కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్‌టెల్‌? | Sakshi
Sakshi News home page

కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్‌టెల్‌?

Published Sun, Jan 14 2024 1:15 PM

5G Tariff Charges Will Be Hike For Upcoming Days - Sakshi

ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్​లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌​లిమిటెడ్​ 5జీ డేటా ప్లాన్‌‌‌‌లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్​ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. 

టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్​ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్​లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌‌‌‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్‌​లిమిటెడ్​ డేటా ఆఫర్లతో పాటు  4జీ  ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్‌‌‌‌లను ప్రకటించవచ్చని  జెఫ్రీస్‌ ఒక రీసెర్చ్ ​నోట్‌లో తెలిపింది. ఎయిర్‌‌‌‌టెల్, జియో  5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది.

ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..

తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్‌‌‌‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్​ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్​పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి​ ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం  మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Advertisement
Advertisement