-
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ఫోర్డ్షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సెలబ్రిటీల ఓటు ఇక్కడే..
బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటు వేయనుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా మరికొంతమంది తారలు ఓటు వేయనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి తమ బాధ్యతను చాటిచెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రజలపై సినీతారల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి తాము సైతం అంటూ ఓటు వేశారు. సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సైతం అటు సినీ ప్రముఖులు, ఇటు ఓటర్లు అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. 👉 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా బంజారాహిల్స్లోని నందినగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 జూనియర్ ఎన్టీఆర్ బంజారాహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో, కల్యాణ్రామ్ ఎమ్మార్వో ఆఫీసు పోలింగ్ బూత్లలో ఓటు వేస్తారు. 👉 సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ, రామ్చరణ్, ఉపాసన, నితిన్లు జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నెంబర్–149లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సెంట్రల్ నర్సరీ బూత్ నెంబర్ 157లో, అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేస్తారు. 👉 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బ్రహ్మజీ, జీవిత, రాజశేఖర్లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో మోహన్బాబు, మంచు విష్ణు, రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వక్సేన్, రాణా, సురేష్బాబు ఓటు వేస్తారు. 👉 అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్లు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–69 బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఓటేస్తారు. 👉 హీరో వెంకటే‹Ù, బ్రహా్మనందం మణికొండ హైస్కూల్లో, రాజమౌళి, రమ షేక్పేట ఇంటర్నేషనల్ హైస్కూల్లో, సుధీర్ బాబు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అల్లరి నరేష్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థలో, తనికెళ్ల భరణి యూసుఫ్గూడ చెక్పోస్టు హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాలులో ఓటు వేస్తారు. -
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
లోక్సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేస్తున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు శాసనసభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని మండలాల్లో నాలుగైదు గ్రామాలకు ఒక కమిటీని, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆయా కమిటీల్లో సీనియర్లతో పాటు జూ నియర్లను సభ్యులుగా చేర్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయిలో అన్ని ఇళ్లను తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ ప్రాధాన్యతలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.నిజాం షుగర్స్, పసుపు బోర్డు తదితర అంశాలు, గల్ఫ్, బీడీ కార్మికులు, రైతు కూలీలు, ఉపాధి కూలీల సమస్యలతో పాటు మండలాలు, గ్రామా ల్లో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు, కార్యకర్తలు హామీలు ఇస్తున్నారు. ము ఖ్యంగా పోలింగ్ బూత్ల పరిధిలో సాధించే ఆధిక్యతను బట్టి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీల అగ్రనాయకులు చెప్పడంతో శ్రే ణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆధిక్యత సాధి స్తే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో శ్రమకోర్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంతో పాటు స్థానికంగా తమ ఉనికినీ చాటుకునేలా మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పని చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే కొన్ని రోజుల తేడాతోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూన్ ఆఖరులో లేదా జూలై ప్రారంభంలో ముగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల కోసం పనిచేయాలని, వారి పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవుల పోటీకి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానికంగా వచ్చే ఓట్లకు సంబంధించి కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ గ్రామాల్లో సాధించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ప్రచార వ్యూహాలను రూపొందించుకుని క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను బూత్ల వారీగా సరిచూసుకుని ప్లస్లు, మైనస్లను బేరీజు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 6న నిజామాబాద్, 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్షోలు ఉండడంతో వాటిని విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.కేంద్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నిజామాబాద్లో వరుసగా రెండోసారి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కార్యకర్తలు చెమటోడుస్తున్నారు. ‘మరోసారి మోదీ సర్కార్’ నినాదంతో పార్టీ శ్రేణులు, అనుబంధ హిందూ సంఘాలు క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారం నిర్వ హిస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామస్థాయిలోనూ భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు, యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు.ఇవి చదవండి: మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్పూర్లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్నగర్లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్రాం మేఘ్వాల్: రాజస్థాన్లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఈనెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
కాంగ్రెస్కు రెండు సీట్లు కూడా రావు: కేసీఆర్
సంగారెడ్డి,సాక్షి: రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే లిల్లిపుట్ గాళ్లకు సురుకు పెట్టినట్లతవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. సంగారెడ్డిలో మంగళవారం(ఏప్రిల్ 16) జరిగిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో వణుకుతున్నాడు. కాంగ్రెస్ పనైపోయింది. ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైంది. సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడు. ముఖ్యమంత్రి ఉంటడా వేరే పార్టీలకు జంపైతడా తెల్వదు. ఇక్కడేమో కాంగ్రెస్కు ఓటేయమంటాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమంటాడు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగేలా.. నన్ను పెంచింది మెతుకు సీమ. మీరిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపిచ్చిన మెతుకుసీమ గడ్డ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కొంత మంది బీఆర్ఎస్కు పార్లమెంట్ సీట్లు ఎందుకని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కావాలి ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు నెరవేర్తాయి. రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు ఉంటుంది. గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు కూడా అధికారం వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకుని ఆవిష్కరించుకున్నాం. విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. పూలమాల పెట్టలే.. ఏర్పాట్లు చేయలే.. సందర్శకులు వెళ్లకుండా గేట్లు బంద్ చేశారు. ఇది కండకావరమా.. అజ్ఞానమా.. మరి సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుకుంటున్నారు. దానికి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టాం కదా.. యాదాద్రి గుడికి ఎందుకు వెళుతున్నారు..ఎమ్మెల్యే క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారు. అవన్నీ మేమే కట్టాం. ఇదే లిల్లీపుట్ గాళ్ల పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్కు ఇవ్వలే. మనం సంగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్లు పెట్టుకున్నం. వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకుంట లేదు. దళితబంధు బంద్ పెడితే నోరు మూస్కోని పడుందామా.. అంబేద్కర్ను అవమానిస్తే చూస్తూ ఊరుకుందామా. వీళ్లకు సురుకు పెట్టాలె. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టాల్సిందే. ఉద్యోగులకు ఎన్నో ఇచ్చాం గుర్తులేదా.. ఆలోచించండి లేదంటే బీఆర్ఎస్కు ఏం కాదు.. మీరే నష్టపోతరు. కరెంటు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. డీజీపీ వార్నింగ్.. పోలీసులు మీకు రాజకీయాలెందుకు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. కరీంనగర్లో సల్వాజీ మాధవరావు అనే బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. డీజీపీకి వార్నింగ్ ఇస్తున్నా.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. మీరేం చేస్తున్నరో అన్నీ రికార్డు చేస్తున్నం. జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’..
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నుంచి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఓటమికి సొంత పార్టీకి చెందిన వారే కొందరు కోవర్టుగా పని చేశారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోగా.. కేటీఆర్, హరీశ్రావు, దయాకర్ రావు కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రమేశ్ రాజీనామా చేశారు. ‘అరూరి’ రాజకీయ ప్రస్థానం.. అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2015 జనవరి 10 నుంచి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2022 జనవరి 26న టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం ఈనెల 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. సుమారు ఆరు రోజులపాటు వరంగల్ పార్లమెంట్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసిన అనంతరం ఏకాభిప్రాయంతో పార్టీ అభ్యర్థిగా అరూరి రమేశ్ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
పార్టీ ఏదైనా.. పోటీలో ఉండటం ఖాయం! : సోయం బాపూరావు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ టికెట్ గొడం నగేశ్కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం. సీనియర్ నేతలను ఢీకొట్టగలరా.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం. మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్డేట్స్ -
వేడెక్కిన రాజకీయం
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై జెండా ఎగురవేసేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద లోక్సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నగరంతోపాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుండటంతో ఓటర్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ప్రస్తుతానికి 37,28,519 ఓటర్లు ఉన్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా, మల్కాజిగిరిలో 4,99,538, కుత్బుల్లాపూర్లో 7,12,756, కూకట్పల్లిలో4,71,878, ఉప్పల్లో 5,33,544, ఎల్బీనగర్లో 6,00,552, కంట్మోనెంట్లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పార్టీలు అప్రమత్తం మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావటంతో ... కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించటంతో వారు ప్రచారంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన బస్తీలు ,పురపాలక సంఘాలు ,డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటల విజయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారాన్ని పూరించగా, శుక్రవారం భారత ప్రధాని మోదీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పేరును అధికారికంగా నేడో ,రేపో ప్రకటించవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో అసమ్మతిపై దృష్టి బీజేపీలో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన కొందరు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పి.హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించటంతో పాటు అభ్యర్థి ఈటల గెలుపు కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీఎస్పీకి రెండు లోక్సభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మోదీ జోష్ షో
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్షో పార్టీ నాయకులు, కేడర్లో జోష్ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్ కాంప్లెక్స్లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు. అబ్కీ బార్ 400 పార్...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. నేడు నాగర్కర్నూల్కు మోదీ కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్టాప్ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్షో నిర్వహించారు. ఆయన వెంట జీప్లో ఓ వైపు కిషన్రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్షోలో పాల్గొన్నారు. అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్షో ముగియగానే మోదీ రాజ్భవన్ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నాగర్కర్నూల్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు. -
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి
-
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, మేడ్చల్ జిల్లా/చార్మినార్: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. మంగళవారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్షా మాట్లాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలన్నారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని, దానిపై జవాబు చెప్పిన తర్వాతనే బీజేపీపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.10వేల కోట్లు సాయం చేసిందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్షా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వారియర్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓటేస్తే అది దుర్వినియోగం అవుతుందని చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, మోదీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సోషల్ మీడియా కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఒవైసీని ఓడిస్తాం: కిషన్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఈసారి హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల తప్పుడు ప్రచారాలను ఖండించాలని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, మహేశ్వర్రెడ్డి, ఎంవీఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అమిత్ షా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. -
పదవుల కోసం పోయెటోళ్లతో పరేషానొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పదవుల కోసం పార్టీలు మారే వారికోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొందరు నేతలు అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారిని చూసి పార్టీని నమ్ముకున్న నేతలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని సూచించారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్.. సోమవారం నందినగర్ నివాసంలో నల్లగొండ, చేవెళ్ల బీఆర్ఎస్ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చెరువు నిండినపుడు కప్పలు చేరినట్లు, అధికారం ఉన్న చోటకు వలసలు సహజమని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం బీఆర్ఎస్కే మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని, అన్ని స్థాయిల్లో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్! చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో ధీటైన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గం పరిధిలోని కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆయన.. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ధీటైన అభ్యర్థి అవుతారని పేర్కొన్నారు. త్వరలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తేదీ నిర్ణయించాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రంజిత్రెడ్డి, గుత్తా అమిత్ దూరం లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి సోమవారం నాటి భేటీకి దూరంగా ఉన్నారు. తాను పోటీకి సిద్ధంగా లేనని కొద్ది రోజుల క్రితం రంజిత్రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరోవైపు మొన్నటివరకు నల్లగొండ, భువనగిరిలో ఏదో ఒకచోట నుంచి టికెట్ ఆశించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డి కూడా కేసీఆర్తో జరిగిన భేటీకి హాజరు కాలేదు. టికెట్ రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన కూడా వారం క్రితమే పార్టీ అధినేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో త్వరలో పార్టీ కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తామని..తెలంగాణ భవన్లో తనను కలిసిన ఆ నియోజకవర్గ నేతలకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. రెండు మూడురోజుల్లో రెండో జాబితా? బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్న కేసీఆర్ రెండు మూడురోజుల్లో రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్)తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ (కరీంనగర్), మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా గాలి అనిల్కుమార్ (జహీరాబాద్), కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ల) పేర్లపై దాదాపుగా స్పష్టత వచ్చింది. బీఎస్పీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాగర్కర్నూలు కేటాయించే అవకాశముంది. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థుల విషయంలో మాత్రం చివరి నిమిషం దాకా వేచి చూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని కలిశారు. గిరిజనులు ఎక్కువగా ఉండే హుజూర్నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జిగా గిరిజన నేతకు బాధ్యతలు అప్పగించాలని కొందరు కోరారు. అయితే కేసీఆర్ ప్రస్తుతానికి జగదీశ్రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్కు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కాగా త్వరలో పార్టీ ఇన్చార్జిని ప్రకటిస్తామని జగదీశ్రెడ్డి చెప్పారు. -
Chennai: డీఎంకేతో కుదిరిన కమల్హాసన్ పార్టీ పొత్తు.. డీల్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్ఎన్ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్ఎన్ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది. చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్తో కమల్హాసన్ భేటీ తర్వాత ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్ఎన్ఎమ్కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన అనంతరం కమల్హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇదీ చదవండి.. హిమాచల్ సంక్షోభం మళ్లీ మొదటికి -
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్నగర్లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
West Bengal: ‘సందేశ్ ఖాలీ’పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని కలకత్తాలో దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో ప్రారంభించిన అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మహిళాశక్తి ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘బెంగాల్లో టీఎంసీ హయాంలో మహిళలు వేధింపులకు గురయ్యారు. చిత్రవధ అనుభవించారు. అధికార పార్టీ టీఎంసీ నేతలే స్వయంగా మహిళలను వేధించారు. టీఎంసీ మహిళలను ఎన్నడూ రక్షించలేదు. సందేశ్ఖాళీ ప్రాంతంలో జరిగిన దానికి ప్రతి ఒక్కరు సిగ్గు పడాలి. కానీ టీఎంసీ మాత్రం ఇవేవీ పట్టించుకోవడవం లేదు. బెంగాల్ ప్రజలను వేధించిన నిందితులను కాపాడాడానికి టీఎంసీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి చివాట్లు తిన్నది. సందేశ్ఖాలీ తుపాను బెంగాల్లో ప్రారంభమైంది. ఈ తుపాను బెంగాల్లోని ప్రతి మూలకు చేరనుంది. టీఎంసీ నేతలకు తమ అధినేత్రిపై పూర్తి నమ్మకం ఉంది కానీ బెంగాల్ మహిళలపై మాత్రం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం లైంగికదాడులకు పాల్పడే వారికి జీవిత ఖైదు శిక్షలు పడేలా చట్టం తీసుకువచ్చింది. మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన వుమెన్ హెల్ప్లైన్ను టీఎంసీ ప్రభుత్వం పనిచేయనివ్వడం లేదు. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేయలేదు’అని మోదీ మండిపడ్డారు. #WATCH | West Bengal: At the women's rally in Barasat, North 24 Parganas district, PM Modi says "TMC govt can never provide protection to women. Whereas, the BJP govt has decided to award life imprisonment for heinous crimes like rape. For easy registration of women's… pic.twitter.com/mHXkqiy30F — ANI (@ANI) March 6, 2024 ‘మోదీ పరివార్’ లాలూ వ్యాఖ్యలకు కౌంటర్ కాదు.. ‘ఒక రాజకీయ నాయకుడు నాకు కుటుంబం లేదని అన్నందుకే నేను దేశమంతా నా కుటుంబమే అని నినాదమిస్తున్నాని కొందరు అనుకుంటున్నారు. వాళ్లకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను నా చిన్నతనంలోనే ఇళ్లు వదిలిపెట్టాను. నా దగ్గర అప్పుడు డబ్బులేదు. అయినా నేను ఏ రోజు ఖాళీ కడుపుతో పడుకోలేదు. ఆ సమయంలో పేద ప్రజలే నన్ను ఆదుకున్నారు. నా జీవితం దేశ ప్రజలకు అంకితం. నా శరీరంలోని ప్రతి అణువణువు, ప్రతి నిమిషం నా దేశ ప్రజల కోసమే. మోదీకి ఎప్పుడైనా సమస్య వస్తే ఈ తల్లులు, సోదరీమణులే రక్షణ కవచంలా నిలిచారు’ అని మోదీ తెలిపారు. ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ బీజేపీపై దీదీ ఫైర్ -
ఎలక్టోరల్ బాండ్లు: మోదీ సర్కారుపై ఖర్గే సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలందించే ఎలక్టోరల్ బాండ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి(ఈసీ) అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చేస్తున్న జాప్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. జాతీయ బ్యాంకును మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా వాడుకుంటోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ టర్ము జూన్ 16తో ముగుస్తుందనగా ఎస్బీఐ జూన్ 30దాకా గడువు కోరడమేంటని ఖర్గే ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధికంగా అక్రమ లావాదేవీలు జరిపింది మోదీ బీజేపీయేనన్నారు. మార్చి 6వ తేదీకల్లా ఈసీకి బాండ్ల వివరాలందించాల్సిన ఎస్బీఐ డెడ్లైన్ను జూన్ 30 దాకా పొడిగించాలని తాజాగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలందించిన 44వేల434 కంపెనీలు, వ్యక్తుల వివరాలను సిద్ధం చేయడానికి 24 గంటల కంటే ఎస్బీఐకి ఎక్కువ సమయం పట్టదని నిపుణులు వాదిస్తుండటం గమనార్హం. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్టీల పేరు మీద విడుదల చేసే ఎలక్టోరల్ బాండ్లను కంపెనీలు, వ్యక్తులు కొనుక్కుంటే రాజకీయ పార్టీల ఖాతాల్లో ఆ నిధులు జమవుతాయి. ఎవరు బాండ్లు కొనుగోలు చేస్తారనేది రహస్యంగా ఉంచుతారు. అయితే ఈ స్కీమ్లో పారదర్శకత లేదని దాఖలైన పిల్ను విచారించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వాటి వివరాలను ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇదీ చదవండి.. లోక్సభ ఎన్నికలపై ఈసీ సంచలన ప్రెస్మీట్ -
కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ..?
కలకత్తా: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం(మార్చ్5) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను రాజీమా చేయనున్నట్లు గంగోపాధ్యాయ్ సోమవారమే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కొందరు న్యాయవాదులు, కక్షిదారులు ఆయనను కోరారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల గంగోపాధ్యాయ ఇచ్చిన కొన్ని తీర్పులు పశ్చిమబెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అయితే రాజీనామా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం జస్టిస్ గంగోపాధ్యాయ్ స్పష్టమైన సమాధానమివ్వలేదు. 2020 జులై30న కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా గంగోపాధ్యాయ్ పదోన్నతి పొందారు. ఇదీ చదవండి.. లోక్సభ ఎన్నికలు.. సీఈసీ ప్రెస్మీట్ -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
BJP: లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..
సాక్షి,ఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ , గుజరాత్, గోవా, చత్తీస్గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. #WATCH | BJP Central Election Committee (CEC) meeting concludes; Union Home Minister Amit Shah and BJP national president JP Nadda leave from the BJP headquarters, in Delhi. pic.twitter.com/xOM8KmrNns — ANI (@ANI) February 29, 2024 తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్నగర్- డీకే అరుణ, నాగర్కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
జూనియర్ కళాశాలలుగా జెడ్పీ పాఠశాలలు
రెచ్చగొట్టారు.. రెచ్చిపోయారు..!
20న ఇల్లెందుకు కేటీఆర్
జీసీసీకి సకాలంలో బిల్లులు
బాలల హక్కులపై దృష్టి పెట్టండి
రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ
నకిలీతో బెంబేలు..
అందరికీ బోనస్ చెల్లించాలి
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
- Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
- కేసీఆర్ను ఢీకొట్టలేక కవితను జైలుకు పంపారు
- యుద్ధం మిగిలే ఉంది: కేసీఆర్
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
Advertisement