-
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.అయితే ఈ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం లవ్ మీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఆశిష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై ఉండగానే ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసింది వైష్ణవి. ఫోన్లోనే తనకు 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' చెప్పాలని వైష్ణవి కోరింది. అయితే దీనికి షాక్ అయిన ఆనంద్ నేనే చెప్పాలా? అని అడిగారు. బేబీ సినిమా మొత్తం చూసినా కదా.. అవన్నీ చెబితే బాగోదేమో అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. ఆ పదాన్ని రిపీట్ చేయాలని మళ్లీ కోరింది వైష్ణవి చైతన్య. దీంతో చివరికీ 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' అంటూ చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా కేకలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. లవ్ మీ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది.#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆 📱Actress @iamvaishnavi04 takes up a dare and calls @ananddeverkonda during #LoveMeTrailer launch live event!😃Watch Live here - https://t.co/CKcEqqOreD#VaishnaviChaitanya #AnandDeverakonda #TeluguFilmNagar pic.twitter.com/0cHFxZjroQ— Telugu FilmNagar (@telugufilmnagar) May 16, 2024 -
దెయ్యాన్ని ప్రేమించిన హీరో.. లవ్ మీ ట్రైలర్ చూశారా?
దెయ్యంతో ప్రేమ.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ..! ఈ కాన్సెప్ట్తో వస్తోన్న క ఒత్త మూవీ లవ్ మీ. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ గురువారం (మే 16న) రిలీజైంది. రోజూ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక అలారం మోగుతుంది. రాత్రి 8 గంటలకు..ఆ సమయానికి ఎవరు ఏ పనిలో ఉన్నా అందరూ టంచనుగా ఆ టైంకు ఇంటి తలుపును మూసేస్తారు. కానీ ఓ ఆడపిల్ల మాత్రం గది తలుపు తెరిచి చూసి కెవ్వుమని అరుస్తుంది. ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ వేశారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. అక్కడ డేంజర్ వెళ్లొద్దు అంటే అటే వెళ్లాలనిపిస్తుందంటూ తన స్వభావాన్ని ట్రైలర్లో చూపించాడు. దెయ్యంతో లవ్అందుకే అందరూ భయపడే దెయ్యంతో ప్రేమలో పడతాడు. దెయ్యం చంపుతుందని అందరూ హెచ్చరించినా హీరో మాత్రం ఆ ఘోస్ట్ ప్లేస్లోకి వెళ్తాడు. చివరికి ఆ దెయ్యం అర్జున్ పీక పట్టుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. మరి ఈ మనిషి-దెయ్యం ప్రేమకథ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మే 25 వరకు ఆగాల్సిందే! మే 25న రిలీజ్అంటే సరిగ్గా మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకులను భయపెట్టేందుకు లవ్ మీ థియేర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
సిల్క్ సారీ.. చేతులోన స్కాచ్ గ్లాస్
వాసుదేవ్ రావు హీరోగా, రీవా చౌదరి, ప్రతీ గోస్వామి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సిల్క్ సారీ’. చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ని ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లిరికల్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది డైరెక్టర్ కి మంచి కమర్షియల్ సినిమా రేంజ్ లో పాట హిట్ అవ్వాలని కోరుకుంటున్న . అలాగే కమలేష్ కుమార్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి .ఆయన మొదటి ప్రయత్నంగ చేసిన ఈ సిల్క్ సారీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అయి ఆయనకి మంచిపేరు రావాలని ఆశిస్తున్నాను’ అన్నారు. -
బన్నీ ఫ్యాన్స్కు షాక్.. పుష్ప-2 మూవీ వాయిదా..?
ఐకాన్ స్టార్, సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ పుష్ప-2: ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ.. మరోసారి దాక్షాయణిగా మెప్పించనున్నారు. తాజాగా అనసూయ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.పుష్ప-2 వాయిదా?అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో పుష్ప-2 సందడి చేయనుందని వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందనే లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. పుష్ప-2 మూవీ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ డేట్స్ విషయంలో సమస్యలు రావడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎడిటింగ్ పూర్తి చేయడానికి నవీన్ నూలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.అదే రోజు రిలీజ్మరోవైపు అల్లు అర్జున్ ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడని చిత్రయూనిట్ పేర్కొంది. జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుందని.. సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని అంటున్నారు. కాగా.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని సుకుమార్ చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
Nindha Teaser : ఆసక్తి రేపుతున్న ‘నింద’ టీజర్
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు.‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్తో మొదలైన ఈ టీజర్లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్లోని విజువల్స్ ఎంతో న్యాచురల్గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు. -
భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
ఈ రోజుల్లో విడాకులు అనేవి మామూలైపోయాయి. కానీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారంటేనే ఏమైందో తెలుసుకోవాలని జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. మొన్నే కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ సైంధవ్.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికినట్లు వెల్లడించాడు. తాజాగా ఓ తెలుగు బుల్లితెర నటి అదే బాట పట్టింది.మా మధ్య బంధం ముగిసిపోయిందిసీరియల్ నటి శిరీష భర్త నవీన్తో విడిపోయినట్లు వెల్లడించింది. 'నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను, నవీన్ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం.తనపై గౌరవముందివీలైతే సపోర్ట్ చేయండి, కానీ విమర్శించకండి. నవీన్పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేసింది.ఆ సీరియల్తో పాపులర్కాగా శిరీష.. అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్లో నటించారు. కానీ శిరీష మాత్రం అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు సీరియల్తో బాగా పాపులర్ అయింది. స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం. . ఇలా అనేక సీరియల్స్లో నటించింది. View this post on Instagram A post shared by It's-me-Sireesha Actor- Official (@its_me_sireesha_actor) చదవండి: జబర్దస్త్ కమెడియన్ ఇంట విషాదం.. ఐదేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతూ.. -
'ప్రముఖ నటి ఇంట్లో అశ్లీల చిత్రాలను షూట్ చేసిన నటుడు'
కొంతకాలంగా కోలీవుడ్లో టాప్ సింగర్గా నిలిచిన సుచిత్ర.. సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కుని, సింగర్ అనే విషయం మరిచిపోయింది. సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న సుచిత్ర.. ఇప్పుడు రకరకాల వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్లో పెను తుఫాను సృష్టిస్తోంది. ప్రస్తుతం వరుసగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్గా మారారు.అందుకు తగ్గట్టుగానే తన మాజీ భర్త కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్తో తనకున్న రిలేషన్ షిప్ గురించి మాట్లాడిన సుచిత్ర.. కోలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా ఉందని, కమల్ బర్త్ డే పార్టీల్లో వెండి తాంబూలాల్లో కొకైన్ వడ్డించారని ఇలా సెన్సేషనల్ కామెంట్లు చేస్తుంది. అంతే కాకుండా సుచీ లీక్స్ ఇష్యూలో వచ్చిన ఫోటోలను త్రిష తనకు ఇచ్చిందని సుచి చెప్పడం చాలా మందిని షాక్కు గురి చేసింది.తాజాగా వనిత విజయకుమార్ గురించి సుచిత్ర పలు వ్యాఖ్యలు చేసింది. అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వనితా విజయకుమార్ ఇంటిని తమిళ నటుడు బైల్వాన్ ఉపయోగించాడని సుచిత్ర తెలిపింది. ఒక బంగ్లాను వనితకు తన సిన్నిహితులు ఇస్తే.. దానిని నటుడు బైల్వాన్కు ఆమె ఇచ్చినట్లు సుచి తెలిపింది. అయితే ఆ బంగ్లాను అశ్లీల చిత్రాల షూటింగ్ కోసం వాడినందుకే సీల్ వేశారని సుచిత్ర పేర్కొంది. బైల్వాన్ అందరి గురించి కామెంట్లు చేస్తాడు కానీ, వనిత గురించి మాత్రం ఎక్కడా మాట్లడరు. దీనికి కారణం ఈ బంగ్లా కథే అంటూ సుచి చెప్పింది.బైల్వాన్ రంగనాథన్ అశ్లీల సినిమాలకు ఏజెంట్గా పనిచేస్తున్నాడని, తనకు ప్లేబ్యాక్ సింగర్ కాకముందే ఈ విషయాలన్నీ తెలుసని సుచిత్ర తెలిపింది. శరత్కుమార్, రాధా రవి వంటి వారు తమిళనాడులో ఇలాంటి అసభ్యకర చిత్రాలను తెరకెక్కించకుండా అడ్డుకున్నారని కూడా ఆమె గుర్తు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ సెలబ్రిటీలకు నిద్రలేకుండా సుచిత్ర చేస్తుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియక భయంతో ఉన్నారని చెప్పవచ్చు. సుచిత్ర వెనుక ఎవరో ఉండే ఈ కథ నడుపుతున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం -
చార్లి గుర్తుందా.. ఇన్నేళ్ల తర్వాత అంటూ వీడియో షేర్ చేసిన రక్షిత్
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ '777 ఛార్లి'. చిన్న చిత్రంగా 2022లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా డాగ్ లవర్స్ను ఆకట్టుకుంది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ కన్నడ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఈ చిత్రానికి రక్షిత్ శెట్టితో పాటు మరో ప్రధాన హీరో ఛార్లీనే.. ఛార్లీ పాత్రలో తెరపై కనిపించేది ఒక శునకమే అయినా.. సినిమా చూస్తున్నంతసేపు చాలామంది దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. అందుకోసం చార్లికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కొన్ని సీన్ల కోసం పదుల సంఖ్యలో టేకులు తీసుకోవాల్సి వచ్చిందని చిత్ర రచయిత, దర్శకుడు కిరణ్ రాజ్ గతంలో తెలిపారు. కానీ ఆ డాగ్ మాత్రం చిత్ర యూనిట్ మొత్తాన్ని మెప్పించిందని ఆయన తెలిపారు.తాజాగా డాగ్ చార్లిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు రక్షిత్ శెట్టి. లేటు వయసులో 6 అందమైన పిల్లలకు చార్లి జన్మనిచ్చిందని ఆయన తెలిపారు. వాటిని చూసేందుకే తాను మైసూర్ వచ్చానని ఒక వీడియో ద్వారా రక్షిత్ చెప్పారు. చార్లి మొదటిసారి తల్లి అయినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి చార్లి వయసు కూడా చాలా ఎక్కువ. తను ఎప్పుడు పిల్లలకు జన్మనిస్తుందని తామందరం ఎంతగానో ఎదరుచూశామని రక్షిత్ తెలిపారు. ఫైనల్లీ ఇన్నేళ్లకు తామందరిలో చార్లి సంతోషాన్ని నింపిందని ఆయన అన్నారు. చార్లికి ఇక సంతానం కలగదేమోనని అనుకున్నట్లు ఆయన అన్నారు. అయితే, లేటు వయసులో చార్లికి సంతానం కలగడం చాలా సంతోషాన్ని కలిగించిందని రక్షిత్ తెలిపారు. ట్రైనర్ ప్రమోద్ ఇంట్లో మే 09న 6 పిల్లలకు చార్లి జన్మనిచ్చింది. అందులో 5 ఫిమేల్,1 మేల్ పప్పీలు ఉన్నాయి. రక్షిత్ శెట్టి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Rakshit Shetty (@rakshitshetty) -
కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ తల్లి క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్తను కమెడియన్ బుధవారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'అమ్మా.. గత ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే! కంటికి రెప్పలామమ్మల్ని కన్నావు.. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ, నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..? వారికి పాదాభివందనాలుమా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభివందనాలు' అని ఇన్స్టాగ్రామ్లో తన తల్లి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం ‘విద్య వాసుల అహం’.
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకలో మణికాంత్ గెల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘విద్య వాసుల అహం’ రూపొందింది. వెంకీ అద్భుతమైన కథ రాయడం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను’’ అన్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ (అహం) ఉండే ఫన్ ఫిలిం’’ అన్నారు. ‘‘రాహుల్ మంచి రైటర్ కూడా. ఈ స్క్రిప్ట్ని తను ఒప్పుకున్నాడంటే కథ బాగుంటుందని అనిపించి నేను కూడా ఓకే చేశాను’’ అన్నారు శివానీ రాజశేఖర్. -
సుచీ లీక్స్.. కమల్ హాసన్పై సంచలన ఆరోపణ చేసిన సుచిత్ర
కోలీవుడ్లో సుచీ లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. రోజుకొక సెలబ్రిటీ గురించి ఎదో వార్త వైరల్ అవుతూనే ఉంది. 2017లో కోలీవుడ్ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశంగా సుచీ లీక్స్ వైరల్ అయింది. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో చాలామంది ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్ టాపిప్గా మారిన విషయం తెలిసిందే.కొన్నేళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి పలు విషయాలు తెలుపుతూ రచ్చ మొదలుపెట్టింది. తాజాగా కమల్ హాసన్పై సుచిత్ర సంచలన ఆరోపణ చేసింది. కమల్ హాసన్ ట్రాన్స్ జెండర్ అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో బాంబ్ పేల్చింది. తమిళ్ బిగ్ బాస్కు హోస్ట్గా కమల్ కొనసాగిన విషయం తెలిసిందే. గత సీజన్లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్గా పాల్గొంది. కమల్తో పాటు మాయ కూడా ట్రాన్స్జెండర్స్ అయి ఉంటారంటూ సుచిత్ర తెలిపింది. ఆయనకు చుడీదార్, కుర్తా అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. కమల్ విషయంలో రీసెర్చ్ చేసే ఈ విషయాలు చెబుతున్నానని సుచిత్ర పేర్కొంది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్ జెండర్తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తున్న సమయంలో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయని ఆమె గుర్తుచేసింది. అందులో కూడా కమల్ వైట్ డ్రెస్తో పాటు చుడీదార్ లాంటి దాన్ని ధరిస్తారని ఆమె తెలిపింది. కమల్ నిజజీవితంలో కూడా ఎక్కువగా అలాంటి దుస్తులే ధరిస్తారని ఆమె తెలిపింది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ వ్యక్తిగతంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు వారు చెబుతున్నారు. మీడియా వారు కూడా ఆమెతో ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించకండి అంటూ వారు కోరుతున్నారు. “Kamal Hassan is a transgender!” 🤯Shocking revelation by singer #Suchitra Arava nibba galla battalu oodadeestundi 😂😂😂#SuchiLeakspic.twitter.com/eWN4RzYiij— Aaku Bhai (@samuraigambhira) May 15, 2024 -
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
ప్రతి సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు కొత్త కళ తెచ్చేది బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్. ఫ్రాన్స్లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 25 వరకు కొనసాగుతున్న ఈ వేడుకులలో భారత్ తరపున పాల్గొనేందుకు తాజాగా ఐశ్వర్య తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి కేన్స్కు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో ఆమె కనిపించారు. కానీ, తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి ఉండటంతో చాలా మంది అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆమె చేతికి తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆమె గాయం గురించి పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నాడు, 'OMG ఆమె గాయపడిన చేతులతో కేన్స్లో ఎలా నడుస్తుంది. కేన్స్ రెడ్ కార్పెట్పై ఐశ్వర్య నడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికే అందం వస్తుంది. కానీ, ఈసారి ఆ రెడ్ కార్పెట్పై ఆమె నడవగలదా అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేన్స్లో ఆమె లుక్ కోసం ఎదురు చూస్తున్నామని మరొకరు తెలిపారు. ఐశ్వర్య చేతికి అయిన గాయానాకి గల కారణాలు మాత్రం తెలియలేదు.ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2002లో తొలిసారి మెరిసింది. ఆ సమయంలో భారీ బంగారు ఆభరణాలతో నీతా లుల్లా డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్ మీద మొదటిసారి కనిపించింది. అదె సంవత్సరంలో ఆమె నటించిన దేవదాస్ సినిమా ఆ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. షారూఖ్ ఖాన్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో ఆమె కేన్స్లో పాల్గొంది. అప్పటి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పెట్పై తన అందంతో కట్టిపడేస్తుంది.ఐశ్వర్యతో పాటు అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ కూడా కేన్స్లో కనిపించనున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పటికే కేన్స్లో పింక్ లుక్లో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరొసారి వాయిదా.. కారణం ఇదే
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా విడుదల విషయంలో ఆమెకు చెందిన నిర్మాణ సంస్థ నుంచి కీలక ప్రకటన వచ్చింది. మరోసారి వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి అధికారిక తేదీని త్వరలో ప్రకటిస్తామని కంగనా టీమ్ తెలిపింది.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం ముందుగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితమే సుమారు పది లక్షల మంది అభిమానుల సమక్షంలో ఆమె నామినేషన్ కూడా వేశారు. ఎన్నికల్లో ఆమె బిజీగా ఉన్న కారణంగానే సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.ఎమర్జెన్సీ సినిమాను వాయిదా వేస్తూ తనకు సంబంధించిన మణికర్ణిక ప్రొడక్షన్ నుంచి సోషల్మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'క్వీన్ కంగనా రనౌత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ చూపుతున్నారు. దీంతో మా హృదయాలు నిండిపోయాయి. ప్రస్తుతం ఆమె దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఎమర్జెన్సీ సినిమా పనులకు కంగనా దూరంగా ఉన్నారు. దీంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో తెలియచేస్తాం. మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు.' అంటూ ఆమెకు చెందిన ప్రొడక్షన్ నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలో ఎమర్జెన్సీ విడుదల కొత్త తేదీని తెలుపుతామని వారు తెలిపారు.ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Manikarnika Films Production (@manikarnikafilms) -
సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
సన్నీలియోన్ బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఆమె అభిమానులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. అలా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన యువకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి అక్కడ వారందరూ కేక్ కట్ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ పుట్టినరోజును ఎందుకు జరుపుకున్నారో కూడా వారు చెప్పుకొచ్చారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె నటించిన గత సినిమాలు ఎలా ఉన్నా సరే సన్నీలో సేవా గుణం ఉంది. భారత్పై గౌరవంతో ఇక్కడే ఉంటుంది. అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుంది. ఇక్కడి ప్రజల్లో మమేకమైంది. ఇక్కడి ప్రజలకు ఆమె ఎంతో సాయం చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి..? అంటూ వారు సన్నీ లియోన్ గురించి చెబుతున్నారు. -
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమ్ఇండియాకు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? లేదా కొత్త కోచ్ వస్తారా..? అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందుకు అర్హతలు, బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో తమ వివరాలు నింపాలని తెలిపింది.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ అందుబాటులో వెబ్సైట్ను బీసీసీ ఉంచింది. దీంతో చాలామంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడంలేదు.అయితే, టాలీవుడ్ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కానీ, తన దరఖాస్తును బీసీసీఐ రిజక్ట్ చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ అప్లికేషన్ను నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో తనకు చాలా సరదాగా అనిపించిందని ఆయన అన్నారు. ' నేను ఒకసారైనా టీమ్ఇండియాకు హెడ్ కోచ్గా ఉండాలనుకుంటున్నాను.' అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. I thought it’d be fun to just fill up the form and submit it for the heck of it. Thought I could tell my kids someday that “you know, I was in the running to be Head Coach of Team India once.” But… ☹️☹️ pic.twitter.com/b54ochsyhQ— Rahul Ravindran (@23_rahulr) May 15, 2024 -
స్టార్ డైరెక్టర్తో నయనతార కొత్త సినిమా
కోలీవుడ్లో తాజాగా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్మీనన్ దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే ఆ వార్త. దక్షిణాదిలో దర్శకుడు గౌతమ్మీనన్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్ దర్శకత్వంలో పేరు గాంచిన 2001లో మిన్నలే (చెలి) అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో గౌతమ్మీనన్కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క (ఘర్షణ), కమలహాసన్ హీరోగా వేట్టైయాడు వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ఈయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏ మాయ చేశావే' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా నటి సమంత కెరీర్కు మైలురాయిగా నిలిచింది. కాగా ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగాను ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో వైవిధ్య భరిత కథాపాత్రలను పోషిస్తున్నారు. గౌతమ్మీనన్ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం వెందు తనిందది కాడు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉంది. చిన్న గ్యాప్ తరువాత గౌతమ్మీనన్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో లేడీ సూపర్స్టార్ నయనతార కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ క్రేజీ చిత్రంలో మలయాల సూపర్స్టార్ మమ్మట్టి నటించనున్నారని టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇది తమిళ చిత్రమా? లేక మలయాళ చిత్రమా, అది కాకుండా పాన్ ఇండియా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. కాగా నయనతార, మమ్ముట్టి కలిసి 2016లో పుదియ నియమం అనే మలయాళ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం పుష్ప-2. ఈ చిత్రం కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ పుష్ప-2పై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.అయితే ఇవాళ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. పుష్ప-2లో దాక్షాయణి ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. అనసూయ పోస్టర్ను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన అభిమాన నటికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.Wishing the talented @anusuyakhasba a very Happy Birthday ❤🔥She will be back with #Pushpa2TheRule as the wily 'Dakshayani' 💥Grand release worldwide on 15th AUG 2024.Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial… pic.twitter.com/AzWpp9fzUT— Pushpa (@PushpaMovie) May 15, 2024 -
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ నెల 20న జూనియర్ బర్త్ డే కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పారు. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.దేవర అప్డేట్తో పాటు చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్ను పంచుకున్నారు. ఫియర్ సాంగ్ అంటూ పోస్టర్తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. ఎన్టీఆర్ పుట్టినరోజుకు కంటే ఒకరోజు ముందుగానే సాంగ్ రిలీజ్ కానుంది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. అనిరుధ్ కోలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ మూవీకి సైతం ఆయన పనిచేశారు.ALL SET for the mighty storm 🌊#DevaraFirstSingle ~ #FearSong will unleash tsunami of madness that will sweep through every coast on May 19th 💥An @anirudhofficial Musical 🎶 #DevaraMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/mRfxMps4FA— Devara (@DevaraMovie) May 15, 2024 -
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్స్టాలో క్యూఆర్ కోడ్ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా విడుదలైన ట్రైలర్తోనే పంచాయత్ మూడో సీజన్పై భారీ అంచనాలను పెంచేశారు. తొలి రెండు సీజన్లు ఎంతటి హిట్ అందుకున్నాయో.. మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనావేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ చోటు కల్పించిన దర్శకుడు రెండో భాగం ముగింపులో కాస్త భావోద్వేగాలను కూడా జోడించడంతో మరింతగా ప్రేక్షకులకు ఈ సిరీస్ దగ్గరైంది. -
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
‘ఊర్వశివో రాక్షసీవో’(2022) తర్వాత అల్లు శిరీష్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకే బడ్డీ మూవీ అనౌన్స్ చేశాడు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకనొక దశలో ఈ సినిమాను పక్కకు పెట్టేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఓ పాటను రిలీజ్ చేసి రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
Hyderabad Heavy Rains: హైదరాబాద్లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
SRH vs GT: మ్యాచ్కు వర్షం అడ్డంకి.. హెచ్సీఏ కీలక ప్రకటన
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement