రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం

Published Wed, May 1 2024 2:47 PM

Congress Says Decision On Amethi, Raebareli In 24 Hours

కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ రాయబరేలీ, అమోథీ లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటి (సీఈసీ) తెరదించింది.

24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లి కార్జున్‌ ఖర్గే,     
పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్‌ స్పష్టం చేశారు.

అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్‌సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్‌ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్‌ పెద్దలు స్పష్టత ఇచ్చారు  

Advertisement
Advertisement