సత్తాచాటిన బనవాసి విద్యార్థులు
● సీబీఎస్ఈ ఫలితాల్లో
వంద శాతం ఉత్తీర్ణతఎమ్మిగనూరురూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ, 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి తెలిపారు. గురువారం ఆమె మా ట్లాడుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించినట్లు చెప్పారు. 10వ తరగతిలో ఎస్. చరణ్ (583/600) , బి. వీరేష్ (550/600), కె. మారుతి ( 543/ 600) ప్రతిభ కనబరిచారన్నారు. 12వ తరగతిలో యు.తరుణ్ (455/500), సాయి సుజిత్ (442/500), ఎ. ధర్మేంద్ర (427/500) సత్తా చాటినట్లు తెలిపా రు. ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.ఓట్ల లెక్కింపునకు సచివాలయ ఉద్యోగులు కర్నూలు(అర్బన్): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న ఓట్ల లెక్కింపునకు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా వినియోగించుకోనున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు కర్నూలు అర్బన్, రూరల్, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లోని సచివాలయ ఉద్యోగుల వివరాలను పంపుతున్నామన్నారు. జూన్ 4న కర్నూలు పార్లమెంట్, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు కర్నూలులోనే కొనసాగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు సహకారాన్ని అందించేందుకు ఈ మండలాలకు చెందిన సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం కర్నూలు(అర్బన్): ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అపరిశుభ్రత కారణంగా అంటు రోగా లు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి టీ నాగరాజునాయుడు తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని మెయిన్ రోడ్లు, సందుల్లో, చెత్త కుండీల వద్ద ఎక్కడా కూడా చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎప్పటికప్పుడు డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. మంచి నీటి ట్యాంకులను నిర్ణీత సమయానికి శుభ్రం చేయాలన్నారు. పల్లెల్లో అంటురోగాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. 2003–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వసూలు చేయాల్సిన పన్నులపై ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని డీపీఓ ఆదేశించారు. లక్ష్యం రూ.36.55 కోట్ల కాగా, ఈ ఏడాది మార్చి నాటికి రూ.19 కోట్లు మాత్రమే వసూలయ్యాయన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలోని సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.