-
T20 WC 2024: అభిమానులకు గుడ్న్యూస్!
క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త! టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ మ్యాచ్లను ఉచితంగా వీక్షించే లక్కీ ఛాన్స్..!! ఈ మెగా ఈవెంట్ ప్రసారకర్త డిస్నీ+హాట్స్టార్ తమ డిజిటల్ ప్రేక్షకులకు ఈ అవకాశం కల్పించనుంది. కాగా ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్ ప్రపంచకప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డిస్నీ+హాట్స్టార్ సోమవారం కీలక ప్రకటన చేసింది. తమకున్న మొబైల్ యూజర్లు వరల్డ్కప్-2024 మ్యాచ్లన్నింటినీ ఫ్రీగా చూడవచ్చని తెలిపింది. కాగా గతంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 మ్యాచ్లను కూడా డిస్నీ తమ డిజిటల్ యూజర్ల కోసం ఉచితంగా ప్రసారం చేసింది. అదండీ సంగతి.. మీకు గనుక డిస్నీ+హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఉచితంగా మ్యాచ్లు చూసేయొచ్చు! కాగా జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా ఈ వరల్డ్కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. అన్నట్లు టోర్నీకే హైలైట్గా భావించే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరుగనుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ సమరం కంటే ముందు.. మరో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ టీ20 మజాను అందించనుంది. ఈ మ్యాచ్లను కూడా జియో సినిమా తమ యాప్లో ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: Anant- Radhika: రోహిత్ తిరుగు పయనం.. భయ్యాకు కోపం వచ్చిందంటే! రింకూ సింగ్కు బంపరాఫర్.. టీ20 వరల్డ్కప్ జట్టులో ఛాన్స్? -
భారత్-పాక్ మ్యాచ్కు ఫుల్ క్రేజ్.. టికెట్ కనీస ధర రూ. 1.8 కోట్లు?
వరల్డ్ క్రికెట్లో పాకిస్తాన్- భారత్ మ్యాచ్కు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దాయాదుల జట్లు ఎప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్లు ఎక్కడ తలపడినా ఇరుదేశాల ఫ్యాన్స్తో స్టేడియం నిండిపోతుంది. ఇప్పుడు మరోసారి విశ్వవేదికపై దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. టీ20 వరల్డ్కప్-2024లో పాక్-భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోన్నాయి. జూన్ 9న న్యూయర్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. వామ్మో ఇంత ధర? అయితే దాదాపు ఏడాది తర్వాత చిరకాల ప్రత్యర్ధిలు తలపడనుండడంతో టిక్కెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో టిక్కెట్ ధర అత్యధికంగా రూ. 1.8 కోట్లు పలుకుతోంది. అవును మీరు విన్నది నిజమే. టీ20 వరల్డ్కప్ టిక్కెట్లను ఐసీసీ పబ్లిక్ బ్యాలట్ ద్వారా విక్రయిస్తోంది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు టికెట్ల ధరను 6 డాలర్ల నుంచి 400 డాలర్లుగా నిర్ణయించింది. భారతీయ కరెన్సీలో కనీస టికెట్ ధర రూ.497 కాగా అత్యధిక ధర రూ.33148. అయితే సెకెండరీ మార్కెట్లలో మాత్రం టిక్కెట్ల ధరలు ఆకాశన్నంటాయి. స్టబ్హబ్, సీట్గీక్ వంటి ఆన్లైట్ ప్లాట్ఫారమ్స్ భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నాయి. అధికారికంగా 400 డాలర్లు ఉన్న టిక్కెట్ సెకెండరీ మార్కెట్లో 40,000 డాలర్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. టాక్స్తో కలిపి ఏకంగా 50,000 డాలర్లు చెల్లాంచిల్సి ఉంటుంది. అంటే భారత కరెన్సీలో రూ.40లక్షల పైమాటే. యూఎస్ఏ టూడే రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్ సీట్గీక్లో భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. సీట్గీక్లో అత్యధిక ఖరీదైన టికెట్ ధర 175,000 డాలర్లగా నిర్ణయించినట్లు యూఎస్ఏ టూడే తమ కథనంలో పేర్కొంది. అంటే భారత కరెన్సీలో రూ.1.4 కోట్లు. అదనపు చార్జీ రూ. 4 లక్షలు కలిపి మొత్తంగా టికెట్ ధర రూ. 1.86 కోట్లు. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక అర్హత
Mumbai Open WTA-125 Rashmika Srivalli Advances To Main Draw:: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ముంబైలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 521వ ర్యాంకర్ రష్మిక 6–3, 3–6, 6–3తో ప్రపంచ 482వ ర్యాంకర్ విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఆరు ఏస్లు సంధించింది. వరల్డ్ గ్రూప్-1లో భారత్ డేవిస్కప్ టోర్నీలో భారత పురుషుల టెన్నిస్ జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. ఆదివారం పాకిస్తాన్తో ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో 4–0తో గెలుపొందింది. చదవండి: భారత్కు మరో ఓటమి భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 1–3తో ఓడింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఏకైక గోల్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ రెండు గోల్స్, ఫేవాన్డెర్ ఒక గోల్ సాధించారు. -
60 ఏళ్ల తర్వాత తొలిసారి... పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా
ఇస్లామాబాద్: లాంఛనం పూర్తి చేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టు డేవిస్కప్ టోర్నీలో మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. పాకిస్తాన్తో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు 2–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో రోజు రెండు మ్యాచ్ల్లో గెలిచింది. పురుషుల డబుల్స్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ ద్వయం 6–2, 7–6 (7/5)తో అకీల్ ఖాన్–ముజమ్మిల్ జంటను ఓడించడంతో భారత్కు 3–0తో విజయం ఖరారైంది. నామమాత్రమైన నాలుగో మ్యాచ్లో నికీ పునాచా 6–3, 6–4తో షోయబ్ మొహమ్మద్పై గెలవడంతో భారత్ ఆధిక్యం 4–0కు చేరింది. అప్పటికే ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్ను నిర్వహించలేదు. కాగా ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు భారత్ వెళ్లడం ఇదే తొలిసారి. VIDEO | Davis Cup 2024: Indian tennis team celebrate at Islamabad Sports Complex after taking unassailable 3-0 lead against Pakistan. #DavisCup pic.twitter.com/goVGIEKD59 — Press Trust of India (@PTI_News) February 4, 2024 -
పాకిస్తాన్తో మ్యాచ్కు సర్వం సిద్దం.. ఫేవరెట్గా టీమిండియా
ఇస్లామాబాద్: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్స్లో భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. నేడు, రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగే పోటీల్లో విజయమే లక్ష్యంగా భారత్ ఆటకు సిద్ధమైంది. డేవిస్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై భారత్ది అజేయమైన రికార్డు. దాయాది జట్టుపై ఆడిన ఏడు సార్లు కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు పాక్ గడ్డపై కూడా జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. అయితే సొంతగడ్డపై ఈ డేవిస్ టై జరగడం, తురుపు ముక్క ఐజాముల్ హక్ ఖురేషి బరిలో ఉండటంతో పాక్ గంపెడాశలు పెట్టుకుంది. గ్రాస్ కోర్టులో ఖురే విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో భారత్కు ఏమైన కఠిన సవాల్ అంటూ ఉంటే మాత్రం అది ఖురేషి నుంచే ఎదురు కావచ్చు. ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొదటి రోజు రెండు సింగిల్స్ మ్యాచ్లను నిర్వహిస్తారు. తొలి సింగిల్స్లో రామ్కుమార్ రామనాథన్... ఐజాముల్ హక్ ఖురేషితో తలపడతాడు. అనంతరం జరిగే రెండో సింగిల్స్లో శ్రీరామ్ బాలాజీ... అఖిల్ ఖాన్ను ఎదుర్కొంటాడు. శ్రీరామ్ బాలాజీ చాన్నాళ్లుగా డబుల్స్కే పరిమితమయ్యాడు. అయితే భారత సింగిల్స్ స్పెషలిస్టు అయిన సుమిత్ నగాల్... గ్రాస్కోర్టు కావడంతో పాక్ వెళ్లేందుకు విముఖత చూపాడు. దీంతో శ్రీరామ్ను సింగిల్స్ బరిలో దించాల్సి వస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement