-
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్స్టా బయోలో తాను సూపర్వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. -
ఇన్స్టాగ్రామ్లో పైలట్గా ప్రొఫైల్.. 30మంది మహిళలకు టోకరా!
గురుగ్రామ్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు సైతం మీతో స్నేహం చేస్తామంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు. అలా ముక్కు మొహం తెలియని వారిని చాలా మంది ఆహ్వానిస్తారు. అయితే.. ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. 25 ఏళ్ల ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పైలట్గా ప్రొఫైల్ పిక్ పెట్టి 30 మంది మహిళలను మోసం చేశాడు. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్లో వెలుగు చూసింది. ఓ యువతి ఫిర్యాదుతో ఢిల్లీ శివారులోని సెక్టార్ 43 ప్రాంతంలో నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి డెబిట్ కార్డు, మొబైల్ ఫోన్, రెండు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హేమంత్ శర్మగా గుర్తించారు పోలీసులు. బుధవారం సిటీ కోర్టులో హాజరుపరచగా.. జుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇన్స్టాగ్రామ్లో పైలట్గా చెప్పుకుని తనకు స్నేహితుడిగా మారాడని, మోసపూరితంగా తన ఖాతా నుంచి రూ.1 లక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎస్హెచ్ఓ బిజేంద్ర సింగ్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసినట్లు తేలింది. ‘సుమారు 150 మంది యువతులకు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించాడు. విమానయాన సంస్థలో ఉద్యోగిగా చెప్పుకున్నాడు. వారిని మాటల్లో దింపి నిజమైన పైలెట్గానే నమ్మించేవాడు. ఆ తర్వాత తన ఖాతాకు డబ్బులు పంపించాలని కోరేవాడు. అలా చేసిన తర్వాత వారి ఖాతాలను బ్లాక్ చేస్తాడు. ఇప్పటి వరకు సుమారు 30 మందిని అలా మోసం చేసినట్లు తెలిసింది. మోసం చేసేందుకు ఇంటర్నెట్లో ఫొటోలు డౌన్లోడ్ చేసి ప్రొఫైల్ పిక్గా పెట్టుకునేవాడు.’ ఏసీపీ ప్రీత్ పాల్ సింగ్ సంగ్వాన్ తెలిపారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
వావ్ కైరా! ఎందుకమ్మా.. నీకు ఇంతమంది ఫ్యాన్స్?
ఆమె పేరు కైరా భూమ్మిదికి వచ్చి ఆర్నెళ్లు కూడా కావడం లేదు అప్పుడే ఆమెకు ఇన్స్టాలో యాభై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతటి ఫాలోయింగ్ ఉందంటే ఆమె తల్లిదండ్రులెవరో సెలబ్రిటీలు అనుకుని పొరపడకండి. ఆమెకు అసలు తల్లిదండ్రులే లేరు! మరి ఆమెకు ఇంత మంది ఫాలోవర్లు ఎందుకు ఉన్నారని సందేహం వస్తోందా? తప్పకుండా రావాలి మరి. ఎందుకంటే పుట్టుక నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారే వరకు కైరా ప్రతీ అడుగు ఓ సంచలనమే. కైరా పేరుతో ఓ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ 2022 జనవరిలో ఖాతాను ప్రారంభించింది. ఇందులో వర్చువల్గా క్రియేట్ చేసిన ఓ యువతిని కైరాగా పేర్కొంటూ పోస్టులు చేసింది. ఈ వర్చువల్ కైరా మాట్లాడగలదు, డ్యాన్స్ చేయగలదు, పాటలు కూడా పాడగలదు. ఒకటేమికి ఆకట్టుకునే రూపంతో రంజిపచేసే కళలు తోడవటంతో జెట్ స్పీడ్తో ఆమె ఫాలోవర్లు పెరిగిపోయారు. కేవలం ఆర్నెళ్లలోనే యాభై వేలకు మించి ఫాలోవర్లను సాధించింది. ఈ సంఖ్య సెకన్ల ముళ్లుతో పోటీ పడుతూ పరుగులు పెడుతోంది. ఏంటా స్పీడు ముగ్గమనోహరమైన కైరా రూపానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కైరా అప్డేట్స్ కోసం ఫాలోవర్లుగా మారారు. ఆమె నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ పెరిగి పెరిగి కేవలం ఆరు నెలల్లోనే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్థాయికి చేరుకుంది. ఏదైనా విషయానికి ప్రచారం కల్పించడంతో పాటు ఏదైనా బ్రాండ్ను ప్రమోట్ చేసే స్థాయికి కైరా చేరుకుంది. కైరా వెంట కుర్రకారు కైరా అందానికి ఇండియన్ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. కైరా ఫాలోవర్లలో 90 శాతం మంది భారతీయులు ఉండటమే ఇందుకు ఉదాహారణ. అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల వయసులోపు ఉన్న వాళ్లే ఎక్కువ. మళ్లీ ఇందులో అర్బన్, మెట్రో యూత్ ఎక్కవగా ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం కైరా అప్డేట్స్ కోసం అర్రులు చాచి ఎదురు చూస్తున్న వారిలో బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మాదాబాద్ వంటి నగరాలకు చెందిన వారే ఉన్నారు. ఫస్ట్ వర్చువల్ ఇప్పటి వరకు సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్పై ఎంతో మంది సోషల్ మీడయా ఇన్ఫ్లూయెన్సర్లుగా ఎదిగారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. కానీ దేశంలో తొలిసారిగా ప్రాణం లేని ఓ కల్పిత వర్చువల్ మనిషి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్థౠయికి రావడం విశేషం. దీంతో ఇటీవల ఈ వర్చువల్ 3డీ కైరా రాజస్థాన్లోని హవా మహాల్ ఎదుట షూట్ నిర్వహించారు. ఇందులో వ్యాక్సినేషన్ ప్రమోషన్ కార్యక్రమాన్ని కైరా చేత చేయించారు. ఎంతందంగా ఉన్నావే కైరాకు పెరిగిన క్రేజ్ను చూసి టెక్నాలజీ, ఫ్యాషన్, గ్యాడ్జెట్ సెకార్ట్ల నుంచి తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలంటూ ఆర్జీలు పెరిగిపోతున్నాయట, మరోవైపు రోజురోజుకి కైరాకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. వర్చువల్ అని తెలిసి కొందరు తెలియక మరికొందరు నీ అందానికి సీక్రెట్స్ ఏంటి అంటూ కైరా వెంటపడుతున్నారు. మరీ ఈ క్రేజ్ చివరకు ఏ ఎత్తులకు చేరుకుంటుందో? ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటే మరికొంతవ కాలం వేచి చూడాల్సిందే! చదవండి: అదిరిపోయే ఆఫర్.. జాబ్ వదిలేస్తే లక్ష డాలర్లు ఇస్తాం! ఇంకా.. -
ఇన్ స్టాగ్రామ్,ఈ సూపర్ ఫీచర్ గురించి మీకు తెలుసా?!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ స్టాగ్రామ్ మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో సెన్సిటీవ్ కంటెంట్ ను కంట్రోల్ చేయవచ్చని ఇన్ స్టాగ్రామ్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతిరోజు ప్రపంచ వ్యప్తంగా 500మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఇన్ స్టాగ్రామ్లో గడుపుతున్నారు. అయితే వారిలో కొంతమంది యూజర్లు అశ్లీల ఫోటోలు, మెసేజ్లను షేర్ చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ ఫీచర్ను అప్ డేట్ చేసింది. ఈ ఫీచర్ ను వినియోగించడం ద్వారా అశ్లీల కంటెంట్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్స్టా గైడ్లైన్స్కు వ్యతిరేకంగా అశ్లీల కంటెంట్ అప్లోడ్ చేస్తే వెంటనే ఇన్స్టాగ్రామ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తొలగిస్తామని ఇన్ స్టాగ్రామ్ వెల్లడించింది. ►ఈ ఆప్షన్ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ►ముందుగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను క్లిక్ చేయాలి ►క్లిక్ చేసి ప్రొఫైల్ సెంట్టింగ్ లో మెన్యు ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి ►మెన్యు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సెన్సిటీవ్ కంటెంట్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు లిమిట్, అలో, లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ డిస్ప్లే అవుతోంది ► లిమిట్ ఈవెన్ మరో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అశ్లీల్ కంటెంట్ మీ ప్రొఫైల్ లో షేర్ అవ్వడం ఆగిపోతుంది. చదవండి : ల్యాప్ ట్యాప్ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్ బాగుంటుందంట -
రికార్డు సృష్టించిన విరుష్క జంట
ముంబై: టీమిండియా సారథి విరాట్ కోహ్లి దంపతులుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానుల చేత ‘విరుష్క’లుగా పిలవబడే ఈ జంట తాజాగా ఓ రికార్టు నెలకొల్పారు. ఇన్స్టాగ్రామ్ పాపులర్ సిరీస్ ‘టేక్ ఏ బ్రేక్’లో కనిపించిన తొలి భారతీయులుగా రికార్డు సృష్టించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించే ఈ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అంతేకాక మార్క్ జుకర్బర్గ్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 59 ఐకానిక్ పర్సనాలిటీలను ఫాలో అవుతుండగా.. వారిలో తాజాగా విరష్క దంపతులు కూడా చేరారు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక కపుల్గా వీరు రికార్డు సృష్టించారు. లక్షలాది మంది అభిమానుల చేత ‘విరుష్క’గా పిలువబడే అనుష్క శర్మ, విరాట్ కోహ్లిలు తమ తమ రంగాలలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. వీరిద్దరూ తమ కెరీర్లో అద్భుతంగా రాణించడమే కాక చాలా మందికి ప్రేరణగా నిలిచారు. దాంతో విరుష్క దంపతులు.. సెలెనా గోమెజ్, మిలే సైరస్, నవోమి కాంప్బెల్ వంటి గ్లోబల్ ఐకాన్ల సరసన చేరారు. వీరు కూడా గతంలో 'టేక్ ఏ బ్రేక్' సిరీస్లో నటించారు. ఈ సిరీస్లో యూత్ ఐకాన్లుగా నిలిచే వారి వ్యక్తిగత జీవితాల గురించి లోతైన విషయాలను వెల్లడిస్తారు.(ఆమె వల్లనే నాలో ఈ మార్పు: కోహ్లి) ఇక విరుష్కల ‘టేక్ ఏ బ్రేక్’ సిరీస్ విషయానికి వస్తే.. దీనిలో అనుష్క, విరాట్లు తమ వ్యక్తిగత జీవితాల గురించేకాక వృత్తులు, ఇష్టాఇష్టాల గురించి ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధించుకున్నారు. అంతేకాక తమ దాంపత్య జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలోనే ఈ వీడియోను 150 మిలియన్ల మంది విక్షించి రికార్డు సృష్టించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.. View this post on Instagram Find out who knows who better, in this fun and interactive #TakeABreak session with us. Hope you guys enjoy it and figure out who the winner is because I couldn't! 🤭 @anushkasharma ❤️ @instagram A post shared by Virat Kohli (@virat.kohli) on Aug 11, 2020 at 9:32pm PDT
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
Advertisement