-
సుమంత్ హీరోగా వస్తోన్న కొత్త మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
సుమంత్ , మీనాక్షి గోసామి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. క్రిష్ మాట్లాడుతూ...'మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నా' అని అన్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
వారాహి ఆలయం నేపథ్యంలో..
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ గోసామి హీరోయిన్. కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ టైటిల్ లోగోను సుమంత్ రిలీజ్ చేశారు. ‘‘మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
ప్రేమజంట ఆత్మహత్య
బోనకల్/వైరా: తెలిసీతెలియని వయస్సు.. ప్రేమలో పడ్డారు.. విషయం తెలియడంతో వారి కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి వారెప్పటికీ ఒప్పుకోరనే ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారంరాత్రి చోటుచేసుకుంది. బోనకల్ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియటంతో మందలించారు. దీంతో సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్ పోలీసులకు 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే, ఐశ్వర్య హైదరాబాద్లో ఉన్న సుమంత్ వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై గురువారంరాత్రి వైరా రిజర్వాయర్ వద్దకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
కథ చెప్పే విధానం ముఖ్యం
‘‘ఏ సినిమాకైనా కథ కంటే ఆ కథని ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిగారు బెస్ట్. మా ‘మేమ్ ఫేమస్’ కథని సుమంత్ ప్రభాస్ చక్కగా చెప్పారు. యూత్తో పాటు తల్లితండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అని నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ అన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మేమ్ ఫేమస్’లో లీడ్ రోల్ కోసం ఆడిషన్స్ చేశాం. అయితే ఆ పాత్రకి ఎవరూ సరిపోకపోవడంతో చివరికి సుమంత్ ప్రభాసే నటించాడు. తన ప్రతిభ, ఎనర్జీ చూస్తే భవిష్యత్లో తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడనిపిస్తోంది. ‘పెళ్ళి చూపులు’ సినిమాలోని సెన్సిబిలిటీస్, ‘జాతిరత్నాలు’ మూవీలోని వినోదం కలిస్తే మా ‘మేమ్ ఫేమస్’. ప్రస్తుతం వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ యంగ్ స్టార్ హీరోతో ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
35 మంది కొత్తవారితో ‘మేమ్ ఫేమస్’
సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ పతాకాలపై శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ సినిమా టీజర్, ‘అయ్యయయ్యో..’ పాటను ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రమోషన్స్కు ప్రముఖ హీరోలంతా హెల్ప్ చేస్తుండటంతో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘18 ఏళ్ళకే టిక్ టాక్లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డెరైక్టర్ అయ్యాడు. అంతా యూత్ చేసిన సినిమా ఇది. ఆడియన్స్కు నచ్చుతుంది’’ అన్నారు అనురాగ్ రెడ్డి. ‘‘ఈ సినిమాతో 30 మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది’’ అన్నారు ‘లహరి ఫిలింస్’ చంద్రు మనోహర్. ‘‘వైజాగ్లో అన్నపూర్ణ స్టూడియోస్, రెండు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్, ఓవర్సీస్లో సరిగమల ద్వారా మా సినిమా విడుదలవుతుంది’’ అన్నారు శరత్ చంద్ర. -
మేము ఫేమస్ మూవీ టీజర్
-
హీరో నానికి నేను పోటీ? సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఈ సినిమాలో హీరోగా చేశా..!
-
వారాహి అమ్మవారి నేపథ్యంతో...
‘సుబ్రహ్మణ్యపురం’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో ‘వారాహి’ మూవీ షురూ అయింది. జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. తొలి సీన్కి నిర్మాత సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ఏడుగురు దేవతామూర్తుల్లో వారాహి అమ్మవారు ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో డిఓషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘సంతోష్ ఈ కథ చెప్పగానే చప్పట్లు కొట్టాను. మా కాంబినేషన్లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా మంచి స్క్రిప్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్, సహనిర్మాత: కేఆర్ ప్రదీప్. -
'సీతారామం' డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ కూడా అద్భుతమే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై సౌత్ సహా బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తాజాగా ఈ చిత్రంలోని డిలీటెడ్ సీన్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో చిక్కుకున్న దుల్కర్, సుమంత్ల మధ్య చిత్రీకరించిన సీన్ అది. ఫుట్బాల్ ఆట పూర్తైన తర్వాత విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు అని రామ్ చెప్పగా.. అతని కాలర్ పట్టుకొని అంతా నీవల్లే జరిగింది.. నువ్వు అనాథవురా. నాకు పుట్టింది ఆడపిల్లనో, మగపిల్లాడో కూడా తెలియదు అంటూ విష్ణుశర్మ ఫైర్ అవుతాడు. దీంతో దుల్కర్ భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సీన్ కూడా ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఇప్పటికే ఈ సీన్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయగా 1మిలియన్కు పైగా వ్యూస్ వచ్చాయి. -
సీతారామం సక్సెస్మీట్కు సుమంత్ డుమ్మా, ఎందుకంటే?
ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన సుమంత్ సీతారామం సినిమాలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా సపోర్టింగ్ రోల్ చేశాడు. ఈ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా హిట్ కూడా అయింది. అయినా సినిమా సక్సెస్ పార్టీలో సుమంత్ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటనేది ఆయన చెప్పుకొచ్చాడు. తాను కోవిడ్ బారిన పడినందువల్లే ఈవెంట్కు రాలేకపోయానని తెలిపాడు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అలాగే సక్సెస్ మీట్కు హాజరైన తన చిన్నమామయ్య నాగార్జున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే సుమంత్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఓటీటీ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని, కథ నచ్చితే తప్పకుండా చేస్తానని చెబుతున్నాడు. Missed being there as I'm down with COVID! Thanks once again to our team, the audience, and to Chinmama @iamnagarjuna for gracing the success meet 🙏🏼 #SitaRamam https://t.co/pTjj1UNCyg — Sumanth (@iSumanth) August 11, 2022 చదవండి: ఆ హీరోయిన్తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో జైభీమ్ వివాదం: హైకోర్టులో సూర్య దంపతులకు ఊరట -
సినిమా కలకాలం నిలుస్తుంది – రమేశ్ ప్రసాద్
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత ఎల్వీ ప్రసాద్) మూకీ సినిమా అప్పటినుంచి సినిమాల్లో భాగమయ్యారు. ఆ విధంగా మా ప్రసాద్స్ సంస్థకి సినిమాతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొనడం చూశాం. ప్రేక్షకుల ప్రేమతో ఇండస్ట్రీ ఈ కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా కలకాలం నిలుస్తుంది. ‘సీతారామం’ టీమ్కి శుభాకాంక్షలు’’ అని ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రలు చేశారు. 1965, 80 నేపథ్యంలో సాగే ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సోమవారం జరిగిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేశ్ ప్రసాద్ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘అందరూ నన్ను రొమాంటిక్ హీరో అంటుంటే విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదనుకున్నాను. హనుగారు చెప్పిన ‘సీతారామం’ అద్భుతమైన ప్రేమకథ. క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీ కాబట్టి చేశాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన అఫ్రిన్ పాత్ర రెబల్. నా పాత్ర పై ఆడియన్స్కి కోపం వచ్చినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్తో కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘ఈ చిత్రంలో మ్యాజికల్ రొమాన్స్ వుంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. సుమంత్, హను రాఘవపూడి మాట్లాడారు. -
సీఎం జగన్, నేను స్కూల్ లో ఎలా ఉండేవాళ్లమంటే..
-
అన్నపూర్ణ స్టూడియోలో అమల, చైతన్య బాధ్యత ఏంటంటే..?
-
పుష్ప-2 లో ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ పై సుమంత్ రియాక్షన్ చూస్తే..
-
వైఎస్ జగన్ విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది.. నేను ఆయన శ్రేయోభిలాషిని
-
కథ నచ్చితే విలన్గా రెడీ
‘‘ఒక ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్లో తొలిసారిగా ‘సీతారామం’ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా ఓ మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. కథ నచ్చితే నెగటివ్ పాత్రలు చేయడానికి రెడీ’’ అని అన్నారు సుమంత్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సుమంత్ చేసిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర లుక్ను శనివారం విడుదల చేశారు. ‘కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ... మద్రాస్ రెజిమెంట్’’ అనే డైలాగ్ ఉంటుంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘పదహారేళ్ల క్రితం ‘గోదావరి’ చిత్రంలో సీతరాముల కథను చెప్పాం (ఈ చిత్రంలో హీరో సుమంత్ పాత్ర రామ్, హీరోయిన్ కమలినీ ముఖర్జీ పాత్ర సీత). ఇప్పుడు ఈ ‘సీతారామం’ కథలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నన్ను నటించమన్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వమని హను రాఘవపూడిగారిని అడగడం జరిగింది. దాదాపు 150 పేజీల స్క్రిప్ట్ను చదివి, ఆ తర్వాత విష్ణు శర్మ పాత్రకు ఓకే చెప్పాను. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది. చాలా షేడ్స్ ఉన్నాయి. నెగటివ్ రోల్ కాదు. బ్యూటీఫుల్ అండ్ చాలెంజింగ్ రోల్లా అనిపించింది. నా కెరీర్లో దుల్కర్ సల్మాన్ను ఓ మంచి కో స్టార్గా చెబుతాను. జనరల్గా సెట్స్లో నేను మానిటర్ చూడను. డైరెక్టర్ ఓకే అంటే నాకు ఓకే. ఈ సినిమా రషెస్ చూసి అశ్వనీదత్ గారు నన్ను అభినందించారు. హ్యాపీ ఫీలయ్యాను. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ‘సీతారామం’ చిత్రం మంచి హిట్గా నిలుస్తుంది. మరోవైపు నేను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో వెబ్ సిరీస్లు చూస్తున్నాను. పెద్ద హీరోలు కూడా ఓటీటీ స్పేస్లో యాక్ట్ చేస్తున్నారు. నాకు ఆఫర్స్ వస్తున్నాయి. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. అలాగే నాకు, తాతయ్య (అక్కినేని నాగేశ్వరరావు)గారికి పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతుంటారు. మా అమ్మగారు తాతయ్యలా ఉంటారు. నేను మా అమ్మ పోలికలతో ఉంటాను (నవ్వుతూ). తాతగారి పోలికలు నాలో ఉండటం నా అదృష్టం’’ అన్నారు. -
ముగింపు మన చేతుల్లో ఉండదు.. ఆసక్తిగా సుమంత్ ఫస్ట్ లుక్..
Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్ క్యారెక్టర్ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్లో సుమంత్ అట్రాక్ట్ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఎఫెక్టివ్గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam! 🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9 — Sumanth (@iSumanth) July 9, 2022 -
హీరో సుమంత్ కొత్త చిత్రం.. మళ్లీ ఆ డెరెక్టర్తో రిపీట్..
Hero Sumanth New Movie With Santhosh Jagarlapudi: హీరో సుమంత్ ఓ కొత్త చిత్రాన్ని అంగీకరించారు. "సుబ్రహ్మణ్యపురం", "లక్ష్య" చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వీళ్లిద్దరి కాంబినేన్లో గతంలో విడుదలైన "సుబ్రహ్మణ్యపురం" సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కె ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం (జులై 3) ప్రకటించారు. పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్కు గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కె ప్రదీప్ తెలిపారు. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఆర్జేగా అక్కినేని హీరో.. 'అహం రీబూట్' ఫస్ట్ గ్లిట్చ్ రిలీజ్
Sumanth Aham Reboot First Glitch Released: ఇటీవల మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు హీరో సుమంత్. తాజాగా సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిట్చ్ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ గ్లిట్చ్ను యంగ్ హీరో అడవి శేష్ ట్విటర్ వేదికగా రిలీజ్ చేస్తూ మూవీ యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఈ ఫస్ట్ గ్లిట్చ్లో హీరో సుమంత్ ఆర్జే నిలయ్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి ఒక అమ్మాయి కిడ్నాప్ అయినట్లు కాల్ చేస్తుంది. తనను ఒక డార్క్ రూమ్లో బంధించి ఉంచారని, త్వరలో తను చనిపోతున్నట్లు చెప్పుకొస్తుంది. ఆ యువతిని ఆర్జే నిలయ్ రక్షించాడా ? లేదా ? అనే కథాంశంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో శ్రీరామ్ మద్దూరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్సింగ్ చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఫస్ట్ గ్లిట్చ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. చదవండి: హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా Here is the mighty Interesting peek into the world of #AhamReboot starting my dear bro @iSumanth In recent years, love his novel attempts Aham Reboot First Glitch | Sumanth | Prashanth Sagar Atluri | Sri Ram Ma... https://t.co/heZi6yZTjJ via @YouTube pic.twitter.com/hqdgPICXGs — Adivi Sesh (@AdiviSesh) June 14, 2022 -
‘కి’ రోల్స్కి సై అంటున్న స్టార్ హీరోలు
హీరో ఎప్పుడూ హీరోగానే చేయాలా? ‘కీ రోల్’లో కనిపించకూడదా? ‘ఎందుకు కూడదూ’ అంటున్నారు కొందరు టాప్ హీరోలు.. అందుకే హీరోగా తమ చేతుల్లో సినిమాలు ఉన్నా కీ రోల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ హీరోల్ చేస్తున్న కీ రోల్ గురించి తెలుసుకుందాం. గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన నాగార్జున చాలా గ్యాప్ తర్వాత చేసిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జునది కీ రోల్. ఇందులో రణ్బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లు. మూడు భాగాలుగా రానున్న ఈ ‘బ్రహ్మాస్త్ర’ తెలుగులో రాజమౌళి సమర్పణలో ‘బ్రహ్మాస్త్రం’గా వస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న రిలీజ్ కానుంది. ఇక నాగ్ హీరోగా చేస్తున్న ‘ఘోస్ట్’ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది. మరోవైపు ‘బిగ్ బాస్ నాన్స్టాప్’కి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జునలానే గతంలో వెంకటేశ్ హిందీ చిత్రాల్లో హీరోగా నటించారు. ‘కబీ ఈద్ కబీ దివాలీ’లో చేస్తున్న కీ రోల్తో చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెబుతున్నారు వెంకటేశ్. సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఇక హీరోగా వెంకటేశ్ నటించిన ‘ఎఫ్ 3’ ఈ నెల 27న రిలీజ్ కానుండగా వెంకీ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ చిత్రీకరణలో ఉంది. మరోవైపు హీరోగా రవితేజ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఊ కొట్టారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇందులో చిరంజీవికి తమ్ముడి పాత్రలో కనిపిస్తారట రవితేజ. ఇదే నిజమైతే... ‘అన్నయ్య’ (2000) చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రను చేసిన రవితేజ మరోసారి చిరూకి తమ్ముడిగా కనిపించినట్లు అవుతుంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’లో ఓ స్పెషల్ రోల్ చేశారు. ఈ సీనియర్ హీరోలు ఇలా కీలక పాత్రలు చేస్తుంటే యంగ్ హీరో నాగచైతన్య కూడా ఆ తరహా పాత్రలో కనిపించనున్నారు. హిందీ ‘లాల్సింగ్ చద్దా’లో కీలక పాత్ర చేశారు నాగచైతన్య. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు మలయాళ స్టార్స్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలు చేస్తున్నవారి లిస్ట్లో ఉన్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’లో మమ్ముట్టి కీ రోల్ చేస్తుండగా, ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘సలార్’లో పృథ్వీరాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ‘సీతారామం’లో సుమంత్ ఓ కీ రోల్ చేశారు. సుమంత్ హీరోగా చేసిన ‘వాల్తేరు శీను’, ‘అహం రీబూట్’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్రకు ఓకే చెప్పారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. అటు హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ సేతు’లో కీ రోల్ చేశారు సత్యదేవ్. అలాగే చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేసిన సత్యదేవ్ ‘గాడ్ ఫాదర్’ లోనూ కీ రోల్ చేశారు. సత్యదేవ్ హీరోగా చేసిన ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’ రిలీజ్కి రెడీ అవు తున్నాయి. ఇక హీరోగా ఫామ్లోకి వస్తున్న విశ్వక్ సేన్ ‘ముఖచిత్రం’లో కీ రోల్ చేశారు. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్, అయేషా ఖాన్ ముఖ్య తారలు. విశ్వక్ ప్రస్తుతం ‘గామీ’, ‘ఓరి.. దేవుడా’, ‘దాస్కీ దమ్కీ’ చిత్రాల్లో హీరోగా చేస్తున్నారు. సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు ఇలా ‘కీరోల్స్’ చేయడం మంచి పరిణామం. ఎలానూ ఆ సినిమా హీరోకి ఉన్న స్టార్డమ్ వల్ల ఆ చిత్రంపై అంచనాలు ఉంటాయి. అదే సినిమాలో ఇంకో హీరో కీ రోల్లో కనబడితే అదనపు బలం చేకూరుతుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా ‘కీ రోల్స్’ చేసేందుకు రెడీ అంటున్నారు. -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022 -
ఆసక్తిగా సుమంత్ ‘అహం రీబూట్’ ఫస్ట్లుక్
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహాం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ ఫస్ట్లుక్ విడదుల చేశారు మేకర్స్. ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుమంత్ లుక్ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో సుమంత్ లుక్ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతుండగా.. సుమంత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కకినిపంచాడు. చదవండి: సూరారై పోట్రు హిందీ రీమేక్లో అక్షయ్, షూటింగ్ స్టార్ట్ చూస్తుంటే ఇందులో సుమంత్... సాయం కోరే వాళ్లతో మాట్లాడుతూ వారి సమ్యలు తీర్చే వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది! ఈ సందర్బంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో నటిస్తున్న సుమంత్ కి అభినందనలు’ అన్నారు. అనంతరం నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు దర్శకుడు ప్రశాంత్ సాగర్తో పాటు మూవీ టీంకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. ‘అహాం రీ బూట్తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ను అందించబోతున్నాం. అనుకోని సంఘటలను మనిషిలోని కొత్త కోణాలను , శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే అహాం రిబూట్. సుమంత్ నటన చాలా హైలెట్గా ఉంటుంది. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జయిట్మెంట్ మా టీం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ మూవీకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. -
సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన యంగ్ హీరోలు
వేరీజ్ దట్ మోడ్రన్ హెయిర్ స్టయిల్.. వాటీజ్ దిస్ మీసకట్టు.. వేరీజ్ దట్ లవర్ బోయ్ లుక్ అంటే... కట్ చేశా.. లుక్ మార్చేశా అంటున్నారు కుర్ర హీరోలు. మరి.. సైనికుడా? మజాకానా? సిల్వర్ స్క్రీన్ కోసం సోల్జర్లుగా మారిన ఈ హీరోలు ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోయారు. సోల్జర్.. ఆన్ డ్యూటీ అంటున్న వెండితెర సైనికుల గురించి తెలుసుకుందాం. 'వెంకీమామ’ (2019)లో కొన్ని సీన్ల కోసం సరిహద్దుకు వెళ్లొచ్చారు నాగచైతన్య. మళ్లీ ఇప్పుడు బోర్డర్కు వెళ్లొచ్చారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో ‘లాల్సింగ్ చద్దా’ అనే సినిమా రపొందిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్ గంప్’కి ఇది హిందీ రీమేక్. ఈ చిత్రంలో బాల అనే పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. కథ రీత్యా ఈ చిత్రంలో కొన్ని సీన్స్లో ఆమిర్ ఖాన్, నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్స్గా కనిపిస్తారు. సినివలో ఓ వార్ బ్యాక్డ్రాప్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్స్లో రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగులోన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే హిందీలో నాగచైతన్య నటించిన తొలి సినిమా కూడా ‘లాల్సింగ్ చద్దాయే’ కావడం విశేషం. అయితే ఇందులో చైతూది స్పెషల్ రోల్. మరోవైపు విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ సోల్జర్గా కనిపించనున్న చిత్రం ‘జేజీఎమ్’ (జేజీఎమ్ అంటే ‘జన గణ మన’ అనే ప్రచారం జరుగుతోంది). ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ మూవీ ‘లైగర్’ తర్వాత వెంటనే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ‘జేజీఎమ్’. ‘‘ఇండియన్స్ ఆర్ టైగర్స్, ఇండియన్స్ ఆర్ ఫైటర్స్, ఇండియన్స్ కేన్ రూల్ దిస్ వరల్డ్.. 'జన గణ మన’... ఇది ‘జేజీఎమ్’ చిత్రం ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ఏ లెవల్లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా కశ్మీర్లోనే టైమ్ స్పెండ్ చేశారు దుల్కర్ సల్మాన్. ఎందుకంటే.. ‘సీతారామం’ సినివ కోసం. ‘మహానటి’ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న రెండో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ఇది. నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తీసిన హను రాఘవపూడి ఈ ‘సీతారామం’ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో హీరోయిన్గా మృణాళినీ ఠాకూర్, కీలక పాత్రలో అఫ్రీన్గా రషి్మకా మందన్నా కనిపిస్తారు. ‘సీతారామం’ బోర్డర్ బ్యాక్డ్రాప్లో సాగే లవ్స్టోరీ అని తెలిసింది. ఈ చిత్రంలో సుమంత్ ఓ కీ రోల్ చేస్తున్నారు. సుమంత్ది కూడా సోల్జర్ పాత్ర అని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ మలయాళ స్టార్ మమ్ముట్టి ‘ఏజెంట్’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రపొందుతోన్న ఈ సినిమాలో అక్కినేని అఖిల్ హీరో. ఈ చిత్రంలో మమ్ముట్టీది మిలిటరీ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ ముగ్గురే కాదు.. మరికొందరు తెలుగు హీరోలు కూడా సోల్జర్స్గా వెండితెరపై కనిపించనున్నారని తెలుస్తోంది. చదవండి: మందు తాగుతా, ఆ టైమ్లోనే కథలు రాస్తాను: ప్రశాంత్ నీల్ దటీజ్ రామ్చరణ్, ఆయన వ్యక్తిత్వానికి ఇదే ఎగ్జాంపుల్! -
ఆడియన్స్ అప్డేట్ అయ్యారు
సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘విడాకులు తీసుకున్న ఓ జంట కథ కొత్తగా మళ్లీ ఎలా మొదలైంది అన్నదే మా ‘మళ్ళీ మొదలైంది’. నా స్నేహితుడి జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ సినిమాను తీశాం. ‘నా సర్కిల్లో సినిమాకు మంచి స్పందన వస్తోంది’ అని సుమంత్ అనడంతో హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ ఆడియన్స్ లాక్డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల మరింత అప్డేట్ అయ్యారు. కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. నేనూ అలాంటి సినిమాలనే తీయాలనుకుంటున్నాను’’ అన్నారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement