-
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆత్మకూరు ఎస్. మండలంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి మాట్లాడారు. ధాన్యం తడిసిందని అధైర్య పడవద్దన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తుగా తార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ మిల్లులకు పంపాలని, మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా 31,335 మంది రైతుల నుంచి 1,84,485.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు ఇప్పటివరకు రూ. 225 కోట్లు చెల్లించామని వివరించారు. కేంద్రాల్లో కొత్త గోనె సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు అడ్రస్ లేకుండా చేయాలి
కోదాడ: అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి కోదాడ రంగా థియేటర్ సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నారని, గుడులు, దేవుళ్లు అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి కుటుంబాల్లో మాత్రం రెండేసి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రే తనకు రైతుబంధు రాలేదని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తెలియజేస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కేసీఆర్.. రైతుబంధును ఆపలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రతి పక్షనాయకుడిగా హామీల అమలు గురించి అడుగుతుంటే సీఎం హోదాలో రేవంత్ దిగజారి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేంద్రంలో తెలంగాణ చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈరోడ్షోలో బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కటికం సత్తయ్యగౌడ్, సుంకర అజయ్కుమార్, పంకజ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు
సూర్యాపేట: లోక్ సభ ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని కోదాడ, హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎన్నికల రూట్ మొబైల్స్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది, అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లారు. ఎన్నికల సామగ్రి స్ట్రాంగ్ రూంల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించడం నుంచి ఎన్నికలు ముగిసి మళ్లీ స్ట్రాంగ్ రూలకు చేరే వరకు రూట్ మొబైల్స్ సిబ్బంది అప్రమత్తంగా పని చేయాలన్నారు. గ్రామాల్లో పరిస్థితులు గమనిస్తూ ఈవీఎంలకు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి పూర్తి భద్రత కల్పించడంలో రూట్ మొబైల్స్ సిబ్బంది ప్రధానమైన భూమికపోషించాలన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రజితరెడ్డి, చరమందరాజు, ఎలక్షన్ సెల్ సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, రూట్ మొబైల్ సిబ్బంది ఉన్నారు. ఎన్నికల్లో సెంట్రల్ ఆర్ముడ్ సిబ్బంది వినియోగం ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసులతో పాటు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఆయా పోలీస్, సైనిక్ అధికారులతో ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల విధులు, జిల్లా పరిస్థితులను ఆయన వివరించారు. సిబ్బందికి గైడ్గా స్థానిక పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికల సామగ్రికి ఆర్ముడ్ రక్షణ కల్పించడం, ఎస్కార్ట్, స్ట్రాంగ్ రూమ్ గార్డ్స్, పోలింగ్ కేంద్రం వద్ద రక్షణ కల్పించడం ముఖ్యమైన విధులు అని వివరించారు. ఫ ఎస్పీ రాహుల్హెగ్డే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మి బ్యాగులు ఇవ్వొద్దని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎనిమిది ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదులను త్వరగా పరిశీలించి బాధితులకు భరోసా కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. -
లడ్డూ నాణ్యత, సైజులో తేడా రావద్దు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన లడ్డూలు అందజేయాలని దేవస్థానం ఈఓ భాస్కర్రావు అక్కడి బాధ్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆలయ సన్నిధిలో ఉన్న లడ్డూ తయారీ విభాగాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. లడ్డూ తయారీ నాణ్యత, పరిమాణం(సైజు)పై సెక్షన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. లడ్డూ తయారీలో పరిమాణం, నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని, తేడా రావద్దని సూచించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూను తిని రుచి చూశారు. అనంతరం టిక్కెట్ కౌంటర్కు వెళ్లి పరిశీలించారు. -
రవాణా చెక్పోస్టులు ఎత్తివేత!
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంతర్ రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి చెక్పోస్టు సిబ్బంది లారీల డ్రైవర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని అనుమతులను ఆన్లైన్లో ఇస్తున్నందున ఈ చెక్పోస్టులను ఎత్తివేయడమే మంచిది. – కనగాల నాగేశ్వరరావు, కోదాడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఫ ఉమ్మడి జిల్లాలో కోదాడ, వాడపల్లి, సాగర్ వద్ద చెక్పోస్టులు ఫ అవినీతికి ఆనవాళ్లుగా మారాయని ఆరోపణలు ఫ ఎన్నికల అనంతరం ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం●కోదాడ: అవినీతి నిలయాలుగా మారాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ప్రభుత్వం త్వరలో ఎత్తివేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా రవాణాశాఖకు 15 చెక్పోస్టులు ఉండగా వాటిలో మూడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత కోదాడ వద్ద తెలంగాణ– ఏపీ సరిహద్దులో విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై , వాడపల్లి (విష్ణుపురం)వద్ద అద్దంకి– నార్కట్పల్లి రహదారిలో, నాగార్జునసాగర్ వద్ద హైదరాబాద్–సాగర్రోడ్డులో రవాణా శాఖ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్పోస్టు వద్ద 10 నుంచి 15 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల పర్మిట్లను తనిఖీ చేయడం, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించడం వీరి పని. కానీ ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వానహనదారుల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాటిని ఎత్తివేసి, అందులో పని చేస్తున్న 150 మంది సిబ్బందిని అవసరమైన చోట వినియోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ముక్కుపిండి వసూలు వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నా ఈ చెక్పోస్టుల వద్ద సిబ్బంది వాహనదారుల నుంచి ఎంట్రీ ఫీజు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ చెక్ పోస్టుల వద్ద డ్యూటీలు చేయడానికి సిబ్బంది పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక ఓవర్లోడ్ పేరుతో, పశువులను రవాణా చేసే వాహనాల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని చెక్పోస్టుల వద్ద అనధికార సిబ్బందిని నియమించుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతి నెలా వీరు కొంత మందికి నెలవారీ వేతనాలు లక్షల్లో ఇస్తున్నారని తెలిసింది. ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేస్తున్నందున.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత సరిహద్దులో ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులను ప్రభుత్వం ఎత్తివేసి రవాణా శాఖ చెక్పోస్టులను కొనసాగిస్తోంది. రవాణా శాఖకు చెందిన అన్ని అనుమతులు, పర్మిట్లు ఆన్లైన్లో జారీ చేస్తున్నందున ఈ చెక్పోస్టులను ఎత్తివేయాలని గతంలో కేంద్రంకోరినా గత సర్కార్ పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం ఈ చెక్పోస్టులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ చెక్ పోస్టులను ఎత్తివేయనున్నట్లు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement