-
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్లో ఓ ఆహార విక్రేత డీజిల్తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్స్టామ్లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!) -
హోలీ 2024 : యూనివర్శిటీలో విద్యార్థుల హంగామా చూసి తీరాల్సిందే!
చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by '*·舞~ 𝕐άŜ𝓗Ɨ𝔰H ~舞*'¨¯ (@yashish023) అయితే ఈ సందర్బంగా క్యాంపస్లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. View this post on Instagram A post shared by Chandigarh (@the__chandigarh) -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ఛండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ!
పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత కుల్జీత్ సంధు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. డిప్యూటీ మేయర్గా బీజేపీ అభ్యర్థి రాజిందర్ కుమార్ శర్మ గెలుపొందారు. మీడియా దగరున్న సమాచారం ప్రకారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. గతంలో మేయర్ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రిసైడింగ్ అధికారిని కోర్టు మందలించింది. అనంతరం డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరు ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్, ఆప్లకు 20 మంది కౌన్సిలర్లు ఉండేవారు. వీరిలో ముగ్గురు బీజేపీలో చేరడంతో ‘ఇండియా కూటమి’ కౌన్సిలర్ల సంఖ్య 17కు తగ్గింది. అదే సమయంలో బీజేపీకి అకాలీ, కిరణ్ ఖేర్ మద్దతు పలకడంతో ఆ పార్టీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. -
‘సర్వోన్నత’ న్యాయం!
వ్యవస్థలు నిర్మాణం కావటానికి సమయం పట్టినట్టే అవి భ్రష్టుపట్టడానికి కూడా ఎంతో కొంత వ్యవధి పడుతుంది. అప్రమత్తంగా వుండి సకాలంలో దాన్ని గమనించుకుంటే వాటిని రక్షించు కోవటం సులభమవుతుంది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీసుకున్న అసాధారణ నిర్ణయం ఆ కారణం రీత్యా హర్షించదగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ను మేయర్గా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు వక్రమార్గాల్లో విజయం సాధించటానికి అలవాటుపడిన రాజకీయ నేతలకూ, వారికి దాసోహమయ్యే అధికారులకూ చెంపపెట్టు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీ కనీసం సీసీ కెమెరాలున్నాయన్న వెరపు కూడా లేకుండా ఆప్ అభ్యర్థికి పడిన ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై స్వహస్తాలతో గీతలు పెట్టి అవి చెల్లని ఓట్లుగా లెక్కేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఆయన వ్యవహారశైలి పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పటంతోపాటు అఫిడవిట్లో సైతం ఆ అధికారి బొంకటం నేరంగా పరిగణించి ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 340 కింద విచారణ జరపాలని నిర్ణయించటం మంచి పరిణామం. నిజానికి ఏ ఇతర నగరాలతో పోల్చినా చండీగఢ్ మేయర్ పదవి ఏమంత ప్రాధాన్యత వున్నది కాదు. కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న ఆ నగరానికి మేయర్ అయినవారు కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించటం, ఎజెండాను రూపొందించటం మాత్రమే చేయగలరు. పైగా ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ వరకూ ఎవరి దారి వారిదే అని ప్రకటించిన ఆప్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 13 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడింటిని గెలుచుకుంది. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చండీగఢ్ లోక్సభ ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కిరణ్ ఖేర్, ఒకే ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ను కూడా కలుపుకొంటే బీజేపీ బలం 16. కనుక 36 మంది సభ్యులున్న కార్పొరేషన్లో 20 మంది సభ్యులున్న ఆప్–కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం. కానీ ఏం చేసైనా నెగ్గి తీరాలనుకున్న బీజేపీ వ్యూహానికి అనిల్ మాసీ వంతపాడారు. ఆది నుంచీ మేయర్ ఎన్నికను ఆయన ప్రహసన ప్రాయంగా మార్చారు. షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి గత నెల 18న మేయర్ ఎన్నిక జరగాలి. కానీ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం కోసం వెళ్లాక మాసీ అస్వస్థులయ్యారంటూ దాన్ని కాస్తా వాయిదా వేశారు. కేంద్రపాలిత పాలనావ్యవస్థ ఈ ఎన్నికను ఫిబ్రవరి 6న జరపాలని నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ పంజాబ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం దీన్ని జనవరి 30న జరపాలని ఆదేశించింది. ఈ క్రమం అంతా పరిశీలిస్తే, 30న జరిగిన తతంగం గమనిస్తే నాయకులు, అధికారులు ఎంత నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈనెల 5న ఈ కేసు విచారణకొచ్చినప్పుడు మాసీ వ్యవహరించిన తీరును జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని వంచించటం, హత్య చేయటం తప్ప మరేమీ కాద’ని ఆయన అన్నారు. నిజానికి ప్రజలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో, వారి విశ్వాసాన్ని పొందాల్సిన స్థానంలో వున్న రాజకీయ పార్టీలకు ఈ స్పృహ వుండాలి. రేపన్న రోజు అధికారంలోకొచ్చే మరో పార్టీ కూడా ఇదే తీరులో గెలుపును తస్కరించే ప్రమాదం వున్నదని గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఈ ఎన్నికల తతంగం మొత్తం గుప్పెడుమంది బల వంతులు చేసే వంచనాత్మక విన్యాసమన్న అభిప్రాయం స్థిరపడితే తమ మనుగడే ప్రశ్నార్థక మవుతుందన్న ఎరుక వుండాలి. కానీ సమస్యాత్మకంగా వున్న బడి పిల్లలకు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టే రీతిలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని చెప్పవలసిరావటం అధికారుల, నేతల పరువు ప్రతిష్ఠలకే తలవంపు. దాన్ని కనీసం గుర్తించలేని స్థితిలోనే మన నాయకగణం వున్నదని ఆదివారంనాటి పరిణామాలు చెబుతున్నాయి. మేయర్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసి, మళ్లీ ఎన్నికకు ఆదేశి స్తుందన్న అంచనాతో బీజేపీ నాయకులు ఫిరాయింపులకు తెరలేపి, ముగ్గురు ఆప్ సభ్యులను బుట్టలో వేసుకున్నారు. దాంతో ఆప్–కాంగ్రెస్ కూటమి బలం 17కి పడిపోగా, బీజేపీ బలం 19కి పెరిగింది. ఒకపక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో వుండి, దేశమంతా దానిపై దృష్టిపెట్టిన తరుణంలో ఈ తరహా జుగుప్సాకర చేష్టలకు పాల్పడటం భావ్యంకాదన్న ఇంగితజ్ఞానం లోపించటం నిజంగా బాధాకరం. మేయర్గా పార్టీ అభ్యర్థి నెగ్గటంపైనే తమ భవిష్యత్తంతా ఆధారపడి వుందనుకోవటం దివాలాకోరుతనం. మాసీ మాయోపాయంవల్ల మేయర్ అయిన మనోజ్ సోంకార్ రాజీనామా చేశారు గనుక తిరిగి ఎన్నికకు ఆదేశించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను తోసిపుచ్చి 142వ అధికరణ కింద సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించటాన్ని చూసైనా అటు నాయకులూ, ఇటు అధికార గణమూ కళ్లు తెరవాలి. అక్రమాలతో, అన్యాయాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర అపచారం చేయటమేనని అందరూ గుర్తించాలి. అసాధారణమైన ఈ తీర్పు మన వ్యవస్థలకు భయభక్తులు నేర్పాలి. -
‘ఆప్’ అభ్యర్థే చండీగఢ్ మేయర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్ అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్ మేయర్గా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు తేల్చిచెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. ఎన్నిక ప్రక్రియను తారుమారు చేశారు మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెల్లనివిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా పరిశీలించింది. అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని ప్రశ్నించింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు తేల్చింది. పిటిషనర్కు అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించినట్లు ఆక్షేపించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. మేయర్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వైఖరి సక్రమంగా లేదని వెల్లడించింది. మేయర్ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని, అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని, ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అసలేం జరిగింది? చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించారు. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు వచ్చింది. మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్కు 12, బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆప్ జాతీయ కన్వి నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందన్నారు. ఇదో చరిత్రాత్మక తీర్పు అన్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా పని చేస్తే బీజేపీని ఓడించడం సులువేనని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పోలయ్యే 90 కోట్లకు పైగా ఓట్లను బీజేపీ ఎలా దొంగిలిస్తుందని ప్రశ్నించారు. నీచ రాజకీయాలను ఎదిరించాలి: ఖర్గే సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ బీజేపీ కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానం రక్షించిందంటూ ఎక్స్లో పోస్టు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలంతా కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి ఒక పావు మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ముఖం నరేంద్ర మోదీ అని ఆరోపించారు. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం .. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను చండీగఢ్ మేయర్గా ప్రకటించింది. మేయర్ఎ న్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే అనిల్ మసీహ్ 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. అంతకముందు మేయర్ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్ పత్రాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనంతరం ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని.. వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్గా ప్రకటించాలని తెలిపింది. తాజాగా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను చండీగఢ్ మేయర్గా ప్రకటించడంతో ఈవివాదానికి తెరపడింది. చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్గాంధీకి ఊరట కాగా జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్ను ఓడించి మనోజ్ సోంకర్ మేయర్గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్ పేపర్లను మార్కింగ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆదివారం సోంకర్ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆప్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. -
బ్యాలెట్పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్ను ఓడించి మేయర్గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్కు ఏడుగురు ఉన్నారు. -
మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. చండీగఢ్లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,. కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు. అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. -
సన్రైజర్స్ ఓపెనర్ ఊచకోత.. ఏకంగా 205 పరుగులతో
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్, చండీగఢ్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ముగిసే సమయానికి పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 477 పరుగులు చేసింది. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ ఆజేయ దిశ్వతకంతో చెలరేగాడు. అన్మోల్ప్రీత్ 329 బంతుల్లో 25 ఫోర్లతో 205 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అతడితో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ సైతం భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రభుసిమ్రాన్ 215 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్లతో 171 చేసి ఆజేయంగా ఉన్నాడు. కాగా అన్మోల్ప్రీత్ సింగ్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో ఓపెనర్గా వచ్చి ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్లు అన్మోల్ప్రీత్ ఆడాడు. అతడిని ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. అదే విధంగా ప్రభుసిమ్రాన్ సైతం క్యాష్రిచ్ లీగ్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. చదవండి: IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్ -
‘ఇండియా కూటమి చారిత్రక గెలుపు నమోదు చేస్తుంది’
న్యూఢిల్లీ: చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత రాఘవ్ చద్దా జోష్యం చెప్పారు. ఎప్రిల్/మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి చారిత్రక, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. మొదటి సారిగా ఇడియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి-1, బీజేపీ-0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. #WATCH | Delhi | AAP MP Raghav Chadha says, "INDIA Alliance will fight the Chandigarh Mayor elections with all its strength and register a historic and decisive victory. Don't consider this an ordinary election. This will be an election where for the first time it will be INDIA… pic.twitter.com/l7d4Ej1kpg — ANI (@ANI) January 16, 2024 ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. చదవండి: ‘రామ మందిర కార్యక్రమం... మోదీ రాజకీయ కార్యక్రమం’ -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్కు భారత్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్లో భారత్.. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో పెరిగిన ఆర్ధిక వ్యయానికి సంబంధించి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్రంలో అప్పు రూ.50,000 కోట్లు పెరిగిపోవడంపై వివరణ కోరగా ముఖ్యమంత్రి భగవంత్ మన్ గత ప్రభుత్వం చేసిన రుణాలకు చెల్లించిన వడ్డీలతోపాటు ఇటీవలి కాలంలో పెరిగిన జీఎస్టీ, వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ చార్జీల వల్లనే వ్యయం పెరిగిందని లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మన్ రాసిన లేఖలో.. గడిచిన ఏడాదిలో పంజాబ్ ఎక్సయిజ్ పన్ను ఏకంగా 37 శాతం పెరిగిందని అలాగే వస్తు సేవల పన్ను 16.6 శాతం, వాహనాలపై మన్ను వసూళ్లు 13 శాతం స్టాంపు రిజిస్ట్రేషన్ల వసూళ్లు 28 శాతం పెరిగాయని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2002 నుండి ఆగస్టు 31,2023 వరకు పంజాబ్ రాష్ట్రం అప్పు రూ.47,107 కోట్లు పెరిగిందని అందులో రూ.27,016 కోట్లు అంతకుముందు తీసుకున్న అప్పుకు వడ్డీగా చెల్లించామని తెలిపారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వాలు వదిలిపెట్టిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశామని వారు విస్మరించిన సంస్థల పునరుద్ధరణకు అలాగే వారు అమలు పరచిన కొన్ని పథకాలను కొనసాగించడానికి అప్పులను అలాగే సొంత ఆర్ధిక వనరులను కూడా వినియోగించామని లేఖలో నివేదించారు. ఇక రాష్ట్రంలో మూలధన వనరులను ఏర్పరిచి అభివృద్ధి పనుల కోసం కొత్తగా చేసిన అప్పులను వినియోగించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం -
గురపత్వంత్ సింగ్కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్కోట్లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్పోల్ రెడ్నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్ -
నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. "अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।" धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं। महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt — AAP (@AamAadmiParty) September 7, 2023 BJP के मुख्यमंत्री की सोच देखिए... हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके। इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे। और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db — Congress (@INCIndia) September 7, 2023 ఇది కూడా చదవండి: నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్ -
Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు
చండీగఢ్: గత నెల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా అల్లర్లతో సంబంధముందన్న కారణంతో బజరంగ్దళ్ సభ్యుడు గోసంరక్షకుడైన బిట్టు బజరంగీని అరెస్టు చేశారు హర్యానా పోలీసులు. నూహ్ జిల్లా గురుగ్రామ్ పరిసర ప్రాంతాల్లోని జరిగిన అల్లర్లలో ఐదుగురు మరణించగా సుమారు 70 మంది గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఒక మసీదు ధ్వంసం కాగా వందలాది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అల్లర్లు చెలరేగడానికి ప్రధానంగా బజరంగ్దళ్ కార్యకర్తలైన బిట్టు బజరంగీ, మోను మనేసర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని వారిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో హర్యానా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బిట్టు బజరంగీని ఫరీదాబాద్ లోని తన ఇంటి వద్దే పారిపోతుండగా వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డవడంతో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో పోలీసులు సాదా దుస్తుల్లో కనిపించగా వారి చేతుల్లో కర్రలు తుపాకులు కనిపించాయి. అతడితో పాటు అతడి అనుచరులను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు ఈ బృందంలోని ఒక పోలీస్ అధికారి. పోలీసుల విధులకు ఎవ్వరు ఆటంకం కలిగించినా విడిచిపెట్టేది లేదని.. సోషల్ మీడియాని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అసత్య సమాచారంతో తప్పుదోవ పట్టించినా సహించేది లేదని అన్నారు. బిట్టు బజరంగీ అలియాస్ రాజ్ కుమార్ ఒక సాధారణ పండ్ల వ్యాపారి. ఫరీదాబాద్ లోని దాబువా మార్కెట్ లో పండ్ల వ్యాపారం చేసుకునే అతను ఒక గోసంరక్షణ గ్రూపును కూడా నిర్వహిస్తున్నాడు. గత నెలలోనే అతడిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. నూహ్ అల్లర్ల తర్వాత గోసంరక్ష బజరంగ్ చీఫ్ పైనా కేసు నమోదైంది. స్థానిక నూహ్ ఎమ్మెల్యే చౌదరి అఫ్తాబ్ మాట్లాడుతూ బిట్టు బజరంగ్, మోను మనేసర్ ఇద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలననే అల్లర్లు చెలరేగాయని ప్రజలు వారిపై కోపంగా ఉన్నారని అన్నారు. बिट्टू बजरंगी को हरियाणा पुलिस ने किया गिरफ्तार पहले सुदर्शन न्यूज के रेजिडेंट एडिटर मुकेश कुमार जी की गिरफ्तारी अब गौरक्षक #BittuBajrangi की गिरफ्तारी ये कैसा अमृतकाल है खट्टर साहब ? स्वतंत्रता दिवस के दिन गौरक्षक की गिरफ्तारी क्यों ? pic.twitter.com/7PlI99F7QR — Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) August 15, 2023 ఇది కూడా చదవండి: Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం -
కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..
చంఢీగడ్: కన్న కొడుకు మరణవార్త వినలేకపోయింది. ఆ వార్త తన చెవిలో పడగానే కళ్లు తిరిగి పడిపోయింది. అంతే.. ఇగ తిరిగి మేల్కోలేదు. కొడుకుతోపాటు తాను అనంతలోకాలకు చేరింది. కొడుకు, తల్లికి ఒకేసారి అంత్యక్రియలు జరిపారు. ఈ బాధాకర ఘటన పంజాబ్లోని నవాన్షహర్ జిల్లాలో జరిగింది. పంజాబ్కు చెందిన గుర్విందర్ నాథ్(24) చదువు కోసం కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. జూలై 9న కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న అక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్విందర్ తల్లి నరీందర్ కౌర్కు చెప్పలేదు. గుర్విందర్ మృతదేహం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిందనే విషయం అతని తల్లికి ఎట్టకేలకు తెలిసింది. ఇక కుమారుని మరణవార్త విన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దుఖిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెను లూథియానాలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాడు. తల్లి, కొడుకుకు ఒకేసారి శుక్రవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరిపారు. ఇదీ చదవండి: షాకింగ్..! ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే.. -
చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది
చండీఘర్కు చెందిన మోహిత్ అహ్లువాలియా, జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది. నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్గా, జగజ్యోత్ కౌర్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసేవారు. ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్లు, క్విల్ట్లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం. బాలి పర్యటనతో మలుపు ‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్ ‘షి ద పీపుల్’ అనే ఆన్లైన్ మ్యాగజైన్తో పేర్కొన్నారు. బ్లాక్ ప్రింటింగ్తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్ను విడిచిపెట్టారు. 2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Raamaé - Home Baby Lifestyle (@raamae_life) -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్షీట్లో బాలీవుడ్ పాటలు ..!
చండీగఢ్: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్కు క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు విద్యార్థి ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలు త్రీ ఇడియట్స్లోని ‘గివ్ మి సమ్ సన్షైన్...’, పీకేలోని ‘భగవాన్ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్ను దిద్దిన టీచర్ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. -
అక్కడ 54.1 శాతం కుటుంబాలకు ఏసీ.. ఏపీ, తెలంగాణాలో ఎంత శాతం అంటే?
దేశవ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఎయిర్ కండీషనర్ల వినియోగం అధికంగా ఉంది. అత్యధికంగా చండీఘడ్లో 54.1 శాతం కుటుంబాలు ఏసీ నీడన సేదతీరుతున్నాయి. దేశంలో 4.9 శాతం కుటుంబాలకు ఏసీ సదుపాయం ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళలో 10.4 శాతం, ఏపీలో 8.1 శాతం కుటుంబాలు ఏసీలను వాడుతున్నాయి. తెలంగాణలో 6.6 శాతం, తమిళనాడులో 6.1 శాతం కుటుంబాలకు ఏసీలున్నాయి. అత్యల్పంగా బిహార్లో 0.4 శాతం, ఒడిశాలో 1.5 శాతం, కర్ణాటకలో 1.8 శాతం కుటుంబాలు ఏసీలను వినియోగిస్తున్నాయి. శ్రీసిటీలో పలు యూనిట్లు దేశవ్యాప్తంగా ఏటా సగటున 75 లక్షల ఏసీల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఎండలు చుర్రుమనే దక్షిణాదిలో ఏసీల వినియోగం పెంచడంపై తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో పలు ఏసీల తయారీ యూనిట్లు ఏర్పాటు కావడంతోపాటు ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ లాంటి సంస్థలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పుతున్నాయి. బ్లూస్టార్ విస్తరణ కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఏటా వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షలకు పైగా ఉంది. వ్యత్యాసం ఎందుకంటే..? కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉండటం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు, పన్నులు తక్కువ ఉండటం లాంటి కారణాలు కొనుగోలు శక్తిని పెంచుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయం, కూలీలు ఎక్కువగా ఉండటం ఏసీ వినియోగం తక్కువగా ఉండటానికి కారణం. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కొనుగోలు శక్తి తక్కువగా ఉంటాయి. – ఎం.ప్రసాదరావు, ఏయూ ఎకనామిక్స్ విభాగం విశ్రాంత అధిపతి సగటు ఏసీ నియోగం భారత్ 4.9% పట్టణాల్లో12.6% గ్రామాల్లో 1.2% -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయేదే.. ఐఏఎస్ సమయస్పూర్తికి ఫిదా
ఇటీవలే బెంగళూరులో ఐకియా మాల్లో ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, మాల్లో ఉన్న ఓ డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్) బాధితుడి ఛాతిపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. తాజాగా ఇలాంటి ఘటనే చండీగఢ్లో చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఓ వ్యక్తి కూర్చీలోనే కుప్పకూలిపోవడంతో ఆఫీసులో ఉన్న ఐఏఎస్ అధికారి వెంటనే స్పందించిన సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించాడు. వివరాల ప్రకారం.. చండీగఢ్ సెక్టార్-41కు చెందిన జనక్ లాల్ మంగళవారం చండీగఢ్ హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వెళ్లారు. తన ఇంటికి సంబంధించి ఉల్లంఘన కేసుపై అధికారులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు వచ్చినట్టు గమనించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఐఏఎస్ యశ్పాల్ గార్గ్ అతడి వద్దకు చేరుకుని సీపీఆర్ చేశారు. ఛాతిపై రెండు చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో రెండు నిమిషాల్లోనే జనక్ లాల్ స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరిచి అక్కడున్న వారి చూసి పర్వాలేదంటూ చేతులతో సైగా చేశారు. దీంతో, ప్రాణాపాయ స్థితి నుంచి జనక్ లాల్ బయటపడ్డారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. యశ్పాల్ గార్గ్కు అసలు సీపీఆర్ గురించే తెలియదని.. ఇటీవలే ఓ టీవీలో చూసి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నట్టు చెప్పారు. ఇక, జనక్ లాల్ ప్రాణాలు కాపాడిన గార్గ్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. एक आदमी को हार्ट अटैक आया तो चंडीगढ़ के हेल्थ सेक्रेटरी IAS @Garg_Yashpal जी ने तुरंत CPR देकर उस आदमी की जान बचाई। उनके इस काम की जितनी सराहना की जाए उतनी कम है। हार्ट अटैक से जानें बचाई जा सकती हैं। हर इंसान को CPR सीखना चाहिए। pic.twitter.com/C7dWVsAoOI — Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
May 16th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
Movie Theaters: దిగాలు పడుతున్న థియేటర్లు
స్టార్ డైరెక్టర్తో నయనతార కొత్త సినిమా
టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
తప్పక చదవండి
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
Advertisement