ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా | Sakshi
Sakshi News home page

ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా

Published Tue, May 7 2024 5:00 AM

ధైర్య

తోటపల్లిగూడూరు: ‘సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా. ఈ విషయాన్ని ధైర్యంగా ప్రజలకు చెప్పి ఓట్లు అడుతున్నా’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మేజర్‌ పంచాయతీ కోడూరులో సోమవారం మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం మేర నెర్చవేర్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజల కోసం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ప్రారంభించి సంక్షేమ పథకాలు అందించారన్నారు. 2014 ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఒక్కదానిని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి జగన్‌ అండగా నిలిచారన్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లను రూ.3 వేలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతులకు పెట్టుబడి సాయం చేశారన్నారు. సీఎంకు అందరూ అండగా నిలవాలన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడని ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయలేదన్నారు. ఇప్పుడు ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడని, ఆయన మాటల్ని నమ్మొద్దన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గుణపాఠం చెప్పాలన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ ఫలాలను అందించిన జగన్‌ను రెండోసారి సీఎంను చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఉప్పాల శంకరయ్య గౌడ్‌, నాయకులు కావల్‌రెడ్డి రవీంద్రరెడ్డి, కావల్‌రెడ్డి హరిశ్చంద్రారెడ్డి, కావల్‌రెడ్డి రంగారెడ్డి, కావల్‌రెడ్డి శ్రీనివాసులురెడ్డి, కావల్‌రెడ్డి నరేంద్రరెడ్డి, కోడూరు దిలీప్‌రెడ్డి, దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మారంరెడ్డి బుజ్జిరెడ్డి, ఆగాల శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో గెలిపించండి

రాష్ట్ర వ్యవసాయ శాఖ

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
1/2

ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా

ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
2/2

ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా

Advertisement

తప్పక చదవండి

Advertisement