవపడ్డారా? అంటే అలాంటిదేం లేదంటోంది కిరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా మాజీ భర్తతో నేను బాగానే ఉంటాను. తల్లిదండ్రులుగా నా కొడుకును మేమిద్దరం బాగా చూసుకుంటాం. చాలామంది పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి అంటుంటారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలంటారు. నేను కూడా అలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను. మా అనుబంధం అలాంటిది కానీ ఆమిర్, నేను మాత్రం ఎప్పుడూ గొడవపడలేదు. వినడానికి వింతగా అనిపిస్తుందేమో కానీ. నిజంగానే మేము పోట్లాడుకోలేదు. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చావి కానీ ఎన్నడూ గొడవపడలేదు. మేము ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం, ఒకరినొకరం ఎంతో అర్థం చేసుకుంటాం. ఒకరు చెప్పేది మరొకరు వింటుంటాం. బహుశా దానివల్లే మా మధ్య ఎలాంటి సమస్యలు ఎదురవలేదు. మా అనుబంధం అలాంటిది. అల్లకల్లోలానికి దారితీసే గొడవలు, చర్చలు ఎప్పుడూ జరగలేదు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న నెటిజన్లు.. అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారో? మరి అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: బేబీ బంప్లో మౌనిక.. పిల్లా నువ్వంటే ప్రాణమన్న మనోజ్ -
హనీమూన్లో స్టార్ హీరో కూతురు.. బీచ్లో విన్యాసాలు!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఇటీవలే పెళ్లి పీటలెక్కింది. ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లాడింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ప్రారంభంలో వీరి వివాహం జరిగింది. ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉదయ్పూర్లో ఘనంగా పెళ్లి వేడుక జరుపుకున్నారు. ఈ మధ్యే కొత్త జంట హనీమూన్కు ఇండోనేషియా చెక్కేసింది. అక్కడ కూడా వర్కవుట్స్ వదలడం లేదు నుపుర్. హనీమూన్లో భాగంగా ఏయే ప్రదేశాలకు వెళ్తున్నారో ఆ అన్నిచోట్లా ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. ఒలంపిక్స్కు వెళ్లు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఐరా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నీ హనీమూన్ ఎలా ఉంది? అని భర్తను కొంటెగా అడుగుతూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ వైరల్గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. హనీమూన్ ఎంజాయ్ చేయకుండా ఈ యోగా ఏంట్రా బాబూ.. ఈయన్ను ఒలంపిక్స్కు పంపించండి, ఐరా నువ్వు పెళ్లాడింది మనిషిని కాదు, కోతిని అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమిర్ దగ్గరే పని చేసి అతడి కూతురికే లైన్.. కాగా నుపుర్ శిఖరే.. బాలీవుడ్లోని పలువురు సెలబ్రిటీలకు ఫిటెన్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. అలా ఆమిర్ ఖాన్ దగ్గర కొంతకాలంపాటు ఫిట్నెస్ కోచ్గా పనిచేశాడు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. జనవరిలో వీరి పెళ్లి, రిసెప్షన్ వేడుకలు జరిగాయి. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ -
విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్ తల్లి), కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్.. ఆమిర్, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది. అందరం కలిసే ఉంటాం.. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్ కజిన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్తో కూడా వెళ్తూ ఉంటాను. పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్ బతికే ఉన్నానని ట్విస్ట్ ఇచ్చిన పూనమ్ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే? -
ఆ బాలీవుడ్ స్టార్తో నన్ను పోల్చవద్దు: హీరో
తమిళ హీరో ఆర్జే బాలాజి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింగపూర్ సెలూన్. మీనాక్షిచౌదరి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, లాల్, అరవిందస్వామి ముఖ్య పాత్రలు పోషించారు. గోకుల్ దర్శకత్వం వహించగా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించారు. గత నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో సింగపూర్ సెలూన్ సక్సెస్మీట్ నిర్వహించారు. అలాంటి వ్యక్తి లైఫ్లో ఉంటే బాగుండు ఈ సందర్భంగా ఆర్జే బాలాజి మాట్లాడుతూ.. సింగపూర్ సెలూన్ చిత్ర విజయం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ మూవీలోని అరవిందస్వామి పాత్రను చూసి ఇలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే బాగుండని చాలా మంది అనుకున్నారన్నారు. అంత ఉత్తమ నటనను ప్రదర్శించిన అరవిందస్వామికి ధన్యవాదాలు తెలిపారు. తొలివారంలో ప్రేక్షకులకు నచ్చేసిన ఈ చిత్రం రెండో వారంలో కూడా మంచి వసూళ్లు రాబట్టాలనే ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఆయనతో పోల్చొద్దు నటుడు చిన్ని జయంత్ తనను సౌత్ ఇండియన్ అమీర్ ఖాన్ అని పేర్కొనడంతో భయం కలిగిందన్నారు. ఆయన లెజెండ్ అని, ఆయనతో తనను పోల్చరాదన్నారు. తనలోని నటనను బయటకు తీసిన దర్శకుడు గోకుల్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. నిర్మాత ఐసరి గణేశ్ తనకు తండ్రి లాంటివారని, ఎల్కేజీ 2, మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రాలను చేయాలన్న ఆలోచన ఉందని, వాటిని ఐసరి గణేశ్ సంస్థలోనే చేస్తానని చెప్పారు. చదవండి: 'దమ్ మసాలా' సాంగ్కు సితార డ్యాన్స్.. మిలియన్లకొద్ది వ్యూస్ -
ఇటు హీరోగా... అటు నిర్మాతగా...
నటుడిగా ఆమిర్ ఖాన్ మేకప్ వేసుకుని దాదాపు రెండేళ్లవుతోంది. ‘లాల్సింగ్ చద్దా’ (2022)లో చేసిన టైటిల్ రోల్, ‘సలామ్ వెంకీ’ (2022)లో చేసిన అతిథి పాత్ర తర్వాత ఆమిర్ ఖాన్ నటుడిగా మేకప్ వేసుకోలేదు. ఫైనల్గా ఫిబ్రవరిలో కెమెరా ముందుకు రానున్నారు. హీరోగా ‘సితారే జమీన్ పర్’ అంగీకరించారు ఆమిర్. ఫిబ్రవరి 2న ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ చిత్రంలోని పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆమిర్ ఖాన్. పలు లుక్స్ ట్రై చేసి, చివరికి ఒకటి ఖరారు చేశారు. అలాగే పలుమార్లు స్క్రిప్ట్ని చదివారు. అన్నీ సంతృప్తికరంగా అనిపించడంతో ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్లాన్ చేశారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి 70 నుంచి 80 రోజులు డేట్స్ ఇచ్చారు ఆమిర్. ఈ చిత్రాన్ని క్రిస్మస్కి విడుదల చేయాలనుకుంటున్నారు. సన్నీ డియోల్ హీరోగా.. నిర్మాతగా ‘లాహోర్: 1947’ చిత్రాన్ని నిర్మించనున్నారు ఆమిర్ ఖాన్. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్లో (ఏకేపీ) మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆమిర్ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరోటి ‘ప్రీతమ్ ప్యారే’. సంజయ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమిర్ బుక్ న్యారేటర్గా అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రం కూడా ప్రథమార్ధంలోనే విడుదల కానుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ చేపట్టడం విశేషం. ఇలా హీరోగా, ఏకేపీ నిర్మించే చిత్రాలతో ఆమిర్ బిజీ. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్: బీటౌన్ స్టార్లు, క్రికెటర్ల సందడి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్వేడుకలు, బారాత్, రిజిస్టర్ మ్యేరేజ్, ఆతరువాత ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో సదడి చేస్తున్నాయి. మాపెళ్లి మా ఇష్టం: ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్, పట్టుచీరలు, నగల హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్ఖాన్ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. Hassan sisters gives respect to legendary actor Dharmendra at Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#ShrutiHaasan #Dharmendra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/EmFIvfZZh3 — sdn (@sdn7_) January 13, 2024 పెళ్లి తరువాత జైపూర్, ముంబై వేదికగా ఇచ్చని రిసెప్షన్ వేడుకు కూడా టాక్ ఆఫ్ది టౌన్గా మారాయి. జైపూర్ వెళ్ల లేని వారు, ముంబైలో, ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్లో ఈ రిసెప్షన్కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీటీలు, క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం విశేషం. Maharashtra CM Eknath Shinde attends Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#EknathShinde #Maharashtra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/OvcFQfVREK — sdn (@sdn7_) January 13, 2024 ఇంకా బాలీవుడ్లో ఖాన్ త్రయంగా పేరొందిన షారుఖ్, సల్మాన్ ఇద్దరూ అమీర్ఖాన్తో కలిసి సందడి చేశారు. ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు విచ్చేసి ఇరా, నూపుర్ జంటకు అభినందనలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్కు హాజరైనారు. ఇంకా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ మరింత ఆకర్షణగా నిలిచారు. -
Ira Khan-Nupur Shikhare: గ్రాండ్గా మరోసారి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ కూతురు (ఫోటోలు)
-
'స్టార్ హీరో కూతురు అయ్యుండి.. ఇలాంటి బట్టలు వేసుకుందేంటి'?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లు గానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యకంగా కనిపించాలని ఆరాటపడినా కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత రాత్రి(జనవరి3)న ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖర్తో ఇరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. వరుడు బ్లూ కలర్ షేర్వానీలో కనిపించగా, వధువు ఇరాఖాన్ సింపుల్గా పటియాలా-చోలి దుస్తుల్లో కనిపించింది. అయితే స్టార్ హీరో కూతురు అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అర్జెంట్గా ఈమెకు స్టైలిస్ట్ అవసరం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్లంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా? జాగింగ్ చేస్తూ నుపుర్ పెళ్లి వేడుకకు రావడం ఏంటి? జిమ్ డ్రెస్లో పెళ్లి తంతు ముగించడం ఏంటి? కనీసం బట్టలు అయినా పద్దతిగా వేసుకున్నారా అంటే అదీ లేదు. ఇదేదో కొత్తరకం స్టైల్ అనుకుంటున్నారేమో, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ అంటూ కొత్త జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకునేవారు. కానీ ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్ని ఎంచుకున్నారు. అనుష్క శర్మ నుంచి పరిణితి చోప్రా వరకు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేస్టల్ కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇరాఖాన్ ఇలా నీలం రంగు దుస్తుల్లో, కొల్హాపురి చప్పల్స్తో కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. అయినా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు వారివి. నిజం చెప్పాలంటే ఈ జంట హంగు, ఆర్భాటాలతో కాకుండా సింపుల్గా పెళ్లి చేసుకోవడం ఆదర్శమని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
స్టార్ హీరో కూతురి పెళ్లి.. బనియన్ మీదే వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్- నిర్మాత రీనా దత్తాల కూతురు ఇరా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. బుధవారం(జనవరి 3న) నాడు ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. జాగింగ్ చేస్తూ మండపానికి.. ఇక వరుడు ఫిట్నెస్ ట్రైనర్ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు కూడా మార్చుకోకుండా టీషర్ట్పైనే పెళ్లి వేడుకలు కానిచ్చేశాడు. రిసెప్షన్కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. ఈ పెళ్లిలో ఆమిర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేశారు. రెండో మాజీ భార్య అయిన కిరణ్ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడీ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇకపోతే సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13న ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 2022లో ఎంగేజ్మెంట్.. కాగా నుపుర్ శిఖరే.. ఆమిర్ ఖాన్కు ఫిట్నెస్ ట్రైనర్గా పని చేశాడు. అలా అతడికి ఇరాతో పరిచయం ఏర్పడింది. కరోనా సమయంలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2022 నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇన్నాళ్లకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్, మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఇరా ఖాన్. ఆమిర్- రీనా దంపతులకు జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు. After marriage ceremony of daughter #IraKhan during photoshoot #AamirKhan kisses #KiranRao what a moment love and Peace 🥰🥰#NupurShikhare #ReenaDutta #celebrity #wedding #celebration pic.twitter.com/lrUEUR7wB5 — sdn (@sdn7_) January 4, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: విజయ్ సినిమాలో ఇన్ని సర్ప్రైజులా.. ఫ్యాన్స్కు పండగే! -
అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్.. రూ. 500 కోట్లు టార్గెట్!
బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్గా పిలిచే అమీర్ ఖాన్ (Bollywood hero Aamir Khan) మాస్టర్ ప్లాన్ వేశారు. ముంబైలో తనకు చెందిన ఓ ప్రాపర్టీని రీడెవలప్మెంట్కు ఇచ్చారు. దీని టార్గెట్ రూ. 500 కోట్లు అని తెలుస్తోంది. ముంబైలో అమీర్ ఖాన్ నివాసం ఉంటున్న ప్రాపర్టీ రీడెవలప్మెంట్ను చేపట్టనున్నట్లు ప్రాపర్టీ డెవలపర్ మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ (MICL) తాజాగా తెలిపింది. ఈ ఆస్తి ముంబైలోని బాంద్రా (పశ్చిమ) ప్రాంతంలోని పాలి హిల్లో ఉన్న విర్గో కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందినది. ఇందులో 24 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో అమిర్ ఖాన్కు తొమ్మిది ఫ్లాట్లు ఉన్నాయి. రూ. 500 కోట్లు టార్గెట్ అమీర్ ఖాన్ ప్రాపర్టీ రీడెవలప్మెంట్ ఒప్పందం నిబంధనలను మాత్రం మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ వెల్లడించలేదు. ప్రాపర్టీలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టి విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి రూ. 500 కోట్ల టాప్లైన్ను లక్ష్యంగా చేసుకుంది. ప్రాజెక్ట్లో లగ్జరీ 4బీహెచ్కే, 5 బీహెచ్కే అపార్ట్మెంట్ను అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది 2024 మధ్యలో ప్రారంభం కానుంది. -
ఆ స్టార్ హీరోను గట్టిగా లాగిపెట్టి కొట్టా.. అందరూ షాక్..: నటి
బాలీవుడ్ నటి మోనా సింగ్.. 3 ఇడియట్స్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమెపై ఓ కీలకమైన సన్నివేశం ఉంటుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెకు హీరో ఆమిర్ ఖాన్.. వీడియో కాల్లో ప్రియురాలు ఇచ్చే సలహాలతో డెలివరీ చేస్తాడు. ఈ సీన్ సినిమాలో విపరీతంగా పండింది. తాజాగా ఈ సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది మోనా సింగ్. హీరోనే కొట్టమన్నాడు.. '3 ఇడియట్స్లో నేను పురిటి నొప్పులతో టేబుల్పై పడుకుని అల్లాడిపోయే ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరించేటప్పుడు అందరూ వారివారి అనుభవాలను చెప్పారు. నా భార్య ఇలా చేసింది.. అని చెప్పుకుంటూ పోతున్నారు. రాజ్కుమార్ హిరానీ సర్ అయితే తన భార్య తన్నిందని చెప్పాడు. మాధవన్ తన భార్య కొరికిందన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండని అడిగాను. అందుకు ఆమిర్ సర్.. మోనా, నువ్వు నన్ను కొట్టు అన్నాడు. సరేనని, చెంప మీద కొట్టాను. యాక్టింగ్లో లీనమైపోయాడు.. కానీ అతడు గట్టిగా కొట్టమని హెచ్చరించాడు. నేను నా బలం కూడదీసుకుని లాగిపెట్టి కొట్టాను. దీంతో ఆయన బాడీగార్డ్ షాకై నన్ను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమిర్ సర్ మాత్రం తన యాక్టింగ్లో లీనమైపోయాడు. ఆ సన్నివేశం చాలా సహజంగా రావాలనుకున్నాడు, అనుకున్నట్లుగానే అంతే సహజంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన స్టార్స్ మాతో పాటు రిహార్సల్స్ చేసేవారు. స్టార్స్లా ఫీలయ్యేవారే కాదు' అని చెప్పుకొచ్చింది మోనా. ఈ సినిమా సంచలన విజయంతో పాటు మూడు జాతీయ అవార్డులు సాధించింది. చదవండి: ప్రముఖ నటి కన్నుమూత... బెడ్పై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ... చివరి వీడియో -
Ira Khan And Nupur Shikhare's Pre-Wedding: అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి.. ఐరా-నిపుర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ (ఫొటోలు)
-
ఆమిర్కు జోడీగా?
‘సై’, ‘బొమ్మరిల్లు’, ‘ఆరెంజ్’ వంటి చిత్రాలతో హీరోయిన్గా జెనీలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయిన జెనీలియా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్కు జోడీగా ఆమె ఓ సినిమాలో ఎంపికయ్యారని బాలీవుడ్ టాక్. ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు జెనీలియాను తీసుకున్నారని, ఆర్ఎస్ ప్రసన్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. మరి.. ఆమిర్కు జోడీగా జెనీలియా కనిపిస్తారా? చూడాలి. మరోవైపు దశాబ్దం తర్వాత ‘జూనియర్’ అనే తెలుగు సినిమాలో జెనీలియా కీలక పాత్ర చేస్తున్నారు. ఇక 2012లో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ తెలుగులో హీరోయిన్గా జెనీలియా నటించిన చివరి చిత్రం. -
స్టార్ హీరో కుమారుడితో సాయి పల్లవి.. లైన్ క్లియర్
సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ పవర్స్టార్ సాయిపల్లవికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేయనున్నారు. తన నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్తో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది. (ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్బాస్ బ్యూటీ) బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులో హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది అని కూడా వార్తలు రాస్తున్నారు. దీనికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు అని, ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. బాలీవుడ్లో పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ పనిచేశాడు. ఈ మేరకు లాస్ ఏంజిల్స్లోని ఓ డ్రామా స్కూల్లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. తన తండ్రి నటించిన ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అతను ఇప్పుడు హీరోగా తెరపై కనిపించనున్నాడు. తన తండ్రి పేరు చెప్పకుండా మొదటి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా సుమారు 20 సార్లు తిరస్కరణకు గురి అయిన తర్వాత సినిమా అవకాశం దక్కించుకున్నాడు. నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలిసిందే. అందం కాదు అభినయమే ఆమెకు ముఖ్యం. ఎప్పుడూ పాజిటివ్గా స్మైల్తో ఆకట్టుకునే ఈ బ్యూటీ. వెండితెరపై తన పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే గత కొద్దిరోజులుగా స్క్రీన్పై తక్కువుగా కనిపిస్తున్న ఆమె. చివరగా 2022లో విరాట్ పర్వం, గార్గి చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఆమె ఈ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
పార్టీలో పూటుగా తాగారు.. తెల్లారేసరికి ఆమిర్ చేతికి సల్మాన్ బ్రేస్లెట్!
ఈ ఏడాది ఈద్ పండగను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ఘనంగా నిర్వహించాడు. సెలబ్రిటీలను వేడుకకు పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో సల్మాన్.. ఆమిర్ ఖాన్తో కలిసి దిగిన ఫోటోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ పార్టీ ముగిసిన తెల్లారి సల్మాన్ చేతికి ఉండాల్సిన బ్రాస్లెట్ ఆమిర్ చేతికి ఉందట. యూట్యూబర్ జబి కోయ్ ఆ పార్టీలో జరిగిన ఆసక్తికర సంఘటనను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఆమిర్ ఖాన్తో మీటింగ్ అనే వ్లాగ్లో యూట్యూబర్ జబి కోయ్ మాట్లాడుతూ.. "ఆమిర్ ఖాన్ను కలవడానికి వెళ్లినప్పుడు ఆయన చేతికి సల్మాన్ ధరించే బ్రేస్లెట్ ఉండటం చూశాను. అది తన చేతికి ఎలా వచ్చిందని అడిగాను. అందుకు ఆమిర్ మాట్లాడుతూ.. 'రాత్రంతా సల్మాన్, నేను హుషారుగా తిరుగుతూ ఉన్నాం. అతడి సినిమా చూసి ఎంజాయ్ చేశాం. పార్టీలో తను మందు తాగాడు, నేను కూడా తాగాను. తాగిన మైకంలో అతడి బ్రేస్లెట్ నాకు ఇచ్చాడు. మనం ఒకరికొకరం ఎంతోకాలంగా తెలుసు. నువ్వు నా బ్రోవి. అందుకే దీన్ని నీకు అప్పగిస్తున్నా, ఎప్పటికీ దాన్ని అలాగే భద్రంగా ఉంచుకో.. అంటూ నా చేతికిచ్చాడు. కానీ మరుసటి రోజు నిద్ర లేచాక ఆ బ్రేస్లెట్ ఇంకా నా చేతికే ఉండేసరికి కంగారుపడ్డాను. పొరపాటున దీన్ని ఎక్కడైనా పడేసుకుంటే దానికి నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే తిరిగిచ్చేదామనుకున్నా, కానీ అలా చేయలేకపోతున్నాను' అని చెప్పుకొచ్చాడు. అయితే ఎక్కడికి వెళ్లినా అందరూ అదే బ్రాస్లెట్ గురించి అడుగుతుండటంతో ఆమిర్ కాస్త ఇబ్బందిపడుతున్నాడు" అని చెప్పాడు జబి కోయ్. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్- ఆయుష్ శర్మ ఇచ్చిన ఈద్ పార్టీలో ఆమిర్ తన చేతికి బ్రేస్లెట్తో హాజరయ్యాడు. View this post on Instagram A post shared by Salman Khan (@beingsalmankhan) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: మా నాన్న మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, ఇప్పటికైనా నమ్ముతారా?: హీరోయిన్
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
మార్కెట్లో కొత్త ఈవీ బైక్.. ధర ఎంతంటే?
తప్పక చదవండి
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement