-
ఆ ఓటర్లే కీలకం..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి.పోస్టల్, హోం ఓటింగ్ కీలకం..రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు.పోలింగ్ శాతం పెరగాల్సిందే..ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు.యువ ఓటర్లకు గాలం!ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు.ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు.ఆమే.. అధికం!ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు.ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
ఖమ్మం వన్టౌన్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోయిన నేపథ్యంలో రైతులు అధైర్య పడొద్దని.. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంటున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ పూర్తిచేసి.. ఎంత మంది రైతులకు, ఎన్ని కోట్ల రుణమాఫీ చేశామనేది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో చెబుతామని తెలిపారు. కాగా, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగేలా పంటల బీమా పథ కాన్ని అమలు చేస్తూ, ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి చెప్పారు. ఇక విత్తన కంపెనీలతో ఇబ్బందులు లేకుండా రైతులకు విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా నిలుస్తుందన్నారు. కాగా, ఆయిల్పామ్తో లాభాలు గడించే అవకాశమున్నందున రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు. ఇక పంట నష్టపరిహారం సైతం త్వరలో అందిస్తామని, వచ్చే ఖరీఫ్ నుంచి పెంచిన ఎకరాకు రూ.15వేల చొప్పున రైతు భరోసా పంపిణీ ప్రారంభిస్తామని తుమ్మల తెలిపారు. కాగా, నల్లగొండలో ఎంపీ అభ్యర్థికి 5 లక్షల మెజార్టీ ఇస్తామని అక్కడి నేతలు చెబుతున్నందున, ఆ మెజార్టీ దాటేలా ఖమ్మం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
యువ ఓటర్లకు గాలం
ఈసారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనుండడంతో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాక యువతకు చేస్తున్న మేలును కూడా ప్రచారంలో నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేకంగా యువ ఓటర్లను కలుసుకునేందుకు సమ్మేళనాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ఉద్యోగ నియామకాల అంశాలను వివరిస్తూ ఓట్లు రాబట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలోని మొత్తం 16,31,039 మంది ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్లలోపు వయస్సు ఓటర్లు 50,747 మంది ఉన్నారు. వీరిలో 26,775 మంది యువకులు, 23,967 మంది యువతులు ఉండగా.. మొదటిసారిగా ఓటు వేసే వీరిని ప్రసన్నం చేసుకోవడంలో పార్టీల అభ్యర్థులు నిమగ్నమయ్యారు. -
1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం
● కోత దశలో ఉన్న మామిడి తోటలపై అకాల వర్షప్రభావం ● జిల్లా అంతటా చల్లబడిన వాతావరణం ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలో 1,358 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. గత శనివారం నుంచి మంగళవారం వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కోత దశలో ఉన్న మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోని 593 మంది రైతులకు చెందిన 1,353 ఎకరాల్లో మామిడి, ఐదుగురు రైతులకు చెందిన ఐదెకరాల్లో బొప్పాయి పంటలకు నష్టం జరిగినట్లు తేల్చారు. పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, తిరుమలాయపాలెం, కూసుమంచి తదితర మండలాల్లో మామిడికి, రఘునాథపాలెంలో బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. చల్లబడిన వాతావరణం ఉపరితల ద్రోణి కారణంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. ఈమేరకు బుధవారం ఉదయం వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలో సగటున 10.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 22.4 మి.మీల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కల్లూరు మండలంలో 1.2 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులు మొదలుకాగా, సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఈ వర్షం కారణంగా జిల్లాలో బుధవారం సాధారణ ఉష్ణోగ్రతలే నమో దు కాగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గాలివానతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో విద్యుత్ శాఖ ఉద్యోగులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నయ్యారు. కాగా, కోత దశలో ఉన్న మామిడి పంట నేలరాలగా, పలుచోట్ల బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. అలాగే, పలుచోట్ల వరి, మొక్కజొన్న వంటి పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఆమే.. అధికం
చల్లని వేళ కానిచ్చేద్దాం..! ఎన్నికల ప్రచారానికి నేతలు ఉదయం, సాయంత్రం సమయాన్నే ఎంచుకుంటూ జనసమూహం ఉన్నచోట్లకు వెళ్తున్నారు.IIలోఈ ఎన్నికల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లోనూ వీరే ఎక్కువ మంది ఓటు వేసినా పూర్తిస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పోలింగ్ బూత్లకు రప్పించేలా పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. చాలా తక్కువ మంది ఓటు వేశారు. ఈసారి మొత్తం ఓటర్లు 16,31,039 మందికి పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉన్నారు. అంటే పురుషుల కన్నా మహిళలు 56,589 మంది ఎక్కువగా ఉన్న నేపథ్యాన గత ఎన్నికల మాదిరి కాకుండా అందరినీ పోలింగ్ బూత్ల వద్దకు రప్పించేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో మహిళలపైనే దృష్టి సారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో కరెంట్ కోతలు లేవని, నీటి కొరత ఎదురుకాలేదని చెబుతుండగా.. కాంగ్రెస్ నేతలు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక బీజేపీ సైతం మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తోంది. -
కాంగ్రెస్ మోసాలను ఇంటింటా చెప్పండి..
● విఫలమైన హామీలను వివరించాలి ● బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సత్తుపల్లి: లోక్సభ పోలింగ్కు తక్కువ సమయం ఉన్నందున బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరును ప్రజలకు వివరించాలని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు సూచించారు. సత్తుపల్లిలోని పలు వార్డుల్లో బుధవారం ఆయన బూత్ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈసమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేశామని ఇటీవల రాహుల్గాంధీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఈమేరకు మహాలక్ష్మి, రూ.4వేల పింఛన్, గ్యాస్ సబ్సిడీ, వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్, రైతుభరోసా, రుణమాఫీ హామీల అమలులో విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి తన విజయానికి కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తన పదవీకాలంలో ఎవరినీ వేధించలేదని, ప్రత్యర్థులపై ఒక్క కేసు కూడా పెట్టలేదని తెలిపారు. కానీ ఈ రోజు పరిణామాలు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలో చించాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేందుకు జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సి పల్ చైర్మన్ కూసంపూడి మహేష్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్.కే. రఫీ, యాగంటి శ్రీని వాసరావుతో పాటు కొత్తూరు ఉమామహేశ్వర రావు, చల్లగుండ్ల కృష్ణయ్య, కూసంపూడి రామారా వు, దొడ్డా శంకర్రావు, వీరపనేని బాబీ, ఎస్.కే. అయూబ్పాషా, మిద్దె శ్రీను, బాబు, దేవరపల్లి ప్రవీణ్, అద్దంకి అనిల్, సూరిబాబు పాల్గొన్నారు. తెలంగాణ వాణి వినిపిస్తా.. బోనకల్/పెనుబల్లి/కల్లూరు/చింతకాని: మరో మారు తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణతో పాటు జిల్లా వాణిని వినిపించి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు వెల్లడించారు. బోనకల్, పెనుబల్లి, కల్లూరు, చింతకానిలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి.. లోక్సభ ఎన్నికల్లో మరోమారు ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలను గుర్తించి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈసమావేశాల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కోటేశ్వరరావు, ఎంపీపీ అలేఖ్య, జెడ్పీటీసీలు చెక్కిలాల మోహన్రావు, కట్టా అజయ్కుమార్, నాయకులు డాక్టర్ లక్కినేని రఘు, వెంకట్రావు, కోటగిరి సుధాకర్రావు, బి.ప్రసాద్, శ్రీనివాసరావు, చెన్నారావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కాకా సీతారాములు, వై.శ్రీనివాసరెడ్డి, పి.మల్లేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, బి.శ్రీను, బానోతు కొండ, బందం నాగేశ్వరావు, పి.పుల్లయ్య, బొడ్డు వెంకట్రామయ్య, జి.హన్మంతరావు, వి.లచ్చయ్య పాల్గొన్నారు. -
బీజేపీ మళ్లీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..
ఖమ్మం మామిళ్లగూడెం: దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యాన డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్ అధ్యక్షతన బుధవారం ‘ప్రస్తుత ఎన్నికలు – మన బాధ్యత’ అంశంపై ఖమ్మంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశం పెనుప్రమాదంలో పడిందని, రాజ్యాంగ అంశాలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలిపారు. ప్రజల చేత ప్రజాస్వామ్య విధానంలో ఎన్నుకున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీకి ప్రభుత్వానికి ఉందని చెప్పారు. అంతేకాక పీఎం కేర్స్లో అవినీతి ప్రశ్నించడానికి వీల్లేకుండా సమాచార హక్కు చట్టం నుండి తొలగించారని చెప్పారు. ఇంత వరకు విరాళాల రూపంలో వచ్చిన రూ.5,416కోట్ల ధనాన్ని ఏం చేశారో చెప్పకపోగా, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదని తెలిపారు. మోడీ మాటలు నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచా రని, పెద్దనోట్ల రద్దు, రాఫెల్ కుంభకోణం, కరోనా సమయంలో పడిన ఇబ్బందులు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పడిపోయి న రూపాయి విలువను గుర్తించి ప్రజలు ఈసారి ఓట్లు వేయాలని సూచించారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పేదవాళ్లు ఇంకా దారిద్ర రేఖకు దిగువకు వెళ్తుండగా.. మోదీ మాత్రం కార్పొరేట్ మిత్రుల ఆకాంక్షలను తీర్చడానికి కృసి చేస్తున్నారని విమర్శించారు. స్వామినాధన్ కమిషన్ సిఫారసులు ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన బాద్యతత ప్రధానమంత్రిపై ఉందన్నారు. ఈసెమినార్లో జమాతె ఇస్లామ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇలియాస్తో పాటు వివిధ సంఘాల ప్రతిని ధులు డాక్టర్ నాగమణి, ఎస్.విజయ్, నాగమల్లేశ్వరావు, సాదిక్ అహ్మద్, జైనుల్పాషా, దేవిరెడ్డి, విజయ్, ఖాసిం పాల్గొన్నారు. రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ -
ఆ ఓటర్లే కీలకం..
లోక్సభ పరిధిలో ఎక్కువగా మహిళా ఓటర్లు ● ఇంటింటా వారిని కలుస్తూ ఓట్ల అభ్యర్థన ● మొదటి సారి ఓటేయనున్న యువతను ఆకర్షించేలా కసరత్తు ● పోస్టల్, హోం ఓటింగ్ కూడా వన్ సైడ్ అయ్యేలా ప్రచారం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు రాబట్టడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఓ వైపు ఉధృతంగా ప్రచారం చేస్తూనే.. ఏయే వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశముందనే అంశంపై లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లు, అందులో పార్టీల వారీగా పోలైనవి, ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నేపథ్యాన అతివలే కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నా యి. అలాగే, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతను ఆకట్టుకునేలా నేతలు ప్రసంగిస్తు న్నారు. ఇక పోస్టల్, హోం ఓటింగ్ వేసే వారిపైనా దృష్టి సారించి.. సాధారణ పోలింగ్ కన్నా ముందుగానే ఎక్కువగా ఓట్లు సాధించాలనే ఉద్దేశంతో పార్టీలు పనిచేశాయి. పోస్టల్, హోం ఓటింగ్ కీలకం రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, హోం ఓటింగ్ ఈనెల 3న ప్రారంభమై బుధవారం ముగు స్తుందని తొలుత ప్రకటించినా 10వతేదీ వరకు పొడి గించారు. ఇప్పటికే తమ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వేయించాలనే లక్ష్యంతో నేతలు పనిచేయగా మిగిలిన సమయంలోనూ ఎక్కువ ఓట్లు రాబట్టేలా ఉద్యోగు లను కోరేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, బుధవా రం నాటికి ఉద్యోగులు 7,203మంది, వయోవృద్ధులు 2,713 మంది ఓటు వేశారు. ఇక ప్రచారానికి మరో మూడు రోజుల సమయమే ఉండడం.. అగ్రనేతల ప్రచారం ముగియడంతో ఓటర్లను నేరుగా కలి సేందుకు అభ్యర్థులు, నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని కోరుతున్నారు. పోలింగ్ శాతం పెరగాల్సిందే.. ప్రచారం చేస్తూనే పోలింగ్ శాతం పెంపుపైనా పార్టీ లు దృష్టి సారించాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో 82.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019లో 75.30 శాతం పోలింగ్ జరిగింది. కానీ ఈసారి అది పెరిగేలా.. తద్వారా ఎక్కువ మంది ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేలా నేతలు పనిచేస్తున్నారు. మరోపక్క ఎన్నికల సంఘం కూడా పోలింగ్ పెంపునకు ప్రచా రం చేస్తోంది. వివిధ మాధ్యమాల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరి స్తూనే షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటుచేశారు. -
రైతులకు ఏ కష్టం రానివ్వం..
ఖమ్మంవన్టౌన్: కాంగ్రెస్ నేతృత్వాన కొనసాగుతున్నది రైతు ప్రభుత్వమని.. రాష్ట్రంలోని ఏ రైతుకూ కష్టం రాకుండా చూసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం అబద్ధాలు, అభూతకల్పనలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. రైతులకు విత్తన కంపెనీల నుంచి ఇబ్బంది రాకుండా మేలైన విత్తనాలు అందేలా ప్రభుత్వం సహాయకారిగా ఉంటుందన్నా రు. వచ్చే జూలైలోపు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తిచేసి ఆగస్టులో వైరా రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపుతామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని చెప్పారు. రైతుల సంక్షేమానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున అకాల వర్షంతో తడిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని తెలిపారు. ఇక రైతుల తరఫున పంట బీమా సైతం ప్రభుత్వమే చెల్లించనుందని మంత్రి ప్రకటించారు. కాగా, నల్లగొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఐదు లక్షల మెజార్టీ సాధిస్తామని అక్కడి నేతలు ధీమాగా ఉన్నందున.. ఖమ్మంలో మరింత మెజార్టీ సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని తుమ్మల కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్ధి రఘురాంరెడ్డి మాట్లాడగా డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, దొబ్బల సౌజన్య, బాలసాని లక్ష్మీనారాయణ, బేబీ స్వర్ణకుమారి, వడ్డెబోయిన నర్సింహారావు, దాసరి డానియేలు, మొక్కా శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ.. జూలైలోగా సీతారామ ట్రయల్ రన్ కిసాన్ కాంగ్రెస్ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
ఎఫ్ఎస్టీలు అప్రమత్తంగా వ్యవహరించాలి
ఖమ్మం సహకారనగర్: లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నందున ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు(ఎఫ్ఎస్టీ)లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర్నంద్ మిశ్రాతో కలిసి ఎఫ్ఎస్టీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మద్యం, నగదు తరలివెళ్లకుండా చూడాలని తెలిపారు. వ్యయ పరిశీలకులు అరుణ్ప్రసాత్ కృష్ణసామి, శంకరనంద్ మిశ్రా ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులతో వెంటనే స్పందించడం ద్వారా వారిలో నమ్మకం కల్పించాలని తెలిపారు. ఆతర్వాత సీ–విజిల్ యాప్కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారంపై సమీక్షించారు. అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. వివిధ పార్టీల నాయకుల సమక్షాన కలెక్టరేట్లో నిర్వహించిన ర్యాండమైజేషన్ను ఆయన పరిశీలించి మట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గానికి కేటాయించిన 19 ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు మరమ్మతుకు రావడంతో రిజర్వ్ యూ నిట్లను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి, సీపీఓ ఏ.శ్రీనివాస్, వ్యయ నోడల్ అధికారి మురళీధర్రావు, ఉద్యోగులు రాంబాబు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. కాగా, డీఈఓ సోమశేఖరశర్మతో కలిసి ఉపా ధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమైన కలెక్టర్ గౌతమ్ ఎన్నికల విధినిర్వహణలో తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ -
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
హన్మకొండ: నల్లగొండ– వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని అధిష్టానం బుధవారం ప్రకటించింది. ప్రస్తుత హనుమకొండ జిల్లా దామెరలో ఎస్సెస్సీ, పరకాలలో ఇంటర్, వరంగల్లో బీఎస్సీ, ఓయూలో ఎమ్మెస్సీ, మరఠ్వాడ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏబీవీపీ, బీజేవైఎంలో పలు పదవులు నిర్వర్తించడమే కాక పూర్వ వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గత పన్నెండేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ప్రేమేందర్రెడ్డి తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా పాల్గొన్నారు. కాగా, 2004లో శాయంపేట, 2009లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన ప్రేమేందర్రెడ్డి, 2021 నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీకి దిగారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించగా గురువారం ఆయన నల్లగొండలో నామినేషన్ వేయనున్నారు.ఓరుగల్లు వాసికి అవకాశమిచ్చిన బీజేపీ -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
మధిర/ఎర్రుపాలెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మధిరకు చేరుకుంటారు. ఆతర్వాత సాయంత్రం 4గంటలకు ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రింగ్ సెంటర్లో ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరఫున నిర్వహించే కార్నర్ మీటింగ్లో భట్టి ప్రసంగిస్తారు. ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివా స్రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ రేణుకా చౌదరి, రఘురాంరెడ్డి సైతం పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6–30గంటలకు మధిరలో జరిగే రోడ్డు షోలో భట్టి విక్రమార్క, మంత్రులు, అభ్యర్థి పాల్గొంటారు. జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్, సీపీ ఖమ్మం సహకారనగర్: జిల్లా జడ్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జి.రాజగోపాల్ను కలెక్టర్ వీ.పీ.గౌతమ్, సీపీ సునీల్దత్ బుధవారం కలిశారు. కోర్టులో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్, సీపీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు. ప్రశాంతంగా ఈఏపీ సెట్ ఖమ్మం సహకారనగర్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఖమ్మం, సత్తుపల్లిలోని పలు కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈమేరకు ఖమ్మంలోని పరీక్షా కేంద్రాల్లో 1,564 మందికి 1,465మంది, సత్తుపల్లిలో 430మందికి 395మంది విద్యార్థులు హాజరయ్యారని అధికార యంత్రాంగం వెల్లడించింది. సకాలంలో సీఎంఆర్ అందించాలి ఖమ్మం సహకారనగర్: 2023–2024 సంవత్సరానికి సంబంధించి క్లస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను సకాలంలో ఎఫ్సీఐకి అందజేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన రైస్ మిల్లర్లు, ఎఫ్సీఐ అధికారులతో సమావేశమయ్యారు. సీఎంఆర్ తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. అలాగే, మిల్ల ర్లకు కావాల్సిన గోనె సంచులు, ఎఫ్సీఐ గోదాంల్లో బియ్యం దిగుమతికి ఉన్న ఖాళీ స్థలాలు వివరాలు ఆరా తీసిన ఆయన ఈ నెలాఖరులోగా సీఎంఆర్ అందజేయాలని స్పష్టం చేశారు. అప్రమత్తతతోనే ప్రమాదాలకు చెక్ తల్లాడ: అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా నే విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ తెలిపారు. తల్లాడ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లలో బట్టలు ఆరేసేందుకు జీఐ వైర్ కాకుండా ప్లాస్టిక్ తాడు ఉపయోగించాలని చెప్పారు. అంతేకాక లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్య ఎదురైతే సొంతంగా మరమ్మతులు చేయకుండా విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే, విద్యుత్ ఉద్యోగులు నిరంతర సరఫరా కోసం కృషి చేస్తూనే రక్షణ చర్యలు పాటించాలని ఎస్ఈ తెలిపారు. అనంతరం విద్యుత్ సిబ్బందితో ప్రమాద రహితంగా విధులు నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈసమావేశంలో డీఈ హీరాలాల్, ఏడీఈలు ఖాదర్బాబా, యాదగిరి, ఏఈలు రాజేష్, సుందర్కుమార్ పాల్గొన్నారు. పట్టభరద్రుల ఉప ఎన్నికకు 19మంది నామినేషన్లు నల్లగొండ: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం 19మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల నుంచే కాక స్వతంత్రులు తమ నామినేషన్లను నల్ల గొండ కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ దాసరి హరిచందనకు అందజేశారు. కాగా, గురువారం నామినేషన్ల గడువు ముగియనుండగా, ఇప్పటి వరకు 67మంది నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు వెల్లడించారు. -
బీజేపీ విజయంతోనే అభివృద్ధి
ఖమ్మం మామిళ్లగూడెం: దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందని.. మూడోసారి కూడా మోదీ ప్రధాని కానున్నందున ఖమ్మంలో కూడా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావును గెలిపిస్తే అభివృద్ధి జోరుగా సాగుతుందని కాకతీయ సామ్రాజ్య వారసుడు, బస్తర్రాజు కమల్చంద్ర భంజ్దేవ్ వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి వినోద్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో వ్యాపారుల ఆధ్వర్యాన కమాన్బజార్లో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధి నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని తెలిపారు. మరోమారు కూడా మోదీ అధికారం ఇవ్వాలని అన్నివర్గాల నిర్ణయించుకున్నందున ఖమ్మంలో వినోద్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, వినోద్రావును గెలిపించాలని కోరుతూ బీజేపీ, టీడీపీ ఆధ్వర్యాన ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద మొదలైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, ఇల్లెందు క్రాస్రోడ్, అంబేద్కర్ సెంటర్ మీదుగా మయూరిసెంటర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాల్లో అభ్యర్థి వినోద్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ, టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, నన్నె ఉదయ్ప్రతాప్, గుర్రం మురళి, వేములపల్లి సీతారాంబాబు, వీరవెల్లి రాజేష్గుప్తా తదితరులు పాల్గొన్నారు.కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ -
తలసేమియా నిర్మూలనకు కృషి చేద్దాం
ఖమ్మంవైద్యవిభాగం: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, పిల్లల కోసం బాధ్యతగా రక్తదాన శిబిరాల నిర్వహణకు అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా బుధవారం ఖమ్మంలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యాన డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి మాట్లాడుతూ తలసేమియా రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తానని చెప్పారు. డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా టీఎస్సీఎస్ వ్యవస్థాపకులు చంద్రకాంత్ అగర్వాల్, రత్నావలీ చేస్తున్న సేవలను వివరించారు. పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, కాంగ్రెస్ నగర ఆద్యక్షుడు జావేద్ పాషా, నాయకులు చావా నారాయణ పాల్గొనగా.. సినీ, టీవీ నటులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ‘సంకల్ప’ సేవలు మరింత విస్తృతం కావాలి పదిహేనేళ్ల క్రితం నలుగురు చిన్నారుల కోసం ప్రారంభించిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిందని ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్, ఆర్టీసీ సీనియర్ వైద్యాధికారి ఏ.వీ.గిరిసింహారావు తెలిపారు. ఖమ్మంలో బుధవారం సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన ప్రపంచ తలసేమియా దినోత్సవంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తలసేమియాతో బాధపడుతున్న వందలాది మంది చిన్నారులకు వైద్యసేవలు అందించడం అభినందనీయమని, ఈ సేవలను ఇంకా విస్తృతం చేయాలని తెలిపారు. సంస్థ బాధ్యులు పి.అనిత మాట్లాడుతూ 250 మంది పిల్లలకు ఉచితంగా మందులు, రక్తం సమకూరుస్తుండగా 11 మంది చిన్నారులకు బోన్ మ్యారో చికిత్స చేయించడంతో ఎనిమిది మంది కోలుకున్నారని వివరించారు. తొలుత చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. డాక్టర్ రమేష్బాబు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి నారాయణరావు మాట్లాడగా.. డిప్యూటీ సూపరింటెంట్ డాక్టర్ కిరణ్కుమార్, వైద్యులు డి.నారాయణమూర్తి, సాయిభార్గవ్, లక్ష్మీదీప, లలిత, రజిత, పి.పావని, అనురాధ, పి.రవిచందర్, పి.ఉదయ్భాస్కర్, పి.వంశీకిరీటి, ఎన్.ఉపేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
చల్లని వేళ కానిచ్చేద్దాం..!
● ఉదయం, సాయంత్రమే ఎన్నికల ప్రచారం ● ప్రజాసమూహాల వద్దకు వెళ్లేలా కార్యాచరణ ● భానుడి భగభగతో జంకుతున్న పార్టీల నేతలు ఖమ్మంమయూరిసెంటర్: లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మా రాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పని లేకుండా గంపగుత్తగా ఒకే చోట వందల సంఖ్యలో ఉండే ఓటర్లను కలిసేందుకే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద యం భానుడి ప్రతాపం ప్రారంభమయ్యే లోగా.. సాయంత్రం వేడి తగ్గాక ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు. మిగతా సమయం పరిస్థితులను బేరీజు వేసుకుంటూ లోపాలను సరిచేసుకోవడంలో నిమగ్నమవుతున్నారు. ఇంటింటి ప్రచారం అంతంతే.. అభ్యర్థులు, పార్టీల నాయకులు ఎక్కువగా ఇన్నాళ్లు రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. స్టార్ క్యాంపెయినర్లు వచ్చినా ఉదయం, సాయంత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అభ్యర్థులు, నాయకులైనా సరే ఎక్కువ మంది ఉండే చోట్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అంతేతప్ప ఇప్పటివరకై తే ఇంటింటి ప్రచారం పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఎండ సమయంలో బయటకు వెళ్లినా ఓటర్లను కలిసే పరిస్థితి లేకపోవడం.. సభలు, కార్నర్ మీటింగ్లు పెట్టినా వేడికి జన సమీకరణ కష్టమవుతోందనే భావనతో ఉద యం, రాత్రి ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండానే.. ఎండలతో పార్టీల కార్యకర్తలు, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఓటర్లను కలిసేందుకు పార్టీల అభ్యర్థులు, నాయకులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. పెద్ద మొత్తంలో జనం ఉండే ప్రాంతాల్లోనే తమ ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాలు, నగరంలో వేకువ జామున మైదానాల్లో వాకర్లను కలిసి ఓట్లు అభ్యర్థించడం కనిపిస్తోంది. గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్తే అక్కడ వందల సంఖ్యలో ఉన్న కూలీలను కలుస్తున్నారు. వీరిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పనిలో పనిగా తమను గెలిపించాలని కోరుతున్నారు. దీంతో పార్టీ అభ్యర్థికి రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం జరిగిపోతోంది. చల్లని వేళ మైదానాలు, పనిప్రదేశాలనే ఎక్కువగా ఎంచుకుని ఓటర్లను కలవడమే కాకుండా, జనసమీకరణ కూడా లేకుండా ప్రచారం ముగించేస్తున్నారు. అంతేకాక శుభ, అశుభకార్యాలు ఎక్కడ జరిగినా.. ఆహ్వానం అందినా, లేకున్నా అభ్యర్థులు, రాజకీయ నాయకులు వెళ్లి తమను తాము పరిచయం చేసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చల్లబడిన వాతావరణం రెండు రోజులుగా గాలిదుమారం, వర్షంతో జిల్లాలో దాదాపు అన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లబడింది. ఇంతలో ప్రచారం ముగిసే సమయం కూడా ముగియవస్తోంది. దీంతో మిగిలిన తక్కువ సమయాన్ని ఇంటింటి ప్రచారానికి వినియోగించుకునేలా పార్టీల నాయకులు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు వచ్చివెళ్లడంతో జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకుల ఆధ్వర్యాన ఇంటింటి ప్రచారంపై ఫోకస్ చేయనున్నారు. -
ఫొటో మార్ఫింగ్.. సంతకం ఫోర్జరీ
● రుణం కోసం పొదుపు సంఘం సాహసం ● పంపకంలో తేడా రావడంతో వెలుగులోకి ఉదంతం ఇల్లెందురూరల్: రుణం చేతికందుతుందన్న తొందరలో ఓ సభ్యురాలి ఫొటో మార్ఫింగ్ చేయడంతోపాటు సంతకం కూడా ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పది మంది సభ్యులున్న శ్రీఆంజనేయం పొదుపు సంఘానికి సుదిమళ్ల ఎస్బీఐ నుంచి ఏడాది కిందట రూ.10 లక్షలు బ్యాంకు లింకేజీ పేరుతో రుణం మంజూరైంది. ఈ సొమ్మును గ్రూపులోని కొందరు సభ్యులు పంచుకుని, క్రమం తప్పకుండా ఏడాదిపాటు అసలుతోపాటు వడ్డీ కలిపి మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట సుదిమళ్ల బ్యాంకు అధికారులు అదే గ్రూపునకు రూ.15 లక్షలు బ్యాంకు లింకేజీ రుణం మంజూరు చేశారు. దీనికోసం డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలని సెర్ప్ అధికారులకు, గ్రూపు సభ్యులకు సూచించారు. ఇదిలా ఉండగా గ్రూపులోని పది మంది సభ్యుల్లో ఒకరు స్థానికంగా ఉండటం లేదు. దీంతో డాక్యుమెంటేషన్ పూర్తి చేయడం గ్రూపు సభ్యులకు ఇబ్బందిగా మారింది. అయితే, స్థానికంగా లేని సభ్యురాలి సోదరి ఉండటం, ఆమె వద్ద తన సోదరి ఫొటో ఉండటంతో తొమ్మిది మంది సభ్యులు దిగిన ఫొటోలో స్థానికంగా లేని సభ్యురాలి ఫొటోను మార్ఫింగ్ చేయించారు. డాక్యుమెంటేషన్లో ఆమె సంతకాన్ని గ్రూపు సభ్యులే ఫోర్జరీ చేసి రుణం మంజూరు కోసం బ్యాంకులో అందజేశారు. డాక్యుమెంటేషన్ పరిశీలించిన బ్యాంకు అధికారులు గతంలో తీసుకున్న రుణంలో మిగిలిపోయిన రూ.7.50 లక్షలను మినహాయించుకొని మిగతా రూ.7.50 లక్షలను పొదుపు సంఘం సభ్యులకు మంజూరు చేశారు. సంబంధిత సొమ్మును సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇదిలా ఉండగా అకౌంట్లలో జమ అయిన సొమ్మును పంచుకోవడంలో సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. గతంలో మంజూరైన రుణంలో రూ.లక్ష తీసుకొని పూర్తిస్థాయిలో చెల్లించకుండానే ఓ సభ్యురాలు ఊరు విడిచి వెళ్లిపోవడంతో రికవరీ ఇబ్బందిగా మారుతుందన్న ఆందోళనతో ఆమెకు తిరిగి రుణం ఇచ్చేందుకు మిగతా సభ్యులు నిరాకరించారు. దీంతో సదరు సభ్యురాలు రుణం మంజూరు కోసం సభ్యులందరూ కలిసి చేసిన ఫొటో మార్ఫింగ్, సంతకం ఫోర్జరీ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆనోట.. ఈనోట విషయం తెలుసుకున్న సుదిమళ్ల ఎస్బీఐ, సెర్ప్ అధికారులు జరిగిన తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సభ్యులందరినీ సమావేశపర్చి చర్చించారు. మంజూరైన నిధులు డ్రా చేయకుండా వారి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. తీసుకున్న రుణం మొత్తం రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు షరతు పెడుతుండగా ఒకే సారి చెల్లించలేమని, తాజాగా మంజూరైన రూ.7.50 లక్షలు మాత్రమే వెంటనే చెల్లిస్తామని పొదుపు సంఘం సభ్యులు బదులిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పొదుపు సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. మార్ఫింగ్ చేసినట్లు గుర్తించాం.. బ్యాంకు లింకేజీ రుణం మంజూరు కోసం పొదుపు సంఘం సభ్యులు ఓ సభ్యురాలి ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించాం. బ్యాంకు అధికారులతో సభ్యుల అకౌంట్లను ఫ్రీజ్ చేయించాం. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. –దుర్గారావు, ఏపీఎం, ఇల్లెందు -
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
● కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్లో భయం ● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అశ్వాపురం: ఆరు గ్యారంటీల పేరుతో మాయమాట లు చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షు డు రేగా కాంతారావు సూచించారు. మహబూబాబా ద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి అశ్వాపురం మండలం మొండికుంటలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ తీరును పార్టీ శ్రేణులు ఇంటింటికీ వివరించాలని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుపై ప్రజలు ఓటు వేసేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలన్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన బస్సు యాత్రతో కాంగ్రెస్ పార్టీలో భయం పుట్టి హామీలపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు సూదిరెడ్డి సులక్షణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, నాయకులు ఎన్నా అశోక్కుమార్, గద్దల రామకృష్ణ, కొల్లు మల్లారెడ్డి, తాటి పూజిత, కంచుగట్ల వీరభద్రం, ఈదర సత్యనారాయణ, సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, చిలకా వెంక టరామయ్య, వీరారెడ్డి, డాక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశానికి బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి గైర్హాజ రు కావడం చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడిన తాను ఆర్థికంగా నష్టపోయినా సరైన గుర్తింపు దక్కలేదనే భావనతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారని తెలిసింది. -
●23 అడుగుల మోటబావే..
రోజురోజుకూ ఎండల తీవ్రతతో భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి. కొంతమంది ఐదారు వందల అడుగుల లోతులో బోర్లు వేసినా.. ఇప్పుడు అవి ఎండిపోతుండడంతో జలం కోసం అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా నగరంలోని మమత రోడ్డులో రామచంద్రనగర్లో గాడిపర్తి లక్ష్మీనారాయణకు చెందిన 60 సంవత్సరాల నాటి మోట బావిలో ఏ మాత్రం జలం తగ్గలేదు. బావి లోతు కేవలం 23 అడుగుల్లోనే ఉంది. నిత్యం ఆ బావి నీటిని నగరంలోని వివిధ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్లి అమ్ముతున్నారు. గత అనేక సంవత్సరాలుగా ట్యాంకర్లకు సరఫరాకు సరిపడా మోట బావి నీరు అందిస్తోందంటే బావిలో ఊట ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్మినారాయణ తల్లిదండ్రులు వ్యవసాయం చేసినప్పుడు ఆ బావిని తవ్వించగా ఇప్పుడు సాగు భూములన్నీ వెంచర్లుగా మారడంతో వ్యవసాయం చేయడం లేదు. ప్రస్తుతం ఆ బావి నీటిని గృహ అవసరాలతో పాటు కూరగాయలు, పండ్లచెట్లకు వినియోగిస్తున్నారు. – ఖమ్మంఅర్బన్ అయినా సమృద్ధిగా లభ్యమవుతున్న నీరు రోజుకు 70 ట్యాంకర్లకు పైగా సరఫరాకు అనువుగా జలధార -
ఎత్తిపోతలు.. ఎదురుచూపులు..
● మారెళ్లపాడు లిఫ్ట్కు శంకుస్థాపన చేసి ఏడాది ● అయినా ముందుకు కదలని పనులు ● పూర్తయితే ‘సీతారామ’ద్వారా 17 వేల ఎకరాల అదనపు ఆయకట్టు అశ్వాపురం: మండలంలో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 17 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులకు మోక్షం కలగడం లేదు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మండలంలో రైతాంగానికి సాగునీరు అందించేందుకు మండల పరిధి బీజీ కొత్తూరు పంప్హౌస్ సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్కు అనుబంధంగా రూ.25 కోట్లతో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఏడాది 2023 జనవరి 29న శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించినా.. ఆరు నెలల వరకు తట్టెడు మట్టి తీయలేదు. ఇప్పుడు ఏడాది గడిచినా ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగడం లేదు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూమి పనులు మాత్రమే చేపట్టారు. అయితే, మే, జూన్ రెండు నెలలు మాత్రమే పనులకు అనుకూలంగా ఉండగా.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాల కారణంగా పనులు చేపట్టే అవకాశముండదు. గత ఏడాది ఖరీఫ్కే ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తామని చెప్పినా ఈ ఏడాది ఖరీఫ్కు కూడా సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. కాగా, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు, చింతలచెరువు, ఎర్రబొక్కలచెరువు, తీగలచెరువులను గోదావరి జలాలతో నింపి మండలంలో 17 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. ఇకనైనా అధికారులు పనులు చేపట్టి వచ్చే ఏడాది ఖరీఫ్ వరకై నా సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. తుమ్మల చెరువు రైతుల చిరకాల కోరిక జిల్లాలోనే పెద్ద చెరువుల్లో ఒకటైన కాకతీయుల కాలం నాటి తుమ్మలచెరువు కింద 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు గోదావరి జలాలు తరలించాలన్నది రైతుల చిరకాల కోరిక. ఈ చెరువు ఆధారంగా వేలాది మంది రైతులు, రైతు కూలీలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, వర్షాధార చెరువు కావడంతో వర్షాలు కురిస్తే చెరువు నిండి రెండు పంటలు పండుతాయి. లేకపోతే రైతులు ఇబ్బంది పడాల్సిందే. ఈ నేపథ్యాన చెరువుకు గోదావరి జలాలు తరలించాలని రైతులు ఏళ్లుగా కోరుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రాజీవ్సాగర్ ప్రాజెక్ట్ ద్వారా తుమ్మలచెరువుకు గోదావరి జలాలు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆపై రీడిజైన్లో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి నీరు అందే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఎమ్మెల్యేలు, మంత్రులకు విన్నవించారు. దీంతో గత ప్రభుత్వం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా తుమ్మలచెరువుకు గోదావరి జలాలు తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా పనుల్లో పురోగతి లేక.. తమ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పనులు చేపడతాం.. దుమ్ముగూడెం ఆనకట్ట సమీపాన హెడ్ రెగ్యులేటర్ 2.6 కి.మీ. వద్ద సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులు జరుగుతున్నాయి. యంత్రాలన్నీ ఆ పనుల వద్దే ఉండడం వల్ల మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల్లో ఆలస్యం జరుగుతోంది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు చేపడుతాం. –వెంకటేశ్వరరావు, ఈఈ, నీటిపారుదల శాఖ -
గాలివాన బీభత్సం
● విరిగిపడిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ● కోత దశలో ఉన్న మామిడి, ఇతర పంటలకు నష్టం ● పలుప్రాంతాల్లో వర్షంతో వాతావరణంలో మార్పు ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి బీభత్సం వెంటాడుతోంది. శనివారం నుంచి ప్రతిరోజు ఈదురుగాలు లు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు, వడగళ్ల వాన కురుస్తున్నాయి. ఈ కారణంగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల ఇళ్ల కప్పులు లేచిపోవడమే కాక విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో ఆస్తి నష్టం జరుగుతోంది. శని, ఆదివారం వీచిన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం జరిగినట్లు అంచనా. ఇంతలోనే మంగళవారం మధ్యాహ్నం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మరో 309స్తంభాలు, తొమ్మిది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు, అకాల వర్షానికి అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉద్యోగులు పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా, తెగిపడిన తీగలను తాకొద్దని, పశువులకు మేతకు వదలొద్దని ఈ సందర్భంగా ఎస్ఈ ఏ.సురేందర్ సూచించారు. ఎక్కడైనా సమస్య ఉంటే 94408 11525 నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మామిడికి తీరని నష్టం జిల్లాలో కోత దశలో ఉన్న మామిడి పంట ఈదురుగాలులకు నేలరాలిపోతోంది. అలాగే, జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు కోత దశలో ఉండగా దెబ్బతింటున్నాయి. ప్రధానంగా మామిడి కాయలు నేల రాలుతుండడంతో నాణ్యత దెబ్బతిని ధర తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకు దాదాపు 250 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఇక కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. వాతావరణంలో మార్పు రానున్న మరో నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో మధ్యాహ్నం వరకు జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమో దు కాగా.. సాయంత్రం తర్వాత వర్షంతో వాతావరణం చల్లబడింది. ఫలితంగా ఉక్కపోతతో సతమతమవుతున్న జనం ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో రాత్రి 8 గంటల సమయానికి వేంసూరు మండలంలో అత్యధికంగా 24.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా.. ఎర్రుపాలెం, సత్తుపల్లి మండలం సదాశివునిపేట, పెనుబల్లి, గౌరారం, మధిర, ఏన్కూరు, కామేపల్లి మండలం లింగాల, పగిడి, బచ్చోడు, ఖమ్మం, చింతకాని, తల్లాడ, వైరా, కల్లూరులో కూడా వర్షపాతం నమోదైంది. -
వాతావరణ ం
జిల్లాలో బుధ వారం ఉష్ణోగ్రత కాస్త తక్కువగానే నమోదవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఎండ పెరిగే అవకాశముంది.పట్టభద్రుల స్థానానికి 14 నామినేషన్లునల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ నుంచి ఈడ శేషగిరిరావు, శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, యువతరం పార్టీ నుంచి బండారు నాగరాజు నామినేషన్లు సమర్పించారు. అలాగే, స్వతంత్రులుగా అయితగోని రాఘవేంద్ర, పిడిశెట్టి రాజు, పూజారి సత్యనారాయణ, మారం వెంకట్రెడ్డి, గుగులోతు బీమా, డాక్టర్ పెంచాల శ్రీనివాస్, కంటే సాయన్న, దైద సోమసుందరం, అల్వాల కనకరాజు నామినేషన్ వేశారు. అభ్యర్థుల నుంచి ములుగు జిల్లా అదనపు కలెక్టర్, పట్టపద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్.మహేందర్జీ నామినేషన్లు స్వీకరించారు. ఓటు వేసిన 8,201 మంది ఖమ్మం సహకారనగర్: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం పార్లమంట్ నియోజకవర్గంలో ఉద్యోగులు, వయోవృద్ధులు, దివ్యాంగులు మంగళవారం నాటికి 8,201 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 5,636మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా, 85ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 2,565మంది ఓటు వేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీ.పీ.గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, మంగళవారం పోస్టల్ బ్యాలెట్లు 2,003మంది, దివ్యాంగులు, వృద్ధులు 2,565మంది ఓటు వేశారని వెల్లడించారు. మూడు రోజుల్లోగా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు ఖమ్మం సహకారనగర్: లోక్సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యాన ఈనెల 10వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన పూర్తికావాలని ఖమ్మం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సూచించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కేంద్రాల్లో ఈనెల 10వ తేదీలోగా పనులు పూర్తిచేయాలని తెలిపారు. జిల్లాలోని 438 పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ. 13.50 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఒక్కో పాఠశాలకు రూ.25వేల నుండి రూ. 50వేల అడ్వా న్స్ ఇవ్వగా.. ఎంపీడీఓలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించామని చెప్పారు. ఈ నిధులతో టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతులు, లైట్లు, ఫ్యాన్ల ఏర్పా టు, నీటి వసతి కల్పన తదితర పనులు చేపట్టాలని సూచించారు. ఎండల దృష్ట్యా టెంట్లు, చల్లటి తాగునీరు సమకూర్చడమేకాక పోలింగ్ రోజున వయోవృద్ధులు, దివ్యాంగుల రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తున్న అంశంపై ప్రచారం చేయాలని కలెక్టర్ తెలి పారు. కాగా, పోస్టల్ బ్యాలెట్లు అందుకున్న ఉద్యోగు ల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, డీఈఓ సోమశేఖరశర్మ, జెడ్పీ సీఈఓ వినోద్, డీపీఓ హరికిషన్, డీఆర్డీఓ సన్యాసయ్య, ఉద్యోగులు అరుణ, సంపత్ పాల్గొన్నారు.రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ -
మరోమారు ప్రధాని మోదీనే...
● బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం ● బస్తర్ మహరాజు, కాకతీయుల వంశ వారసుడు కమల్చంద్రవైరా/ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్రంలో మరో మారు బీజేపీ అధికారంలోకి రావడం.. మోదీ ప్రధాని కావడం ఖాయమని బస్తర్ మహరాజు, కాకతీయుల వంశ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ స్పష్టం చేశారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరఫున వైరాలో నిర్వహించిన ప్రచార ర్యాలీ తో పాటు ఖమ్మంలో నిర్వహించిన కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొనగా.. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎమ్మార్సీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైరాలో నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, అభ్యర్థి వినోద్రావుతో కలిసి పాల్గొన్న కమల్చంద్ర మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి రానున్న నేపథ్యాన ఖమ్మంలోనూ వినోద్రావును గెలిపిస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.12 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి చేసిన ఘనత మోడీదేనని తెలిపారు. అనంతరం అభ్యర్థి వినోద్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మకపోవడంతో ఈ ఎన్నికల్లో మాయ చేసేందుకు రిజర్వేషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనను గెలిపిస్తే పాయాయిల్ బోర్డు సాధించడంతో పాటు సింగరేణి గనుల అనుమతులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పాటుపడతానని తెలిపారు. అనంతరం వైరా శాస్తానగర్లోని అయ్యప్ప స్వామి క్షేత్రంలో పూజలు చేశారు. ఇక ఖమ్మంలో నిర్వహించిన కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో కూడా బీజేపీ అభ్యర్థి వినోద్రావు, బస్తర్ మహరాజు కమల్చంద్ర భంజ్దేవ్ పాల్గొనగా... బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ప్రకటించారు. ఈసమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీతో పాటు వివిధ పార్టీల నాయకులు నున్నా రవికుమార్, శ్యాంరాథోడ్, కోటేశ్వరరావు, రంగా కిరణ్, భద్రయ్య, వెంకటకృష్ణ, హరీశ్చంద్ర, వరలక్ష్మి, కళ్యాణం లక్ష్మీపతి, కొండబాల కరుణాకర్, మల్లెంపాటి అప్పారావు గుత్తా సీతయ్య నున్నా నవీన్, పృథ్వీ, లక్ష్మణ్, చావా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుందా.. సింగిల్ ‘హ్యాండ్’!
ఖమ్మం వన్టౌన్: ‘అందరికీ గుర్తుందా.. చేయి గుర్తు.. సేవాభావం కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించుకుంటే ప్రజ లకు ఉపయోగపడే పనులు చేయడమే కాక అభివృద్ధికి పాటుపడతారని ఆయన వియ్యంకుడు, సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ తెలిపారు. రఘురాంరెడ్డి తరఫున మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం 6గంటలకు మయూరిసెంటర్ వద్ద ప్రారంభమైన రోడ్డుషో పాత ఎల్ఐసీ ఆఫీస్, జెడ్పీ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి, ఇల్లెందు క్రాస్రోడ్డు వరకు కొనసాగింది. మార్గమధ్యలో జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో వెంకటేష్ మాట్లాడుతూ అందరూ ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. ‘ఎనీటైం... ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాంరెడ్డి.. కమాన్ ఖమ్మం’ అంటూ తన సినిమాల్లోని డైలాగ్లతో వెంకటేష్ ఆకట్టుకోగా ఆయనను చూసేందుకు రహదారి పొడవునా జనం బారులు దీరారు. అలాగే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ శ్రేణులు సైతం భారీగా తరలివచ్చాయి అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడగా ఎంపీ రేణుకాచౌదరి, అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డితో పాటు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, మహ్మద్ జావీద్, కమర్తపు మురళి, పాలెపు విజయలక్ష్మి, రాపర్తి శరత్, దొబ్బల సౌజన్య, విజయాబాయి, నాగండ్ల దీపక్చౌదరి, తుంబూరు దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు పెట్టుబడి సాయం
● డిసెంబర్ నుంచి అంచెలంచెలుగా పథకం అమలు ● మార్చి నాటికి ఐదెకరాల వరకు పూర్తి ● ప్రస్తుతం ఆపై భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు ఖమ్మంవ్యవసాయం: యాసంగి సీజన్ ప్రభుత్వ పెట్టుబడి సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. మార్చి నుంచి నిలిచిపోయిన రైతుబంధు నగదు జమ ప్రక్రియ మళ్లీ సోమవారం ప్రారంభమైంది. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున పంటల పెట్టుబడి సా యంగా ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. గడిచిన యాసంగి సీజన్లో గత ప్రభుత్వం సకాలంలో రైతుబంధు పథకాన్ని సకాలంలో అమలు చేయకపోగా, ఆతర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పథకాన్ని రైతుభరోసాగా కొనసాగిస్తామని వెల్లడించింది. ఈ మేరకు జిల్లాలో పథకానికి 3,42,799 మంది అర్హులు కాగా వీరి భూమి ఆధారంగా ప్రభుత్వం రూ. 360.30 కోట్లు గతంలోనే కేటాయించారు. ఆరు నెలలుగా అంచెలంచెలుగా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. గత ప్రభుత్వం అమలు చేసినట్లుగానే యాసంగి పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. డిసెంబర్ 12వ తేదీ నుంచి తక్కువ భూమి కలిగిన రైతులకు ప్రాధాన్యం ఇస్తూ నగదు జమ చేస్తుండగా ఆ నెలలో రెండెకరాల లోపు భూమి ఉన్న రైతులు 1.60 లక్షల మంది ఖాతాల్లో రూ. 62.63 కోట్లు జమ అయ్యాయి. జనవరి, ఫిబ్రవరి ల్లో పథకం నత్తనడకన సాగగా, ఐదెకరాల లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే రైతుభరోసా అమలవుతుందనే ప్రచారం జరిగింది. ఇంతలోనే మార్చిలో ఐదెకరాల భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు మూడు నుంచి ఐదెకరాల భూమి కలిగిన సుమారు 1.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 191.74 కోట్లు జమ చేశారు. అప్పటివరకు మొత్తంగా 3,07,327 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 254.37 కోట్లు జమ కాగా.. అంతకుమించి భూమి కలిగిన రైతులకు రైతుభరోసా జమ కాదనే చర్చ సాగింది. ఇంతలోనే లోక్సభ ఎన్నికలు రావడం.. పెట్టుబడి సాయం అంశాన్ని ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా తీసుకోవడంతో ప్రభుత్వం మళ్లీ రైతు భరోసా కింద నగదు జమ చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు వారికి కూడా... లోక్సభ ఎన్నికలో లేదంటే ప్రతిపక్షాల విమర్శలో కారణం తెలియకున్నా ఐదెకరాల పైబడి భూమి కలిగిన రైతులకు యాసంగి సీజన్ పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఈ కేటగిరీ రైతులు జిల్లాలో 35 వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరికి ఉన్న భూమి ఆధారంగా ప్రభుత్వం రూ.116 కోట్లను జమ చేస్తోంది. ఇదిలా ఉండగా ఎకరాకు రెండు సీజన్లలో కలిపి రూ.15 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయాన ప్రకటించిన నేపథ్యాన వచ్చే ఖరీఫ్ నుంచి అమలయ్యే అవకాశముంది. అయితే, రైతులందరికీ కాకుండా ఐదు లేదా పది ఎకరాల భూమి స్లాబ్గా పథకం వర్తింపచేయనున్నట్లు చర్చ జరుగుతోంది. -
సత్వరన్యాయం అందించడమే లక్ష్యం
ఖమ్మం లీగల్: కక్షిదారులకు సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుంత రాజగోపాల్ వెల్లడించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల పై నమ్మకంతో కక్షిదారులు వస్తారని, వారికి సత్వరన్యాయం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. లోక్దాలత్లను వినియోగించుకుంటే సత్వర న్యాయం అందడ మే కాక సమయం, డబ్బు ఆదా అవుతాయనే అంశంపై అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖరరావు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కల్పనను బార్ కార్యదర్శి చింతనిప్పు వెంకట్ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ, దీప, రజని, బిందుప్రియ, మాధవి, న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, వెంకట్, యుగంధర్, గోపి, శ్రీను, లలిత పాల్గొన్నారు.పెద్దాస్పత్రిలో వైద్యుల ధర్నా ఖమ్మంవైద్యవిభాగం: కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడికి నిరసనగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది మంగళవారం ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు విధులు నిలిపేసి ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిపై దాడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు బి.కిరణ్కుమార్, సదానందం, బాబురత్నాకర్, సరిత, తులసి, రమేష్, రాంప్రసాద్, అశోక్, విజయ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభమైన ఈఏపీ సెట్ ఖమ్మం సహకారనగర్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తు న్న టీఎస్ ఈఏపీ సెట్ మంగళవారం జిల్లాలో ప్రారంభమైంది. ఖమ్మం, సత్తుపల్లిల్లో ఏఆర్పటుచేసిన పరీక్ష కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఖమ్మంలోని కేంద్రాల్లో ఉద యం పరీక్షకు 1,563మందిలో 1,454మంది, మధ్యాహ్నం పరీక్షకు 1,564మందిలో 1,492 మంది హాజరయ్యారు. అలాగే, సత్తుపల్లిలో ఉదయం పరీక్షకు 410మందికి 375మంది, మధ్యాహ్నం పరీక్షకు 411మందిలో 372మంది హాజరయ్యారని అధికార యంత్రాంగం వెల్లడించింది. తాగునీటి సమస్య రావొద్దు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో తాగునీటి సరఫరా పై వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తూనే నాణ్యతపై శ్రద్ధ కనబర్చాలని సూచించారు. తాగునీటి వనరులు లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడమే కాక కొత్త కాలనీలకు లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వాలని తెలిపారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్, జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ హరికిషన్, ఈఈలు రంజిత్, కృష్ణలాల్, పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు. పూడిక మట్టిని సద్వినియోగం చేసుకోండి చెరువుల్లో పూడిక తీస్తున్నందున మట్టిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో సూచించారు. ఉపాధిహామీ కింద చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయని, చిన్న, సన్నకారు రైతులు సంబంధిత ఎంపీడీఓలు, అదనపు ప్రోగ్రాం అధికారులను సంప్రదించి ట్రాక్టర్ రవాణా ఖర్చు భరిస్తే ఉచితంగా పూడిక మట్టిని పొలాలకు తరలించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు 3,820 మంది రైతులు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ మట్టితో భూసా రం, దిగుబడులు పెరగడమే కాక సాగు ఖర్చులు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement