-
T20 WC: హార్దిక్ను సెలక్ట్ చేయడం రోహిత్కు ఇష్టం లేదు.. కానీ!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి అతడిని ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రకటించడానికి కారణం ఏంటి?..ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ కెప్టెన్గా ప్రకటించింది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి మరీ పగ్గాలు అతడికి అప్పగించింది.అయితే, పాండ్యా యాజమాన్యం అంచనాలు అందుకోలేకపోయాడు. అంతేకాదు జట్టులో సీనియర్లు అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లతో పాండ్యాకు సఖ్యత లేనట్లు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వర్గాలుగా విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పేలవంగా సాగడం, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలవడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. కెప్టెన్గా విఫలమైన పాండ్యా ఆల్రౌండర్గానూ చెప్పుకోగదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 144.93 స్ట్రైక్రేటుతో 200 పరుగులు స్కోరు చేయడంతో పాటు 10.59 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. అయితే, ఆరంభంలో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో ఫామ్లో లేకున్నా పాండ్యాకు చోటు ఇవ్వడం పట్ల బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమాధానిమిస్తూ.. తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో పాండ్యా మాదిరి బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమర్థవంతమైన పేస్ ఆల్రౌండర్ లేనందు వల్లే అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ ఆసక్తికర కథనం వెలువరించింది. రోహిత్, అగార్కర్లకు ఇష్టం లేకపోయినా.. ఒత్తిడిలో కూరుకుపోయినందు వల్లే పాండ్యాను సెలక్ట్ చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేనందు వల్లే వైస్ కెప్టెన్గా ప్రకటించినట్లు వెల్లడించింది. -
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
టీ20 వరల్డ్కప్-2024కు ప్రకటించిన భారత జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వని సెలక్టర్లు.. నామమాత్రంగా స్టాండ్బైగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. అద్బుత ఫామ్లో రింకూను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టులో అదనపు బౌలర్ అవసరం ఉండటంతోనే రింకూను సెలక్ట్ చేయలేదని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్ట్రా స్పిన్నర్ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. -
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
ఐపీఎల్-2024 ముగియగానే టీ20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్ మొదలుకానుంది. మే 26న క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ షురూ కానుంది. ఇక టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఈవెంట్లో పాల్గొనబోయే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్ట్రైక్రేటు గురించి క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న ఈ రన్మెషీన్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లలో కలిపి 147.49 స్ట్రైక్రేటుతో 500 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, టీ20లలో కోహ్లి స్ట్రైక్రేటు టీమిండియాకు ఇబ్బంది కానుందంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా.. ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు.అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరంఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించాడు. ‘‘కోహ్లి స్ట్రైక్రేటు గురించి మేము చర్చించలేదు. ఐపీఎల్కు, అంతర్జాతీయ క్రికెట్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు అవసరం. మా జట్టు ప్రస్తుతం పూర్తి సమతూకంగా ఉంది. ఐపీఎల్ నుంచి సానుకూల అంశాలను మాత్రమే మనం స్వీకరించాలి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడేటపుడు ఒత్తిడిని జయించే అనుభజ్ఞులైన ఆటగాళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా కోహ్లి కోసం యువ ప్లేయర్లకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ వేశాడు అగార్కర్. రోహిత్ శర్మతో కలిసి గురువారం నాటి మీడియా సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగానే రోహిత్ శర్మ మాత్రం నవ్వేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్ -
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు."రాహుల్ టీ20ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ను ఎంపిక చేయాలనకున్నాం. అందుకే రాహుల్ను పక్కన పెట్టి సంజూ శాంసన్, రిషబ్ పంత్లకు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లగా ఎంపిక చేశాము. వీరిద్దరికి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని" ప్రెస్కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్కాన్ఫరెన్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
టీ20 ప్రపంచకప్-2022 తర్వాత తాను అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. నాడు టెస్టు క్రికెట్కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలోనే పొట్టి ఫార్మాట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నట్లు తెలిపాడు.కాగా వరల్డ్కప్-2022లో భారత జట్టు సెమీస్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన బీసీసీఐ నాటి సెలక్షన్ బోర్డును రద్దు చేసింది. అయితే, చీఫ్ సెలక్టర్గా తిరిగి చేతన్ శర్మనే కొనసాగిస్తూ సభ్యులను మాత్రం మార్చింది. ఈ క్రమంలో చేతన టీమిండియాపై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడగా.. అతడిని తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ను నియమించింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి దాదాపు ఏడాది కాలం పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై చర్చ నడిచింది. టీ20 ప్రపంచకప్-2024లో వీరిద్దరు ఆడతారా లేదా అనే సందేహాల నడుమ అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలో రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది కూడా. అదే విధంగా హిట్మ్యాన్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి గురువారం మీడియా ముందుకు వచ్చిన రోహిత్ శర్మ టీ20లలో తన గైర్హాజరీ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ‘‘టీ20 ప్రపంచకప్ జరుగుతుందన్న సమయంలో మేము చాలా వరకు అంతర్జాతీయ మ్యాచ్లు మిస్సయ్యాం.టెస్టు ఫార్మాట్లో మ్యాచ్లను మిస్ చేసుకోవాలని ఎవరూ భావించరు. నిజానికి ఈ ఫార్మాట్కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి కూడా. ఈ విషయం గురించి నేను సహచర ఆటగాళ్లు, కోచ్లతో చర్చించాను.ఆ తర్వాత అజిత్ వచ్చాడు. మేము చర్చించిన అంశాల గురించి అప్పుడు అతడికి తెలియదు. ఎప్పుడు ఏ ఫార్మాట్కు సంబంధించి కీలక ఈవెంట్ ఉంటుందో అదే ఫార్మాట్కు ప్రాధాన్యం ఇవ్వాలని భావించాం.తొలుత టీ20 ప్రపంచకప్, తర్వాత వరల్డ్ టెస్టు చాంపియన్షిప్.. అనంతరం 50 ఓవర్ల క్రికెట్లో వరల్డ్కప్.. ఈ క్రమంలోనే చాలా వరకు టీ20లు నేను మిస్సయ్యాను’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 1 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుండగా.. జూన్ 5 టీమిండియా తమ తొలిమ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. -
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్.. అతడిపై వేటు తప్పదా?
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్మెంట్కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫిట్నెస్, వికెట్ కీపర్ ఎంపిక గురించి మేనేజ్మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్ చేస్తే అదనపు పేసర్ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్నెస్ దృష్ట్యా బౌలర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్తో పాటు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్ స్లాట్లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో జైస్వాల్వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్కప్లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది. -
T20 World Cup 2024: ఓ ఆటగాడి కోసం చీఫ్ సెలెక్టర్కు రెకమండ్ చేసిన రైనా
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఓ ఆటగాడిగా కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు రెకమండ్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో భీకర ఫామ్లో ఉన్న శివమ్ దూబేను టీ20 వరల్డ్కప్ 2024కు ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. శివమ్ దూబే కోసం వరల్డ్కప్ లోడ్ అవుతుంది. అగార్కర్ భాయ్.. దయ చేసి దూబేని సెలెక్ట్ చేయండని రైనా ట్వీట్ ద్వారా అగార్కర్ను కోరాడు.ఓ మాజీ ఆటగాడు ఓ ఆటగాడి కోసం రెకమండ్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. బహుశా పేరున్న ఏ క్రికెటర్ కూడా ఇలా చేసి ఉండడు. అయితే రైనా మాత్రం తన ఇగోను, ఇతర విషయాలను పక్కన పెట్టి భీకర ఫామ్లో ఉన్న శివమ్ దూబేను వరల్డ్కప్ జట్టుకు సెలెక్ట్ చేయాలని చీఫ్ సెలక్టర్ను కోరాడు. ఏప్రిల్ నెలాఖరులోపు వరల్డ్కప్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైనా ప్రతిపాదన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. World Cup loading for Shivam dube ! @imAagarkar bhai select karo please 🇮🇳🙏 https://t.co/b7g0BxHRSp— Suresh Raina🇮🇳 (@ImRaina) April 23, 2024 కాగా, మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన శివమ్ దూబే ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో ఆల్రౌండర్ స్థానానికి దూబే పర్ఫెక్ట్ సూట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఆల్రౌండర్గా చెప్పుకునే హార్దిక్ పాండ్యా చెత్త ప్రదర్శనలతో కాలం వెల్లదీస్తున్న తరుణంలో దూబే భారత క్రికెట్ అభిమానుల పాలిట ఆశాదీపంలా కనిపిస్తున్నాడు.దూబేకు బంతితోనూ సరైన అవకాశాలు లభిస్తే.. వరల్డ్కప్లో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. దూబే బ్యాటింగ్ సామర్థ్యం గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ20 సిరీస్లోనూ దూబే వరుస అర్దశతకాలతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్లో దూబే బ్యాటింగ్ మెరుపులు పతాక స్థాయిలో ఉన్నాయి.ప్రస్తుత సీజన్లో అతను ఇప్పటికే మూడు అర్దసెంచరీలు చేశాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ఇరదీశాడు. ఈ మ్యాచ్లో అతను 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ వల్ల దూబేకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. దూబే ఒకటి రెండు మ్యాచ్ల్లో బంతితో రాణిస్తే వరల్డ్కప్ బెర్త్ దక్కడం ఖాయం. -
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్కాస్ట్లో మైకేల్ వాన్, ఆడం గిల్క్రిస్ట్లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్లో కోహ్లి తను రెగ్యులర్గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: రోహిత్తో ద్రవిడ్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్ను ఫైనల్కు తీసుకువచ్చాడు. కలిసిరాని కాలం కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ విఫలం ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్గా ఉన్నాడా? లేడా? ఆల్రౌండర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పాండ్యా హిట్టింగ్కు తోడు అదనపు సీమర్గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయం అతడే! ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్టింగ్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్కు చోటిచ్చేస్తారా? Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్ -
తెలివి తక్కువ వాళ్ల జోక్యం వద్దు.. కోహ్లి విషయంలో పట్టుబట్టిన రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో విరాట్ కోహ్లికి స్థానం ఉండబోదన్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ ఘాటుగా స్పందించాడు. జట్టు ఎంపిక విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకపోతేనే బాగుంటుందని హితవు పలికాడు. ఎవరేమనుకున్నా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. కోహ్లి వరల్డ్కప్ జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు కీర్తి ఆజాద్ వెల్లడించాడు. కాగా యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో విరాట్ కోహ్లిని పక్కనపెట్టాలని టీమిండియా సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాల మేరకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ మేరకు గత వారం టెలిగ్రాఫ్ కథనం ప్రచురించగా.. బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ఐసీసీ ఈవెంట్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 1983 వరల్డ్కప్ విజేత జట్టులోని సభ్యుడు కీర్తి ఆజాద్ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా తన కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జై షా సెలక్టర్ కాదు కదా! కోహ్లికి టీ20 జట్టులో చోటు ఇవ్వకుండా అతడెందుకు అజిత్ అగార్కర్ను.. మిగతా సెలక్టర్లను కూడా ఇందుకు ఒప్పించమని అడుగుతాడు? జట్టు ఎంపిక కోసం మార్చి 15 వరకు సమయం ఇచ్చారట. సోర్సెస్ చెప్పినవే నిజమనుకుంటే.. కోహ్లి విషయంలో అజిత్ అగార్కర్ మిగతా సెలక్టర్లతో పాటు తనను తాను కూడా కన్విన్స్ చేయలేకపోయాడు. జై షా రోహిత్ శర్మను ఈ విషయం గురించి అడుగగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లి జట్టులో ఉండాల్సిందే అని రోహిత్ స్పష్టం చేశాడు. ఈసారి టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లి కచ్చితంగా ఆడతాడు. జట్టు ఎంపిక ప్రకటన కంటే ముందే అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుంది. జట్టు ఎంపిక ప్రక్రియ విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకూడదు’’ అని కీర్తి ఆజాద్ పేర్కొన్నాడు. కాగా జూన్లో వెస్టిండీస్-అమెరికా వేదికగా ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్-2024లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కుమారుడు అకాయ్ జననం(ఫిబ్రవరి 15) నేపథ్యంలో విరాట్ కోహ్లి లండన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు దూరమైన అతడు.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లి ఐపీఎల్-2024 బరిలో దిగనున్నాడు. గత సీజన్లో ఈ రన్మెషీన్ 14 మ్యాచ్లు ఆడి 639 పరుగులు చేశాడు. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్కప్లో నో ఛాన్స్! Why should Jay Shah, he is not a selector, to give responsibility to Ajit Agarkar to talk to the other selectors and convince them that Virat Kohli is not getting a place in the T20 team. For this, time was given till 15th March. If sources are to be believed, Ajit Agarkar was… pic.twitter.com/FyaJSClOLw — Kirti Azad (@KirtiAzaad) March 17, 2024 -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
BCCI: బీసీసీఐ సెలక్టర్పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల
BCCI Men's Senior Selection Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి మెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీలోని ఓ సభ్యుడిపై వేటు పడింది. అతడి స్థానంలో కొత్త మెంబర్ను నియమించేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లోనే టీమిండియా వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అతడిపై వేటు అయితే, అనేక చర్చల అనంతరం మళ్లీ చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్గా నియమించిన బోర్డు.. సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శివ్ సుందర్ దాస్, ఎస్.శరత్లకు కమిటీలో సభ్యులుగా చోటిచ్చింది. అయితే, ఓ వార్తా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ భారత క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై వేటు వేసింది బీసీసీఐ. చాలాకాలం పాటు చీఫ్ సెలక్టర్ పోస్టు ఖాళీగా ఉన్న తరుణంలో టీమిండియా మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ఆ పదవిని చేపట్టేలా బోర్డు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రస్తుతం అగార్కర్ నాయకత్వంలో సెలక్షన్ కమిటీ పనిచేస్తోంది. త్యాగం చేయాల్సి వస్తోంది అయితే, ఇందులో భాగమైన సలీల్ అంకోలా తన పదవిని త్యాగం చేయాల్సి వస్తోంది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలక్టర్ సహా నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ జోన్ల నుంచి ఒక్కో సభ్యుడు ఉండాలి. ప్రస్తుతం ఉన్న కమిటీలో అగార్కర్, సలీల్ వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. శివ సుందర్ ఈస్ట్, శరత్ సౌత్, సుబ్రతో బెనర్జీ సెంట్రల్ జోన్ నుంచి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అగార్కర్ను కొనసాగించేందుకు నిర్ణయించిన బీసీసీఐ వెస్ట్ నుంచి అదనపు సభ్యుడిగా ఉన్న సలీల్ అంకోలాను తప్పించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొత్త మెంబర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సెలక్షన్ కమిటీ మెంబర్ కావాలంటే అర్హతలు ఏడు టెస్టులు లేదంటే 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి. 10 అంతర్జాతీయ వన్డేలు లేదంటే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. అదే విధంగా ఆట నుంచి రిటైర్ అయ్యి ఐదేళ్లు పూర్తై ఉండాలి. అదే విధంగా.. గత ఐదేళ్లకాలంలో ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా ఉండకూడదు. కాగా బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు జనవరి 25, సాయంత్రం ఆరు లోగా తమ అప్లికేషన్ సమర్పించాలి. -
T20: రోహిత్ ఒక్కడే రీఎంట్రీ.. కోహ్లికి నో ఛాన్స్? అగార్కర్ ఆలోచన?!
అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పునరాగమనం చేస్తారా? లేదంటే ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే అంతర్జాతీయ టీ20లలో వాళ్ల రీఎంట్రీ ఉంటుందా? ఒకవేళ అఫ్గన్తో సిరీస్కు దూరంగా ఉన్నా.. ఐపీఎల్లో తమను తాము నిరూపించుకుని తిరిగి జట్టుతో చేరతారా? టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైన నేపథ్యంలో టీమిండియా సగటు అభిమానులను గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ప్రశ్నలు ఇవి!! పొట్టి ఫార్మాట్లో 2022 వరల్డ్కప్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లి ఇంతవరకు ఒక్క ఇంటర్నేషనల్ టీ20 కూడా ఆడలేదు. హార్దిక్ పాండ్యా పేరు దాదాపుగా ఖరారు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వివిధ సిరీస్లలో టీమిండియా టీ20 కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కెప్టెన్గా పాండ్యా పేరు దాదాపుగా ఖాయమైపోగా.. సూర్య వైస్ కెప్టెన్ పదవిని దక్కించుకోవడం లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సహా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, పీయూశ్ చావ్లా తదితరులు రోహిత్, కోహ్లిలాంటి సీనియర్లు లేకుండా టీ20 ప్రపంచకప్ బరిలో దిగితే జట్టుకు నష్టమేనని వాదిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించగల సత్తా ఇంకా వీరిలో మిగిలే ఉందని.. కాబట్టి విరాహిత్ ద్వయం సిద్ధంగా ఉంటే టీ20లలో కొనసాగించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరో ఒక్కరే రీఎంట్రీ? ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. అఫ్గన్తో సిరీస్కు అందుబాటులో ఉంటామని చెప్పిన రోహిత్- కోహ్లి ఇంకా ఈ విషయంపై స్పష్టతకు రాలేదన్నది దాని సారాంశం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సైతం వీరిద్దరిలో ఎవరో ఒకరినే ఆడిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. జట్టు కూర్పు విషయంలో ఎటూ తేల్చుకోకపోవడం వల్లే ఇంకా జట్టును ప్రకటించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగార్కర్ అంతటి సాహసం చేస్తాడా? ఈ క్రమంలో బీసీసీఐ మాజీ సెలక్టర్ పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ జట్టులో రోహిత్, శుబ్మన్ గిల్, విరాట్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తమ టాప్-5 స్థానాలను నిలబెట్టుకుంటే.. లెఫ్టాండర్ను ఎక్కడ ఆడిస్తారు? ఒకవేళ ఎడమ చేతి వాటం బ్యాటర్ కోసం కోహ్లిని తప్పించి.. అతడి స్థానంలో గిల్ను వన్డౌన్లో ఆడించి.. రోహిత్కు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ను ఆడిస్తే... ఎలా ఉంటుంది??.. అయితే, అజిత్ కోహ్లిని డ్రాప్ చేయగల సాహసం చేయగలడా??’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గాయాల కారణంగా హార్దిక్, సూర్య అందుబాటులో లేకుంటే రోహిత్ కెప్టెన్గా తిరిగి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉంటే ఇద్దరూ ఉంటారు.. లేదంటే ఇద్దరూ ఉండరు కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి వస్తే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్గా జితేశ్ శర్మ, ఫినిషర్గా రింకూ సింగ్ మాత్రం తన స్థానాలు నిలబెట్టుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా పూనుకుంటే తప్ప రోహిత్- కోహ్లి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కోహ్లి- రోహిత్లలో తీసుకుంటే ఇద్దరినీ తీసుకుంటారని.. లేదంటే ఇద్దరినీ డ్రాప్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఐపీఎల్-2024 ముగిసిన తర్వాతే వీరిద్దరు టీ20 ప్రపంచకప్లో ఆడతారా లేదా అన్నది తేలుతుందని జోస్యం చెబుతున్నారు. మరోవైపు.. టీమిండియాతో జనవరి 11 నుంచి మొదలుకానున్న టీ20 సిరీస్కు అఫ్గనిస్తాన్ 19 మంది సభ్యులతో జట్టును శనివారం ప్రకటించింది. -
Rohit- Kohli: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం!
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు టీమిండియాకు కేవలం మూడే మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్తో జనవరి 11 నుంచి ఇందుకు సంబంధించిన సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్కప్ ఆడతారా? లేదా? స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్మెషీన్ విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి వారిద్దరితో కూలంకషంగా చర్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అఫ్గనిస్తాన్తో సిరీస్కు వీరు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న విషయం గురించి క్లారిటీ తీసుకోవాలని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా టోర్నీకి ముందు జరుగనున్న ఈ సిరీస్కు జట్టును ప్రకటించే అంశంపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్తోనూ చర్చలు జరిపేందుకు.. అజిత్ అగార్కర్తో పాటు శివ్ సుందర్ దాస్, సలీల్ అంకోలా సౌతాఫ్రికాకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే. అఫ్గన్తో సిరీస్లో కెప్టెన్ ఎవరు? ఈ నేపథ్యంలో ఈ ఏడాది విరాహిత్ ద్వయం వరల్డ్కప్-2024 ఆడతారా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. ఐపీఎల్ రూపంలో పొట్టి ఫార్మాట్లో వీరు ఫామ్లోనే ఉన్న కారణంగా 2024 సీజన్ తర్వాత భారత టీ20 జట్టుతో చేరతారా? లేదంటే అంతకంటే ముందే అఫ్గనిస్తాన్తో సిరీస్కు అందుబాటులోకి వస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీ20 సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. వరల్డ్కప్నకు ఆఖరి సన్నాహకంగా భావిస్తున్న అఫ్గన్తో సిరీస్ నాటికి వీరిద్దరు గాయాల బారి నుంచి కోలుకోకపోతే జట్టును ముందుకు నడిపించేది ఎవరన్న సందేహాల నడుమ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో తాజాగా చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సఫారీ పర్యటనలో టీమిండియా కాగా టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలి టెస్టులో ఓడిపోయిన భారత జట్టు.. బుధవారం నుంచి మొదలుకానున్న రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను డ్రా చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లు ముగిసిన తర్వాతే టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో 25- 30 మంది క్రికెటర్లను ప్రస్తుతం మానిటర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జూన్ 4 నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానుంది. చదవండి: టీమిండియా అభిమానులకు శుభవార్త: హార్దిక్ పాండ్యా వీడియో వైరల్ -
బీసీసీఐ కసరత్తు.. ఆరోజే రోహిత్, కోహ్లి టీ20 భవితవ్యం తేలేది!
టీమిండియా ఈ ఏడాది చివరి విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్కు వెళ్లనుంది. ప్రొటిస్ గడ్డపై డిసెంబరు 10 నుంచి దాదాపు నెల రోజుల పాటు సుదీర్ఘ పర్యటన కొనసాగించనుంది. టీ20 సిరీస్తో మొదలుపెట్టి టెస్టు సిరీస్తో జనవరిలో ఈ టూర్ను ముగించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. వచ్చే వారం ఇందుకు సంబంధించి జట్టు ఎంపికను పూర్తి చేయన్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా సెలక్షన్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్కప్-2023కి సన్నద్ధమయ్యే క్రమంలో గతేడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇకపై వారిద్దరు పొట్టి ఫార్మాట్కు అందుబాటులో ఉంటారో లేదోనన్న విషయంపై అజిత్ అగార్కర్ బృందం తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్-2024కి షెడ్యూల్ ఖరారైన తరుణంలో ‘విరాహిత్’ ద్వయం కొనసాగుతారా లేదోనన్న అంశంపై తేల్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు గనుక వీరిద్దరు అందుబాటులో ఉంటే ప్రపంచకప్ ఆడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇక ఇంటర్నేషనల్ టీ20లలకు 36 ఏళ్ల రోహిత్, 35 ఏళ్ల కోహ్లి వీడ్కోలు పలికినట్లే అర్థమంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు ఇన్సైడ్స్పోర్ట్కు వెల్లడించాయి. కాగా రోహిత్ టీ20లతో పాటు వన్డేలకూ దూరం కానుండగా.. కోహ్లి చాంపియన్స్ ట్రోఫీ-2025 వరకు కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సౌతాఫ్రికా టూర్ సందర్భంగా ఈ ఇద్దరిని టీమిండియా తరఫున టీ20లలో చూస్తామా లేదా అన్నది తేలే ఛాన్స్ ఉంది. చదవండి: సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు.. -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
అందుకే అక్షర్ను తీసుకున్నాం..ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు! మేము క్లియర్గానే ఉన్నాం!
India World Cup 2023 squad: ‘‘జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో కొందరికి నిరాశ కలగడం సహజం. సమతూకం కోసమే శార్దుల్, అక్షర్లను తీసుకున్నాం. గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్లో బలహీన బ్యాటింగ్తో సమస్య ఎదుర్కొన్నాం. 8వ, 9వ స్థానాల్లో ఆడేవారు కూడా కొన్ని పరుగులు చేయడం అవసరం. వారికి ఆ విషయం స్పష్టంగా చెప్పాం కూడా. పాకిస్తాన్తో మ్యాచ్లో హార్దిక్ ఆట చూస్తే అతను ఎంత కీలకమో అర్థమవుతుంది. ఫైనల్తో కలిపితే 11 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. టి20లతో పోలిస్తే వన్డేల్లో కోలుకునేందుకు, వ్యూహాలు రూపొందించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. అందుకే అక్షర్కు చోటు అన్ని రకాలుగా ఈ టీమ్ అత్యుత్తమం అని మేం భావిస్తున్నాం. టీమ్ ప్రకటించేందుకు ముందు ఎంతో చర్చించి, ఎంతో ఆలోచింతాం. ఎంపికతో ఎంతో సంతృప్తిగా ఉన్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టు సమతూకం కోసం ఆల్రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ పేరును చేర్చినట్లు వెల్లడించాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి రోహిత్ మంగళవారం.. వన్డే వరల్డ్కప్-2023 జట్టును ప్రకటించాడు. నాడు రోహిత్ను కాదన్న ధోని ఈ సందర్భంగా టీమ్లో స్థానం దక్కదని వాళ్ల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్న హిట్మ్యాన్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. కాగా 2011 వరల్డ్కప్ సమయంలో రోహిత్ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లు సూచించినప్పటికీ.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పీయూశ్ చావ్లా కోసం అతడిని పక్కన పెట్టాడని ఇటీవలే మాజీ సెలక్టర్ రాజా వెంకట్ పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకే ఆఫ్ స్పిన్నర్ ఆలోచన విరమించుకున్నాం: అగార్కర్ జట్టులో ఇప్పుడు ఎవరికీ ఫిట్నెస్ సమస్యలు లేవు. అందరూ పూర్తిగా కోలుకున్నారు. ఎన్సీఏలో జరిగిన క్యాంప్లో రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు కీపింగ్ కూడా చేశాడు. కాబట్టి అతని గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆఫ్స్పిన్నర్పై చర్చ జరిగింది. అయితే జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థంగా బౌలింగ్ చేయగలరని నమ్ముతున్నాం. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టి ఆఫ్స్పిన్నర్ ఆలోచనను పక్కన పెట్టాం’’ అని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ ఎంపికలను సమర్థించుకున్నాడు. కాగా 2011 నాటి వరల్డ్కప్ జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అదే విధంగా సచిన్ టెండుల్కర్, సురేశ్ రైనా రూపంలో మంచి ఆప్షన్లు ఉండేవి. ఇక 2019 నాటికి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఆఫ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈసారి మాత్రం ఉపఖండ పిచ్పై ఆఫ్ స్పిన్నర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుండటంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్ -
WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
India Playing XI- KL Rahul vs Ishan Kishan: ప్రపంచకప్-2023 టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్.. ఇద్దరికీ చోటు దక్కింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆసియా కప్ వన్డే ఈవెంట్తో జట్టులోకి పునరాగమనం చేశాడు కేఎల్. జాతీయ క్రికెట్ అకాడమీలో నెలలపాలు పునరావాసం పొంది రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. కేఎల్ రాహులా? లేదంటే ఇషాన్? అయితే, గాయం వెంటాడటంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఈ కర్ణాటక బ్యాటర్ సూపర్-4 మ్యాచ్తో మైదానంలో దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే.. సదరు మ్యాచ్లో తుదిజట్టులో కేఎల్ రాహుల్కు చోటిస్తే ఇషాన్ పరిస్థితి ఏమిటన్న చర్చలు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్ రాహుల్ కోసం... పాకిస్తాన్తో మ్యాచ్లో అర్ధ శతకంతో మెరిసిన ఇషాన్ను పక్కనపెడితే అంతకంటే మూర్ఖత్వం ఉండదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్కప్ జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇలాంటి తలనొప్పి మంచిదే కదా! ఇందుకు స్పందనగా.. ‘‘ఇలాంటి తలనొప్పి మంచిదే? కాదంటారా? ఇషాన్ గత మ్యాచ్లో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సాధారణంగా అతడు ఓపెనర్గా వస్తాడు. అలాంటిది మిడిలార్డర్లో గొప్పగా రాణించాడు. కాబట్టి కేఎల్ జట్టులో ఉంటే ఇద్దరిలో ఎవరిని ఆడించాలన్న తలనొప్పి తప్పదు. ఇషాన్ కిషన్ ఇద్దరూ ఉన్నా.. వన్డే క్రికెట్లో కేఎల్ రికార్డు అద్భుతమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు వచ్చాడంటే ఇలాంటి సందిగ్దం ఉండటం సహజం. అయినా.. ఇద్దరు ఉన్నారే అని బాధపడే బదులు మన ముందు రెండు మంచి ఆప్షన్లు ఉన్నాయని సంతోషించవచ్చు కదా!’’ అని అజిత్ అగార్కర్ బదులిచ్చాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ఆటగాళ్ల ఫిట్నెస్ను బట్టే తుదిజట్టు కూర్పు ఉంటుందని.. అందులో ఇద్దరు ఒకే రకమైన ప్లేయర్లు ఉండటం అసాధ్యమేమీ కాదని పేర్కొన్నాడు. చదవండి: వన్డే వరల్డ్కప్కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. జట్టు నిండా చిచ్చరపిడుగులు అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్ -
అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్
India's ODI World Cup 2023 Squad: ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై హర్భజన్ సింగ్ స్పందించాడు. మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడం ఏమిటంటూ ‘ఎక్స్’ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం ప్రపంచకప్ జట్టును ప్రకటించాడు. ఈసారి కూడా మొండిచేయి! ఇందులో.. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్రౌండర్లకు చోటు దక్కింది. అయితే, ఆసియా కప్ జట్టులో స్థానం లేనప్పటికీ అనుభవం దృష్ట్యానైనా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఈసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. చహల్ కానీ.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా.. ఇకపై రిస్ట్ స్పిన్నర్లు కుల్-చా ద్వయాన్ని ఒకే జట్టులో చూడలేమన్న మాటలను నిజం చేస్తూ అగార్కర్.. చహల్పై వేటు పడటానికి కారణాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో చైనామన్ స్పిన్నర్కు చోటు దక్కగా.. చహల్కు భంగపాటు తప్పలేదు. ఆశ్చర్యం వేసింది ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ప్రపంచకప్ జట్టులో యజువేంద్ర చహల్కు చోటు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్యూర్ మ్యాచ్ విన్నర్ తను’’ అని ట్వీట్ చేశాడు.ఘీ క్రమంలో నెటిజన్లు సైతం యుజీకి మద్దతు తెలుపుతూ భజ్జీని సమర్థిస్తున్నారు. చహల్తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కూడా అన్యాయం జరిగిందని మరికొంత మంది వాపోతున్నారు. అక్షర్ వద్దు.. ఎందుకంటే! తన వరల్డ్కప్ జట్టులో యజువేంద్ర చహల్కు చోటిచ్చిన హర్భజన్ సింగ్.. అక్షర్ పటేల్ను విస్మరించిన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘రవీంద్ర జడేజా.. అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు. చహల్ బౌలింగ్ శైలి వేరు. అతడు మ్యాచ్ విన్నర్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి గణాంకాలు గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వన్డే, టీ20లలో చహల్ లాంటి ప్రభావంతమైన స్పిన్నర్ లేడనే చెప్పాలి. జడ్డూ ఎలాగో జట్టులో ఉంటాడు కాబట్టి.. అక్షర్ను పక్కనపెట్టి యుజీని తీసుకుంటే బాగుంటుంది అని వరల్డ్కప్ జట్టు ప్రకటనకు ముందు భజ్జీ తన అంచనా తెలియజేశాడు. వన్డే వరల్డ్కప్-2023కి హర్భజన్ ఎంచుకున్న జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్. చదవండి: తిలక్తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్ Surprise not to see @yuzi_chahal in the World Cup squad for Team India. pure Match winner — Harbhajan Turbanator (@harbhajan_singh) September 5, 2023 -
WC 2023: వాళ్లే బెస్ట్.. ఇకపై నేను మీకు జవాబు ఇవ్వను: రోహిత్ శర్మ
India's ODI World Cup 2023 Squad- Rohit Sharma Comments: ‘‘మా దృష్టి మొత్తం ట్రోఫీ గెలవడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇక నుంచైనా బయట వాగే చెత్త గురించి వరల్డ్కప్ ప్రెస్కాన్ఫరెన్స్లో నన్ను ప్రశ్నించరని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇకపై నేను అలాంటి కామెంట్లపై మీకు సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదు. మేము ప్రొఫెషనల్స్. మేమేం చేయాలో నాతో పాటు మా ఆటగాళ్లకు కూడా తెలుసు’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. దయచేసి అనవసర విషయాల గురించి ప్రస్తావించవద్దని విజ్ఞప్తి చేశాడు. అత్యుత్తమైన వాళ్లనే సెలక్ట్ చేసుకుంటాం టీమిండియాకు ఆడుతున్న క్రికెటర్ల నుంచి అత్యుత్తమైన 15 మందిని మాత్రమే తాము ఎంచుకోగలమని నొక్కివక్కాణించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి బీసీసీఐ జట్టును మంగళవారం ప్రకటించింది. ఆసియా కప్-2023 ప్రధాన జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణ మినహా మిగతా వాళ్లనే ఐసీసీ ఈవెంట్కు సెలక్ట్ చేసింది. ఈ క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు కూర్పు గురించి మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల అభిప్రాయాలు.. జట్టుపై విమర్శల నేపథ్యంలో విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందుకు స్పందించిన రోహిత్ ఈ మేరకు కాస్త గట్టిగానే బదులిచ్చాడు. ఆసీస్తో టీమిండియా తొలి మ్యాచ్ అదే విధంగా జట్టు గురించి చెబుతూ... ‘‘అందుబాటులో ఉన్న వాళ్ల నుంచి అత్యుత్తమ టీమ్ను ఎంపిక చేసుకున్నాం. మా బ్యాటింగ్లో డెప్త్ ఉంది. మా దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు. ఇతర బౌలింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి’’ అని రోహిత్ పేర్కొన్నాడు. జట్టుకు మేలు చేసే విధంగానే తమ నిర్ణయాలు ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. కాగా అక్టోబరు 5న చెన్నైలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో ప్రపంచకప్-2023 టోర్నీకి తెరలేవనుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. చదవండి: తిలక్తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్ కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు -
తిలక్తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అగార్కర్
India's ODI World Cup 2023 Squad- Ajit Agarkar Comments: సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఐసీసీ ఈవెంట్ ఆడనున్న 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించాడు. అగార్కర్ ముందుగా చెప్పినట్లుగానే ఆసియా వన్డే కప్ ఆడుతున్న జట్టు నుంచే వరల్డ్కప్ టీమ్ను ఎంపిక చేశారు. ఊహించినట్లుగానే యువ ఆటగాళ్లు పేసర్ ప్రసిద్ కృష్ణ, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సంజూ శాంసన్కు కూడా చోటు దక్కలేదు. ఇక యజువేంద్ర చహల్కు కూడా ఈ వరల్డ్కప్ ఈవెంట్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇదే ఫైనల్.. మార్పుల్లేవు.. కానీ కాగా ఈ ప్రొవిజినల్ జట్టే ఫైనల్ అని, కేవలం గాయాల బెడద ఉంటే తప్ప ఈ జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కుండబద్దలు కొట్టాడు. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఈ 15 మందిని ఎంపిక చేసినట్లు స్పష్టం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానుంది. టైటిల్ వేటలో పది జట్లు ఆతిథ్య టీమిండియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇక 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్లో ధోని సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. నాడు ధోని సిక్సర్తో.. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సిక్సర్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు నాటి కెప్టెన్ ధోని. తద్వారా 28 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరింది. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం కావాలని.. రోహిత్ సేన వరల్డ్కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ODI WC 2023: వన్డే ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన.. వారిద్దరూ ఔట్ కండలు పెంచితే సరిపోదు.. కాస్తైనా: టీమిండియా స్టార్లపై మాజీ బ్యాటర్ ఘాటు విమర్శలు "Dhoni finishes off in style!" 🇮🇳🏆 Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp — ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018 -
Ind Vs Pak: కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? పాక్ క్రికెటర్ రియాక్షన్..
India Vs Pakistan- "Bolne se kuch nahi hota": దాయాదులు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు ఇలాంటి హై వోల్టేజ్ తాజా మ్యాచ్ కి శ్రీలంక లోని పల్లకెలే వేదిక కానుంది గెలుపే లక్ష్యంగా ఆసియా కప్-2023 లో భాగంగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ పోటీ పడనున్నాయి. ఈ వన్డే కప్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా దాయాదిపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పూనకాలు వస్తాయని తెలిసిందే. గతేడాది ఐసీసీ T20 టోర్నీలో ఈ విషయాన్నీ మరోసారి నిరూపించాడు. పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించాడు. కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో .. కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులే అని తేలింది. పాక్ స్టార్ రియాక్షన్ ఇదే! ఇదే విషయాన్నీ కొంతమంది రిపోర్టర్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దగ్గర ప్రస్తావించారు. అజిత్ అగార్కర్ ఆ మాటలు అన్నారా లేదా అన్నది పక్కన పెడితే .. ఇలాంటి కామెంట్లపై మీరేమంటారు అని ప్రశ్నించారు. అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో గెలుపు తర్వాత ప్రెస్ మీట్ సందర్భంగా షాదాబ్ ఈ ప్రశ్నలకు బదులిస్తూ అందరికి ఆట తోనే సమాధానం ఇస్తామని పేర్కొన్నాడు. ప్రగల్బాలు మ్యాచ్ రోజు ఏం జరుగుతుందనే దాని పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనైనా మా జట్టు లో ఎవరైనా.. లేదంటే ప్రత్యర్థి టీం లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే వాస్తవం అందరికి బోధపడుతుంది అని షాదాబ్ ఖాన్ ప్రగల్బాలు పలికాడు. కాగా లెగ్ స్పిన్నర్ అయిన షాదాబ్ ఖాన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటర్గానూ రాణించగలడు. ఇక పాక్ పేస్ దళంలో ఫాస్ట్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షా గత కొంత కాలంగా మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! అతడు మొదలు పెట్టేశాడు -
ఫిట్గా లేనప్పుడు ఎందుకు సెలక్ట్ చేశారు? వేరే వాళ్లని బలిచేసి..
'What is all this? Don't Select Him?: ఆటగాడు పూర్తి ఫిట్గా లేనప్పుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుకని టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు. ఫిట్నెస్ లేని ఆటగాడి కోసం మిగతా వాళ్లను బలి చేయడం సరికాదంటూ మండిపడ్డాడు. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చీఫ్ సెలక్టర్ స్వయంగా చెప్పాడు ఈ క్రమంలో బీసీసీఐ.. సోమవారం 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు సుదీర్ఘకాలం పాటు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మెగా టోర్నీతో పునరాగమనం చేయనున్నట్లు వెల్లడించాడు. ఫిట్గా లేనివాడిని ఎందుకు ఎంపిక చేయడం? అయ్యర్ వంద శాతం ఫిట్నెస్ సాధించాడని.. రాహుల్ను గాయం వెంటాడుతోందని అగార్కర్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, ఈ వన్డే ఈవెంట్లో రెండు లేదంటే మూడో మ్యాచ్ నుంచి అతడు అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్ విన్నర్ శ్రీకాంతాచారి తన యూట్యూబ్ చానెల్ వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. అసలేంటి ఇదంతా? ‘‘కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్గా లేడని వాళ్లే చెప్పారు. ఒకవేళ ఆటగాడికి గాయం తాలుకు నొప్పి ఉంటే అతడిని సెలక్ట్ చేయొద్దు. సెలక్షన్ సమయంలో పూర్తి ఫిట్గా లేడని తెలిసినపుడు అతడిని ఎంపిక చేయొద్దనేది మన పాలసీ కదా! సెలక్షన్ నాటికి ఫిట్గా లేనివాడికి అవకాశం ఇవ్వడం దేనికి? ఒకవేళ వరల్డ్కప్ నాటికి అతడిని సిద్ధం చేయాలనుకుంటే.. అప్పుడే సెలక్ట్ చేయండి. అది వేరే విషయం. అంతేగానే ఆరంభంలో రెండు మ్యాచ్లు ఆడడు కానీ.. అతడిని సెలక్ట్ చేశాం. సంజూ శాంసన్ను ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేశాం అనడం.. అసలేంటి ఇదంతా? ఇలా చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’’ అంటూ బీసీసీఐ సెలక్టర్లను ఏకిపారేశాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ చిక్కా చురకలు అంటించాడు. ఆసియా వన్డే కప్-2023 బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్. చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. -
అందుకే తిలక్ను సెలక్ట్ చేశాం.. వరల్డ్ కప్ టీమ్లో: బీసీసీఐ చీఫ్ సెలక్టర్
Asia Cup 2023 India Squad: ‘‘మేం ఇప్పుడు 18 మందిని ఎంపిక చేశాం. ఈ జాబితా నుంచే వరల్డ్ కప్ టీమ్ను ఎంచుకోవడం ఖాయం. ఎంపికకు ముందు మన జట్టు ఆసియా కప్లో రెండు మ్యాచ్లు ఆడుతుంది. అన్నీ చూశాకే నిర్ణయం తీసుకుంటాం. రాహుల్ రెండో మ్యాచ్ వరకు పూర్తిగా కోలుకోగలడని ఆశిస్తున్నాం. రెండో మణికట్టు స్పిన్నర్ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో యుజువేంద్ర చహల్ను పక్కన పెట్టాం. వెస్టిండీస్లో తిలక్ ఆట మమ్మల్ని ఆకట్టుకుంది. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే వన్డేల్లో తీసుకున్నాం. ఎడంచేతివాటం కూడా అదనపు అర్హత’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా వన్డే కప్-2023 టోర్నీకి జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్ జట్టులోనూ వీళ్ల నుంచే! ఈ ఈవెంట్లో ఆడే ఆటగాళ్ల నుంచే సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2023కి కూడా జట్టును ఎంపిక చేస్తామని అగార్కర్ స్పష్టం చేశాడు. కాగా ఆసియా కప్ నేపథ్యంలో జట్టుకు చాన్నాళ్లుగా దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా వెస్టిండీస్లో సత్తా చాటిన తెలుగు తేజం తిలక్ వర్మను అదృష్టం వరించింది. ఏకంగా ఆసియా కప్ వంటి మెగా టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం అతడి ముంగిట నిలిచింది. తిలక్కు లక్కీ చాన్స్... హైదరాబాద్కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఇటీవల వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టి20 సిరీస్లో 173 పరుగులతో భారత్ తరఫున టాపర్గా నిలిచాడు. అయితే అతని స్కోర్లకంటే క్రీజ్లో అతని ఆత్మవిశ్వాసం, పోరాటతత్వం అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పటి వరకు వన్డేలే ఆడకపోయినా అతనికి అవకాశం దక్కింది. దేశవాళీ వన్డేల్లో తిలక్ రికార్డు చాలా బాగుంది. 25 మ్యాచ్లలో 56.18 సగటుతో అతను 1,236 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉండగా స్ట్రయిక్రేట్ కూడా 101.64 కావడం అతని దూకుడును చూపిస్తోంది. ఆసియా వన్డే కప్-2023కి బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. స్టాండ్ బై: సంజూ శాంసన్ చదవండి: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 11 బంతుల్లోనే
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement