-
రేకులు, చలువ పందిళ్ల పునరుద్ధరణ
యాదగిరిగుట్ట : జిల్లాలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు యాదాద్రి కొండపై చలువ పందిళ్లు కూలిపోవడం, టెంట్ రేకులు ఎగిరిపోవడంతో వాటిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. క్యూకాంప్లెక్స్ పైభాగంలో రేకులు లేచిపోయిన ప్రాంతంలో కవర్లు కప్పి తాళ్లతో కడుతున్నారు. అలాగే ర్యాంప్, మాఢ వీధుల్లో చలువు పందిళ్లు కూలిపోవడంతో వాటిని తొలగించి కొత్తవి వేస్తున్నారు. ఉత్తర మాఢ వీధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ కదలడంతో తాళ్లతో బిగిస్తున్నారు. ఇక కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో చెత్తాచెదారం చేరడంతో ఆ నీటిని తొలగించి తిరిగి నింపుతున్నారు. -
పాత కలెక్టరేట్లోనే మెడికల్ కాలేజీ
భువనగిరి : జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను పాత కలెక్టరేట్ భవనంలోనే ఏర్పాటు చేయనున్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు తొలుత ఇదే భవనాన్ని ఎంపిక చేశారు. అయితే జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలంటే భవన సముదాయం లక్ష నుంచి 1.30 లక్షల ఎస్ఎఫ్టీల వరకు ఉండాలి. కానీ, భువనగిరి శివారు పగిడిపల్లి గ్రామ పరిధిలో ఉన్న పాత కలెక్టరేట్ భవనం కేవలం 55వేల ఎస్ఎఫ్టీలు మాత్రమే ఉంది. దీంతో జాతీయ వైద్య మండలి అదేశాల మేరకు అధికారులు పాత కలెక్టరేట్కు బదులు అనంతారం పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలు, రాయగిరి పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల, పగిడిపల్లి పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల భవనాలను పరిశీలించారు. కానీ, ఆ భవనాలన్నీ మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనువుగా లేవు. దీంతో, ప్రస్తుతానికి పాత కలెక్టరేట్ భవనంలోనే తాత్కాలికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు పాత కలెక్టరేట్ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే యాజమాన్యంతో మాట్లాడి భవనానికి మరమ్మతులు చేయనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ తెలిపారు.ఫ అందుబాటులో లేని అనువైన భవనాలు ఫ తాత్కాలికంగా పాత కలెక్టరేట్లోనే కళాశాల ఏర్పాటుకు చర్యలు -
కాంగ్రెస్ ఖాతాలోకి అడ్డగూడూరు పీఏసీఎస్
అడ్డగూడూరు : అడ్డగూడూరు పీఏసీఎస్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొప్పుల నిరంజన్రెడ్డి ఎన్నికయ్యారు. అప్పటి చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లుపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బుధవారం ఉదయం 11గంటలకు స్థానిక పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డీసీఓ ప్రవీణ్కుమార్ సమక్షంలో ఓటింగ్ నిర్వహించారు. పీఏసీఎస్లో 13 మంది డైరెక్టర్లుగా ఉండగా వైస్ చైర్మన్ చేడే చంద్రయ్య, 8మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసానికి మద్దతుగా తొమ్మిది మంది డైరెక్టర్లు చేతులు ఎత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు డీసీఓ ప్రకటించారు. జనవరి 9న డీసీఓకు నోటీస్ అందజేత పీఏసీఎస్లో కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్ 6, సీపీఐకి ఒకరు చొప్పున డైరెక్టర్లు ఉన్నారు. చైర్మన్గా బీఆర్ఎస్ డైరెక్టర్ పొన్నాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా సీపీఐ డెరెక్టర్ చెడే చంద్రయ్య ఎన్నికయ్యారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో తొమ్మిది మంది డైరెక్టర్లు చైర్మన్పై అవిశ్వాసం ప్రకటిస్తూ జనవరి 22వ తేదీన డీసీఓకు సంతకాలతో కూడిన నోటీస్ అందజేశారు. మరుసటి రోజునుంచి 9 మంది డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లారు. ఫిబ్రవరి 9న అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా పొన్నాల వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే ఇస్తూ తీర్పు వెలువరించింది. ఇటీవల కోర్టు స్టే ఎత్తివేయడంతో పాటు అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీసీఓ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ నిర్వహించగా.. తొమ్మిది మంది డైరెక్టర్లు మాజరై కొప్పుల నిరంజన్రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో నిరంజన్రెడ్డి చైర్మన్గా ఎన్నికై నట్లు డీసీఓ ప్రకటించారు. హాజరుకాని డైరెక్టర్లు వీరే.. చైర్మన్ పొన్నాల వెంటకటేశ్వర్లతో పాటు ఎల్లంల వీరస్వామి, బాలెంల ఎల్లమ్మ, పోగులు నర్సిరెడ్డి అవిశ్వాస సమావేశానికి గైర్హాజరయ్యారు. ఫ నెగ్గిన అవిశ్వాస తీర్మానం ఫ నూతన చైర్మన్గా కొప్పుల నిరంజన్రెడ్డి -
యాదాద్రిలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా మూర్తులకు అర్చనలు, అభిషేకం చేశారు. ఇ ఆలయ ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ భువనగిరి టౌన్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. 11 సాయంత్రం 5 నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బంద్ ఉంటాయన్నారు. అలాగే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బంద్ పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిథ్య చట్టం చట్టప్రకారం తీసుకోనున్నట్లు హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులపై సమీక్ష భువనగిరిటౌన్ : పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై పోలింగ్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వసతులు ఉండాలని, పోలింగ్ సిబ్బందికి భోజన సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు ఆలేరురూరల్ : మనువాద బీజేపీకి, మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేష్ అన్నారు. ఆలేరులోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గ్యార నరేష్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు తొలగిస్తామమని బీజేపీ, మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కేటాయించకుండా కాంగ్రెస్ తమ సామాజిక వర్గాన్ని అవమానపరిచిందని ఆరోపించారు. మాదిగలు, ఉపకులాలు బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎప్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల శంకర్, నియోజకవర్గ ఇన్చార్జి గ్యాదపాక మల్లేష్, పరశురాములు, సుధాకర్, ఎర్ర విజయ్, సిలువేరు అశోక్, కృష్ణ, సురేందర్, తిరుమలేష్, విజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన ఉష్ణోగ్రతలు
ఫ సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ నమోదు భువనగిరిటౌన్ : పది రోజులుగా నిప్పులు కురిపించిన భానుడు కాస్త శాంతించాడు. బుధవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా రాజాపేటలో 40 డిగ్రీలు, అత్యల్పంగా రామన్నపేటలో 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. యాదగిరిగుట్టలో 39.9, బొమ్మలరామారం మండలం మర్యాల, భూదాన్పోచంపల్లి మండలాల్లో 39.2, భువనగిరిలో 38.9, ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. -
నేడు భువనగిరికి అమిత్షా
సాక్షి, యాదాద్రి : కేంద్ర హోం మంత్రి అమిత్షా గురువారం భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ భ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా రాయగిరిలో ఉదయం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. సభ విజయవంతానికి పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మందితో సభ బహిరంగ సభకు 50 వేల మందిని సమీకరించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనాన్ని తరలించనున్నారు. ఆహుతుల కోసం భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. జనం కూర్చోవడానికి జర్మన్ టెంట్లు వేస్తున్నారు. ఎండతీవ్రత దృష్ట్యా సభకు వచ్చేవారి కోసం మంచినీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దూకుడు పెంచిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మరింత దూకుడు పెంచింది. ప్రచారానికి మరో మూడు రోజులే సమయం మిగిలి ఉండడంతో అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఈనెల మొదటి వారంలో చౌటుప్పల్కు ప్రధాని నరేంద్రమోదీ రావల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయ్యింది. 6వ తేదీన చౌటుప్పల్ పరిధి తంగడపల్లిలో నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధి రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభకు అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ప్రచారానికి గడువు ముగిసేలోపు ఉత్తరాదికి చెందిన ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సర్వశక్తులొడ్డుతున్న బీజేపీ.. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది.ఫ రాయగిరిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్న కేంద్ర హోం మంత్రి ఫ జన సమీకరణకు బీజేపీ సన్నాహాలు పటిష్ట పోలీసు బందోబస్తు కేంద్ర హోంశాఖ మంత్రి రాకను పురస్కరించుకొని పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. పోలీసు బలగాలు సభాస్థలిని తమ అఽధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. -
‘పది’కి సంసిద్ధత
సమయాన్ని వృథా చేయవద్దనే.. వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయవద్దనే ఉద్దేశంతో సంసిద్ధ కార్యక్రమం పేరుతో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున సుమారు గంట పాటు ఆన్లైన్ తరగతులు, పీడీఎఫ్ వర్క్ ఉంటుంది. పాఠశాలల పునఃప్రారంభం వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి సిలబస్కు సంబంధించి ప్రాథమిక సమాచారం, సూత్రాలు, వాక్యరణాలు, గ్రామర్, మ్యాప్ పాయింటింగ్ తదితర అంశాలపై తరగతులు నిర్వహిస్తారు. ఇది విద్యార్థులకు పునశ్చరణగా ఉంటుంది. –నారాయణరెడ్డి, డీఈఓభువనగిరి : తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24నుంచి సంసిద్ధత పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా పదో తరగతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేయిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి 100 శాతం ఫలితాలు లక్ష్యంగా కృషి చేస్తున్నా లక్ష్యానికి చేరువకావడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరంపై జిల్లా విద్యాశాఖ ఇప్పటినుంచే దృష్టా సారించింది. ఇందులో భాగంగానే ముందస్తుగా విద్యార్థులను సిద్ధం చేస్తోంది. టెన్త్ విద్యార్థులు 4,834 మంది జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 712 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత 163, ప్రాథమికోన్నత 68, ప్రాథమిక పాఠశాలలు 481 ఉన్నాయి. వీటితో పాటు కేజీబీవీలు 11, ఆదర్శ 7,బీసీ గురుకుల, మైనార్టీ, రెస్సిడెన్సియల్ స్కూళ్లు సుమారు 10వరకు ఉన్నాయి.ఆయా పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి విద్యార్థులు 4,834 మంది ఉన్నారు. ఆన్లైన్ తరగతులు ఇలా.. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సుమారు 49 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. విద్యార్థులు ఈ సమయాన్ని వృథా చేయకుండా 40 రోజుల పాటు పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలని భావించిన జిల్లా విద్యాశాఖ అధికారులు.. సంసిద్ధత పేరుతో ఆన్లైన్ తరగతులను ప్రారంభించారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో రోజూ రెండు సబ్జెక్టుల చొప్పున సుమారు గంట పాటు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై సబ్జెక్ట్ ఉపాధ్యాయులు వీడియోలను రూపొందించి డీసీఈబీకి పంపితే వాటిని పరిశీలించి ప్రధానోపాధ్యాయుల వాట్సప్కు పంపుతారు. యూట్యూబ్కు లింక్ ఇచ్చి తద్వారా విద్యార్థులు తరగతులు వినేలా ఏర్పాటు చేశారు. అనంతరం పీడీఎఫ్ వర్క్ షీట్ను పంపిణీ చేసి తిరిగి వాటిపై విద్యార్థులు సమాధానాలు పంపేలా చేస్తున్నారు. ప్రధానంగా సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం, ప్రధాన సూత్రాలపై మాత్రమే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. సంసిద్ధత కార్యక్రమం ద్వారా తొమ్మిదో తరగతి పాసైన విద్యార్థులు ముందుగానే పదో తరగతికి ఉపయోగపడే ప్రధాన అంశాలను నేర్చుకోవడానికి దోహదపడుతుంది. తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ఫ టెన్త్ సిలబస్లోని ప్రధాన అంశాలపై ఆన్లైన్ తరగతులు ఫ వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా కార్యాచరణ -
1,266 మంది హోం ఓటింగ్ వినియోగం
భువనగిరి టౌన్ : లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈనెల 3వ తేదీ నుంచి కొనసాగుతున్న హోం ఓటింగ్ బుధవారం ముగిసింది. ఇంటి వద్దనుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం 1,363 మంది దరఖాస్తు చేసుకోగా 1,266 మంది ఓటు వేశారు. 97 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు గడువును మరో రెండు రోజుల పాటు ఎన్నికల సంఘం పొడిగించింది. 8వ తేదీన గడువు ముగిసినప్పటికీ ఓటింగ్ శాతం పెంచే చర్యల్లో భాగంగా 10వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 13,213 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా 10,468 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం 2,403 మంది ఓటు వేశారు. ఇంకా 2,745 ఓట్లు పోల్ కావాల్సి ఉంది. -
రామన్నపేటలో ‘దోస్త్’ సహాయ కేంద్రం
రామన్నపేట : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థుల సౌకర్యార్థం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జిల్లాస్థాయి దోస్త్ సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రహత్ఖానమ్ ప్రారంభించారు. కళాశాలల్లో అడ్మిషన్ కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే సహాయ కేంద్రంలో పరిష్కరించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థుల ఆధార్కు మొబైల్ నంబర్ అనుసంధానమై ఉండాలని, టెన్త్ మార్కుల మెమో, ఇంటర్ సెకండియర్ హాల్టికెట్, కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలు, 3వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు.వివరాలకు యాదగిరి 9948649049, ఎస్కే.హరీఫ్ 9676759155, నవీన్ 9490911910ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలోమాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, దోస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.యాదగిరి, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ బాలనర్సింహ, కమిటీ సభ్యులు కిషన్, డాక్టర్ అనీత పాల్గొన్నారు. -
యాదాద్రి భువనగిరి
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.Iరైతులను ఆదుకోవాలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు కోరారు.- IIIలోగురువారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2024గరిష్టం / కనిష్టంప్రలోభాలకు లోనుకావద్దు ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ హనుమంతు కే.జండగె అన్నారు.- IIలో -
సగం కూడా కొనలే!
సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాలు తెరిచి 40 రోజులు దాటిపోయింది. అయినా 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. తూకం వేసి సిద్ధంగా ఉంచి ధాన్యాన్ని కూడా మిల్లులకు చేర్చే అవకాశాలు కరువయ్యాయి. లారీలు, హమాలీల కొరత, మిల్లర్ల కొర్రీలు, మిల్లుల్లో స్థలాభావం వెరసి కొనుగోళ్ల జాప్యానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లోనే.. జిల్లాలో 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్నది పౌరసరఫరాల శాఖ లక్ష్యం.362 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రైవేట్కు పోను ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. మరోవైపు కాంటా వేసిన ధాన్యం ఎగుమతి, దిగుమతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సేకరించిన వడ్లలో సగానికి పైగా మిల్లులకు తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. కొనుగోలు చేయని ధాన్యంతో పాటు కాంటా వేసిన వడ్లు వర్షాలకు తడుస్తున్నాయి. జాప్యానికి కారణాలు జిల్లాలోని రైస్ మిల్లులన్నీ ధాన్యంతో నిండుగా ఉన్నాయి. గత యాసంగికి చెందిన 1.80 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాలం సీఎంఆర్ సుమారు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా మిల్లుల్లోనే ఉండడంతో స్థలం కొరత ఏర్పడింది. దీంతో ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దీనికి తోడు ఎఫ్సీఐ గోదాముల్లో ఽసీఎంఆర్ ధాన్యం దించుకోవడంలో జాప్యం జరుగుతుండడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది. దీంతో ఇతర జిల్లాల మిల్లులకు ధాన్యం ఎగుమతి చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. అంతేకాకుండా సకాలంలో లారీలు రాకపోవడం వల్ల కాంటా వేసిన ధాన్యం ఎగుమతి చేయలేకపోతున్నారు. మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ఎడతెగని జాప్యం ఫ 4.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం ఫ ఇప్పటి వరకు 1.80 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు ఫ కాంటా వేసిన వడ్లను తరలించడంలోనూ ఆలస్యమే ఫ అకాల వర్షాలకు ఆగమాగం ఫ దయనీయ స్థితిలో రైతులు భూదాన్పోచంపల్లి పరిధిలోని ముక్తాపూర్కు చెందిన రైతు గొలుగొండ శ్రీశైలం రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. 20 రోజుల క్రితం పోచంపల్లి పీఏసీఎస్ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు ధాన్యం కాంటా వేయలేదు. కేంద్రంలో సుమారు 100 వరకు వడ్ల రాశులు ఉన్నాయి. లారీల కొరత కారణంగా కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, నాలుగు రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయయని రైతు శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వర్షాలు కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నాడు. గుండాల మండలం మాసాన్పల్లికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ స్థానిక కొనుగోలు కేంద్రానికి 20 రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాడు. 15 రోజుల క్రితమే వడ్లను కాంటా వేశారు. కానీ, లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం మూలుగుతోంది. అకాల వర్షానికి కాంటా వేసిన ధాన్యం పూర్తిగా తడిసింది. లారీలను రప్పించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతు కోరుతున్నాడు. రోడ్డెక్కిన రైతులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురం, అడ్డగూడూరు మండలం చౌల్లరామారం రైతులు రోడ్డెక్కారు. చౌల్లరామారంలో రోడ్డుపై వడ్డు పోసి నిరసన తెలిపారు. ఆస్తి, పంట నష్టం ఇలా.. అకాల వర్షానికి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో పాటు ఉద్యాన తోటలు దెబ్బతిన్నాయి. ఆత్మూరు(ఎం) మండలంలోని పోసానికుంటతో పాటు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు దూదివెంకటపురం – సోమారం గ్రామాల మధ్య చెట్లు నేలకూలాయి. బొమ్మలరామారం మండలంలో సుమారు 50 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. గుండాల మండలంలో పలుచోట్ల కాంటా వేసిన ధాన్యం తడిసింది.దీంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. ఆలేరు మండలం శారాజీపేటలో కరెంట్ తీగలు తెగి చెట్లపై పడ్డాయి. కొలనుపాక జైన్ మందిరంలో భారీ వృక్షాలు కూలిపోయాయి. శర్భనాపురంలో సైదాపురం భాస్కర్, సీత కిష్టయ్య ఇంటి కప్పు రేకులు ఎగిరిపోయాయి. భువనగిరి మండలం, బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి ఎర్రబెట్టితండా, ముగ్దంపల్లి, జంపల్లి గ్రామాల్లో సుమారు 15 వేల బస్తాలకు పైగా కాంటవేసిన ధాన్యం తడిసింది. కాంటా వేయని ధాన్యం కూడా తడిసి ముద్దయ్యింది. అలాగే మాదారం, జమీలాపేట, వెంకిర్యాలలో మామిడి కాయలు నేలరాలయి. రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో మామిడి నేలరాలింది. వెల్లంకిలో వనం ఉపేందర్ ఇంటిపై చెట్టు కూలడంతో ఇంటి కప్పు ధ్వంసమైంది. -
12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించొచ్చు
నల్లగొండ: ఓటరు గుర్తింపు కార్డు లేనివారు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి పోలింగ్ బూత్లో చూపించొచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటో ఉన్న బ్యాంక్, పోస్టాఫీస్ పాస్బుక్లు, కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్పీఆర్ కింద జారీచేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ దివ్యాంగ కార్డులలో ఏదో ఒకదానిని గుర్తింపుకార్డులుగా చూపవచ్చని తెలిపారు.ఫ నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన -
యువకుడి ఆత్మహత్య
కొండమల్లేపల్లి : ఉరివేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రంలోని బియావర్ జిల్లా పాట్వా గ్రామానికి చెందిన ప్రజాపతి సోహన్లాల్, కమ్లి దంపతుల 3వ కుమారుడు రాకేశ్(24) రెండు సంవత్సరాలుగా కొండమల్లేపల్లిలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్ మూడు నెలల క్రితం హైదరాబాద్కు వెళ్లి ఈనెల 6న మండల కేంద్రానికి వచ్చాడు. తన పాత యజమాని అయిన సందే కిరణ్కు ఫోన్ చేసి మళ్లీ షాపులో పనిచేస్తానని ఇక్కడే ఉంటానని అడగడంతో తాను అందుబాటులో లేనని కిరణ్ తెలిపాడు. అయితే దుకాణం తాళాలు ఇవ్వాల్సిందిగా రాకేశ్ కోరగా కిరణ్ తన దుకాణం నుంచి తాళాలు తీసుకొమ్మని చెప్పాడు. మరుసటి రోజు తాళం తీయకపోవడంతో అనుమానం వచ్చిన కిరణ్ షాప్ తెరిచి చూడగా రాకేష్ ప్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతుని బాబాయి ప్రకాష్చంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. ఫ మృతుడు రాజస్థాన్ రాష్ట్ర వాసి -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
భువనగిరి క్రైం : రైలు కిందపడి గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని పగిడిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి–పగిడిపల్లి రైల్వేస్టేషన్ మధ్య 238/11–13 మైలురాయి వద్ద ఎగువలైన్లో వెళ్లే వందేభారత్ రైలు కిందపడి సుమారు 35సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వంటిపై లైట్ బ్లూ జీన్స్ ప్యాంట్, పసుపు పచ్చ బ్లూ చెక్స్ షర్టు, మెడలో నల్లదారం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. వివరాలకు 8712568454, 8712658719ను సంపాదించాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిమిర్యాలగూడ అర్బన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్పేట ప్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడనే సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సుమారు 45ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్ 8712670150, 8186865497 నంబర్లకు సంప్రదించాలని కోరారు. విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతిఆత్మకూరు (ఎస్) : విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధిలోని ఏపూరి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరాల లింగయ్య తన ఎద్దులను మేపడానికి పొలంలోకి వదిలాడు. అవి మేతమేసుకుంటూ వెళ్లి అప్పటికే పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లకు తగలడంతో రెండు ఒకేసారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. వాటి విలువ దాదాపు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. -
కార్మికవర్గం ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలి
తుంగతుర్తి : దేశంలో మత ప్రాతిపదికన పాలన సాగించాలని చూస్తున్న బీజేపీకి కార్మిక వర్గం గట్టి బుద్ధిచెప్పాలని, కార్మిక హక్కులకు అండగా నిలిచిన ఎండీ జహంగీర్ను గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శ్రీపార్లమెంట్ ఎన్నికలు– కార్మికుల కర్తవ్యంశ్రీఅనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని, వారికి కనీస వేతనాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పోరాడి సాధించిన 44కార్మిక చట్టాలలో 29చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలను అమలు చేస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చే కుట్ర ఇప్పటి నుంచే చేస్తుందన్నారు. సదస్సులో యల్క సోమన్న, చెరుకు యాకసోమన్న, యాక లక్ష్మి, అనంతరం మల్లయ్య, రాధాకృష్ణ, శ్రీనివాస్, వచ్చే సైదులు, శేఖర్, మన్సూర్, వెంకన్న, సతీష్, పరశురాం, శ్రీను, విజయ్, యాదగిరి, చంద్రకళ, శోభ, ఉమ, అనిత పాల్గొన్నారు. ఫ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు -
పట్టభద్రుల స్థానానికి 14 మంది నామినేషన్
నల్లగొండ: వరంగల్– ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా మంగళవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య, అలియన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ నుంచి ఈడ శేషగిరిరావు, శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్ , యువతరం పార్టీ నుంచి బండారు నాగరాజు నామినేషన్లు వేశారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా అయితగోని రాఘవేంద్ర, పిడిశెట్టి రాజు, పూజారి సత్యనారాయణ, మారం వెంకట్ రెడ్డి, గుగులోతు బీమా, డాక్టర్ పెంచాల శ్రీనివాస్, కంటే సాయన్న, దైద సోమసుందరం, అల్వాల కనకరాజు నామినేషన్ వేశారు. ములుగు జిల్లా అదనపు కలెక్టర్, వరంగల్– ఖమ్మం– నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్.మహేందర్జి నామినేషన్లు స్వీకరించారు. -
గంపగుత్తగా రాబట్టాలని..
సాక్షి, యాదాద్రి : పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థులు ఓట్ల వేటను ముమ్మరం చేశారు. ప్రధానంగా గంపగుత్తగా ఓట్లు సాధించే అంశాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా సామాజిక వర్గాలతో పాటు యువజన సంఘాల మద్దతు కూడగట్టేందుకు ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆయా సంఘాలకు హామీలు గుప్పించడంతో పాటు బేరసారాలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులకు సమ్మేళనాల బాధ్యతలు భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. గౌడ, గొల్లకుర్మ, పద్మశాలి, ముదిరాజ్, విశ్వకర్మలు, రజకులు, మున్నూరుకాపు.. ఇలా అన్ని బీసీ వర్గాలతో పాటు దళిత సంఘాలతో మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఈ సభలకు ఆయా సంఘాలకు చెందిన జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఆర్యవైశ్యులు, రెడ్డి కుల సంఘాల నేతలను సైతం ప్రత్యేకంగా కలిసి మద్దుతు కూడగట్టే ప్రయత్నం అభ్యర్థులు చేస్తున్నారు. తమ పార్టీల విధి విధానాలు, గతంలో ప్రజలకు చేసిన పనులు, సేవా కార్యక్రమాలు, గెలుపొందితే చేయాలనుకుంటున్న పనులను వివరిస్తున్నారు. ఇదే అదనుగా కుల సంఘాల నేతలు తమ సమస్యలను అభ్యర్థుల ముందుంచి హామీలు పొందుతున్నారు. బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. కాగా ఆత్మీయ సమ్మేళనాల బాధ్యతలను ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కుల సంఘాలకు ప్రాతినిథ్యం వహించే నాయకులు చూస్తున్నారు. బలనిరూపణలో కుల సంఘాల నేతలు ప్రధాన రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటించిన కుల సంఘాల పెద్దలు.. ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ బలం, బలగం ఏమేరకు ఉందో నిరూపించుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామం నుంచి సమ్మేళనాలకు పెద్ద సంఖ్యలో తమ సామాజికవర్గం వ్యక్తులను తరలిస్తున్నారు. వారికి రవాణా, భోజన వసతులు సంఘం నాయకులే చూస్తున్నారు. ప్రతి పార్టీ రోజూ కనీసం రెండు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. యువజన సంఘాలతోనూ.. యువజన సంఘాలతోనూ ప్రధాన రాజకీయ పా ర్టీలు ప్రత్యేకంగా సమావేశం అవుతూ మద్దతు కోరుతున్నాయి. వారి డిమాండ్లు నెరవేర్చందుకు హామీలిస్తున్నాయి. అంతేకాకుండా ముందుగానే బేరసారాలు కుదర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. సమ్మేళనాలకు అధిక ప్రాధాన్యం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓ వైపు బహిరంగ ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. ప్రచారం ముగింపునకు మరో ఐదు రోజులే సమయం ఉండడంతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కుల సంఘాలతో ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తమ ప్రభుత్వాలు కుల సంఘాలకు చేసిన పనులు, వారితో పార్టీకి ఉన్న అనుబంధం మొదలైన అంశాలను వివరిస్తూ ఓట్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. సామాజికవర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో పార్టీలు ఫ ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు ఫ యువజన సంఘాలతోనూ ప్రత్యేక సమావేశాలుఫ హామీలు గుప్పిస్తున్న అభ్యర్థులు -
ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
సాక్షి, పెద్దపల్లి/సాక్షి, యాదాద్రి, నల్లగొండ టూటౌన్: ‘ఏ అంటే ఏఐఎంఐఎం.. బీ అంటే బీఆర్ఎస్.. సీ అంటే కాంగ్రెస్. ఈ మూడు ఏబీసీ పార్టీలు ముస్లిం లీగ్ ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఇవి తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయి’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రజాకార్ పాలనను సమర్ధించే పార్టీలుగా వాటిని అభివర్ణించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఆ పార్టీలు నిర్వహించవని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని నల్లగొండ పట్టణంలో నిర్వహించిన జన సభల్లో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని నడ్డా దుయ్యబట్టారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలోంచి 4% కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవి దక్కేలా చూస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తొలగించబోమనే విషయాన్ని లిఖితరూపంలో ఇచ్చే దమ్ముందా..? అని ప్రధాని మోదీ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ను ప్రశ్నిస్తే.. ఇప్పటివరకు రాహుల్ స్పందించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, మతం పేరిట ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. శ్రీరాముని వ్యతిరేకి కాంగ్రెస్.. శ్రీరాముడు, సనాతన ధర్మం, దేశాన్ని వ్యతిరేకించేది కాంగ్రెస్ పార్టీ అని నడ్డా ఆరోపించారు. సనా తన ధర్మం గురించి కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే ఎన్ని విమర్శలు చేసినా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ స్పందించలేదన్నారు. దేశాన్ని ముక్కలు చేస్తామన్న వారికి రాహుల్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపితే అందుకు ఆధారాలు అడిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అలాంటి వారికి అధికారమిస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట కేసీఆర్ పేదలను మోసగించారని నడ్డా ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేసీఆర్ ఉపయోగించలేదని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కూడా దానిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 5వ ఆర్థిక శక్తిగా భారత్.. గత పదేళ్లలో ప్రధాని మోదీ దేశం విలువను పదింతలు పెంచారని నడ్డా తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో విదేశీ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ మోదీ విధానాలతో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. అందుకే దేశాభివృద్ధికి పాటుపడుతున్న బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని నడ్డా కోరారు. ఆయా సభల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ)తోపాటు సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత, పార్టీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆగని భగభగలు
ఫ మర్యాలలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు భువనగిరిటౌన్ : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం అత్యధికంగా బొమ్మలరామారం మండలం మర్యాలలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. యాదగిరిగుట్ట 44.4, రాజాపేట 44, భువనగిరి 43.1, ఆత్మకూర్(ఎం) 42.7, చౌటుప్పల్ 42.6, బీబీనగర్ 42.3, అడ్డగూడూరు 42.1, మోత్కూరు 42, వలిగొండ 41.9, ఆలేరు మండలంలో 41.6 డిగ్రీల ఎండ కాసింది. ఉదయం 8 గంటలకే మొదలైన ఎండ తీవ్రత సాయంత్రం 5 గంటల వరకూ తగ్గలేదు. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో వాతావరణం చల్లబడి జనాలకు ఉపశమనం లభించింది. సోమవారం మళ్లీ మళ్లీ ఎండతీవ్రత పెరడడం, దీనికి ఉక్కపోత తోడవడంతో అల్లాడిపోయారు. సాయంత్రం వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. -
9న రాయగిరిలో బీజేపీ బహిరంగ సభ
భువనగిరి : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న భువనగిరి మున్సిపాలిటీ పరిధి రాయగిరిలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తెలిపారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్షా హాజరుకానున్నారని పేర్కొన్నారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి సభాస్థలిని ఆయన సందర్శించారు. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ గెలుపును కాంక్షిస్తూ నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలనికోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేష్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్గుప్తా, ఉపాధ్యక్షుడు పట్నం శ్రీనివాస్ పాల్గొన్నారు.ఫ హాజరుకానున్న కేంద్ర మంత్రి అమిత్షా -
భువనగిరి స్థానాన్ని గెలిచితీరాలి
చౌటుప్పల్ : భువనగిరి లోక్సభ స్థానాన్ని గెలుచుకుని తీరాలని, అందుకు పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం తాజా మాజీ సర్పంచ్ మునగాల ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకుసాగాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, ఆరు గ్యారంటీలను వివరించి ఓట్లు రాబట్టాలని కోరారు. అదే విధంగా గుండ్లబావి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు పిశాటి శ్రీకాంత్రెడ్డి తన అనుచరులతో కలసి కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి ప్రభాకర్రెడ్డి, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, నాయకులు కాసర్ల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
ఏవీ రద్దు కావు.. ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు మారుస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏవీ రద్దు కావని, సీఎం రేవంత్రెడ్డి రాజకీయ భవిష్యత్ మాత్రం రద్దవుతుందన్నారు. రాహుల్గాంధీ పరిస్థితి కూడా అదేనని, అందుకే వారికి భయం పట్టుకుందన్నారు. రేవంత్రెడ్డి మాట్లాడితే గాడిదగుడ్డు అంటూ విమర్శలు చేస్తున్నాడని, గాడిదలు గుడ్డు పెట్టవన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. మూడేళ్ల పాటు పదవిలో ఉందామనుకున్న రేవంత్రెడ్డికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరికీ తెలియదని, అతనో డమ్మీ అని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఏం సాధించావని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రూ.9వేల కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. నా తర్వాత ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు ఏం చేశారు, ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
చౌటుప్పల్ : ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) బెన్షాలోమ్ ఆదేశించారు. సోమవారం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. అకాల వర్షాలు పడుతున్నందున రైతులు నష్టపోకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాని సూచించారు. కాంటా వేసిన వడ్లను ఎప్పటికప్పుడు దిగుమతి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ హరికృష్ణ, పీఏసీఎస్ సీఈఓ ఎరుకల రమేష్, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు. 9న యాదగిరిగుట్టకు కేటీఆర్ రాక యాదగిరిగుట్ట : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 9న యాదగిరిగుట్టకు రానున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యాదగిరిగుట్ట పట్టణ ప్రధాన కార్యదర్శి పాపట్ల నరహరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్కు మద్దుతుగా నిర్వహించే బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారని, అనంతరం కార్నర్ మీటింగ్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కేటీఆర్తో పాటు ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేష్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. లడ్డూ నాణ్యత, సైజులో తేడా రావద్దు యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన లడ్డూలు అందజేయాలని దేవస్థానం ఈఓ భాస్కర్రావు అక్కడి బాధ్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆలయ సన్నిధిలో ఉన్న లడ్డూ తయారీ విభాగాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. లడ్డూ తయారీ నాణ్యత, పరిమాణం(సైజు)పై సెక్షన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. లడ్డూ తయారీలో పరిమాణం, నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని, తేడా రావద్దని సూచించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూను తిని రుచి చూశారు. అనంతరం టిక్కెట్ కౌంటర్కు వెళ్లి పరిశీలించారు. పెద్దకందుకూరు రైల్వే గేట్ మూసివేత యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని పెద్దకందుకూరు రైల్వే గేట్ను నేటి నుంచి మూడు రోజుల పాటు మూసివేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గేట్కు మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 35, కిమీ 254/2022 గేట్ను మంగళవారం నుంచి 9వ తేదీ వరకు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. గేట్ గుండా రాకపోకలు సాగించే వివిధ గ్రామాల ప్రజలు, వాహనదారులు గమనించి వేరే మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. శివుడికి అభిషేకం, అర్చనలు యాదగిరిగుట్ట : యాదాద్రి కొండపై ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన తదితర కై ంకర్యాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ప్రధానాలయంలో సంప్రదాయ పూజ లు కొనసాగాయి. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, అర్చన, నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ, తిరు వీధుల్లో ఊరేగించారు. -
హాజీపూర్ బ్రిడి్జ అంతేనా..?
బొమ్మలరామారం : బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని నాయకులు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చడం లేదు. బొమ్మలరామారం మండల పరిధిలోని హాజీపూర్ – మాచన్పల్లి గ్రామాల మధ్య గల షామీర్పేట్ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని సగం గ్రామాల ప్రజలు బొమ్మలరామారం రావాలన్నా, జిల్లాకేంద్రానికి వెళ్లాలన్నా వాగు దాటాల్సి ఉంటుంది. వర్షం పడితే రాకపోకలు సాగవు. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రజల విన్నపం మేరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 2020–21 సంవత్సరంలో రూ.6.32 కోట్లు మంజూరు కాగా.. మూడేళ్ల తరువాత పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారు. శంకుస్థాపన చేసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి వంతెన నిర్మాణానికి మూడు నెలల క్రితం జనవరి 4వ తేదీన రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్థానిక ఎమ్మెలే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలసి శంకుస్థాపన చేశారు.నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే వంతెన పనులు పూర్తై తమ కష్టాలు తీరుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. గుంతలు తవ్వి వదిలేశారు వంతెన నిర్మాణం కోసం వాగులో కొన్నిచోట్ల పుట్టింగ్లు నిర్మించారు. మరికొన్ని చోట్ల పుట్టింగ్ల కోసం గోతులు తీసి వదిలేశారు. బ్రిడ్జి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తీరు వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందన్న విమర్శలున్నాయి. ఫ 2020–21లో రూ.6.31 కోట్లు మంజూరు ఫ మూడు సంవత్సరాల తర్వాత జనవరిలో శంకుస్థాపన ఫ నేటికీ పుట్టింగ్లకే పరిమితం ఫ వర్షాలు కురిస్తే రాకపోకలు బంద్ -
కమలం పార్టీలో జోష్..
చౌటుప్పల్ : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ పరిధి తంగడపల్లిలోని ముస్కు మదుసూధన్రెడ్డి వ్యాయామ కళాశాల క్రీడా ప్రాంగణంలో చౌటుప్పల్ జనసభ పేరిట సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాల్సిన ఆవశ్యకతను వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరును విమర్శిస్తూ జెపీ నడ్డా ప్రసంగిస్తుండగా జనం నుంచి చప్పట్లు మార్మోగాయి. హిందీలో ప్రసంగించినా జనం చక్కగా అర్థం చేసుకొని నడ్డాకు మరింత ఉత్సాహం ఇచ్చారు. కాషాయమయంసభకు జనం భారీగా రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ప్రధాన రహదారులతోపాటు సభా ప్రాంగణం కాషాయమయంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. డీసీపీ రాజేష్చంద్ర సభ ముగిసే వరకు అక్కడే ఉన్నారు. ఏసీపీ పటోళ్ల మదుసూధన్రెడ్డి పర్యవేక్షించారు. జేపీ నడ్డాకు బూర నర్సయ్యగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. కళాకారులు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. అబద్దాలతో పాలన సాగిస్తున్నారు : కాసం కాంగ్రెస ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ పాలన సాగిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశం విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలకు పంగనామాలు పెట్టిందన్నారు. భూ భకాసురుడు, బ్రోకర్ అయిన రేవంత్రెడ్డిని తరిమికొట్టి ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ చాడ సురేష్రెడ్డి, పార్లమెంట్ ప్రభారీ పాపారావు, కన్వీనర్ బందారపు లింగస్వామి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు పాశం భాస్కర్, జశ్వంత్రెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, దోనూరి వీరారెడ్డి, కర్నాటి ధనుంజయ్య, దాసరి మల్లేశం, పోతంశెట్టి రవీందర్, పడమటి జగన్మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, జిల్లా కార్యదర్శులు ఆలె చిరంజీవి, బత్తుల జంగయ్య, అధికార ప్రతినిధి కైరంకొండ అశోక్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ పోలోజు శ్రీధర్బాబు, మున్సిపల్, మండల పార్టీ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్రెడ్డి, చినుకని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.ఫ చౌటుప్పల్ బీజేపీ సభకు భారీగా తరలివచ్చిన శ్రేణులు ఫ ఉత్సాహం నింపిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగం
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
పెళ్లి సీక్రెట్గా ఉంచా.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా
కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement