-
ప్రధాని రేసులో ఉంటా!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధానిగా పనిచేసే అవకాశం వస్తే వంద శాతం రేసులో ఉంటానని.. అవకాశం వస్తే వదులుకునేంత అమాయకుడిని కాదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను కొనసాగిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత అందరినీ సంప్రదించి.. తనకున్న రాజకీయ సంబంధాలు, శక్తి, తెలివిని రంగరించి ప్రాంతీయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. ఏదో ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టిస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ 12 నుంచి 14 ఎంపీ స్థానాల్లో గెలిచితీరుతుందని చెప్పారు. కాంగ్రెస్ 9 చోట్ల మూడో స్థానంలో ఉందని.. బీజేపీ రెండో స్థానంలో ఉన్నా బీఆర్ఎస్కు చాలా దూరంలో ఉందని పేర్కొన్నారు. 16 రోజుల పాటు నిర్వహించిన ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ముగియడంతో శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు పార్టీని వీడటంతో ఆయన స్థానంలో రాజ్యసభ ఎంపీ కేఆర్.సురేశ్రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్కు లేఖ ఇస్తున్నా. జాతీయ రాజకీయాల్లో మా పార్టీ తరఫున ఆయన కీలక ప్లేయర్గా ఉంటారు. ఈ అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాలని అక్కడి నేతలు కోరుతున్నారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అక్కడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పేరిట పోటీచేసి గెలుస్తాం. హైదరాబాద్ గొంతు కోస్తే సహించరు.. కేంద్ర పాలిత ప్రాంతం పేరిట హైదరాబాద్ గొంతు కోస్తే తెలంగాణ ప్రజలు సహించరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వంటివారు కూడా దేశానికి రెండో రాజధాని కావాలని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పిచ్చివాళ్లకు స్థానమిస్తే హైదరాబాద్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ తెలంగాణ సొంతం.. ఎన్నటికీ వదులుకోబోం. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ బీజేపీలో చేరతాడని కాంగ్రెస్ నేతలే అనుమానిస్తున్నారు. 26 నుంచి 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు రెడీగా ఉన్నామని మాతో అంటున్నారు. కారు షెడ్డుకు వెళ్లిందంటున్న రేవంత్రెడ్డి.. మా ధాటికి రేపు ఎక్కడికి పోతాడో చూద్దాం. పనులు, పైరవీల కోసమే కొందరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రళయ గర్జన చూస్తారు. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు.. ప్రభుత్వంలో వందల మంది అధికారులు ఉంటారు. అందులో ఒకరైన రాధాకిషన్రావు ఎవరు? ఫోన్ ట్యాపింగ్కు సీఎంకు ఏం సంబంధం? గూఢచార వ్యవస్థ లేని ప్రభుత్వం ఉండదు. నిఘా విభాగం నుంచి ప్రభుత్వం కేవలం సమాచారం మాత్రమే కోరుతుంది. ట్యాపింగ్ పూర్తిగా పోలీసు విభాగం అంతర్గత విషయం. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం.. హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే ట్యాపింగ్ జరుగుతుంది. రేవంత్వి చిల్లర రాజకీయాలు రైతు భరోసా, ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్, నాలుగు విడతల డీఏ విడుదల వంటివి ఉండగా రైతులకు రూ.40 వేల కోట్ల రుణమాఫీ సాధ్యం కాదు. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నం సఫలం కాదు. మేం ఎంతో ఆలోచించి ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. భాష విషయంలో రేవంత్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. రేవంత్ ఓటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలర్, భూ కబ్జాకోరు. ఆయన చేతకానితనంతోనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ప్యారగాన్ చెప్పులు లేని కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు. రేవంత్వి చిల్లర రాజకీయాలు. ఆరు నెలల పాలనలో ఆరోగ్యం, విద్యుత్, వ్యవసాయ, చేనేత తదితర రంగాల్లో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఇదే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ముంచుతుంది..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. లక్ష మంది రేవంత్లు వచ్చినా బీఆర్ఎస్ను తుడిచిపెట్టలేరు.. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర. నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం తెచ్చా. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ.. తెలంగాణ గుండెల్లో కేసీఆర్ ఉంటరు. గెలుపోటములు పక్కన పెడితే తెలంగాణ ఎమోషన్ కేసీఆర్. 65 లక్షల మంది సభ్యత్వం కలిగిన మహా సముద్రం లాంటి బీఆర్ఎస్ను తుడిచిపెట్టడం లక్ష మంది రేవంత్లు వచ్చినా సాధ్యం కాదు. కేసీఆర్ను గిల్లి పడేస్తం అనుకునే వాళ్లు పిచ్చివాళ్లు. మోదీ దుర్మార్గాలు పెరిగాయ్..ప్రధాని మోదీ దుర్మార్గాలు పెరిగిపోయాయి. ఆయన గోబెల్స్ మాదిరిగా అవసరాన్ని బట్టి మాట్లాడుతారు. నాలుక మడతేయడం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేవుడి పేరిట ఓట్లు కొల్లగొట్టే పార్టీ బీజేపీ. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా.. అసమానతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, ఎంబీసీ, మైనారిటీలు అందరికీ న్యాయం జరగాలి. ఎస్సీ రిజర్వేషన్లు 15% నుంచి 19 శాతానికి పెంచాలి. అల్పాదాయం ఉన్న ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మోదీ సృష్టించిన రాజకీయ కుట్ర. నేనూ, కేజ్రీవాల్ మోదీకి కంటిలో నలుసులా తయారయ్యాం. మోదీ కుడి భుజం బీఎల్ సంతో‹Ùను అరెస్టు చేసేందుకు వెళ్లినందునే.. నా కూతురు కవితను టార్గెట్ చేశారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేం ఈ కుట్రలను ఎదుర్కొంటాం. -
