-
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాలని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆశ నెరవేరలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించలేదు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.తొలుత కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరడం సరైంది కాదని మెహతా వాదించారు. ‘‘ఇలాంటి వాటికి కూడా బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులను ప్రత్యేక తరగతిగా పరిగణించినట్లు అవుతుంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఓ రైతు తనకు పంట కోతలున్నాయంటూ మధ్యంతర బెయిల్ కోరవచ్చు. అందుకే రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండొద్దు.నిందితుడు సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొద్దు’’ అని సుప్రీంకోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఒక పార్టీ అధినేతగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం కేజ్రీవాల్కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ఇది నిజంగా అసాధారణ పరిస్థితి. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. ఐదేళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవసరం ఆయనకు ఉంది. ఈ కేసులో ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేము అనుమతించం.అలా చేయడం విరుద్ధ ప్రయోజనాలకు దారి తీస్తుంది. అందుకే బెయిల్పై విడుదలైతే అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని స్పష్టం చేసింది. అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ కేజ్రీవాల్ బెయిల్పై బయటకు వెళ్లినా ఎలాంటి ఫైళ్లపై, పత్రాలపై సంతకాలు చేయబోరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది. బుధవారం లేదా గురువారం లేదా శుక్రవారం.. ఎప్పుడైనా సరే దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్పై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు, కేజ్రీవాల్ అరెస్టుకు ముందునాటి ఫైళ్లను అధికారులు కోర్టుకు సమర్పించారు. -
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కాబట్టి కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో.. మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 21వ తేదీన ఈడీ మనీలాండరింగ్ అభియోగాలతో కేజ్రీవాల్ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ.. మధ్యంతర బెయిల్ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీకి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని, నేరాలకు అలవాటు పడిన వ్యక్తి కాదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వద్దని ప్రశ్నించింది.ఈ సందర్భంగా ఈడీ తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుపై సర్వోన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ విషయంలో.. కేసు విచారణను జాప్యం చేయడంపై ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ స్కామ్పై చర్యలు చేపట్టేందుకు రెండు సంవత్సరాలు ఎందుకు పట్టింది?కేజ్రీవాల్ నేరం చేశాడని చూపే సాక్ష్యాలు మీ వద్ద ఉంటే లేదా అతను నిరపరాధి అనే ఆధారాలు ఉంటే.. ఏదో ఒకదానిని ఎంచుకొని విచారణ వేగవంతం చేయాలి కదా? ఇది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ కాదా? మీరు రెండింటి మధ్య సమతుల్యతను పాటించాలి. మీరు ఏ కోణాన్ని మినహాయించలేరు. మీరు ఒక వ్యక్తి జీవించే హక్కును హరిస్తున్నారు.సమస్య ఏమిటంటే దీని కోసం రెండేళ్లు పట్టింది. ఏ దర్యాప్తు సంస్థ అయినా అవినీతిని బట్టబయలు చేయడానికి రెండేళ్లు పడుతుందని చెప్పడం మంచిది కాదు. ఇప్పుడింకా విచారణ ఎప్పుడు మొదలవుతుంది? ఒక దశ నుంచి మరో దశకు ఎప్పుడు చేరుకుంటుంది?కేజ్రీవాల్కు సమన్లు జారీ చేయడానికి, అరెస్టు చేయడానికి ముందు అతని గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?అయితే, లిక్కర్ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేజ్రీవాల్ను సున్నితంగా హెచ్చరించింది. ‘ఒకవేళ మేము మిమ్మల్ని విడుదల చేశామనుకోండి. మీరు ఎన్నికలలో పాల్గొనడానికి అనుమతిస్తే.. మీరు సీఎంగా అధికారిక విధులను కూడా నిర్వహిస్తారు...ఇది కేసు మీద ప్రభావం కలిగించవచ్చు.’ అని న్యాయస్థానం పేర్కొంది.దీనిపై మిస్టర్ కేజ్రీవాల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ.. తన క్లయింట్ కేజ్రీవాల్ ఈ కేసుతో సంబంధించిన ఏ వ్యవహారంలోనూ పాల్గొనడని తెలిపారు. దీనిపై సుప్రీం స్పందిస్తూ.. కేజ్రీవాల్ను విడుదల చేస్తే ఆయన సీఎంగా ఎలాంటి అధికారిక విధులు నిర్వర్తించకూడదు, ఫైల్స్ మీద సంతకం చేయకూడని స్పష్టం చేసింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ఇవ్వడాన్ని ఈడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ ఇవ్వడం సరైనది కాదని వాదించింది. ఎన్నికల ప్రచారం అంత ముఖ్యమేమి కాదని, కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం చేయకపోోతే కొంపలేం మునగవని చెప్పింది. సామాన్యుడి కొక న్యాయం, సీఎంకు ఒక న్యాయం ఉండదని తెలిపింది. సెలెక్టివ్గా బెయిల్ ఇస్తే అది తప్పుడు సాంప్రదాయానికి తెర తీస్తుందని పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది. కాగా ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. మే 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో మొత్తం 7 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. -
సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తిహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ తరఫున ఆప్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తాలతో కూడిన ధర్మానం విచారణ జరుపనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీం కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పరిశీలిస్తామని సుప్రీం కోర్టు మే 3వ తేదీన పేర్కొంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం సమాచారం అందిస్తున్నామని సుప్రీం కోర్టు ఈడీ తరఫు న్యాయవాదికి తెలియజేసింది.దీనికంటే ముందు జరిగిన విచారణలో లోక్సభ ఎన్నికల ముందు సీఎం కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగే మధ్యంతర బెయిల్ విచారణలో సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. -
కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
ఆప్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత, మంత్రి అతిషి సోమవారం తీహార్ జైలులో కేజ్రీవాల్ను కలిశారు. వేసవిలో నగరవాసులు నీటి కష్టాలను ఎదుర్కోకుండా చూడాలని ఆయన ఆదేశించారని తెలుస్తోంది.జైలు నుంచి తిరిగి వచ్చిన తరువాత మీడియా సమావేశంలో అతిషి మాట్లాడుతూ.. తన క్షేమం గురించి అడిగినప్పుడు, నా గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ చెప్పినట్లు చెప్పారు. అంతే కాకుండా పాఠశాల పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయా? పిల్లలు చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? మొహల్లా క్లినిక్లలో మందుల సమస్య పరిష్కారమైందా? కేజ్రీవాల్ తనను అడిగినట్లు అతిషి చెప్పారు.వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన నీటి సరఫరా ఉండేలా చూడాలని కేజ్రీవాల్ తనను కోరినట్లు ఆమె తెలిపారు. ఇక మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 1000 గౌరవ వేతనం అందిస్తామని, త్వరలోనే బయటకు వస్తానని చెప్పినట్లు కూడా అతిషి వెల్లడించారు.కేజ్రీవాల్పై కేంద్ర ప్రభుత్వానికి ద్వేషం ఉందని, వారు కొత్త నిబంధనలను రూపొందిస్తున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఆయన భార్యకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారని ఆప్ ఆదివారం తెలిపింది. అయితే దీనిని జైలు అధికారులు తోసిపుచ్చారు.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం (ఏప్రిల్ 30) ఆప్ అధినేతను కలవనున్నారు. ప్రధానితో ఇది రెండో భేటీ కావడం విశేషం. చివరిసారిగా ఏప్రిల్ 15న పార్టీ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్తో కలిసి కేజ్రీవాల్ను కలిశారు.मुख्यमंत्री @ArvindKejriwal जी से मिलते ही मैंने उनसे उनका हालचाल पूछा तो उन्होंने कहा कि आप लोग मेरी चिंता मत करो, बस दिल्ली वालों की चिंता करो और उनका ख्याल रखो।उन्होंने मुझसे दिल्ली की जनता को मिलने वाली तमाम सुविधाओं का Status जाना और निर्देश दिए कि गर्मियों में किसी को भी… pic.twitter.com/H18YMoqUYu— AAP (@AamAadmiParty) April 29, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement