-
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్లెన్నో ఊహించగలరా?
‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్కు పూనకాలే. బ్లాక్ బస్టర్మూవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ పెద్దదే. 1980లలో తన కెరీర్ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరో. . పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్ బస్టర్మూవీ జవాన్లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను మొదలు తమ అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది చర్చకు దారితీసింది. షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట. షారూఖ్ కరీర్లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్తో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్ఆర్కే దగ్గర 17ఫోన్లు, ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్ చేసినపుడు ఆయన దొరకడు. ఆయన ఫోన్ చేసినపుడు నేను మిస్ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు. వెండితెర సామ్రాజ్యాన్ని ఏలుతున్న అద్భుతమైన వ్యక్తి’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా రియల్మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. అంతేకాదు బాలీవుడ్ హ్యాపియస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్ జంట . వీరి వివాహ బంధం మొదలై మూడు దశాబ్దాలుదాటింది. ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని చెప్పడం వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా చెప్పిన సంగతి తెలిసిందే. -
సీక్వెల్స్ కు భారీగా పెరుగుతున్న ట్రాఫిక్...!
-
న్యూ బ్రాండ్ అంబాసిడర్గా దీపికా పదుకొనె.. ఏ కంపెనీకంటే..
ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను తమ కంపెనీకి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. షారుక్ ఖాన్ తర్వాత దీపికా పదుకొనెను రెండో బ్రాండ్ అంబాసిడర్గా హ్యుందాయ్ ఇండియా నియమించుకున్నట్లు తెలిపింది. షారుక్ ఖాన్ స్థానంలో దీపికా పడుకొనె తమ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతుందా లేక ఇద్దరూ కలిసి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తారా అనే విషయంలో కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసాధారణ నైపుణ్యం, నటనా సామర్థ్యం కలిగిన గ్లోబల్ ఇండియన్ ఐకాన్ దీపికా పడుకొనెను తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ వెల్లడించారు. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు ఆమె తిరుగులేని ఆకర్షణ శక్తి, అద్భుతమైన కెరియర్ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఉపయోగపడుతుందన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 2021 నాటికి భారతదేశంలో 17% మార్కెట్ వాటాను కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని అనుబంధ సంస్థ కియాతో కలిసి 2022లో భారతదేశంలో 10 లక్షల కార్లను తయారుచేసింది. ఈ రెండు కంపెనీలు కలిసి ప్రస్తుతం దేశంలో దాదాపు 23% వాటాను కలిగి ఉన్నాయి. -
షిర్డీ ఆలయంలో షారుక్ ఖాన్ పూజలు
-
కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్తో సూత్రధారి పరార్
న్యూఢిల్లీ: కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్సింగ్ గొగామెడిని హత్య వెనుక కీలక సూత్రధారి గ్యాంగ్స్టర్ రోహిత్ గొడారా భారత్ నుంచి పారిపోయాడు. అయితే గొడారా డాంకీ ఫ్లైట్ టెక్నిక్ వాడి కెనడాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ టెక్నిక్నే పంజాబ్లో డుంకీ అని పిలుస్తారు. ఈ పేరుతోనే త్వరలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సినిమా రాబోతోంది. డుంకీ సినిమా థీమ్ కూడా పోలీసుల కళ్లుగప్పి పారిపోవడమేనని తెలుస్తోంది. డుంకీ టెక్నిక్లో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వెళ్లాల్సిన చోటికి నేరుగా కాకుండా మధ్యలో వేరు వేరు దేశాల్లో ఆగుతూ చివరకు గమ్యస్థానం చేరుకుంటారు. ఇందుకు ఆయా దేశాల వీసా,ఇమిగ్రేషన్ నిబంధనల్లోని లోపాలను అడ్డుపెట్టుకుంటారు. ఈ తరహాలోనే గొడారా పలు దేశాల్లో ఆగుతూ తొలుత అమెరికా వెళ్లాడు. అక్కడి నుంచి చివరకు కెనడా పారిపోయాడు. ఈ నెల ఐదవ తేదీన కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్సింగ్ గొగామెడిని ఆయన ఇంట్లోనే టీ తాగుతుండగా ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. వీరిలో ఒకరు అక్కడే క్రాస్ ఫైరింగ్లో చనిపోగా మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ హత్య తామే చేశామని గ్యాంగ్స్టర్ రోహిత్ గొడారా ప్రకటించుకున్నారు. ఇతనిపై దేశంలోని పలు పోలస్స్టేషన్లలో 32 కేసులు నమోదయ్యాయి. ఇదీచదవండి..కాంగ్రెస్ ఉండగా మనీ హేస్ట్ ఎందుకు? -
డైలమాలో ప్రభాస్ (సలార్) ఫ్యాన్స్..(డంకీ) షారుఖ్ ఫ్యాన్స్ కి పూనకాలు..!
-
సలార్ VS డంకీ: రెఢీ
రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేరోజు థియేటర్లకు వస్తే.. ఏ సినిమా చూడాలి? అనేది ప్రేక్షకుల ముందుండే ప్రశ్న. ఏ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి? అనేది ఎగ్జిబిటర్ల ముందుండే ప్రశ్న? ఏ సినిమాని ఏ ఏరియాకి ఎంత ఇచ్చి కొనాలి? అనేది డిస్ట్రిబ్యూటర్ల ముందుండే ప్రశ్న.. అసలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కరెక్టేనా? బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందేమో.. ఇది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు,ప్రొడ్యూసర్లు.. ఇలా అందరి ముందుండే ప్రశ్న. శుక్రవారం వచ్చిన ‘సలార్’ విడుదల తేదీ (డిసెంబర్ 22) ప్రకటన ఈ ప్రశ్నలకు కారణమైంది. అదే రోజు షారుక్ ఖాన్ ‘డంకీ’ కూడా రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న ‘సలార్’, ‘డంకీ’... చిత్రాల్లో ఏది వసూళ్లను కొల్లగొడుతుంది? ఈ రెండింటి కారణంగా వేరే చిత్రాలు వాయిదా పడతాయా? ఓ లుక్కేద్దాం. ఇండియన్ సినిమా బడా సూపర్ స్టార్స్ ప్రభాస్, షారుక్ ఖాన్ బాక్సాఫీస్ ఫైట్కి రెఢీ అయ్యారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’లోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. నిజానికి 2022 ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుని, ఆ తర్వాత 2023 సెప్టెంబరు 28కి వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్ 22 అంటున్నారు. ఇంకోవైపు మరో పాన్ ఇండియన్ స్టార్ షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’. హిందీలో ‘మున్నాభాయ్ ఎమ్బీబీఎస్’, ‘3 ఇడియట్స్, ‘పీకే’ వంటి బ్లాక్బస్టర్ ఫిల్మ్స్ తీసిన అగ్రశ్రేణి దర్శకుడు రాజ్కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. షారుక్, రాజ్కుమార్.. ఈ ఇద్దరికీ విడివిడిగా రికార్డులు ఉండటంతో తొలిసారి ఇద్దరూ కలిసి చేస్తున్న ‘డంకీ’ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. గౌరీ ఖాన్, రాజ్కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా 2022 ఏప్రిల్ 19న ‘డంకీ’ సినిమాను ప్రకటించిన రోజే విడుదల తేదీని (22 డిసెంబరు 2023) కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ అండ్ టీమ్ ఇదే రోజున ‘సలార్’ విడుదలను నిర్ణయించడం ఇటు తెలుగు అటు హిందీతో పాటు పాన్ ఇండియా సినిమాలు కాబట్టి.. ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. ఎవరి రికార్డులు వారివి... ‘బాహుబలి: ది కన్క్లూజన్’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో (2019)’, ‘రాధేశ్యామ్ (2022)’, ‘ఆదిపురుష్ (2023)’ చిత్రాలకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ప్రభాస్కు ‘సలార్’ హిట్ కీలకంగా మారింది. ఇటు ‘జీరో (2018)’ రిజల్ట్తో షారుక్ ఖాన్ డీలా పడ్డప్పటికీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ‘పఠాన్’, ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘జవాన్’ చిత్రం కలెక్షన్స్లో హిందీ హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిందని యూనిట్ పేర్కొంది. ఇవి షారుక్ ఖాన్ సూపర్ఫామ్ను స్పష్టం చేస్తున్నాయి. అలా అని ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమాలనూ తక్కువ చేయలేం. ఎందుకంటే ప్రభాస్ ‘బాహుబలి: ది కన్క్లూజన్’ మొత్తం వసూళ్లను షారుక్ ఏ సినిమా కూడా ఇంకా అధిగమించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే షారుక్ కెరీర్లో ఓ డిజాస్టర్గా నిలిచిన ‘జీరో’ రిలీజైన రోజున.. అంటే డిసెంబరు 21నే ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’ (యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూ΄÷ందింది) విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచి, కొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ప్రశాంత్ నీల్, షారుక్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొనడానికి రెడీ కావడం ఆసక్తికరమైన విశేషం. ఎవరి రికార్డులు వారికి ఉన్న నేపథ్యంలో తాజా ΄ోటీలో రికార్డ్ ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కన్ఫ్యూజన్ నో కన్ఫ్యూజన్..‘సలార్: సీజ్ ఫైర్’ను డిసెంబరు 22న విడుదల చేస్తున్నాం అంటూ ‘సలార్’ టీమ్ ప్రకటించింది. అయితే ‘సలార్’కు కన్ఫ్యూజన్ అక్కర్లేక΄ోవచ్చు కానీ 2023 క్రిస్మస్కు ఆల్రెడీ రిలీజ్ను కన్ఫార్మ్ చేసుకున్న తెలుగు చిత్రాల విడుదల విషయం ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్. డిసెంబరు 21న నాని ‘హాయ్ నాన్న’, 22న వెంకటేశ్ ‘సైంధవ్’, సుధీర్బాబు ‘హరోం హర’, 23న నితిన్ ‘ఎక్స్ట్రా’ చిత్రాలు విడుదలకు షెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడు ‘సలార్’ ఎఫెక్ట్తో ఈ సినిమాల విడుదల వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పుడు వాయిదా వేసి, సంక్రాంతికి వద్దామనుకుంటే ఆల్రెడీ పండగ బరిలో నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్ (ప్రచారంలో ఉన్న టైటిల్), తేజా సజ్జా ‘హనుమాన్’ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు శివ కార్తికేయన్ ‘అయలాన్’, సుందర్. సి ‘అరణ్మణై 4’ ఉన్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలంటే థియేటర్ల సంఖ్య ప్రశ్నార్థకమవుతుంది... దాంతో పాటు వసూళ్లు కూడా షేర్ అయి΄ోతాయి కాబట్టి వీటిలో ఏదైనా వాయిదా పడే అవకాశమూ లేక΄ోలేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2098 ఏడి’ కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా వాయిదా పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. ‘సలార్’, ‘డంకీ’... ప్రకటించిన ప్రకారం డిసెంబర్ 22నే వస్తాయా? ఇవి వస్తే ఏ చిత్రాలు వెనక్కి వెళతాయి? సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలేంటి? అనేది తెలియాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఆ తేదీకే ఎందుకు? ఓ సినిమా బాక్సాఫీస్ సరికొత్త రికార్డులను సృష్టించాలంటే సరైన రిలీజ్ డేట్ కూడా ముఖ్యం. ఇప్పుడు ‘సలార్’, ‘డంకీ’ చిత్రాలు డిసెంబరు 22ను ఎంచుకోవడం సరైనదే. ఎందుకంటే ఆ రోజు నుంచి వారాంతం ఆరంభమవుతుంది. సరిగ్గా క్రిస్మస్ సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్కు రావడం ఖాయం. ఒకవేళ ఈ చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే.. న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాంతి వరకూ ప్రదర్శనకు స్కోప్ ఉంటుంది. సంక్రాంతి సెలవుల టార్గెట్గా కొత్త చిత్రాలు వస్తాయి. అప్పుడు ‘సలార్’, ‘డంకీ’కి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ పండగ టైమ్లో వచ్చే చిత్రాలకన్నా ఈ రెండూ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు సంక్రాంతి సెలవులను కూడా క్యాష్ చేసుకుంటాయి. ఈ చిత్రాల టాక్ ముందే తెలిసి΄ోతుంది కాబట్టి.. సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో ఏదైనా వాయిదా పడే అవకాశం కూడా లేక΄ోలేదు. -
షారుఖ్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ బాద్షా 'షారుఖ్ ఖాన్' (Shah Rukh Khan)ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజుల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలోని జిందాబాద్ పాటు విడుదలైంది. ఈ పాటలో యువకుడిగా కనిపించిన షారుఖ్ ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసాడు. ఈ హీరో వయసు 57 సంవత్సరాల? ఈయన వయసు గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేఖంగా వెళ్తోందా.. మిగిలిన వారికంటే 10 రెట్లు యాక్టివ్గా కనిపిస్తున్నారని ట్వీట్ చేసాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఇదీ చదవండి: కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్ ఈ ట్వీట్ చూసిన షారుఖ్ ఖాన్.. జీవితం చాలా చిన్నది మాత్రమే కాదు వేగవంతమైంది సర్, దానిని అందుకోవడానికి ట్రై చేస్తున్నా.. నవ్వడం, ఏడవడం, డ్యాన్స్ ఇలా ఏది కావాలంటే ఆలా ప్రయత్నిస్తున్నా! ఉన్న కొన్ని క్షణాలలోనే ఆనందం కోసం కలలు కంటున్నా అంటూ ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. @anandmahindra Life is so short and fast sir, just trying to keep up with it. Try and entertain as many whatever it takes….laugh..cry…shake…or fly…hopefully make some to swim with the stars….dream for a few moments of joy. https://t.co/3bP8Xth1yG — Shah Rukh Khan (@iamsrk) August 2, 2023 -
టీఎన్పీఎల్ 2023 విజేత లైకా కోవై కింగ్స్.. వరుసగా రెండోసారి
నెలరోజుల పాటు క్రికెట్ ప్రేమికులను అలరించిన తమిళనాడు ప్రీమియర్(TNPL 2023) లీగ్లో లైకా కోవై కింగ్స్ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో నెల్లయ్ రాయల్ కింగ్స్పై 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన లైకా కింగ్స్ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. సురేశ్ కుమార్(33 బంతుల్లో 57 పరుగులు), ముకిలేష్(40 బంతుల్లో 51 నాటౌట్) నిలకడగా ఆడగా.. చివర్లో అతీక్ ఉర్ రెహమాన్(21 బంతుల్లోనే 50 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 15 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. అరుణ్ కార్తిక్ 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లక్ష్మేషా సుర్యప్రకాశ్ 22 పరుగులు చేశాడు. లైకా కోవై కింగ్స్ బౌలర్లలో జతదేవ్ సుబ్రమణ్యన్ నాలుగు వికెట్లు తీయగా.. కెప్టెన్ షారుక్ ఖాన్ మూడు, మణిమరన్ సిద్దార్థ్, గౌతమ్ కన్నన్, మహ్మద్లు తలా ఒక వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా జతదేవ్ సుబ్రమణ్యన్ నిలవగా.. ఆరెంజ్ క్యాప్ను నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి(10 మ్యాచ్ల్లో 385 పరుగులు) గెలుచుకోగా.. పర్పుల్ క్యాప్ను లైకా కోవై కింగ్స్ కెప్టెన్ షారుక్ ఖాన్(9 మ్యాచ్ల్లో 17 వికెట్లు) అందుకున్నాడు. And the party🪇 mood starts!❤️#TNPL2023🏏#GethuKaatuvoma#sekkalisingamla#TNPLonstarsports#TNPLonfancode#NammaAatamAarambam💥#NammaOoruNammaGethu💪🏼 pic.twitter.com/ygqBBSACxg — TNPL (@TNPremierLeague) July 12, 2023 Lyca Kovai, Kings once again!#TNPLonFanCode pic.twitter.com/ALXkYMzChX — FanCode (@FanCode) July 12, 2023 చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' 'సూపర్మ్యాన్' సిరాజ్.. కళ్లు చెదిరే క్యాచ్తో మెరిశాడు -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్కి గాయం ఐదు కేజీల డంబెల్ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
సచిన్ కొడుకుపై షారుక్ ట్వీట్ అదే రేంజ్ లో సచిన్ రిప్లై
-
రెమ్యూనరేషన్ లో ప్రభాస్ ని దాటేసిన హీరో ఎన్టీఆర్,రామ్ చరణ్ కూడా వెనుకే..
-
NMACC: డాన్స్తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్కైతే
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు, సినీరంగ సెలబ్రిటీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ఖాన్ త్రయంతోపాటు, దీపికా, రణవీర్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ ,ఫ్యాషన్స్టార్ సోనమ్ కపూర్, వరుణ్ధావన్, రణ్వీర్ సింగ్, సీనియర్ నటులు రేఖ , వహీద తదితర స్టార్డస్ట్ అంతా గ్లామరస్గా కనిపించారు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్తో కలిసి డ్యాన్స్ ఇరగ దీశారు. షారుఖ్ ఖాన్ హిట్ ట్రాక్ ఝూమ్ జో పఠాన్కి స్టెప్పులేశారు. ఇండో కెనడియన్ సింగర్ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ (ఏపీ సింగ్) పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. గౌరీ బెస్ట్ ఫఫ్రెండ్ మహీప్ కపూర్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు. View this post on Instagram A post shared by JODI (@thejodilife) అంతముందు వరుణ్ ధావన్, సూపర్ మోడల్ జిగి హడిద్ స్టేజ్పై సందడి చేశారు. మరోవైపు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా స్టేజ్పై షారూఖ్ ఖాన్ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. తనతోపాటు స్టెప్ప్లేయాల్సిందిగా వరుణ్ధావన్, రణ్వీర్ సింగ్ను కోరడంతో మరింత జోష్ నెలకొంది View this post on Instagram A post shared by @varindertchawla మరోవైపు బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ప్రియాంక చోప్రా, హీరో రణవీర్ సింగ్తో కలిసి డ్యాన్స్ చేసింది.దీనికి షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది. GAURI KHAN ??? DANCING AND VIBING TO PRIYANKA’S PERFORMANCE??? NOW THIS IS MY MULTIVERSE OF MADNESS 😭😭😭😭 *screamingggg*#PriyankaChopra pic.twitter.com/0y3Ku7Vvt9 — k. (@karishmaokay) April 2, 2023 -
గౌరీ ఖాన్ పనికి షారూఖ్ మేనేజర్ పూజా ఫిదా! ఆమె సంపాదన ఎంతో తెలిస్తే..!
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ఓవర్లు చేసి భారీగానే ఆర్జిస్తోంది. ఫలితంగా ఆమె కూడా ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరు. అయితే షారూఖ్ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గౌరీఖాన్పై ప్రశంసలు కురిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలింతకీ పూజా దద్లానీ ఎవరు? గౌరీ ఖాన్ ఏం చేశారు? షారుఖ్ ఖాన్ మేనేజర్గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. మంచి సన్నిహితురాలు కూడా. ఖాన్ దీంతో చాలా సెలబ్రిటీ పార్టీలకు ఆహ్వానిస్తారు. తాజాగా పూజా కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నా.. ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నా.. ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్ను మించిన గొప్పవాళ్లు ఎవరుంటారు. ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్స్టా స్టోరీలో ఆమెపై ప్రశంసలు కురిపించింది. దీంతో పూజా ఇంటి ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) బాలీవుడ్ టాప్ హీరో షారూక్కు చెందిన కేకేఆర్, రీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వంటి వ్యాపారాలను కూడా పూజా దద్లానీ నిర్వహిస్తుంది. దీంతో పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువట. దద్లానీ సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంది. నెలకు 7 కోట్ల నుండి 9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకోగా, వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది. -
జవాన్లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..!
ఇటీవలే పఠాన్ మూవీ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ బాద్షా. ఆ తర్వాత వెంటనే అట్లీ డైరెక్షన్లో జవాన్ షూటింగ్లో బిజీ అయిపోయారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్లో పాల్గొన్న షారుక్ నయనతార ఇంటికి కూడా వెళ్లారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు చెందిన మరో క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. జవాన్లో ఓ అతిథి పాత్ర కోసం బన్నీని చిత్రబృందం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అట్లీ ఈ సినిమాపై పెద్ద ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపిస్తే టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వైజాగ్లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే ఈ చిత్రబృందంతో కలవనుంది. -
ఆర్యన్ ఖాన్ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
షారుక్ ఖాన్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనేక విజయాలు, గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ హీరోగా పేరు గడించిన షారుక్ ఖాన్ 'కింగ్ ఖాన్'గా మన్ననలు పొందాడు. ఈ బాలీవుడ్ బాద్షా సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్ 25) 30 ఏళ్లు పూర్తయింది. 1992 జూన్ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ పెంచుకున్నాడు. ఇక షారుక్, కాజల్ రొమాంటిక్ లవ్ ట్రాక్ 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'తో ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పఠాన్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో చేతిలో గన్తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్లో ఆకట్టుకుంటున్న షారుక్ను చూడొచ్చు. ఈ పోస్టర్ రిలీజైన అతి తక్కువ సమయంలోనే నెట్టింట షేక్ చేస్తోంది. కాగా పఠాన్ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25, 2023న గ్రాండ్గా విడుదల కానుంది. (చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) 'పఠాన్'తోపాటు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవేకాకుండా మాధవన్ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా', రణ్బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్ 'టైగర్-3' చిత్రాల్లో కింగ్ ఖాన్ కెమియో ఇవ్వనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
బుర్జ్ ఖలీఫా: "నేను కూడా మీ అభిమానినే"
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2 పురస్కరించుకుని దుబాయ్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా బాలీవుడ్ సూపర్స్టార్కు 'హ్యాపీ బర్త్డే' శుభాకాంక్షలు తెలుపుతూ అతని చిత్రాన్ని ప్రదర్శించి సత్కరించింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) ఆ తర్వాత ఆకాశహర్మ్యంపై 'హ్యాపీ బర్త్డే షారూఖ్' అనే సందేశాన్ని తోపాటు " మేము నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ ఒక లవ్ సింబల్ కనిపిస్తుంది. ఈ విధంగా షారూఖ్ ఖాన్ బుర్జ్ ఖలీఫా భవనంపై కనిపించడం మూడోసారి. అయితే దీనికి సంబంధించిన వీడియోతో పాటుగా "ఈ భవనం నీ కోసం మెరుస్తుంది" అనే క్యాప్షన్ జోడించి మరీ వ్యాపారవేత్త మొహమ్మద్ అలబ్బర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ మేరకు నెటిజన్లు మనందరిలాగే బుర్జ్ ఖలీఫా కూడా షారుఖ్ ఖాన్ని ప్రేమిస్తుంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది) Happy birthday @iamsrk from the @noon family كل عام وأنت بخير @iamsrk من عائلة نون pic.twitter.com/TIG3zURQjk — Mohamed Alabbar محمد العبار (@mohamed_alabbar) November 2, 2021 -
ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్కు బెయిల్
-
Aryan Khan Drug Case: ఆర్యన్కు దొరకని బెయిల్
-
అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి
‘చెన్నైఎక్స్ప్రెస్’లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి ప్రియమణితో చిందేసిన ఐటమ్సాంగ్ గుర్తుందా. అదేనండి అప్పట్లో వన్ టూ త్రీ ఫోర్.. గెట్ ఆన్ ది డ్యాన్స్ ఫ్లోర్..అంటూ స్టెప్పులేసిన ఈ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది ఎందుకు అంటారా? ఇటీవల విడుదలై విశేష ప్రజాదరణ పొందుతున్న ఫ్యామిలీ మ్యాన్-2తో ఆకట్టుకున్న నటి ప్రియమణి ఓ ఇంటర్య్వూలో ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ షూటింగ్ సమయంలోని కబుర్లను గుర్తుచేసుకుంది. అది నా పర్సులో భద్రంగా దాచుకున్నా ఈ సందర్భంగా ఆమె.. ‘‘నాకు అది మరచిపోలేని అనుభవం. షూటింగ్ సమయంలో షారుఖ్ ఐప్యాడ్లో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ ఆడుతుంటే రూ.300 ఇచ్చారు. అవి ఇప్పటికీ నా పర్సులో భద్రంగా దాచుకున్నా. షారుఖ్ని బాలీవుడ్ బాద్షా అని అనడానికి ప్రత్యేకించి ఒక్క కారణమంటూ లేదు. మనదేశంలో ఉన్న గొప్పనటుల్లో ఆయన ఒకరు. సక్సెస్ని ఎప్పుడూ తలకెక్కించుకోరు. షూటింగ్లోనూ చాలా సింపుల్గా ఉంటారు. షారుక్ వ్యక్తిత్వమే మనల్ని మరింతగా ఆయన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఎప్పుడు మరుసటి రోజు సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేవారు. అలా షూటింగ్ సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకునే వారు’’ అంటూ షారుఖ్తో తన అనుబంధాన్ని ఈ రకంగా చెప్పుకొచ్చింది. చదవండి: ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా: జరీన్ ఖాన్ -
ప్రేమ కోసం షారుఖ్ ఎన్ని కష్టాలు పడ్డాడో!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ గురువారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. గౌరీ, షారుఖ్లది ప్రేమ వివాహం అని అందరికి తెలుసు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న వీరు వారి ప్రేమను దక్కించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. సినిమా హీరో అయిన షారుఖ్ కూడా నిజ జీవితంలో చాలానే కష్టాలు పడ్డారు. అయితే వారి ప్రేమ కథ ఏమిటో గౌరీ పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి తెలుసుకుందాం. జర్నలిస్ట్ అనుపమ చోప్రా రాసిన కింగ్ ఆఫ్ బాలీవుడ్: షారుఖ్ ఖాన్ అండ్ సెడక్టివ్ వరల్డ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే పుస్తకంలో వీరి ప్రేమ పెండ్లి పీటలు ఎక్కడానికి పడిన కష్టాలను వివరించారు. గౌరీని పెళ్లి చేసుకునే సమయానికే కింగ్ ఖాన్ టీవీ సీరియల్లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఆయనను గౌరీ వాళ్ల ఇంట్లో ఎవరు అంగీకరించలేదు. గౌరీ తండ్రి, రమేష్ చిబ్బా, తన మతం కంటే షారుఖ్ నటనా వృత్తి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్, భారత మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ వద్ద పనిచేస్తున్నప్పుడు సినీ తారల జీవితాలను దగ్గరుండి చూడటంతో ఆయన ఆ వృత్తిని ద్వేషించారు. ఇక గౌరీ తల్లి సవితా, షారుఖ్ను తెరపై చూడటానికి ఇష్టపడిన గౌరీ తల్లి అల్లుడిగా మాత్రం అంగీకరించలేదు. ఇక గౌరీ వాళ్ల సోదరుడికి రౌడీ అన్న పేరు కూడా ఉండేది. అతను ఏకంగా షారుఖ్ తలపై గన్పెట్టి మరీ బెదిరించాడు. అయినా షారుఖ్ బయటపడకుండా తన ప్రేమను దక్కించుకున్నాడు. షారుఖ్, గౌరీ అక్టోబర్ 25, 1991 న వివాహం చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి బంధం బలంగా కొనసాగుతుంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి పేర్లు ఆర్యన్, సుహానా, అబ్రామ్. చదవండి: 'కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు' -
భావోద్వేగానికి గురైన షారుక్ ఖాన్!
కన్నడ నటి కిషోరి బల్లాల్(80) మరణవార్త తెలిసి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. నిన్న(మంగళవారం)అనారోగ్యం కారణంగా ఆమె బెంగుళూరులో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షారుక్ సోషల్ మీడియాలో హృదయపూర్వక లేఖ రాసి ఆమె మృతికి బుధవారం సంతాపం తెలిపాడు. 2004లో విడుదలైన షారుక్ ‘స్వదేశ్’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆ సినిమా సమయంలో తనతో షారుక్కు ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్లో భావోద్వేగ పోస్టు షేర్ చేశాడు. ‘స్వదేశ్’లో షారుక్ను ఓ సన్నివేశంలో ఆమె హెచ్చరించిన తీరును గుర్తుచేస్తూ ఆమె గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. May her soul rest in peace. Kishori ‘Amma’ will be sorely missed. Especially how she used to reprimand me for smoking. May Allah look after her. pic.twitter.com/E8UGZMZ0Zj — Shah Rukh Khan (@iamsrk) February 19, 2020 వారిద్దరూ ఉన్న ఫొటోకు ‘తన ఆత్మ ప్రశాంతగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. కిషోరి అమ్మను చాలా మిస్సవుతున్నాను. అమ్మా.. ధూమపానం చేయోద్దంటూ నన్ను ఏలా మందలిస్తుందో చూడండి. తన ఆత్మకు అల్లా తోడుగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా దాదాపు 75కు పైగా సినిమాల్లో నటించిన కిషోరి బల్లాల్ బాలీవుడ్లో షారుక్తోనే కాకుండా బాలీవువడ్ స్టార్ హీరోయిన్లు రాణిముఖర్జీ, దీపికా పదుకొనెతో కూడా నటించారు. 1960లో విడుదలై కన్నడ చిత్రం ‘ఇవెలెంతా హెందతి’ నటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘క్యారీ ఆన్ మరాఠా’, ‘కహి’, ‘సూర్యకాంతి’ ‘క్వీన్ గన్’ ‘మురుగన్’ వంటి పలు భాష చిత్రాల్లో నటించారు. -
వాట్సాప్ వండర్ బాక్స్ : భలే షార్ట్కట్
వాట్సాప్ వండర్ బాక్స్ మరో వండర్ను పరిచయం చేసింది. గణితం చదువుకునే సమయంలో ఎక్కాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలుసు. అంతేకాదు వాటిని బట్టీ పట్టడం ఎంత కష్టమో అనుభవమే.. మాస్టారు ఎక్కం అప్ప చెప్పమనగానే.. అయితే 5వ ఎక్కం, లేదంటే 10వ ఎక్కం...ఇదే కదా.. పిల్లలకు గుర్తొచ్చేది.. మిగతా ఎక్కాల జోలికి వెళ్లాలంటే విద్యార్థులకు ఒకింత గుబులే.. అయితే ఈ కష్టాల నుంచి గటెక్కేందుకు మాథ్స్ టీచర్ల చిట్కాలు, కిటుకులు పిల్లల మనసుల్లో బాగా గుర్తుండి పోతాయి కూడా. తాజాగా అలాంటి టీచర్ ఒకరు వాట్సాప్ వండర్ బాక్స్లో రౌండ్లు కొడుతున్నారు. తొమ్మిదో ఎక్కాన్ని అతి సులువుగా విద్యార్థులకు నేర్పిస్తున్న ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. కార్పొరేట్ దిగ్గజం ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇలాంటి వీడియో నొకదాన్ని ట్విటర్లో షేర్ చేశారు. ఈ తెలివైన, సులువైన షార్ట్కట్ గురించి తెలియదు. ఆమె నా గణిత ఉపాధ్యాయురాలిగా ఉండివుంటే.. గణితంలో బహుశా ఇంకా చాలా మెరుగ్గా వుండేవాడినంటూ వ్యాఖ్యానించారు. దీనికి ముగ్ధుడైన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు దీన్ని బైజూస్కి పంపిస్తున్నానని షారూక్ ట్వీట్ చేయడం విశేషం. Whaaaat? I didn’t know about this clever shortcut. Wish she had been MY math teacher. I probably would have been a lot better at the subject! #whatsappwonderbox pic.twitter.com/MtS2QjhNy3 — anand mahindra (@anandmahindra) January 22, 2020 -
‘ఒకేసారి సినీ జీవితం ప్రారంభించాం’
ముంబై: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రస్తుతం నటిస్తున్న ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రంపై పలువురు బాలీవుడ్ హీరోలు అభినందనలు తెలుపుతూ.. అజయ్తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా అజయ్కి వందో చిత్రం. తాజాగా అక్షయ్ కుమార్.. అజయ్ నటించే తన్హాజీ సినిమా పోస్టర్ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..‘మనం ఇద్దరం 30 ఏళ్ల కింద సినీజీవితాన్ని ఒకేసారి ప్రారంభించాము. అప్పటి నుంచి నీ సినిమాల గ్రాఫ్ను చూస్తున్నాను. అది ఎప్పటికప్పుడు మంచి విజయాలతో పెరుగుతూనే ఉంది. నీ వందో చిత్రం తన్హాజీకి అభినందనలు. ప్రేమ, అదృష్టం నీకు కలగాలి సోదరా..’ అని కామెంట్ చేశారు. We started our journey in this industry together...30 years ago.And I’ve seen your graph only grow from strength to strength.And as you are all set to mark your century with #TanhajiTheUnsungWarrior,I wish you nothing but lots of love and luck.Shine on my friend @ajaydevgn pic.twitter.com/HrE1DvPYFW — Akshay Kumar (@akshaykumar) November 12, 2019 దీని కంటే ముందు అజయ్ 100వ చిత్రంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా తన ట్విటర్ ఖాతాలో ‘తన్హాజీ’ సినిమాలోని అజయ్ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నీ నుంచి మరో వంద సినిమాలు రావాలని ఎదరుచూస్తున్నా. మరిన్ని సినిమాల్లో నటించాలి సోదరా. నీ సినీజీవితంలో మైలురాయిగా నిలిచే వందో సినిమాకు అభినందనలు. ఒకేసారి రెండు బండ్ల మీద రైడ్ చేయటం నుంచి చాలా దూరం వచ్చావు. ఇక అలాగే స్వారీ చేస్తూ ఉండు.. తన్హాజీకి ఆల్ ది బెస్ట్.’ అంటూ కామెంట్ చేశారు. షారుఖ్ ట్విట్కు స్పందించిన అజయ్.. ‘మీ అభినందనలకు కృతజ్ఞతలు’ అంటూ రిట్వీట్ చేశారు. Here’s looking forward to another 100 and more films from my friend @ajaydevgn . All the best for this milestone...from striding atop two motorcycles at the same time...you’ve come a long long way....keep riding...and all the best for Tanhaji. pic.twitter.com/s1YpGpgEkQ — Shah Rukh Khan (@iamsrk) November 11, 2019 మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ సైన్యానికి నాయకత్వం వహించిన సుబేదార్ తన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో, కాజోల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమాను అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. గత నెలలో అజయ్ తన లుక్ని షేర్ చేసి ‘మెదడు.. కత్తికంటే కంటే చాలా పదునైనది’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
Advertisement