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. -
అసెంబ్లీ రద్దు కావొచ్చు: కేసీఆర్
‘‘బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నాయకులు బాధపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉందంటూ ఆ పార్టీలోకి వెళితే.. అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు నాతో వాపోయారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా అని నన్ను సంప్రదించారు. కానీ ఇప్పుడు వద్దని వారించాను..’’ సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి అసమర్థతతో కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయని.. లోక్సభ ఎన్నికల తర్వాత ఏడాదిలోపు అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్లో అంతా బీజేపీ కథ నడుస్తోందని.. రేవంత్ బీజేపీలోకి వెళ్లినా ఆయన వెంట వెళ్లేందుకు కరుడుగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘‘గతంలో బీఆర్ఎస్కు 104 మంది ఎమ్మెల్యేలతోపాటు ఏడుగురు ఎంఐఎం సభ్యులను కలుపుకొని 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. మనం అప్రమత్తమై అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేశాం. ప్రధాని మోదీ దుర్మార్గుడు. తెలంగాణలో 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా? రేవంత్ బీజేపీలోకి వెళ్లినా, వెళ్లకున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిది చోట్ల గెలుస్తాం..: లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతాయని.. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సునాయాసంగా గెలిచే పరిస్థితులు ఉంటాయన్నారు. రాజకీయాల్లో తొందరపాటు ఆలోచ నలు సరికాదని, కాంగ్రెస్లోకి వెళ్లిన నాయకులు అక్కడి పరిస్థితులు చూసి తిరిగి వస్తామంటున్నారని చెప్పారు. కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన జరిగే నష్టమేమీ లేదని, బుల్లెట్లలాంటి నాయకులను తయారు చేసుకుంటామని పేర్కొన్నారు. ‘కొందరు నాయకులు వెళ్లినపుడు కొంత మంచే జరుగుతుంద’ంటూ కడి యం శ్రీహరి పార్టీ వీడటాన్ని ప్రస్తావించి విమర్శించారు. ‘‘2006 కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల సమయంలో చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండల అధ్యక్షులు అందరూ కాంగ్రెస్కు అమ్ముడుపోయినా భారీ మెజారిటీ సాధించాం. డబ్బులు ఉంటేనే గెలుస్తామనే అభిప్రాయం సరికాదు. ఇప్పటివరకు అందిన సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తాం. మరో మూడు చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నాయి’’ అని కేసీఆర్ చెప్పారు. బీఎల్ సంతోష్ పై కేసు వల్లే కవిత అరెస్టు.. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ఆయన ఆఫీసు దాకా వెళ్లారు. దీనిపై కక్ష సాధింపులో భాగంగా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారు. కవిత తప్పు చేసినట్టు వంద రూపాయల ఆధారం కూడా చూపలేదు. బీఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోయి ఉంటే కవిత అరెస్టు ఉండేది కాదు. ఆమెను కుట్రపూరితంగా మద్యం విధానం కేసులో ఇరికించారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లతో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందనే అతి ప్రచారాన్ని సృష్టించారని చెప్పారు. జాతీయ స్థాయిలో వివిధ పారీ్టల నేతలతో తాను జరుపుతున్న సంభాషణల ప్రకారం.. మోదీ ప్రాభవం అంతగా లేదని స్పష్టమవుతోందన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా బలమైన నేత లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ నెల చివరి వారం నుంచి బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారం కోసం ఈనెల చివరి వారం నుంచి బస్సు యాత్ర చేస్తానని.. సాయంత్రం సమయాల్లో ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు చోట్ల రోడ్షోలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. రెండు, మూడు వారాల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతోపాటు వివిధ వర్గాలతో భేటీ అవుతానని వెల్లడించారు. బస్సుయాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్లలో లక్ష మందితో మినీ సభలు కూడా ఏర్పాటు చేద్దామన్నారు. లోక్సభ నియోజకవర్గాల రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ఇస్తే షెడ్యూలు ప్రకటిస్తానని నేతలకు సూచించారు. కేటీఆర్, హరీశ్ హైదరాబాద్ పరిధిలోని నియోజకర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటారని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ను తిరస్కరించలేదని.. మరో నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తే మెజారిటీ సీట్లు సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేతకాదు.. ‘‘రేవంత్ సందూక్లో సరుకు లేదు. ధాన్యం కొనుగోలు, రుణమాఫీ సహా ఏదీ ఈ ప్రభుత్వానికి చేతకాదు. ధాన్యం కొనుగోలును గాడిలో పెట్టేందుకు మనం అధికారంలో వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు శ్రమించాం. ధాన్యం బహిరంగ వేలంలో అవకతవకలు జరిగాయి. ధాన్యం కొనడం చేతకాక మిల్లర్ల మీద కేసులు బనాయిస్తున్నారు. రైతు సమస్యలపై పార్టీ నాయకులు, కేడర్ ఎక్కడికక్కడ స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద రూ.500 బోనస్ కోసం డిమాండ్ చేయాలి. ధాన్యం కొనుగోలుపై సిద్దిపేట తరహాలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్షలాది పోస్టుకార్డులపై ప్రభుత్వ హామీలను గుర్తుకు చేయాలి..’’ అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించారు. గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి కర్నాటక, తమిళనాడుకు నీళ్లు తరలించుకుపోయి ఓట్లు దండుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా వెళ్తున్న కేంద్రాన్ని అడ్డుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతేనని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టాలన్న సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే పార్టీ యంత్రాంగం అంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త సల్వాజి మాధవరావుపై పెట్టిన అక్రమ కేసులపై తాను సభలో మాట్లాడితే 10వేల మంది సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారని తెలిపారు. అభ్యర్థులకు బీ ఫారాలు.. చెక్కుల పంపిణీ తెలంగాణ భవన్లో గురువారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత పార్టీ లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో జరిగిన భేటీలో రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రచార వ్యూహం, ఎజెండా, బస్సుయాత్ర వంటి అంశాలపై చర్చించి.. దిశా నిర్దేశం చేశారు. అనంతరం పార్టీ తరఫున పోటీ చేస్తున్న 17 మంది లోక్సభ అభ్యర్ధులకు బీ ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం రూ.95లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి నివేదితకు బీ ఫారం, రూ.45 లక్షల చెక్కును అందజేశారు. -
అన్ని వ్యవస్థలు రేవంత్ గుప్పిట్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్రెడ్డి, పి.శశిధర్రెడ్డి గురువారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ► ఎమ్మెల్యే దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు. ► బీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు. ‘హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ► 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. -
బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట రూ. 20 వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మండలానికో అంతర్జాతీయ స్థాయి గురుకులాల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో మూడేళ్లలో జరగనున్న పూలే ద్విశతాద్ది ఉత్సవాల నాటికి హైదరాబాద్లో ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ మేరకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు ఇచి్చన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం బీసీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారికి రాజకీయ అవకాశాల కోసం బీఆర్ఎస్ మాత్రమే పాటుపడుతోందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతోపాటు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించామని చెప్పారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో బీసీల అభ్యున్నతిని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించి చూపామని.. ఫూలే ఆలోచనా విధానంలో భాగంగా వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు. నేత, యాదవ, ముదిరాజ్, గౌడ సామాజికవర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని... అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్పై బడుగు, బలహీనవర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. గత పదేళ్లలో సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. -
ప్రయత్నిస్తే మంచి ఫలితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు. ఈ ఏడాదంతా కేసీఆర్కు బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలా ఉంటే కేటీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతారు కేటీఆర్ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు. -
ఈశాన్యం వైపు నడుద్దాం.. తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్లో వాస్తు రీత్యా మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు అధినేత కేసీఆర్ ప్రమాదం బారిన పడటం, నేతలు పార్టీ వీడటం, కవిత అరెస్టు తదితర ఘటనల నేపథ్యంలో వాస్తు నిపుణుల సూచనల మేరకు పలు మార్పులు చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. వాస్తు నిపుణుల సలహా మేరకు ఇకపై ఈశాన్యం వైపు ఉన్న గేటును రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును తెరిచి వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. మరోవైపు వీధి పోటును దృష్టిలో పెట్టుకుని దక్షిణభాగంలో ఉన్న గేటు వద్ద యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అబ్బే.. వాస్తు మార్పులు కాదు కానీ.. అయితే పార్టీ వర్గాలు మాత్రం వాస్తు మార్పులు కాదని అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్ ఇతర కీలక నేతలు తెలంగాణ భవన్కు వస్తున్న సందర్భాల్లో వాయువ్య దిశలో ఉన్న గేటు ఎదురుగా రోడ్డులో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని చెప్తున్నాయి. దీంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇన్నాళ్లూ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈశాన్యం గేటును ఉపయోగించుకోలేక పోయామని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ను అనుకుని నిర్మించిన విశాలమైన రోడ్డుతో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తీరుతాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
నలుగురితో బీఆర్ఎస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు సోమవారం ఖరారు చేశారు. నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్, సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఆయా సమావేశాల్లో పార్టీ నేతలు చర్చించి అభ్యర్థుల పేర్లకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంయుక్త ఎన్నికల ఇన్చార్జిలుగా ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిలను కేసీఆర్ నియమించారు. నేడు ఉమ్మడి పాలమూరు నేతలతో భేటీ లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీలో భాగంగా కేసీఆర్ మంగళవారం మహబూబ్నగర్, నాగర్కర్నూలు లోక్సభ నియోజవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. నాగర్కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి.రాములు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు పి.భరత్ను బీజేపీ నాగర్కర్నూలు అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. అయితే మంగళవారం నాటి భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఆల ఖరారు..నేడు ప్రకటన ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. దీంతో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చర్చల అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మంగళవారం జరిగే భేటీ అనంతరం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. రాహుల్గాందీతో పోటీకైనా రెడీ: నామా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పోటీ చేసినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు ప్రకటించారు. తనను మరోమారు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు నామా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు ఎంపీగా గెలిచా. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు’అని నామా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తప్పు చేశామనుకుంటున్నారు: మాలోత్ కవిత మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన కేసీఆర్కు ఎంపీ మాలోత్ కవిత ధన్యవాదాలు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పార్లమెంటు వేదికగా తన పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి ఓట్లు వేసి తప్పు చేశామనే చర్చ ప్రజల్లో జరుగుతోందని పేర్కొన్నారు. మహబూబాబాద్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని అన్నారు. -
కాంగ్రెస్పై వ్యతిరేకత: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కారు ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదని విమర్శించారు. వాటి కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆదివారం తెలంగాణ భవన్కు విచ్చేసిన కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ పార్టీ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేశారు. అయితే ఆదివారం అష్టమి కావడంతో అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు కరీంనగర్, పెద్దపల్లితో పాటు మరికొన్ని స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించనున్నారు. కాగా పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రెగ్యులరైజేషన్ ఉచితంగా చేయాలి విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైందని కేసీఆర్ చెప్పారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని, నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. అంతా కలిసి పని చేయాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శించిందని, ప్రజల రక్తం పీలుస్తున్నారని వ్యాఖ్యానించిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. పైగా అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ కింద ఉచితంగా ప్లాట్లు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఓ పన్ను పాడైందని పళ్లన్నీ పీకేయలేం కదా! ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని, మిడ్ మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పూనుకొని పరిష్కరించాలని, రాజకీయం చేస్తామంటే ప్రజలు గమనిస్తారని అన్నారు. ఒక పన్ను పాడైతే.. చికిత్స చేసుకుంటాం తప్ప.. మొత్తం పళ్లన్నీ పీకి వేసుకోలేం కదా? అని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేయాలని, మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదన్న ఆయన.. ఓడితే కుంగి పోయేది లేదు.. గెలిస్తే పొంగి పోయేది లేదని అన్నారు. కాంగ్రెస్లో వాళ్ల కుంపటి వాళ్ళు సర్దుకోవడానికే టైం సరిపోతుందని విమర్శించారు. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తామని, ధైర్యంగా ఉండాలని నాయకులకు భరోసా ఇచ్చారు. మెజారిటీ సీట్లు మనవే.. ముందుగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో మాట్లాడిన కేసీఆర్.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 12న భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు. సభను విజయవంతం చేసే బాధ్యతను గంగుల కమలాకర్కు అప్పగించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నదని చెప్పారు. అలాగే మెజారిటీ స్థానాల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
‘హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుంది అని కాంగ్రెస్ చెప్తోందని, నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ప్రశ్నిస్తే దాడులు, నిర్బంధాలు, ఎదురిస్తే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘జర్నలిస్ట్ శంకర్పైన దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. సాయి రామ్ రెడ్డి హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్కి చెందిన అనుచరుడు. పథకం ప్రకారం శంకర్ను చంపాలని చూశారు. గొడవపడినట్టు ఇద్దరు మహిళలను పెట్టి పథకం ప్రకారం చేశారు. పాశవికంగా శంకర్పై దాడి జరిగింది. ఈ దాడిని అందరూ ఖండించాలి. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?. అక్షరంతో ప్రశ్నిస్తే అయుధంతో దాడులు చేస్తారా?. హత్యలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమా?’అని బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోంది: క్రాంతి మాజీ ఎమ్మెల్యే ‘ఇది ప్రజా పాలన లాగా లేదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లాగా కనిపిస్తుంది. సీఎం రేవంత్రెడ్డి తన ప్రమేయం లేకుండా తెలంగాణ వచ్చిందనే ప్రతీకారం ఉన్నట్టు ఉంది. అనేక మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి దాడులు గమనించాలి. ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశ్యం లేదు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం’అని క్రాంతి మండిపడ్డారు. -
‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి. ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్రెడ్డి అన్నారు. -
నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: భా రత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు శనివారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరగనున్నాయి. ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా కేసీఆర్ 70వ పుట్టిన రోజును గుర్తు చేసేలా 70 కిలోల భారీ కేక్ను కట్ చేస్తారు. కేటీఆర్ చేతుల మీదుగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా చేయిస్తారు. అలాగే దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘తానే ఒక చరిత్ర’పేరిట 30 నిముషాల నిడివి కలిగిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. కాగా, కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు పార్టీ పిలుపునిచి్చంది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. -
నీకు చేతకాకపోతే తప్పుకో...నేను చేసి చూపిస్తా
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడం చేతకాకపోతే తప్పుకొని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని, రేవంత్రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ చేశారు. ‘నాకు చేత కాదు.. నువ్వు చేసి చూపించమని రేవంత్ అడిగితే నేను సిద్ధం.. నాకు బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా’ అని అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడా రు. ‘శాసనసభ పవిత్రత, సంప్రదాయాలను సీఎం రేవంత్ మంట గలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బురద రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం ఎంత తక్కువ చేసి మాట్లాడినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని, ప్రజలకు జీవధార. ఈ ప్రాజెక్టు విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో ఏ తరహా విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. విచారణ జరిపి బాధ్యులను శిక్షించండి..’అని హరీశ్రావు అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి ‘ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, యుద్ధ ప్రాతిపదిక మరమ్మతు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. రెండు పిల్లర్లు కుంగాయనే నెపంతో మొత్తం ప్రాజెక్టు ప్రతిష్టను డామేజ్ చేసే దుష్టపన్నాగానికి కాంగ్రెస్ పాల్పడుతోంది. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి పొలాలకు నీళ్లు మళ్లించండి కానీ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగింది. ప్రాజెక్టు ఫలాల గురించి చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. గతంలో కడెంవాగు ప్రాజెక్టు, సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పునరుద్ధరించడం జరిగింది. పోలవరం డయాఫ్రం వాల్, రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కారకులను శిక్షించి, ప్రాజెక్టులను పునరుద్ధరించి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారు..’అని హరీశ్ వ్యాఖ్యానించారు. కాలువలు తవ్వి నీళ్లివ్వకపోతే కష్టాలే ‘రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ డైవర్షన్ టూర్ పెట్టుకుని, ఇంజనీర్లు వాస్తవాలు చెబుతున్నా దబాయిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో హెడ్ వర్క్స్ పూర్తయిన తర్వాతే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై నిధులు వెచ్చిస్తాం. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తే, మేము అన్ని పనులు పూర్తి చేసి 6.36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం కాలువలు తవ్వి నీరు ఇవ్వకుంటే సాగు, తాగునీటి కష్టాలు వస్తాయి..’అని మాజీ మంత్రి హెచ్చరించారు. రీ ఇంజనీరింగ్ వల్లే అంచనాల పెంపు ‘రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాణహిత–చేవెళ్ళ ఆంచనా విలువ రూ.17 వేల కోట్లతో మొదలై రూ.38 వేల కోట్లకు పెరిగింది. ఆ తర్వాత కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి రూ.40 వేల కోట్లకు పెరిగింది. తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాజెక్టు అంచనా విలువ రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగినట్టు?. కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యం పెంచాం. కొత్త జలాశయాలు ప్రతిపాదించాం. జలాశయాల సామర్థ్యం పెరగడంతోనే అంచనాలు పెరిగాయి..’అని హరీశ్రావు వివరించారు. -
KRMB వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలపై సమీక్ష
-
తెలంగాణ భవన్కు నేడు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారిగా బీఆర్ఎస్ అధి నేత, శాసనసభ పక్షనేత కె.చంద్రశేఖర్రావు మంగళవారం తెలంగాణభవన్కు రానున్నా రు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయ కులతో సమావేశమవుతారు. ఈ మేరకు ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు రావాలని అధినేత ఆదేశించారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించను న్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావే శాల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ప్రజాక్షే త్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడంలాంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కేసీఆర్ చర్చించి నేతలకు సూచనలు చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా తెలంగాణభవన్కు కేసీఆర్ రానుండటంతో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశముంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు వచ్చి కలవనున్నారు. -
గణతంత్ర వేడుకలు: స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా స్పృహ తప్ప కిందపడిపోయారు. దీంతో, హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ పతకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కాగా, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్బంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచర బీఆర్ఎస్ నేతలు ఆయనను పట్టుకున్నారు. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై కిందపడి పోయిన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. pic.twitter.com/FkgrFqc0iF — Telugu Scribe (@TeluguScribe) January 26, 2024 -
సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగానే కలిశాం
-
కాంగ్రెస్ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, అవి 420 హామీలని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, అబద్ధాలు మాట్లాడించారని, వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ‘స్వేద’పత్రం విడుదల చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, రూ.2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టమని ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తా మని ఇచ్చిన హామీని విస్మరించి, ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రియాంకాగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క అలా చెప్పలేదని హరీశ్రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టేది లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్గాందీ, రేవంత్రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ అదానీని తిడితే, రేవంత్రెడ్డి అదే సమయంలో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా వస్తున్నాడని కేటీఆర్ నిలదీశారు. ఈసారి కూడా మెదక్ మనదే ... మెదక్ లోక్సభ సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని కేటీఆర్ అన్నారు. గత ఎంపీ ఎన్నిక ల్లో హరీశ్రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో అత్యధిక మెజారిటీ సాధించామని, మరోసారి అది పునరావృతం కావాలన్నారు. కొందరు దు్రష్పచారం చేయడంతోనే మెదక్ పార్లమెంట్ పరిధిలో తాను ఒక్కదాన్నే ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. పనికొచ్చే సమీక్షలు చేయడం లేదు: హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం పనికొచ్చే సమీక్షలు చేయడం లేదని, సమీక్షల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ లీకులు ఇస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు మండిపడ్డారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో, ఆ తర్వాత చెల్లదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, భవిష్యత్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు. కొందరు బీఆర్ఎస్ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామని హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటారన్నారు. రైతు బంధు విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
స్వామి వివేకానంద బాటలో నడవాలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు. పొన్నంకు క్రిబ్కో చైర్మన్ సన్మానం.. ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందలాది సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసినా ఏనాడూ ప్రజలను రోడ్ల మీద వరుసల్లో నిలబెట్టలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించామే తప్ప రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మళ్లీ గెలిచేవాళ్లమని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రచారం చేసిన అబద్ధాల ముందు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఓడిపోయింది. అధికారంలోకి వస్తామనే ఆశలు లేని కాంగ్రెస్.. నోటికొచ్చిన హామీలను ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు. కొత్తగా 6.47 లక్షల రేషన్కార్డులు, అత్యధిక వేతనాలు, 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినా ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యాం. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదు. బీఆర్ఎస్కు అసెంబ్లీలో మూడో వంతు సీట్లు రాగా, 14 స్థానాల్లో కేవలం 6 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాం. కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమే. గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటాం. స్థానిక సంస్థలు మొదలుకుని అసెంబ్లీ ఎన్నికల దాకా బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు పార్టీకి అండగా ఉన్నారు’అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల పేరిట రేవంత్ రెడ్డి నాటకాలాడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే స్వేదపత్రం రూపొందించాం. అన్ని వర్గాలకు పార్టీ దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం’అని కేటీఆర్ చెప్పారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే: హరీశ్రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ‘విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ది చేసినా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసింది. రుణమాఫీ, ధాన్యానికి బోనస్ తదితరాలపై మాట తప్పి దగా చేశారు. విద్యుత్లో కొత్త విధానం అంటే విద్యుత్ను 48 గంటలు ఇస్తారా. లోక్సభ ఎన్నికల్లో సమష్టిగా కష్టపడదాం. నెల రోజుల్లో కేసీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారు. కేడర్కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని మీ ముందుకొస్తాం. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసి కేడర్ పిల్లలకు సహకారం అందిస్తాం. అక్రమ కేసుల నుంచి కార్యకర్తలను కాపాడేందుకు తెలంగాణ భవన్తోపాటు జిల్లా కార్యాలయాల్లోనూ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. మండల, జిల్లా కమిటీలు వేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదు. గల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో కాపాడటం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్కు చూపింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్లో అప్పుడే కుమ్ములాటలు కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలయ్యాయని, మంత్రి పొంగులేటి తానే నంబర్ 2గా చెప్పుకుంటున్నారని, డిప్యూటీ సీఎం భట్టి ముఖ్యమంత్రి పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ‘కేటీఆర్, హరీశ్రావు కృష్ణార్జునుల తరహాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలి. గతంలో ఎంపికైన దళిత బంధు లబి్ధదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం’అని కడియం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓటమి చెందినట్టు చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాగా, తెలంగాణ భవన్లో ఎనిమిదో రోజు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాము. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
పట్నం వర్సెస్ పైలట్.. స్వల్ప ఉద్రిక్తత!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది. ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది! చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. -
రెండో రోజు తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ మీటింగ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
Advertisement