-
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్కు చేరుకుని భారీగా ఫ్యాన్స్ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది. -
స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం
బుల్లితెర స్టార్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈమేరకు తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. తన భర్త మంజునాథ్ తండ్రి గారు హఠాన్మరణం చెందారని తెలుపుతూ ఆమె కలత చెందింది. ఈ క్రమంలో తన మామగారి ఫోటోను ఆమె షేర్ చేసింది. 'మిస్ యూ అంకుల్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ చెప్పుకొచ్చింది.ఇదే సమయంలో లాస్య భర్త మంజునాథ్ కూడా తన తండ్రి గురించి ఎమోషనల్ అయ్యాడు. 'భౌతికంగా మీరు మాతో లేకపోయినా.. మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే ఉంటుంది.' అని మంజునాథ్ భావోద్వేగానికి గురైయాడు. ఆపై తన తండ్రితో దిగిని ఫోటోలను పంచుకున్నాడు. ఆయన మరణానికి కారణాలు తెలుపలేదు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించి ఉంటారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Manjunath Chillale (@manjunath_chillale) -
‘మీ అమ్మకు అలా మెసేజ్ చేస్తే ఓకేనా?’.. నెటిజన్పై శ్వేతవర్మ ఫైర్
బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. వారిలో శ్వేతవర్మ కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ సీజన్ 5లో పాల్గొన్న తర్వాత బుల్లితెర ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రియులందరికి దగ్గరైంది. ఆ షో తర్వాత సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గాను నటించింది. అయితే అవకాశాలు రాలేకనో లేదా పాత్రలు నచ్చకపోవడంతో తెలియదు కానీ కొన్నాళ్లుగా శ్వేత వర్మ సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వార మాత్రం ఫ్యాన్స్తో టచ్లోనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్తో షేర్ చేసుకునే శ్వేతకు సోషల్ మీడియాలో ఛేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నాడు. ఆమె ఫ్రైవేట్ భాగాలపై నీచంగా కామెంట్ చేశాడు. తాజాగా సదరు వ్యక్తి పంపిన సందేశాలతో పాటు అతని ప్రొఫైల్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.‘ఒక మనిషికి ఇలాంటి మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది? అతని అమ్మకు కూడా ఎవరైనా ఇలా చెబితే ఊరుకుంటాడా? ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను’అంటూ శ్వేత రాసుకొచ్చింది. అలాగే అతని అడ్రస్, కాంటాక్ట్ కూడా సంపాదించానని, ఆ వివరాలు కూడా ఇన్స్టాలో పెట్టొచ్చు..కానీ మనిషిని కాబట్టి షేర్ చేయలేకపోతున్నానని చెప్పింది. ఇది అతనికొక గుణపాఠమని, ఇకనైనా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిదంటూ శ్వేత ఓ వీడియోని షేర్ చేసింది.శ్వేత వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Swetaa Varma (@swetaavarma) -
బిగ్ బాస్ హౌస్లో డేటింగ్.. అప్పుడే బ్రేకప్ చెప్పేసుకున్నారా?
బిగ్ బాస్ సీజన్- 17తో ఫేమస్ అయిన జంట సమర్థ్ జురెల్- ఇషా మాల్వియా. గతేడాది జరిగిన షోలో వీరిద్దరు మరింత రెచ్చిపోయారు. ఏకంగా ఓకే బెడ్పై నిద్రించిన వీడియో అప్పట్లో తెగ వైరలైంది. హౌస్లో సమర్థ్ జురెల్, ఇషా తీరు దారుణంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 19 ఏళ్ల వయసులో ఇలా చేయడమేంటి? అంటూ ఇషాను ట్రోల్ చేశారు. అంతే కాకుండా ఇది బిగ్బాస్ షోనా.. అడల్ట్ షోగా మార్చేశారా అంటూ మండిపడ్డారు. అదే హౌస్లో ఇషా మాజీ భాయ్ ఫ్రెండ్ అభిషేక్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈ జంటపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఉదరియన్ అనే సీరియల్లో నటించే సమయంలో వీరి మధ్య రిలేషన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బిగ్బాస్ షో ద్వారా తమ రిలేషన్ నిజమేనని ధృవీకరించారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలకనున్నట్లు టాక్ వినిపించింది. ఈ జంట త్వరలోనే బ్రేకప్ కానుందని నెట్టింట తెగ వైరలైంది. కానీ ఈ రూమర్స్పై ఇషా కానీ, సమర్థ్ కానీ స్పందించలేదు. (ఇది చదవండి: 'పెళ్లికి ముందు సహజీవనం'.. ఉచిత సలహాపై మండిపడ్డ నటి!) తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాను జంట బ్రేకప్ కావడంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. అయితే ఈ జంట బ్రేకప్కు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై మాత్రం బుల్లితెర జంట నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ఇషా మాల్వియా ఇటీవల పలు మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. -
జైలు నుంచి వచ్చాడు.. రూ.3 కోట్ల కారు కొన్నాడు!
ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్. పాము విషం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్పై విడదలయ్యారు కూడా. యూట్యూబర్గా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఎల్విశ్ యాదవ్ బిగ్బాస్ షో మరింత గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల జైలు నుంచి బయటికొచ్చిన ఎల్విశ్ యాదవ్ ఖరీదైన లగ్జరీ కారును కొన్నారు. తాజాగా మెర్సిడెస్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ కారును 2022లోనే కొనాలనుకున్నట్లు తన వీడియో ఎల్విశ్ వెల్లడించారు. అప్పుడు కుదరకపోవడంతో ఈ ఏడాది తన కల నెరవేరిందని అన్నారు. కాగా.. ఎల్విశ్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2 విజేతగా నిలిచారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement