-
వరల్డ్కప్లో భారత్ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ: మహ్మద్ రిజ్వాన్
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన అనంతరం పాకిస్తాన్ స్టార్ ఓపెనర్, వికెట్కీపర్ మహ్మద్ రిజ్వాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్తో సిరీస్ గురించి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రిజ్వాన్ మాట్లాడింది టీమిండియాను ఉద్దేశించి. స్కై స్పోర్ట్స్ ఛానల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్తో రిజ్వాన్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్కప్-2021లో టీమిండియాపై విజయం తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవాన్ని సైతం పక్కకు పెట్టిన రిజ్వాన్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరల్డ్కప్లో భారత్పై విజయం సాధించిన నాటి నుంచి స్వదేశంలో తనకు మర్యాద విపరీతంగా పెరిగిపోయిందని, తాను షాపింగ్కు ఎక్కడికి వెళ్లినా షాప్ యజమానులు తన వద్ద డబ్బులు తీసుకోవట్లేదని తెలిపాడు. ఇండియాను ఓడించావు.. అది చాలు, మాకు డబ్బులు వద్దు.. నీకు అన్నీ ఫ్రీ అంటూ షాప్కీపర్లు తెగ మెహమాట పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తానైతే టీమిండియాపై గెలుపును ఓ సాధారణ గెలుపులానే భావించానని, స్వదేశానికి వెళ్లాక ఆ గెలుపు ప్రత్యేకతేంటో తనకు తెలిసి వచ్చిందని అన్నాడు. కాగా, టీ20 వరల్డ్కప్-2021 తొలి మ్యాచ్లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్), బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించుకున్నాడు. -
Team India: ద్వైపాక్షిక సిరీస్ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు
రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది. ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆతర్వాత కరీబియన్ గడ్డపై 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్, సెప్టెంబర్లలో జరిగిన ఆసియా కప్లో సూపర్-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో సెమీస్లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్లో అయితే పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది. 2021 టీ20 వరల్డ్కప్లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో గ్రూప్ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్లో ఇంగ్లండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. -
ఆటకు గుడ్బై చెప్పిన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం.. సెలక్టర్ల వల్లేనంటూ!
Kevin O Brien: ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత ఆట నుంచి వైదొలుగుదామని భావించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా తనను సెలక్టర్లు పక్కనపెట్టారన్న 38 ఏళ్ల కెవిన్.. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మంగళవారం సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. అందరికీ ధన్యవాదాలు! ‘‘ఐర్లాండ్ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నాతో పనిచేసిన కోచ్లు.. సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన అడీ బిరెల్, ఫిల్ సిమ్మన్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు. క్రికెటర్గా నా ప్రయాణంలో వెన్నంటి నిలిచిన నా కుటుంబ సభ్యులకు థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్న నా భార్య రూత్ అనీకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అంటూ కెవిన్ తన నోట్లో పేర్కొన్నాడు. 2006లో ఎంట్రీ ఇచ్చి! కాగా బ్యాటింగ్ ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ 2006లో ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్తో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. టెస్టు క్రికెట్లో ఐర్లాండ్ జట్టు అసోసియేట్ మెంబర్షిప్ పొందడంలోనూ కీలకంగా వ్యవహరించాడు. ఇక 2008లో టీ20 ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చి.. మొత్తంగా 109 మ్యాచ్లు ఆడాడు. గతేడాది అక్టోబరు(వరల్డ్కప్)లో కెవిన్ తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడిని సెలక్టర్లు పరిమిత ఓవర్ల జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో కెవిన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పడం గమనార్హం. టెస్టుల్లో.. ఇదిలా ఉంటే.. 2018లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన కెవిన్.. 2019లో లార్డ్స్ మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంగా మూడు టెస్టులాడిన అతడు 258 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 118. వన్డేల్లో ఇలా వన్డేల విషయానికొస్తే.. 152 మ్యాచ్లు ఆడి 3619 పరుగులు(అత్యధిక స్కోరు 142) చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఒక సెంచరీ(124 పరుగులు) నమోదు చేశాడు. కెవిన్ తన కెరీర్లో మొత్తం నాలుగు శతకాలు(టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో రెండు, టీ20లలో ఒకటి) బాదాడు. బౌలర్గా అరుదైన ఘనత ఇక రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కెవిన్.. వన్డేల్లో 114 వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. ఐర్లాండ్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్కప్ టోర్నీలో వేగవంతమైన సెంచరీ(50 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్సర్లతో శతకం.. మొత్తంగా 113 పరుగులు) సాధించిన బ్యాటర్గానూ చరిత్రకెక్కాడు. 2011 ప్రపంచకప్ సందర్భంగా బెంగళూరులో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. చదవండి: Kohli- Rohit: కోహ్లి కెప్టెన్సీలో జట్టు దూకుడుగా ఉండేది కాదు! రోహిత్ శర్మ అలా కాదు! అతడు ఉన్నాడంటే.. Thanks ☘️ pic.twitter.com/E4335nE8ls — Kevin O'Brien (@KevinOBrien113) August 16, 2022 -
Ind Vs Pak: అతడు ఫామ్లోకి వస్తే మనకు ఓటమి తప్పదు: పాక్కు సల్మాన్ వార్నింగ్
Asia Cup 2022 India Vs Pakistan: ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈనెల 27న శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఆ మరుసటి రోజే క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఇక మ్యాచ్లో గెలిచి టీ20 ప్రపంచకప్-2021లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ప్రస్తుతం రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తూ జోరు మీదున్న తీరు చూస్తే గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు, యువ ఆటగాళ్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఫామ్లో ఉండటం సహా.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్లోకి వస్తే భారత్ను ఆపడం ఎవరితరం కాదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా ఇదే మాట అంటున్నాడు. రొటేషన్ పాలసీతో భారత్ తమ ఆటగాళ్లందరినీ పరీక్షిస్తూ బెంచ్ను పటిష్టం చేసుకుంటోందని కొనియాడాడు. అదే విధంగా విరాట్ కోహ్లి విజృంభిస్తే పాకిస్తాన్కు కష్టాలు తప్పవని బాబర్ ఆజం బృందాన్ని హెచ్చరించాడు. మంచి పరిణామం! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా సల్మాన్ బట్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘భారత జట్టులో రొటేషన్ పాలసీ అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయినట్లుగా అనిపిస్తోంది. ప్రతీ సిరీస్లోనూ వాళ్లు వేర్వేరు ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నారు. సీనియర్లకు తగినంత విశ్రాంతినిస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. విభిన్న కాంబినేషన్లతో ముందుకు వస్తున్నారు. నిజానికి ప్రస్తుతం వాళ్ల బెంచ్ స్ట్రెంత్ కారణంగా సెలక్షన్ తలనొప్పిగా మారుతోంది. ఇది మంచి పరిణామమే. కోహ్లి గనుక ఫామ్లోకి వస్తే! ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే... అతడు ఎంతటి అనువజ్ఞుడో, అతని శక్తి సామర్థ్యాలేమిటో అందరికీ తెలుసు. కోహ్లి వీలైనంత తొందరగా ఫామ్లోకి వస్తే బాగుంటుందని ఇండియా భావిస్తోంది. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో చాలా మంది భారత ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చిన తీరును మనం చూశాం. ఒకవేళ కోహ్లి గనుక తిరిగి పుంజుకుంటే.. కచ్చితంగా అతడు పాకిస్తాన్కు తలనొప్పిగా మారతాడు’’ అని సల్మాన్ బట్ పాకిస్తాన్ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. కాగా దుబాయ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్తాన్పై కోహ్లి అర్ధ శతకం(57)తో రాణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో రిషభ్ పంత్(39) మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయకపోవడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయడం భారత బౌలర్లకు సాధ్యం కాకపోవడంతో పది వికెట్ల తేడాతో కనీవిని ఎరుగని రీతిలో ఐసీసీ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది. చదవండి: India Tour Of Zimbabwe: స్టార్ ఆల్రౌండర్ దూరం..! WI VS NZ 3rd T20: ఎట్టకేలకు ఓ విజయం.. వైట్వాష్ అవమానాన్ని తప్పించుకున్న విండీస్ టీమిండియా పటిష్టమైన జట్టే కావొచ్చు.. ధీటుగా పోటీ ఇస్తాం..! #ViratKohli has started the practice for #AsiaCup 2022 at BKC Complex Mumbai.pic.twitter.com/KkhgGWGYti — Lakshya Lark (@lakshyalark) August 11, 2022 Cometh the hour, cometh the man!🙌 Do you remember this crucial knock that helped #TeamIndia complete a tricky chase? Look forward to more such knocks from #KingKohli in the greatest rivalry! #BelieveInBlue | #AsiaCup | #INDvPAK: Aug 28, 6PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/UtZJnVh9v4 — Star Sports (@StarSportsIndia) August 12, 2022 -
T20 WC 2021: రిజ్వాన్కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
ICC T20 World Cup 2021 Semi Final PAK Vs AUS: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అదరగొట్టిన పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డాక్టర్ నజీబుల్లా సుమ్రొ సంచలన విషయాలు వెల్లడించాడు. వరల్డ్కప్ టోర్నీ సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కోలుకునేందుకు నిషేధిత పదార్థాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా సాగిన ఐసీసీ పొట్టి ఫార్మాట్ ఈవెంట్లో పాకిస్తాన్ అజేయ రికార్డును కొనసాగిస్తూ సెమీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్కు ముందు రిజ్వాన్ తీవ్ర చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు అనూహ్యంగా ఆసీస్తో మ్యాచ్కు అందుబాటులోకి రావడమే కాదు.. 52 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. PC: Shoaib Akhtar Instagram అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలగేరడంతో పాక్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు.. ఆపై ఫైనల్ చేరి.. అక్కడ న్యూజిలాండ్ను ఓడించి తొలిసారి ట్రోఫీ గెలిచారు. ఇదిలా ఉంటే.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక మైదానంలో దిగాడంటూ అప్పట్లో రిజ్వాన్పై ప్రశంసలు కురిశాయి. రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే రిజ్వాన్కు ఆట పట్ల ఉన్న అంకితభావం, దేశం కోసం ఆడాలన్న తపన చూసి గర్వపడుతున్నానంటూ పేర్కొన్నాడు. మిగతా పాక్ క్రికెటర్లు సైతం అతడిని ప్రశంసించారు. అయితే, ఈ ఘటన గురించి రిజ్వాన్కు చికిత్స అందించిన డాక్టర్ నజీబుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు.. ‘‘నువ్వు అసలు శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు కోలుకోవాలంటే నీకు ఇంజెక్ట్ చేయాల్సిన మెడిసన్ గురించి ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆ మెడిసిన్ అథ్లెట్లు వాడటం నిషేధం. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు కచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి’’ అని రిజ్వాన్తో ఇంటర్వ్యూలో నజీబుల్లా వ్యాఖ్యానించాడు. కాగా నజీబుల్లా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. చదవండి👉🏾MS Dhoni: మేము ప్లే ఆఫ్స్కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని చదవండి👉🏾IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
Advertisement