-
మద్యం అమ్మకాలపై పిటిషన్ కొట్టివేత.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. విచారణలో భాగంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. వివరాల ప్రకారం.. మద్యం అమ్మకాల్లో ఎక్సైజ్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు చేస్తూ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. కాగా, విచారణలో భాగంగా.. పిటిషన్లో చేసిన ఆరోపణలు అవాస్తవని తేలింది. కాంపిటీషన్ లాను ఉల్లంఘించినట్టు నిర్ధారణ కాలేదని కమిషన్ తేల్చింది. ఎక్సైజ్ చట్టం సెక్షన్-4 ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేస్తూ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. -
‘పండగ పూటా పస్తులేనా?.. మేమేం పాపం చేశాం’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు, దసరా వేడుకలు జరుగుతున్నాయి. మాకు మాత్రం కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. కష్టపడి చదువుకున్నాం. పోటీపరీక్షల్లో గెలిచాం. ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికయ్యాం. కానీ ఇప్పటి వరకు పోస్టింగులు ఇవ్వలేదు. 10 నెలలుగా జీతాలు కూడా లేవు. మేమేం పాపం చేశాం. మాకూ కుటుంబాలు ఉన్నాయి. మేం పండగలు చేసుకోవద్దా. సంతోషంగా ఉండొద్దా...’ – ఆబ్కారీశాఖలో ఎస్సైగా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళ ఆవేదన ఇది. ఈ మహిళ ఒక్కరే కాదు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ ఎస్సైలుగా ఎంపికైన సుమారు 280 మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ‘కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాం. ఇక ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండొచ్చని భావిస్తున్న తరుణంలో రెండేళ్లుగా అటు పోస్టింగుల్లేక, పది నెలలుగా జీతాలు అందక బాధలు పడుతున్నామ’ని మరో మహిళా ఎస్సై తెలిపారు. గతంలో చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఆబ్కారీశాఖలో అడుగు పెట్టిన మరికొందరు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చదవండి: నా భర్తను అంతం చేయాలని ఎర్రబెల్లి కుట్ర ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు.. ► 2015లో గ్రూపు–2 పరీక్షలు రాసి పోటీలో నెగ్గి చివరకు 2019లో ఎక్సైజ్ ఎస్సైలుగా ఎంపికైన ఉద్యోగులకు రెండేళ్లు దాటినా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారంతా నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆబ్కారీ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ► నియామకపత్రాలు అందుకున్న ఉద్యోగుల్లో 193 మందిని పలు ఎక్సైజ్ స్టేషన్లకు అటాచ్ చేశారు.కానీ వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. ► అలాగే మరో 87 మందిని ఎక్సైజ్ అకాడమీకి పంపించారు. సాధారణంగా ప్రతి ఎస్సైకి విధి నిర్వహణ పరిధి ఉంటుంది. కానీ ఎక్సైజ్ స్టేషన్లకు అటాచ్ అయిన ఏ ఒక్క ఎస్సైకి కూడా ఇప్పుడు ఆ పరిధి లేదు. ప్రతి రోజు కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లవలసిందే. ఇంచుమించు అకాడమీలో ఉన్నవాళ్లు కూడా అంతే. ► ‘తాత్కాలిక పదోన్నతులపైన నిబంధనలను బేఖాతరు చేశారు. మా కోసం సూపర్న్యూమరీ పోస్టులను సృష్టించారు. విధి నిర్వహణ లేని ఆ పోస్టుల్లో మేం బలిపశువులుగా మారాం.’ అని మరో ఎస్సై తెలిపారు. చదవండి: ‘జువెనైల్’ ఉన్నట్లు నాకు తెలియదు! అలా తిష్ట వేశారు.. గతంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ఎస్ఐలుగా తాత్కాలిక (అడ్హక్)పదోన్నతులిచ్చారు. గ్రూపు–2లో ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగాలు పొందిన వాళ్లకు పోస్టింగులు ఇవ్వాలంటే ఈ తాత్కాలిక ఉద్యోగులను వెనక్కు పంపించాలి. లేదా కొత్తవాళ్ల కోసం మరిన్ని పోస్టులను సృష్టించాలి. కానీ 87 మందికి మాత్రమే సూపర్న్యూమరీ పోస్టులను సృష్టించారు.ఈ ఏడాది జనవరితో ఆ గడువు ముగియడంతో జీతాలు నిలిచిపోయాయి. మిగతా వాళ్లను స్టేషన్లకు అటాచ్ చేసినా విధులు మాత్రం లేకపోవడం గమనార్హం. జీతాల్లేక విలవిల... ► సూపర్న్యూమరీ పోస్టుల కోసం ఇచి్చన గడువు ముగియడంతో జీతాలు ఇవ్వడం అధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో అప్పట్నుంచి జీతాలు చెల్లించడంలేదు. ఫలితంగా సబ్ ఇన్స్పెక్టర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.కొంతమందికి కుటుంబపోషణ భారంగా మారింది. ► ఇంటి అద్దెలు, నిత్యాసవరాలు, పిల్లల ఫీజులు తదితర అవసరాలకు ఎంతో కష్టంగా ఉందని పలువురు ఆవేదన చెందారు. ప్రైవేట్ సంస్థల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నట్లు మరికొందరు విస్మయం వ్యక్తం చేశారు. -
3 బార్లకు 3 దరఖాస్తులే.. ఆ 10 బార్ల పై ఆరా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వెల్లువలా దరఖాస్తులు వ చ్చినా కేవలం నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మున్సిపాలిటీలో నోటిఫై చేసిన బార్లకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం ఇప్పుడు ఎక్సైజ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 7 బార్లను నోటిఫై చేస్తే అక్కడ కేవలం 10 దరఖాస్తులే వచ్చాయి. ఇక బోధన్ మున్సిపాలిటీలో అయితే 3 బార్లకు గాను 3 దరఖాస్తులే వచ్చాయి. కానీ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మాత్రం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల్లోని 159 కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 7,400 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్, బోధన్లలో చాలా తక్కువగా ఎందుకు దరఖాస్తులు వచ్చాయన్న దానిపై ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఆరా తీసినట్టు తెలిసింది. నిజామాబాద్లో 7 బార్లకు గాను చివరిరోజు వరకు ఒక్కటే దరఖాస్తు వచ్చిందని, చివరి రోజు కూడా 9 మాత్రమే ఎలా వచ్చాయని, అలాగే బోధన్లో అయితే మూడు బార్లకు చివరిరోజే మూడు దరఖాస్తులు రావడం ఎలా సాధ్యమైందని ఆయన అంతర్గతంగా పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇక్కడ తక్కువ దరఖాస్తులు రావడానికి సిండికేట్ కారణమైందని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నోటిఫై అయిన బార్లకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 16 వరకు పొడిగించారు. ఇక ఈ నెల 19న లాటరీలు తీసి.. అందులో వచ్చిన వారికి 25వ తేదీన కేటాయిస్తారని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. చదవండి: సముద్రం నీరూ తాగొచ్చు! -
దశలవారీ మద్యనిషేధంపై కసరత్తు షురూ..
సాక్షి, అమరావతి: దశలవారీ మద్య నిషేధం అమలు చర్యలు శరవేగంగా సాగుతోన్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు ప్రధాన విభాగాల ఉన్నతాధికారులు శుక్రవారం గుంటూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) గుంటూరు అర్బన్ ప్రత్యేకాధికారి కరిముల్లా షరీఫ్, గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. బాలకృష్ణన్ తో కలిసి మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పలు అంశాలపై చర్చించారు. ముందుగా ఎస్ఈబీ ప్రత్యేకాధికారి షరీఫ్ కి లక్ష్మణరెడ్డి అభినందనలు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, రవాణాను నిరోధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఆ శాఖలు సమన్వయంగా పనిచేయాలి.. మద్య నిషేధం అమలులో భాగంగానే ఎస్ఈబీని ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలంటే ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలు సమన్వయంగా పనిచేసి తమ సత్తాను చాటుకోవాలని సూచించారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లల్లో మద్యం దుకాణాలు తెరవనందున ఇతర ప్రాంతాల నుంచి మద్యాన్ని తరలించే ప్రమాదాన్ని పసిగట్టి నిరోధించాలన్నారు. రాష్ట్ర,జిల్లాల సరిహద్దుల్లో మద్యం అక్రమరవాణాకు పటిష్ట బందోబస్తును మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులను లక్ష్మణరెడ్డి కోరారు. కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, రాపాక వరప్రసాద్ ల నేతృత్వంలో నాటు సారా కేంద్రాల్ని మూసేయించడం అభినందనీయమన్నారు. ('ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు') సరికొత్త శుభ పరిణామం.. నాటు సారా తయారీదారులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేంద్రాలను అప్పచెప్పారని.. ముఖ్యమంత్రి సంకల్పమే తమలో మార్పునకు కారణమని చెప్పడం సరికొత్త శుభ పరిణామంగా లక్ష్మణరెడ్డి వివరించారు. ఇలాంటి సంఘటనల ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా పూనుకొని ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో నాటుసారా తయారీ కేంద్రాల్ని మూత వేయించాలన్నారు. రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు.. దశలవారీ మద్య నిషేధ చర్యలతో రానున్న రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదని.. అలాంటప్పుడే ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నాటుసారా తయారీ, కల్తీకల్లు, గంజాయి ఇతర మత్తుపదార్ధాల ఉత్పత్తి జరగకుండా ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. ఎస్ఈబీలో 70శాతం ఉద్యోగులు, సిబ్బందితోనూ.. ఎక్సైజ్ శాఖ 30 శాతం సిబ్బందితో సమర్ధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరుశాఖల అధికారులు చెప్పారు. మద్య విమోచన ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ తమ శాఖల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆయా శాఖల అధికారులు హామీనిచ్చారు. -
చూసీ చూడనట్టు వదిలేశారు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలోని 83 బార్ అండ్ రెస్టారెంట్లపై సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు 19 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని టీడీపీ నాయకుడికి చెందిన ఓ బార్లో ఫుల్ బాటిల్ను బయటికి పార్సిల్ చేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం బార్లలో మద్యాన్ని బయటికి విక్రయించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని బయటికి విక్రయించినట్లైతే సదరు బార్పై కేసు నమోదు చేసి లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. టీడీపీ నాయకుడి బార్లో ఫుల్ బాటిల్ మందు బయటకు విక్రయించినట్లు అధికారులు గుర్తించడంతో వెంటనే ఆయన జిల్లాకు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో పాల్గొన్న ఎక్సైజ్ సీఐకు జిల్లా ఉన్నతాధికారి ఫోన్ చేసి బార్ యజమానికి తనకు కావాల్సిన వాడని చూసి చూడనట్లు వదిలేయమని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బాస్ చెప్పడంతో సదరు టీడీపీ నాయకుడి బార్పై పార్సిల్ కేసు నమోదు చేయకుండా టెక్నికల్ కేసు నమోదు చేసి వదిలేసినట్లు ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని బార్ అండ్ రెస్టారెంట్లపై 7 కేసులు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా డెప్యూటీ డైరెక్టర్(ఎఫ్ఏసీ) డాక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement