రాజ్యాంగాన్ని మార్చే వారికి బుద్ధి చెప్పాలి | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని మార్చే వారికి బుద్ధి చెప్పాలి

Published Sun, Apr 7 2024 1:40 AM

-

జక్రాన్‌పల్లి: రాజ్యాంగాన్ని మార్చే వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌ పిలుపునిచ్చారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం జక్రాన్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ.. కొందరు మనువాదులు రాజ్యాంగం స్థానంలో మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

యాత్రకు స్వాగతం

నిజామాబాద్‌నాగారం: జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర శనివారం నిజామాబాద్‌ చేరుకున్న సందర్భంగా యాత్ర బృందానికి పులాంగ్‌ చౌరస్తా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రక్షణ యాత్ర బృందానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ వారసులమైన మనమంతా ఏకమై రాజ్యాంగాన్ని రక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం రాజ్యాంగ రక్షణ యాత్ర కామారెడ్డికి బయలుదేరి వెళ్లింది.

Advertisement
Advertisement