-
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కంచరపాలెం ఘటనలో ఏం జరిగిందో చెప్పిన DCP
-
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
తలకొండపల్లి, కల్వకుర్తి /కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ద్విచ క్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తలకొండపల్లి మండల పరిధి వెల్జాల్ సమీపంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వివరాలి లా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నారాయణ్రెడ్డి వెల్జాల్ నుంచి మిడ్జిల్ వెళ్తుండగా రామాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. బైక్ను తప్పించే క్రమంలో ఎమ్మెల్యే వాహనం రోడ్డు దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్ (25) అక్కడిక్కడే మృతి చెందగా బైరపాక పరశురాం(35) గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం వెల్దండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే కారులోని ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యేతో సహా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. -
రాయి విప్పిన రాక్షస కుట్ర
-
రిమాండ్ రిపోర్ట్..బోండా ఉమా బ్యాచ్ స్కెచ్
-
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్పై హత్యాయత్నానికి సతీష్ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్సింగ్నగర్లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్సింగ్నగర్లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్ను అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించి లాకప్లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
సీఎం జగన్పై దాడి కేసులో విచారణ వేగవంతం: సీపీ
ఎన్టీఆర్,సాక్షి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో విచారణ వేగంగా సాగుతోందని, అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని విజయవాడ పోలీసు కమిషనర్(సీపీ) కాంతిరాణా చెప్పారు. కమిషనర్ ఆఫీసులో సోమవారం(ఏప్రిల్15) సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో 22 కిలోమీటర్ల మేర సీఎం బస్సుయాత్ర కొనసాగింది. యాత్ర సందర్భంగా మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారు. బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట్ల ప్రొటోకాల్ ప్రకారం కరెంట్ నిలిపివేశాం. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట ముందుగానే కరెంట్ నిలిపివేస్తారు. బస్సుయాత్ర డాబా కొట్ల సెంటర్ దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించాం. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ తెలిపారు. ఇదీ చదవండి.. సీఎం జగన్పై దాడి.. నిందితులను పట్టుకుంటే బహుమతి -
సీఎం జగన్ పై దాడి...నిందితుడిని పట్టిస్తే నగదు బహుమతి...
-
సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే కుట్రలు: దేవినేని అవినాష్
-
సీఎం జగన్ దాడిపై గన్నవరం ప్రజల రియాక్షన్..
-
సీఎం జగన్ పై దాడి...జోగి రమేష్ ఆగ్రహం
-
సీఎం జగన్ కు భద్రతా పెంపు
-
సీఎం జగన్ పై కుట్ర చేసి..భయంతో కవరింగ్ చేస్తున్న పిచోళ్లు
-
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక ఆధారాలు లభ్యం..
-
సీఎం జగన్ దాడి పై రాపాక స్ట్రాంగ్ రియాక్షన్...
-
సీఎం జగన్ పై దాడి...వైఎస్ఆర్ సీపీ నేతల ఆగ్రహం
-
సీఎం జగన్ దాడిపై ముద్రగడ స్ట్రాంగ్ రియాక్షన్..
-
సీఎం జగన్ పై దాడి...ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు
-
షార్ప్ షూటర్ పనే..
-
KSR Live Show: సీఎం జగన్ పై దాడి ఎలా జరిగింది...
-
పెళ్లిలో భర్తతో డాన్స్.. కొన్ని గంటల్లోనే మృతి
మక్కువ: పెళ్లైన ఆనందంలో భర్తతో కలిసి డాన్స్ చేసిన నవ వధువు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దబ్బగెడ్డ గ్రామానికి చెందిన భాస్కరరావుతో పార్వతీపురం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన అఖిల(20)కు శుక్రవారం రాత్రి పెళ్లి జరిగింది. మాంగల్యధారణ అనంతరం శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ఊరేగింపు సాగింది. డీజే పాటలకు భర్తతో కలిసి అఖిల డాన్స్ చేసింది. అనంతరం నీరసంగా ఉందంటూ నిద్రలోకి జారుకుంది. తర్వాత బంధువులు వెళ్లి లేపగా, ఎంతకూ లేవకపోవడంతో వెంటనే మక్కువ పీహెచ్సీకు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సాలూరు సీహెచ్సీకు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అఖిలకు తల్లిదండ్రులు లేరు. నానమ్మ, తాతయ్యల వద్దే పెరిగింది. ముందు రోజు ఉపవాసం ఉండటం, పెళ్లి తర్వాత డాన్స్ వేయడం వల్ల డీహైడ్రేషన్కు గురై మృతి చెంది ఉండవచ్చునని గ్రామస్తులు, బంధువులు భావిస్తున్నారు. -
గీతాంజలి ఘటనపై..విజయసాయి రెడ్డి సీరియస్
-
విద్యార్థుల ఆత్మహత్య ఘటన.. భువనగిరి హాస్టల్ ఎదుట ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో ఎస్సీ బాలికల హాస్టల్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. బాలికల బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేశారంటూ బాలికల బంధువులు ఆరోపించారు. హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ కక్కుర్తి.. కళ్లు బైర్లు కమ్మేలా.. -
ఇంట్లో ఉంటున్న కూతురిపై పలుమార్లు తండ్రి లైంగికదాడి
-
రాత్రికి రాత్రే చెరువు మాయం! తెల్లారేసరికి అక్కడ..!
కొన్ని రాష్ట్రాల్లో జరిగే వింత ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి అనిపిస్తుంది. సాధారణంగా దొంగలు చైన్లు, పర్సులు, ఇళ్లు దోచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ బిహార్లో మాత్రం దొంగలు చాలా వెరైటీగా ఉంటారు. అక్కడ ఒక్కసారి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఓ సొరంగం మార్గం ద్వారా బెగుసరాయ్లోని రైల్వే యార్డ్ నుంచి ఏకంగా రైలు ఇంజన్ని ఎత్తుకుపోయారు. ఇలాంటి విచిత్రమైన చోరీలతో బిహార్ తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడూ ఈ చెరువు కారణంగా మరోసారి హాట్టాపిక్గా వార్తల్లో నిలిచింది. ఎక్కడైన చెరువుని ఎత్తుకెళ్లడం గురించి విన్నారా! అదికూడా ఒక్కరాత్రిలో మాయం చేయడం అంటే నమ్ముతారా?. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ దుండగలు ఎవరో గానీ ఎత్తుకెళ్లే దమ్ముంటే ఏదైనా చెయ్చొచ్చు అన్నా రేంజ్లో చేసి చూపించారు!. ఈ విచిత్ర ఘటన బిహార్లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. తెల్లారేసరికి ఆ ప్రదేశంలో నీళ్లు లేకుండా మట్టితో పూడుకుపోయి, అక్కడ ఒక గుడిసె మాత్రమే కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చెరువుని చేపలు పట్టడానికి, వ్యవసాయానికి వినియోగించేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. ఇంతకమునుపు మండల అధికారులు చెరువు పూడిక తీత పనులు మొదలుపెట్టారని తాము అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పనులు నిలిపేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నాది తామకిప్పటికీ అంతుపట్టడం లేదన్నారు. అంతేగాదు రాత్రికి రాత్రే ఎలా చెరవు మాయం చేశారన్నది తమకు తెలియదని ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రదేశంలో రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది తమకు మాత్రం తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అంతేగాదు ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా దుండగుల దృష్టి ఈ చెరువుపై పడిందని అంటున్నారు. అందుకే ఇంతలా పకడ్బంధీగా చీకట్లోనే చెరువు కబ్జా చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, చెరువుని మాయం చేసేలా మట్టిని ఎలా నింపారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది మాములు మిస్టరీ కాదు. ఎదుకంటే? కటిక చీకటిలోనే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు దుండగలు. (చదవండి: New Year 2024: ఇవాళ ఇవి తింటే..లక్కే లక్కు..డబ్బే..డబ్బు..)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మరో రెండ్రోజులు వానలు
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
రోజు రూ.2 కోట్లకుపైగానే..
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అన్నదాతల అగచాట్లు
రోజు రూ.2 కోట్లకుపైగానే..
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement