-
గాలివాన బీభత్సం
గుడిహత్నూర్/ఇంద్రవెల్లి: మండల కేంద్రంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. జోరుగా వీచిన గాలితో రహదారిపై చెట్లు పడిపోగా, హనుమాన్ నగర్లోని పలు ఇళ్లు, దుకాణాల పైకప్పు రేకులు లేచి పోయి దూరంగా పడ్డాయి. దీంతో నిత్యావసర సరుకులు, సామగ్రి తడిసిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ అరుణ్ బాధిత ఇళ్లను సందర్శించి నష్టం అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మండలంలోని ఈశ్వర్నగర్ సమీపంలో ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో సుమారు గంట సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న మాజీ ఎంపీ గోడం నగేష్ వాహనం కూడ ఆగిపోయింది. ఎస్సై దుబ్బక సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో చెట్టును తొలగించారు. -
ఉపాధికోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది సారంగపూర్: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్కు తన బావమరిది కుంటాల నరేశ్ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్ మండలం హాల్దాకు తరలించారు. శంకర్ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ
● పలువురికి గాయాలుభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు వురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరాల ప్రకారం.. భైంసా నుంచి మద్యం లోడుతో ఐచర్వాహనం, నిర్మల్ వైపు నుంచి మామిడి కా యల లోడ్తో భైంసా వైపు వస్తున్న మరో ఐచర్ వా హనం తిమ్మాపూర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో మామిడి కాయల లోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ అమ్జద్ఖాన్, మధ్యంలోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ శంకర్తోపాటు దీక్షిత్, సందీప్, వంశీకి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో ముగ్గురికి..భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వానల్పాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రుక్మా ద్విచక్రవాహనం వెళ్తూ యూటర్న్ తీసుకుని గ్రామంలోకి వెళ్తుండగా కుంటాల మండలం కల్లూరు గ్రామం నుంచి భైంసాకు ద్విచక్రవాహనంపై వస్తున్న వంశీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భైంసా ఆస్పత్రికి తరలించారు. -
క్లుప్తంగా
కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ఎదులాపురం: కుమారుడిపై తండ్రి ఫిర్యాదు చేసిన సంఘటన పట్టణంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై లాల్సింగ్ కథనం ప్రకారం పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన పవన్ అనుమానంతో భార్యపై చేయి చేసుకున్నాడు. కోడలిని ఎందుకు కొడుతున్నావ్ అని అడ్డుకోబోయిన తల్లిదండ్రులపై సైతం చేయి చేసుకున్నాడు. దీంతో అతని తండ్రి నాగోరావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్యను వేధించిన కేసులో 18 నెలల జైలు కై లాస్నగర్: భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్రావు గురువారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి ఎం. గంగాసింగ్ తెలిపారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన మహిళ, మహారాష్ట్రలోని సరత్ తాలూకా ఘటంజి గ్రామానికి చెందిన సావాపురే దీక్షిత్ భార్యాభర్తలు. నిత్యం భార్యను వేధిస్తుండడంతో దీక్షిత్పై జైనథ్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పీసీఆర్ కోర్టులో విచారణ జరుపగా నిందితుడికి 18నెలల జైలు, రూ.2500 జరిమానా విఽధిస్తూ పీసీఆర్ కోర్టు తీర్పునిచ్చింది.పేకాట రాయుళ్ల అరెస్ట్ తానూరు: మండలంలోని హంగిర్గా గ్రామ శివారులో గురువారం పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. వారి నుంచి రూ.11,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
4,28,612 మంది
● ప్రచారం కల్పించినా కదలని ఓటర్లు ● నిర్మల్ నియోజకవర్గంలోనే అత్యధికం ● ఓటేయని వారిలోనూ మహిళలే అధికం ● ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ తీరు కై లాస్నగర్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలక మే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతోమంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితుల ను సైతం చేసి ఇంటికి పరిమితం చేసింది. ఓటు అంతటి శక్తివంతమైనది కనుకే ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఈసీ విస్తృ త ప్రచారం కల్పిస్తోంది. ఓటరు బాధ్యతను గుర్తు చేసేలా ప్రముఖులతో వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు జిల్లా స్థాయిలో స్వీప్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కల్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఓటింగ్ రోజు వరకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. అయినా ఓటర్లు మాత్రం తమ నిర్లిప్తతను విడనాడలేదు. నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనుకున్నారో లేక నాకేందకనే భావనతోనో తెలియదు కానీ చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదలలేదు. ఈ నెల 13న జరిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో 4,28,612 మంది ఓటర్లు ఓటు వేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కారణాలేవైనప్పటికీ ఓటర్ల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటేయకపోవడంలోనూ మహిళలదే రికార్డు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 16,50,175 మంది ఓటర్లున్నారు. ఇందులో సోమవారం జరిగిన ఎన్నికల్లో 12,21,563 మంది ఓటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుష ఓటర్లు 8,04,875 మంది ఉండగా 5,99,108 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో 2,05,767 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. అలాగే 8,45,213 మంది మహిళా ఓటర్లుండగా 6,22,420 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో 2,22,793 మంది ఓటేయలేదు. ఇతరులు 87 మంది ఉండగా 35 మంది ఓటు వేశారు. మరో 52 మంది ఓటుహక్కును వినియోగించుకోలేదు. నిర్మల్ నియోజకవర్గంలో అత్యధికంగా 73 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోకపోగా, అత్యల్పంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 55 వేల మంది ఓటర్లు ఓటు వినియోగానికి ఆసక్తి చూపలేదు. కాగా పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉండటంలోనూ రికార్డు నమోదు చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 17,026 మంది అధికంగా ఓటింగ్కు దూరంగా ఉండటం ఆఽశ్చర్యానికి గురిచేస్తోంది. అవగాహన కల్పించినా ఆసక్తి చూపలే.. ఓటుకున్న ప్రాధాన్యతను చాటుతూ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలనే బాధ్యతను గుర్తుచేసేలా స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. ర్యాలీలు, రంగోలిలు, యువత, వృద్ధులు, దివ్యాంగుల అవగాహన సదస్సులు, ప్రచార రథాలు వంటి అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక వసతులను సైతం కల్పించింది. అయినా ఓటర్లు పట్టించుకోలేదు. కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కును వినియోగించుకోలేదు. పల్లెలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. నిరాక్షరాస్యులు, ఆదివాసీలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం 78 నుంచి 82 శాతం వరకు నమోదు కాగా విద్యావంతులు, చైతన్యం కలిగిన వారుండే పట్టణ ప్రాంతాల్లో 60 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. యువ ఓటర్లు సైతం ఓటరుగా పేర్ల నమోదుపై చూపుతున్న శ్రద్ధ తీరా ఓటుహక్కు వినియోగించుకోవడంపై చూపడం లేదు. 4 లక్షల మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉండటం రాజకీయ పార్టీలతో పాటు అధికార యంత్రాంగాన్ని సైతం ఆలోచింపజేసేలా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఇవే ఓట్లు ఐదు అభ్యర్థుల తలరాతలను మార్చగలవు. వజ్రాయుధంగా చెప్పుకునే ఓటుహక్కుకు ఇంత పెద్ద స్థాయిలో ఓటర్లు దూరంగా ఉండటం నిజంగా విస్తుగొలిపే అంశంగానే భావించవచ్చు. మావల పోలింగ్ కేంద్రంలో క్యూలో నిల్చున్న ఓటర్లు (ఫైల్) నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఓటు వేయనివారుసిర్పూర్ 2,29,101 1,63,944 65,157ఆసిఫాబాద్ 2,27,208 1,71,511 55,697ఖానాపూర్ 2,24,523 1,62,101 62,422ఆదిలాబాద్ 2,45,137 1,81,136 64001బోథ్ 2,11,313 1,65,157 46,156నిర్మల్ 2,58,314 1,85,168 73,146ముధోల్ 2,54,579 1,92,546 62,033 -
భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య
గుడిహత్నూర్: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మన్నూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఇ మ్రాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మన్నూర్కు చెందిన బస్వంతె బ్రహ్మానంద్(38), అనిత దంపతులు బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నా రు. వివాహామై పదహారేళ్లు కావస్తున్నా సంతానం కలుగలేదు. వారం రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అనిత పుట్టింటికి వెళ్లింది. భార్యను తీసుకొద్దామని బ్రహ్మానంద్ బుధవారం ఇంద్రవెల్లి మండలం సట్వాజీగూడలోని అత్తారింటికి వెళ్లాడు. రావడానికి నిరాకరించడంతో సా యంత్రం మన్నూర్కు వచ్చి మద్యం సేవించాడు. మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. స్థానికులు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్యభైంసారూరల్: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన పోతన్న(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతన్న గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు మృతదేహాన్ని భైంసా ఏరియాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోతన్నకు భార్య సావిత్ర, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సాకెరలో చోరీ బోథ్: మండలంలోని సాకెర గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాథోడ్ రాయల్ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..రాథోడ్ రాయల్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 14న సారంగపూర్ మండలంలోని లింగాపూర్ వెళ్లాడు. గురువారం ఉదయం తాళం తీసి ఉండడాన్ని గమనించిన గ్రామానికి చెందిన రాథోడ్ రంజిత్ ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. గ్రామానికి చేరుకున్న రాయల్ ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న 8 గ్రాముల బంగారు, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు కనిపించలేదు. వెంటనే ఎస్సై రాముకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దేశీదారు పట్టివేతకౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ పట్టణంలోని సుభాష్ కాలనీలో గురువారం దేశీదారు మద్యం పట్టుకున్నామని కాగజ్నగర్ ఎకై ్సజ్ సీఐ వి.రవి తెలిపారు. సుభాస్ కాలనీలో కె.అరుణ్కుమార్ దేశీదారు మద్యం అమ్ముతుండడంతో 56 దేశీదారు 90 మి.లీ. బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అరుణ్కుమార్పై కేసు నమోదు చేశామన్నారు. నలుగురు పాత నేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని వెల్లడించారు. -
శిక్షణ పూర్తి చేసుకున్న
నేను పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న. దరఖాస్తు పరిశీలన పూర్తి చేయడంతో నేను ఐదురోజుల శిక్షణకు ఎంపికై న. నిర్మల్లో శిక్షణ కూడా పూర్తి చేసుకున్న. ఐదురోజుల స్టైఫండ్ కూడా మంజూరైంది. ఎన్నికల కోడ్ కారణంగా నాకు టూల్ కిట్ ఇంకా అందలేదు. – ప్రత్యూష, టైలరింగ్, కల్లూర్‘కోడ్’ కారణంగానే జాప్యంపీఎం విశ్వకర్మ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మున్సిపల్, పంచాయతీ అధికారులకు అప్పగించాం. ఎన్నికల కోడ్కు ముందు గ్రామాల్లో అర్హులను ఎంపిక చేశాం. జిల్లాలో 700 మందిని గుర్తించి శిక్షణ ఇచ్చాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాగా ప్రక్రియ నిలిచింది. కోడ్ తర్వాత ప్రక్రియ చేపడతాం. – నర్సింహారెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్అర్హులను గుర్తించాలిపీఎం విశ్వకర్మ పథకం కోసం జనవరిలోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న. ఐదునెలలైనా ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. అధికారులను అడిగితే ఎన్నికల కోడ్ అని సాకులు చెబుతున్నరు. ఎన్నికల కోడ్ తర్వాతనైనా ఎంపిక ప్రక్రియ త్వరగా చేపట్టి అర్హులను గుర్తించాలె. – సుమిత్ర, టైలర్, భైంసా -
సీపీఎస్ను రద్దు చేయాలి
నిర్మల్ రూరల్: ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో అమలు చేసే పీఆర్సీలో సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు వై.సాయన్న విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉమాకర్రెడ్డి ఆధ్వర్యంలో పీఆర్సీ చైర్మన్ శివశంకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2023 జూలై ఒకటి నుంచి రెండో పీఆర్సీ అమలు చేయాలని కోరారు. 50శాతం ఫిట్మెంట్తో ఆనాటికి ఉన్న 33.67శాతం కరువు భత్యంతో కలిపి వేతన సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీని రూ.25 లక్షలకు పెంచాలని కోరారు. ఉపాధ్యాయులకు సంవత్సరానికి 18 సంపాదిత సెలవులు, అర్ధవేతన సెలవులు 30కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేజీబీవీ, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగులకు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు శంకర్, చంద్రకాంత్ తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
నేరడిగొండ: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన అడిగం నగేష్ జాతీయ రహదారి పక్కనుంచి వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు 108లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుబోథ్: మండలంలోని పొచ్చెర బ్రిడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన ఆడె లక్ష్మణ్, విష్ణు బోథ్ మండలంలోని కంటెగాంలో ఓ పెళ్లి వేడుకకు గురువారం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో పొచ్చెర బ్రిడ్జి వద్ద కారును తప్పించబోయి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా బోథ్లోని ప్రధాన ఆస్పత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం నిర్మల్కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి కడెం: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మ్యాడరపు అనిల్ (25) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్ గ్రామానికి చెందిన అనిల్ లక్ష్మీపూర్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. బైక్పై గ్రామ శివారులోకి వచ్చిన అనిల్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
సినిమా థియేటర్లకు విశ్రాంతి
● పది రోజులపాటు ప్రదర్శనల నిలిపివేతకు ఎగ్జిబిటర్ల నిర్ణయం ● చిన్న సినిమాలకు తగ్గుతున్న ప్రేక్షకాదరణ ● సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లు వెళ్లలేని పరిస్థితులు ● వేసవిలో విడుదలకు నోచుకోని అగ్రహీరోల సినిమాలు బెల్లంపల్లి: సామాన్య, సగటు ప్రేక్షకులకు అతి తక్కువ ధరలో వినోదం అందిస్తున్న సినిమా థియేటర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జిల్లాలోని పలు థియేటర్లు ప్రేక్షకులు రాక.. ఆటలు ప్రదర్శించే పరిస్థితులు లేక నష్టాలు చవి చూస్తున్నాయి. కాసులు రాబట్టుకునే సమయంలో ఈసారి కొత్త సమస్య ఎదుర్కొంటున్నాయి. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత వరుసగా అగ్రహీరోల సినిమాలు పోటాపోటీగా విడుదల కావాల్సి ఉండగా ఈ దఫా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు మూడు నెలల నుంచి ప్రముఖ నటుల సినిమాలు కానరాకుండా పోగా, కొందరు హీరోల సినిమాలు నిర్మాణ దశల్లో, పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నూతనంగా నిర్మిస్తున్న సినిమాల విడుదలకు ప్రతిబంధకాలు ఏర్పడగా థియేటర్లలో ప్రదర్శనలు జరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో మంచిర్యాల, సీసీసీ, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, తాండూర్, జన్నారంలో మొత్తంగా 13 సినిమా థియేటర్లు ఉన్నాయి. మంచిర్యాలతోపాటు ఇతర ప్రాంతాల థియేటర్లలో సినిమాల ప్రదర్శలు సరిగా జరగక సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో కొన్నాళ్ల క్రితం నుంచే థియేటర్లు మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, సీసీసీ నస్పూర్, లక్సెట్టిపేట, మ్యాదరిపేటలో ఉన్న 8 థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకాదరణ లేక, లాభాలు రాకపోగా కనీసం సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు సైతం చెల్లించేందుకు ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తలెత్తి అనివార్యంగా మూసి వేశారు. వీటిలో కొన్నింటిని ఫంక్షన్ హాళ్లుగా మార్చగా, మరికొన్ని వృథాగా మారి నాటి దర్పానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజా పరిస్థితుల ప్రభావం కొత్త సినిమాల జాడ లేకపోవడంతో తాజాగా పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను బంద్ చే యాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి ఆయా థి యేటర్ల గేట్లకు తాళం పడనుంది. చిన్నాచితక సి నిమాలను ప్రదర్శించినా సరిగా కలెక్షన్లు రాక నష్టాలపాలయ్యే కన్నా పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యాకనే తెరవాలని నిర్ణయం తీసుకుంది. సాంకేతికత పెరిగి.. సాంకేతిక రంగం విస్తరించి ఇళ్లలో ఓటీటీలు, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో సినిమా థియేటర్లకు ఆదరణ కరువవుతోంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి ముందే బెల్లంపల్లిలో ఓ ప్రముఖ సినిమా థియేటర్ గత వారం నుంచే ప్రదర్శనలు నిలిపివేసింది. చిన్న సినిమాలు నడవడం లేదు సినిమా టాకీసుల్లో చిన్న సినిమాలకు ప్రేక్షకాదరణ ఉండడం లేదు. సరైన కలెక్షన్లు రావడం లేదు. రోజుకు గరిష్టంగా కనీసం రూ.8 వేలకు తగ్గకుండా ఆదాయం రావాలి. కానీ రూ.5 వేలకు లోబడి వస్తున్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించలేని, కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంటున్నాయి. కలెక్షన్లు లేక మా థియేటర్లో వారం రోజుల క్రితం నుంచి ప్రదర్శనలు నిలిపేశాం. డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీతో థియేటర్లకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. సిబ్బంది వీధిన పడకుండా ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అవకాశం కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – సయ్యద్ కమర్ పాషా, సినిమా థియేటర్ మేనేజర్, బెల్లంపల్లి కనీస ఖర్చులు రావడం లేదు సినిమా థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. రోజువారీగా సినిమా వేస్తే కనీస ఖర్చులు కూడా రావడం లేదు. లాభం రాకపోగా నష్టాలను చవి చూడాల్సి వస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షోలను నిలిపి వేయాల్సి వస్తోంది. నష్టాల బాట పట్టిన థియేటర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకుని తగిన చర్యలు తీసుకోవాలి. – ఎర్ర సంపత్, రాఘవేంద్ర థియేటర్ యాజమాని, జన్నారం -
కొనుగోలు కేంద్రాల పరిశీలన
సోన్: న్యూవెల్మల్, న్యూబొప్పారం గ్రామాల్లోని ఎఫ్ఎస్సీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ పరిశీలించారు. వర్షాలు పడే అవకాశమున్నందున త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డీసీవో నర్సయ్య, ఏఈవో అంభాజీ, నిర్వాహకులు శ్రీనివాస్, సాయన్న, మహేందర్, సవిత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయినాథ్ తదితరులున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలిలోకేశ్వరం: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకళ ఆదేశించారు. గురువారం మండలంలోని మన్మద్, రాజూర గ్రామాల్లోని డీసీఎమ్మెస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం విక్రయించిన వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట సివిల్ సప్లయీస్ డీటీ రమేశ్, నిర్వాహకుడు గంగాధర్ పటేల్, రైతులున్నారు. -
సీఎంఆర్ పూర్తి చేయకుంటే చర్యలు
నిర్మల్చైన్గేట్: సకాలంలో సీఎంఆర్ సరఫరా పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. గురువారం క లెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా లక్ష్యం, పూర్తిచేసిన సరఫరా, నిల్వ ఉన్న ధాన్యం వివరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు రోజూ మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ ప్రక్రియ, మిల్లులో ధాన్యం నిల్వ, సా మర్థ్యం, అన్ లోడింగ్ తదితర అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. వారం రోజులుగా సీఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఆర్వో భుజంగ్రావు, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, డీఎస్వో నందిత, డీఎం సివిల్ సప్లయీస్ శ్రీకళ, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సరఫరాపై అధికారులు, మిల్లర్లతో సమీక్ష -
స్విమ్మింగ్పూల్లో స్విచ్ల ధ్వంసం
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రి యదర్శిని క్రీడా మైదానంలో గల స్విమ్మింగ్ పూల్ కు విద్యుత్ సరఫరా చేసే బోర్డులను గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం మధ్యాహ్నం రేకుల తలుపును పగులగొట్టి లోపలికి వెళ్లిన దుండగులు స్విమ్మింగ్ ఫూల్కు నీటిని సరఫరా చేసే మోటార్లకు అనుసంధానమైన స్విచ్ బోర్డులు, ప్యూజ్లను ధ్వంసం చేసి చెల్లాచెదురుగా పడేశారు. వైర్లను సైతం కత్తిరించారు. కాగా అక్కడి అధికారులు, సిబ్బంది దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై డీఎస్డీఓ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఈ విషయం నా దృష్టికి వచ్చిందని, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
డెంగీని నియంత్రించాలి
నిర్మల్చైన్గేట్: డెంగీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో ధనరాజు సూచించారు. జాతీ య డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగీ నియంత్రణ, నివారణ, లక్షణాలపై విస్తృతంగా అవగాహ న కల్పించాలని సూచించారు. ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతీ మంగళ, శుక్రవా రాలను ‘డ్రై డే‘గా పాటించి నీటి నిల్వలు తొలగించాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ రవీందర్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో రాజేందర్, కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి రవీందర్, సబ్ యూనిట్ అధికారులు, సూపర్వైజర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య సహాయకులు, ఆశ కార్యకర్తలున్నారు. డీఎంహెచ్వో ధనరాజు జిల్లా కేంద్రంలో ర్యాలీ -
‘కడెం’ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి
కడెం: కడెం ప్రాజెక్ట్ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.5.46 కోట్లు మంజూరు చేయగా చేపట్టిన మరమ్మతు పనులను గురువారం ఆయన పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ మొదటి వారంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూ టీ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్, ఎస్ఈ రవీందర్, ఈఈ విఠల్, డీఈ బోజదాసు, ఏఈఈ రవినాయక్, సర్వర్ తదితరులున్నారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలి
కుంటాల: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఎస్టీయూ రాష్ట్ర సహ అధ్యక్షుడు జుట్టు గజేందర్ సూచించారు. ప్రభుత్వం కుంటాలకు జూనియర్ కళాశాల మంజూరు చేయగా గురువారం మండల కేంద్రంలోని గజ్జలమ్మ ఆలయ ఆవరణలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపా రు. విద్యార్థులు కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విండో మాజీ చైర్మన్ జుట్టు లక్ష్మణ్, నాయకులు వెంకటేశ్, సుధాకర్, గజ్జారాం, గజేందర్, నవీన్, నరేశ్, శ్రీనివాస్, రాకేశ్, రమేశ్, కృష్ణ, సురేశ్ పాల్గొన్నారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నిర్మల్చైన్గేట్: 2024–25 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంకు ఈ నెల 18నుంచి జూన్ 7వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజేశ్వర్గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. 1, 5 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్ధులు అర్హులని పేర్కొన్నారు. ఒకటో తరగతిలో 49, ఐదో తరగతిలో 52 సీట్లున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒక్కరికే స్కీం వర్తిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షికాదా యం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.2లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులు తేదీ: 01.06.2018 నుంచి తేదీ: 30.06.2019 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఐదో తరగతిలో చేరే విద్యార్థులు నాలుగో తరగతి ఉత్తీర్ణులైనట్లు రికార్డు షీట్ తీసుకురావాలని తెలిపారు. రేషన్కార్డు, ఆధార్కార్డు, కులం, ఆదా యం, నివాసం, మూడు ఫొటోలు, గతేడాది మా ర్కుల జాబితాను దరఖాస్తుకు జత చేయాలని సూ చించారు. నిర్మల్లోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది, పూర్తి చేశాక జూన్ 7 సాయంత్రం 4 గంటలలోపు అందించాలని తెలిపారు. జూన్ 11న లాటరీ పద్ధతి లో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. బాలికలకు 33, అనాథ పిల్లలకు 20, జోగిని పిల్లలకు 15, బాండెడ్ లేబర్ పిల్లలకు 15శాతం రి జర్వేషన్ ఉందని, వీరు సంబంధిత అధికారుల నుంచి ధ్రువపత్రాలు అందించాలని సూచించారు. -
నిర్మల్
4,28,612 మంది ఓటెయ్యలె! ఇటీవల నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని 4,28,612 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. వీరిలో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 20248లోuకలెక్టర్కు సన్మానంనిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను గురువారం టీఎన్జీవోస్ యూని యన్ నాయకులు కలిశారు. పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినందుకు మొ క్క అందజేసి అభినందించారు. జిల్లా అధ్యక్షు డు వీ ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీరా మ్ శ్రీనివాస్ జయం, సెక్రటరీ ఎస్.మోహన్రె డ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాములు, ని ర్మల్ టౌన్ కార్యదర్శి డీ శ్రీనివాస్, నాయకులు శ్రీకాంత్, అరుణ్, సుధాకర్ ఉన్నారు.నిర్మల్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, ఆర్ఎంపీ, పీఎంపీల క్లినిక్లపై ఒక్కసారిగా దాడులు జరగడం కలకలం రేపింది. ఎవరొచ్చారు.. ఎందుకు తనిఖీ లు చేస్తున్నారంటూ.. దొంగ దవాఖానలు నిర్వహిస్తున్న వాళ్లు కంగారుపడ్డారు. వాళ్లు అనుకున్నట్లుగా నే సదరు వైద్యాధికారులు పలువురిపై కేసులు వే యనున్నట్లు ప్రకటించారు. నేషనల్ మెడికల్ కౌన్సి ల్ (ఎన్ఎంసీ), తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఆధ్వర్యంలో గురువారం వైద్యాధికా రుల బృందాలు ఈ దాడులు చేపట్టాయి. ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులు, ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులతోపాటు కొన్నిరోజులుగా ‘సాక్షి’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలూ ఇందుకు ప్రభావం చూపాయి. జిల్లా కేంద్రంపై ప్రధాన దృష్టి రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న దాడుల్లో భాగంగా గురువారం జిల్లాలోనూ ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ వైద్యాధికారుల బృందాలు దాడులు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జిల్లాకేంద్రంపై అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఇందులో ఎవరు అసలో.. ఎవరు నకిలీ డాక్టరో తెలియని విధంగా వైద్యం అందిస్తున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలూ ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారు. ఇలాంటి పలు ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ తనిఖీలు చేపడుతోంది. నిర్మల్లో గురువారం నిర్వహించిన దాడుల్లో టీఎస్ఎంసీ ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్కుమార్ తోట, కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ యెగ్గన, డాక్టర్ నరేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫేక్ డాక్టర్స్.. డేంజర్ ట్రీట్మెంట్ జిల్లాలో పదుల సంఖ్యలో నకిలీ వైద్యులున్నట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ప్రధానంగా ఈ తనిఖీల ఉద్దేశం కూడా ఆర్ఎంపీ, పీఎంపీలతో పాటు నకిలీ వైద్యులు ప్రజలకు ప్రమాదకరంగా అందిస్తున్న ట్రీట్మెంట్ను అడ్డుకోవడమేనని సభ్యులు తెలిపారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారికి మోతాదుకు మించి మందులు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ ఇంజక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. తమ చదువులకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఇష్టారీతిన బోర్డులు పెట్టి కొంతమంది డాక్టర్లుగా చలామణి అవుతున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాకేంద్రంలోనే పలు దవాఖానలు మల్టీస్పెషాలిటీ, ఈఎన్టీ తదితర పేర్లు పెట్టుకుని ఎంబీబీఎస్ వైద్యులతో నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని ఆస్పత్రులను అసలు వైద్యులు లేకుండానే నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఎదుట గల ఓ చర్మవ్యాధుల ఆస్పత్రి తమ బోర్డుపై వైద్యుడి పేరు కూడా పెట్టలేదని గుర్తించారు. ఇలాంటి ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులు అసలా.. నకిలీనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిపైనా చర్యలుంటాయని తనిఖీ అధికారులు తెలిపారు. ప్రాణాలతో చెలగాటం వైద్యాధికారుల తనిఖీల్లో వైద్యపరంగా పలు కీలక విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. జిల్లాకేంద్రంలోనే ఎలాంటి విద్యార్హత లేకుండా విచ్చలవిడిగా రోగులకు యాంటిబయాటిక్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల అర్హత లేనివాళ్లు ఆపరేషన్లు చేస్తున్నట్లు, గర్భ విచ్ఛిత్తి టాబ్లెట్లు ఇస్తున్నట్లు నిర్ధారించారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు, ఫేక్ వైద్యులు మోతాదుకు మించి ఇస్తున్న మందుగోలీల కారణంగా ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కిడ్నీ, షుగర్ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు చెప్పారు. వీటిని అరికట్టేందుకే తరచూ దాడులు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. న్యూస్రీల్ ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లపైనా.. ఎన్ఎంసీ, టీఎస్ఎంసీ ఆధ్వర్యంలో జిల్లాలో వరుసగా హాస్పిటళ్ల తనిఖీ నకిలీ వైద్యులు.. ఆస్పత్రుల గుర్తింపు కేసులు పెడతామన్న అధికారులు ప్రభావం చూపిన ‘సాక్షి’ కథనాలు‘సాక్షి’ కథనాల ప్రభావంజిల్లాలో వైద్యం పేరిట వ్యాపారం చేస్తున్న తీరుపై ‘దుకాణాల్లా దవాఖానలు..’ శీర్షికన ఎన్నికలకు ముందు ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం రాష్ట్ర వైద్యశాఖ అధికా రుల వరకూ వెళ్లింది. అలాగే ఆర్ఎంపీల తీరుపైనా పలు కథనాలు ‘సాక్షి’ ప్రచురించింది. స్థానికంగా ఫేక్ దవాఖానలు, నకిలీ వైద్యులపై వస్తున్న ఫిర్యాదులకు ‘సాక్షి’ వరుస కథనాలు తోడవడంతో వైద్యాధికా రుల బృందాలు జిల్లాలోనూ జల్లెడ పడుతున్నాయి. ఈ తనిఖీలను ఇంతటితో ఆపబోమని, తరచూ కొనసాగిస్తామని తనిఖీ బృందంలోని అధికారులు చెబుతున్నారు. -
చేతివృత్తులకు చేయూతేది?
● అర్హులకు అందని ‘పీఎం విశ్వకర్మ’ ● పంచాయతీల్లో అందని టూల్కిట్లు ● పట్టణాల్లో అర్హుల ఎంపికకు బ్రేక్ ● అడ్డంకిగా మారిన ఎన్నికల కోడ్ భైంసాటౌన్: చేతివృత్తుల వారికి చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్లోనే ఈ పథకాన్ని ప్రారంభించినా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా అమలు చేయలేదు. ఎన్నికల తర్వాత జిల్లాకు చెందిన దాదాపు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, జిల్లాస్థాయి కమిటీకి పంపించగా, వారు రాష్ట్రస్థాయి కమిటీకి అందించారు. రాష్ట్ర కమిటీ దాదాపు 700 మందిని అర్హులుగా గుర్తించగా ఈ మేరకు జిల్లాస్థాయిలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న పలువురికి స్టైఫండ్ కూడా మంజూరైనా నేటికీ టూల్కిట్లు అందలేదు. మరోసారి ఎన్నికల కోడ్తో.. పీఎం విశ్వకర్మ కింద 18 రకాల చేతివృత్తుల వారికి సాయం అందించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. పథకం ఎన్నికలకు ముందే అమలులోకి వచ్చినా.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా అర్హుల ఎంపిక పూర్తి కాలేదు. ఎన్నికల తర్వాత గ్రామస్థాయిలో అర్హుల ఎంపిక, శిక్షణ పూర్తయినా, పట్టణాల్లో మాత్రం కోడ్ పేరిట అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కారణంగా కోడ్ కారణంగా మరోసారిు ఎంపిక ప్రక్రియ నిలిచింది. దరఖాస్తుదారుల నిరీక్షణ కులంతో సంబంధం లేకుండా ఆయా చేతివృత్తుల (టైలర్లు, తాపీ మేసీ్త్రలు, వడ్రంగులు, హేర్సెలూన్, బుట్టలు, చాపలు, చీపుర్లు, కొబ్బరిపీచు వస్తువులు, పూలమాలలు అల్లేవారు, రజకులు, చేపల వలలు అల్లేవారు, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, శిల్పులు, చర్మకారులు, సుత్తెలు, టూల్కిట్ల తయారీ, బొమ్మలు, ఆయుధాలు, పడవలు, తాళాల తయారీదారులు) వారెవరైనా పథకానికి అర్హులు. -
క్రీడాశిబిరాలు పకడ్బందీగా నిర్వహించాలి
ఉట్నూర్రూరల్: వేసవి క్రీడా శిబిరాలు విజయవంతంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. గురువారం ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీవో మాట్లాడుతూ.. శిబిరాల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని తెలిపారు. గిరిజన విద్యార్థుల్లో సహజసిద్ధంగా నైపుణ్యాలుంటాయని పేర్కొన్నారు. వాటిని గుర్తించి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీ దిలీప్కుమార్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీవో క్రాంతికుమార్, ఏఎస్వో హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆరువారాలు దాటినా అందని ఇంటర్ మూల్యాంకనం డబ్బులు ● నిరీక్షిస్తున్న 500 మంది ఏఈలు ● జిల్లాకు రావాల్సింది రూ.90లక్షలు
మారిన ఇంటర్బోర్డు తీరుగతంలో ఇంటర్ మూల్యాంకనం కోసం అయ్యే డబ్బులను ముందుగా ఇంటర్ నోడల్ అధికారి అకౌంట్లో ఇంటర్ బోర్డు వారు జమ చేసేవారు. ఇంటర్ నోడల్ అధికారి మూల్యాంకనం ముగిసిన వెంటనే అధ్యాపకుల రెమ్యునరేషన్ లెక్కించి వెంటనే ఖాతాల్లో వారంలోపే జమ చేసేవారు. కానీ.. గతేడాది నుంచి ఇంటర్ బోర్డు వారు నేరుగా అధ్యాపకుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడంతో ఇంటర్ నోడల్ అధికారి మూల్యాంకనం చేసిన అధ్యాపకుల వివరాలు ఇంటర్ బోర్డుకు అప్లోడ్ చేస్తున్నారు. కానీ.. బోర్డు వారు మాత్రం అధ్యాపకుల మూల్యాంకనం డబ్బులు ఇప్పటివరకు జమ చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మూల్యాంకనం డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని విధులు నిర్వర్తించిన అధ్యాపకులు కోరుతున్నారు.లక్ష్మణచాంద: జిల్లాలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ముగిసి ఆరువారాలైనా అధ్యాపకులకు రె మ్యునరేషన్ డబ్బులు అందలేదు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మూల్యాంకనం గత మార్చి 16నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగింది. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కానీ.. మూల్యాంకనం విధులు నిర్వర్తించిన అధ్యాపకులు రెమ్యునరేషన్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఇంటర్ మూల్యాంకనం నిర్వహించేవారు. నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడే జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలోనే ఇంటర్ మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 500 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈలు) పేపర్ వాల్యుయేషన్లో పాల్గొనగా, వీరికి రెమ్యునరేషన్ అందలేదు. రెమ్యునరేషన్ ఇలా.. ఇంటర్ మూల్యాంకనం విధులకు హాజరైన ఏఈల కు ఒక్కో పేపర్ వాల్యుయేషన్ చేసినందుకు రూ. 23.66 ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకు ఒక్కో ఏఈ 30 పేపర్లు వాల్యుయేషన్ చేస్తారు. అలాగే ఒక్కోరోజుకు డీఏ, 50కిలో మీటర్ల లోపు వారికి రూ.400, లోకల్ వారికి రూ.188, 50కిలోమీటర్ల పైన ఉన్నవారికి రూ.703 రెమ్యునరేషన్తోపాటు చెల్లిస్తారు. గతంలో చివరిరోజే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహించేవారు. గతంలో మూల్యాంకనం చివరిరోజే అధ్యాపకులకు పూర్తి రెమ్యునరేషన్ చెల్లించేవారు. నాలుగేళ్లుగా అధ్యాపకుల నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకుని వారంలోపు మూల్యాంకనం డబ్బులు జమ చేసేవారు. గతేడాది నుంచి మాత్రం రెమ్యునరేషన్ చెల్లింపులో విపరీతమైన జాప్యం చేస్తుండడంతో అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి జిల్లాకు రావాల్సిన రెమ్యునరేషన్ డబ్బులు రూ.90 లక్షలు నేటికీ అందలేదని అధ్యాపకులు వాపోతున్నారు. -
పనుల్లో నాణ్యత పాటించాలి
నిర్మల్చైన్గేట్: నాణ్యతా ప్రమాణాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులను జూన్ 5లోపు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సదుపాయం, ప్రహరీ రిపేర్లు, విద్యుత్ పనులు, స్లాబ్ల మరమ్మతు, గ్రిల్స్ ఏర్పాటు, పెయింటింగ్స్ తదితర పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పనుల ప్రారంభానికి ముందు, తర్వాత ఫొటోలతో కూడిన నివేదికలు అందించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోపు పనుల పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పాఠశాలల్లో చేపట్టిన పనులు, మరమ్మతుకు సంబంధించిన వివరాలు మండలాల వారీగా సమీక్షించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రవీందర్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు. వెదురుబుట్ట అందజేత పెంబి మండలం కొలంగూడ, పసుపుల గ్రామపంచాయతీలకు చెందిన గిరిజనులు చేతితో అల్లిన వెదురుబుట్టను నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రతినిధి నవీన్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు ఆయన ఛాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా పెంబి మండలంలో నీతి ఆయోగ్ ఎంపిక చేసిన బ్లాక్లలో చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి పురోగతిని కలెక్టర్కు వివరించారు. -
ట్రబుల్ బూత్ నంబర్ 227
● దొందరిలో అష్టకష్టాల మధ్య పోలింగ్ ఖానాపూర్: నియోజకవర్గంలోని పెంబి మండలం మారుమూల గ్రామాలైన వస్పెల్లి, దొందరి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అష్టకష్టాల మధ్య సాగింది. పెంబి మండల కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ గిరిజన గ్రామాలకు కొసగుట్ట మీదుగా వెళ్తే చిక్మన్వాగు, కడెం వాగు, అటవీ ప్రాంతం ఉంటుంది. గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామం మీదుగా వెళ్లినా వాగులతో పాటు అడవి ఉంటుంది. గత 13వ తేదీన నిర్వహించిన ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు అధికారులు ఉట్నూర్లోని రిసెప్షన్ నుంచి పోలింగ్ సామగ్రితో ప్రత్యేక వాహనంలో పెంబికి చేరుకున్నారు. అక్కడి నుంచి గతుకుల రోడ్డు మీదుగా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఇటిక్యాల తండా, గుమ్మెనకు వెళ్లారు. అక్కడ రాత్రి వర్షం ప్రారంభం కాగా, వస్పల్లి వరకు ఫోర్ వీలర్ను తోసుకుంటూ వెళ్లారు. అక్కడ ఫోర్వీలర్ బురదలో దిగబడింది. రాత్రి 11గంటలకు భారీ వర్షంలోనూ నాలుగు కిలోమీటర్ల దూరంలోని దొందరికి కమ్యూనికేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, సెక్టోరల్ అధికారులు, ఇతర సిబ్బంది ఎండ్లబండిపై రాత్రి 11.55కి చేరుకున్నారు. ఆ వెంటనే అధికారులకు రిపోర్టు చేయగా 13న పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగింది. కలెక్టర్ కంట్రోల్ రూమ్తో పాటు రిటర్నింగ్ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సిగ్నల్ కోసం గుమ్మెనలో టవర్ ఏర్పాటు చేశారు. రూట్ ఆఫీసర్ గంగజల, సెక్టోరియల్ ఆఫీసర్ బోజదాస్, ఐటీ అండ్ సీ (కమ్యూనికేషన్ పోలీస్ అధికారులు) ఎస్సై గంగాసాగర్, కానిస్టేబు ల్ రాజ్కుమార్ తదితరులు కమ్యూనికేట్ చేస్తూ అష్టకష్టాలు పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుమ్మెన గ్రామస్తులు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికలు బహిష్కరించి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. వాగులు పొంగిపొర్లడంతో అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయగా, వారం తర్వాత మళ్లీ నిర్వహించారు. -
No Headline
ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) గ్రా మంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి రైతుల వరి ధాన్యం తడిసిపోయింది. గ్రామంలో పక్షం రోజుల క్రితం వరి కోతలు ప్రారంభించినా నేటికీ కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదని రైతులు వాపోయారు. వెంటనే ప్రారంభించాలని కోరారు. కడెం మండలంలో.. కడెం: మండలంలోని కడెం, కొండుకూర్, పాండ్వపూర్, మద్దిపడగ తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచింది. దీంతో కొంత మేర రైతుల ధాన్యం తడిసింది. ప్రభుత్వం టార్పాలిన్లు అందించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. కుంటాల మండలంలో.. కుంటాల: మండలంలోని కల్లూర్ అందాపూర్, ఓ లా, కుంటాల, పెంచికల్పాడ్, అంబకంటి, సూ ర్యాపూర్, లింబా(కే), లింబా(బీ) తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. అందాకూర్లో ఆరబోసిన మక్కలు తడిసి రంగు మారాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నర్సాపూర్(జీ) మండలంలో.. నర్సాపూర్ (జి): మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. ఎంపీపీ కొండ్ర రేఖ రమేశ్ బంగ్లాపై ఉన్న హోర్డింగ్ కింద పడింది. ఆయా గ్రామాల్లో విద్యుత్ అంతరాయమేర్పడి జనాలు ఇబ్బంది పడ్డారు. -
ఆర్టీసీ డిపోలో వైద్యపరీక్షలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో భాగంగా సంస్థలో పని చేసే ఉద్యోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యులు విద్యాసాగర్రావు, చంద్రిక ఆధ్వర్యంలో 60 మంది ఉద్యోగులకు బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారికి మాత్రలు అందజేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు బాధ్యతతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్, సహాయ మేనేజర్లు రాజశేఖర్, నవీన్కుమార్, సిబ్బంది ఉన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement