-
ఫేస్ ‘బుక్' అయ్యారో.. ఇకపై వీడియో కాల్ తో.. మీ పని అంతే!
వరంగల్: కాజీపేటకు చెందిన యువకుడు సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా అనంతరం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళతో న్యూడ్ కాల్ మాట్లాడి వారికి దొరికిపోయాడు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడ్తానని బెదిరించగా రూ.10లక్షలు ముట్టజెప్పాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో చివరికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఎంతో మంది.. ఎన్నో రకాలుగా మోసపోతున్న ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పరిమితుల్లేని శృంగారం.. అవధుల్లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ వాట్సాప్ కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుతూ ఆపై వీడియోలు తీసి బెదిరిస్తున్న సైబర్ నేరస్తుల వల నుంచి తప్పించుకోవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యువకులు, వృత్తి నిపుణులే లక్ష్యంగా పశ్చిమ బంగాల్, రాజస్తాన్ ముఠాలు వలపు వలలు విసురుతున్నాయి. బుట్టలో పడిన వారిని బెదిరించి లక్షల్లో నగదు బదిలీ చేయించుకుంటున్నారు. పరువు పోతుందన్న భావనతో పలువురు.. నిందితులు అడిగినంత డబ్బు పంపిస్తూ మోసానికి గురవుతున్నారు. ఇకపై అలా చేయొద్దని, సొంతంగానే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. సాధ్యం కాదన్నా వినకుండా.. ఫేస్బుక్ ద్వారా యువకులు, వృత్తి నిపుణులను భరత్పూర్, కోల్కతాకు చెందిన యువతులు పరిచయం చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు ఫేస్బుక్లో మాట్లాడిన తర్వాత వాట్సాప్ నంబర్లు తీసుకుంటున్నారు. వాట్సాప్ కాల్ మొదలైన నిమిషానికే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారుతున్నారు. కొంతమంది యువతులు ప్రేమలోకి దింపి యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ఆటాడించి డబ్బులు దండుకుని వదిలేస్తున్నారు. మరికొంత మంది యువతులు ఒకటికి, రెండుసార్లు నగ్నంగా మారి వీడియో కాల్ చేయండని కోరుతున్నారు. ఇంట్లో ఉన్నాను.. బంధువులు, స్నేహితుల మధ్య ఉన్నాను. ఇప్పుడు చేయడం సాధ్యంకాదని చెప్పినా పదే పదే వీడియో కాల్ చేస్తుంటారు. లొంగిపోతే ఇక బెదిరింపులే.. బాధితులు ఒత్తిడికి లొంగి వీడియో కాల్ చేయడం మొదలు పెట్టగానే మీ ముఖం కనింపించేలా మాట్లాడాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తారు. వెంటనే అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న యువతి మరో కెమెరాతో మాటలు, నగ్న దృశ్యాలను రికార్డు చేస్తుంది. కాల్ పూర్తైనా నిమిషాలకే వీడియోను పంపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ భయబాంత్రులకు గురి చేస్తుంటారు. రిపోర్ట్ కొట్టండి.. సెట్టింగ్ మార్చండి.. అసభ్యకరమైన, ఆశ్లీల వీడియోలు పంపుతామని నేరస్తులు చెప్పిన వెంటనే మీ టైమ్లైన్లో.. ‘నా ఫేస్బుక్ హ్యాక్ అయ్యింది.. మీరు నాకు ఎలాంటి సమాచారం పంపొద్దం’టూ సందేశాన్ని పంపించండి. ఈ సందేశాన్ని హ్యాకర్ చూసినా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. స్మార్ట్ఫోన్లో ఫేస్బుక్ తెరవగానే.. మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై నొక్కితే రిపోర్ట్ అని వస్తుంది. అందులో ఎవరో మీలా నటిస్తున్నారా? అన్నవి తెరపైకి వస్తాయి. మమ్మల్ని అనుకరిస్తున్నారా? అన్న ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే.. ఫేస్బుక్ ప్రతినిధులు హ్యాకర్ను తొలగిస్తారు. అప్పుడు మీ ఫేస్బుక్ సెట్టింగ్లను కొత్తగా మార్చుకోవాలి. -
ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి..
జైపూర్: ఇటీవలి కాలంలో ఆన్లైన్ పరిచయాలతో యువత ప్రేమలో మునిగిపోతున్నారు. కొద్దిరోజుల పరిచయాలకే సరిహద్దులతో పాటు దేశాలు కూడా దాటిపోతున్నారు. మొన్నటికి మొన్న పాకిస్థాన్కు చెందిన సీమా.. తన ప్రేమ కోసం భారత్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే భారత్కు చెందిన ఓ యువతి.. ఫేస్బుక్ ప్రేమలో పడి పాకిస్తాన్కు వెళ్లింది. వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన వివాహిత అంజు(34)కు.. సోషల్ మీడియాలో పాకిస్థాన్కు చెందిన నస్రుల్లా ఖాన్(29)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో, వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. ఇక, ఒకరినొకరు కాలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంజు.. సరిహద్దులు దాటి పాక్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఫ్రావిన్స్లోని దీర్ సిటీకి జూలై 21న వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. తన భార్య జైపూర్కు వెళ్తున్నాననే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఆమె పాకిస్థాన్కు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయిందని వెల్లడించాడు. ఆమె ఆదివారం సాయంత్రం 4 గంటలకు అతనికి ఫోన్ చేసి, తాను లాహోర్లో ఉన్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందని తెలిపాడు. ఇదిలా ఉండగా.. యూపీకి చెందిన అంజుతో అరవింద్కు 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తోంది. అటు నస్రుల్లా.. వైద్య రంగంలో పనిచేస్తున్నాడు. అయితే, అంజు పాకిస్థాన్లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా, పాక్కు వెళ్లేందుకు అంజు వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్గానే ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ సెక్యూరిటీ కల్పించాలని అధికారులను కోరారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. A married Indian woman Anju resident of UP has travelled from Rajasthan’s Bhiwadi district all the way to Pakistan's KPK province to meet a man she befriended and fell in love with on Facebook. Her husband Arvind came to know about this from media.#SeemaHaidar #Pakistan pic.twitter.com/qw84iGvWMX — Ashutosh Pandey (@Indiawiing) July 23, 2023 ఇది కూడా చదవండి: సీమా, సచిన్ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్ స్టోరీ.. చివరికి? -
ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో..
సాక్షి,బంజారాహిల్స్: ఫేస్బుక్ చాటింగ్ ద్వారా టచ్లోకి వచ్చిన ఓ అపరిచితుడు మార్పింగ్ చేసిన వీడియోలు పంపిస్తూ బ్లాక్మెయిన్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకృష్ణానగర్లో నివాసం ఉంటున్న రాజీవ్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతడి ఫేస్బుక్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి రాజీవ్ తన నెంబర్ ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత రాజీవ్ ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని వేరొకరి శరీరాలతో కలిసి వీడియోలు తయారు చేసిన దుండగులు అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఫేస్బుక్లోని స్నేహితుల గ్రూపులకు షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో రూ. 3469 చొప్పున మూడుసార్లు పంపించినా ఇదే తీరులో బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితుడు రాజీవ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి👉🏻 కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్ ఖతం -
వార్నీ! సొంత తండ్రితోనే సినీ నటుడి ఆన్లైన్ డేటింగ్..
వాషింగ్టన్: హాలీవుడ్ నటుడు, దర్శకుడు జేమ్స్ మోరొసినికి వింత సమస్య వచ్చి పడింది. ఆయన గత కొన్ని రోజులుగా ఫేస్బుక్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా 31 ఏళ్ల జేమ్స్ మోరొసినికి, బెక్కా అనే అమ్మాయికి పరిచయమైంది. అభిరుచులు, అలవాట్లు, ఆసక్తులు కలవడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. స్నేహం కాస్తా ఆన్లైన్ డేటింగ్కు దారితీసింది. ఇలా కొన్ని రోజులు ఆ అమ్మాయితో మనోడు డేటింగ్, చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఈక్రమంలోనే తనకు సంబంధించిన చాలా విషయాలు ఆ అమ్మాయి చెప్తున్నవాటితో సరిపోలడంతో అతనికి డౌట్కొట్టింది. దీంతో మరింత లోతుగా ఆ యువతి బెక్కా వివరాలు తెలుసుకుని షాకయ్యాడు. అతడు ఆన్లైన్లో ఇన్నిరోజులూ డేటింగ్ చేస్తున్నది తన తండ్రితో అని తెలిసి బిక్కచచ్చిపోయాడు. అయితే, తన తండ్రి ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్తో అలా ఎందుకు చేశాడో తెలుసుకుని కుదుటపడ్డాడు. (చదవండి: మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) అమ్మాయిల పట్ల తన ప్రవర్తన ఎలా ఉంది. ఇతరులతో ఆన్లైన్ స్నేహాలు గట్రా చేసే క్రమంలో ఓవర్ చేస్తున్నాడా? అని తెలుసుకునేందుకే ఆయన అలా చేశాడని తెలిసింది. ఆన్లైన్ యుగంలో సైబర్ నేరాలకు కొదవే లేకుండా పోయింది. గుడ్డిగా నమ్మి మోసపోయినవారెందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల డిజిటల్ వ్యవహారాలపట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా! (చదవండి: అర్ధరాత్రి పరుగులు.. ఫేమస్ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నాడు!) -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్పే, గూగుల్పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్కు చెందిన టి.శ్రావణ్కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement