-
సైక్లింగ్తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్,అస్సాం, వెస్ట్బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్లాండ్లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 3,15,000 మంది, యూట్యూబ్లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు
ఎన్నో విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న మలయాళ బిగ్బాస్ రియాలిటీ షో సంచలనాలను క్రియేట్ చేసింది. తొలి సీజన్ విజయవంతం కావడంతో బిగ్బాస్ నిర్వాహకులు రెండో సీజన్ను పట్టాలెక్కించారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా రెండో సీజన్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో పాల్గొననున్న సెలబ్రిటీలను నెటిజన్లు అప్పుడే ఫాలో అవడం మొదలుపెట్టారు. అయితే మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న రంజిత్ కుమార్ను బిగ్బాస్ యాజమాన్యం సెలక్ట్ చేయడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఎందుకు రంజిత్ కుమార్పై వ్యతిరేకత ఉందో తెలుసుకుందాం.. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారు.. కాలేజీ ప్రొఫెసర్గా పని చేసిన రంజిత్ కుమార్ ఓసారి కళాశాల ప్రాంగణంలో మాట్లాడుతూ... అమ్మాయిలు జీన్స్ ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. జీన్స్ వేసుకుంటే ట్రాన్స్జెండర్లు పుడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి విద్యార్థులు నిరసనగా సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. ఇలా తొలిసారిగా 2013లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత రంజిత్ కుమార్ ఓ టీవీ షోలో అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు మానసిక సమస్యలతో ఉన్న పిల్లలు జన్మించడానికి ప్రధాన కారణం పెద్దల డ్రెస్సింగ్ సెన్స్ అంటూ వ్యాఖ్యానించారు. మహిళలు గెంతులు వేయకూడదు.. ఇక మరోసారి రంజిత్ మరీ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అస్సలు గెంతకూడదని హితవు పలికారు. పొరపాటుగా అయినా మహిళలు గెంతులు వేస్తే వారి గర్భాశయం ఉన్నచోట నుంచి జారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసే రంజిత్ వైఖరిని కేరళ ప్రభుత్వం అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే ఈ వివాదాస్పద వక్త ప్రాంతీయ భాషలో పలు పుస్తకాలను కూడా రచించారు. ఏదైతేనేం.. టీవీ షో కు ప్రాణవాయువు టీఆర్పీ. బిగ్బాస్ వంటి కార్యక్రమాలకు టీఆర్పీ రావాలంటే వినోదం ఒక్కటే సరిపోదు. వివాదాలు, గొడవలు.. అన్నీ కలగలసి ఉండాలి. అందుకనే బిగ్బాస్ యాజమాన్యం రంజిత్ కుమార్ను ఏరికోరి తీసుకుందని స్పష్టమవుతోంది. మరి బిగ్బాస్ హౌస్ లోపలికి వెళ్లాక సంయమనం పాటిస్తాడో లేదా మళ్లీ నోరుజారుతారో చూడాలి! చదవండి: బిగ్బాస్ భామ పెళ్లికూతురాయెనే.. -
సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా
సాక్షి, న్యూఢిల్లీ : భారత సోలిసిటర్ జనరల్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజీత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచి సోలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత ఎట్టకేలకు ఆయన స్థానంలో తుషార్ మెహతాకి కేంద్రం పదోన్నతి కల్పించింది. 2014 నుంచి అదనపు సోలిసిటర్ జనరల్గా పలు కీలకమైన కేసుల్లో మెహతా వాదనలు వినిపించారు. 2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన సోలిసిటర్ జనరల్గా కొనసాగనున్నారు. -
సర్కారీ చెక్కు బౌన్స్.. అమరవీరుడికి అవమానం!
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా సాయం చేశాయి. వాళ్లను తాము ఆదుకుంటున్నామంటూ చెక్కులిచ్చి ఫొటోలు, వీడియోలు కూడా తీయించుకున్నారు. కానీ ఆ చెక్కులు వాళ్లకు ఎంతవరకు పనికొచ్చాయంటే.. అనుమానమే. ఎందుకంటే బిహార్ ప్రభుత్వం ఇలాగే ఇచ్చిన ఓ చెక్కు బౌన్స్ అయ్యింది. బిహార్లోని షేక్పురా జిల్లాకు చెందిన రంజీత్కుమార్ కూడా సుక్మా జిల్లాలో జరిగిన మారణహోమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మొత్తం ఆరుగురు బిహారీలో ఆ దారుణకాండలో అమరులయ్యారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. తన కోడలు సునీతాదేవి పేరు మీద ఇచ్చిన చెక్కును రంజీత్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జమ చేశారు. కానీ.. ఆ చెక్కు బౌన్స్ అయ్యిందని వాళ్లకు బ్యాంకు అధికారులు చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల అలా జరిగిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు. అమరవీరుడి కుటుంబం విషయంలో ఇలా వ్యవహరించినందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. నితీష్ హయాంలో ఇలా జరగడం ఇది మొదటి సారి ఏమీ కాదని.. వాళ్ల మంత్రులు, నాయకులు సైనికుల గురించి దారుణంగా మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ టైగర్ అన్నారు. ఇప్పుడు చెక్కు బౌన్స్ అయ్యిందని, అమర సైనికుడి కుటుంబాన్ని ఆదుకోవాలే తప్ప ఇలా అవమానించకూడదని ఆయన చెప్పారు. అయితే తప్పు తమది కాదని, బ్యాంకు అధికారులదని జేడీ(యూ) నాయకులు అంటున్నారు. ఈ విషయమై విచారణ జరపాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించిందని నీరజ్ కుమార్ అనే నేత చెప్పారు. -
ఉర్దూలో నీట్కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు . ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
Advertisement