హయగ్రీవర్‌ ఆలయంలో 20 సవర్ల నగల చోరీ | Sakshi
Sakshi News home page

హయగ్రీవర్‌ ఆలయంలో 20 సవర్ల నగల చోరీ

Published Tue, Apr 23 2024 8:30 AM

-

అన్నానగర్‌: చైన్నె టీనగర్‌లోని హయగ్రీవర్‌ ఆలయంలో స్వామి విగ్రహానికి ఉన్న 20 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. వివరాలు.. టీనగర్‌లోని విజయరాఘవ రోడ్డులో ప్రసిద్ధి గాంచిన హయగ్రీవర్‌ ఆలయం ఉంది. ఇక్కడికి రోజూ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎన్నికల సందర్భంగా 19వ తేదీన భక్తులు పెద్దగా ఆలయానికి రాలేదు. ఇదే అదనుగా దుండగులు హయగ్రీవర్‌ విగ్రహానికి అలంకరించి ఉన్న 20 సవర్ల బంగారు హారాన్ని తస్కరించారు. ఆలయ ట్రస్టు మేనేజర్‌ మధుసూధన్‌ భట్‌ ఆలయంలో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇందులో ఇటీవల ఉద్యోగిగా చేరిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దినకర్‌ త్రిపాఠి (25) స్వామి విగ్రహానికి అలంకరించిన బంగారు హారాన్ని దొంగిలించినట్లు తెలిసింది. దీంతో ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు చైన్నెలోని పాండిబజార్‌ పోలీసులు దినకర్‌ త్రిపాఠి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement