‘కడెం’ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

‘కడెం’ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి

Published Fri, May 17 2024 6:10 AM

‘కడెం’ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలి

కడెం: కడెం ప్రాజెక్ట్‌ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.5.46 కోట్లు మంజూరు చేయగా చేపట్టిన మరమ్మతు పనులను గురువారం ఆయన పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్‌ మొదటి వారంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూ టీ చీఫ్‌ ఇంజినీర్‌ మధుసూదన్‌, ఎస్‌ఈ రవీందర్‌, ఈఈ విఠల్‌, డీఈ బోజదాసు, ఏఈఈ రవినాయక్‌, సర్వర్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement