-
బాలకృష్ణను ఓడించి జగనన్నకు గిఫ్ట్ ఇస్తా
-
బాలయ్య కుటుంబ ఆస్తులు రూ.465.35 కోట్లు.. అయ్యన్నపై కేసులు 17
సాక్షి నెట్వర్క్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 2022–23లో ఆదాయం రూ.10 కోట్లు, స్థిరాస్తులు రూ.103 కోట్లు, చరాస్తులు రూ.82 కోట్లు కలిపి బాలయ్యకు మొత్తం రూ.185 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. క్రిమినల్ కేసులు ఏవీ లేవని పేర్కొన్నారు. నందమూరి హిందూ అవిభాజ్య కుటుంబంలో బాలకృష్ణకు స్థిరాస్తులు రూ.28.91 కోట్లు, చరాస్తులు రూ.2.41 కోట్లుగా చూపారు. బాలయ్య సతీమణి వసు«ంధర పేరిట రూ.179.28 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. అందులో స్థిరాస్తులు రూ.38.90 కోట్లు, చరాస్తుల విలువ రూ.140.38 కోట్లుగా చూపారు. కుమారుడు మోక్షజ్ఞ పేరిట స్థిరాస్తులు రూ.11.11 కోట్లు, చరాస్తులు రూ.58.64 కోట్లు కలిపి బాలకృష్ణ కుటుంబానికి మొత్తం ఆస్తుల విలువ రూ.465.35 కోట్లుగా చూపారు. అయ్యన్నపాత్రుడిపై 17 కేసులు చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరిట రూ.5,04,61,500, అతని భార్య పేరిట రూ.10,84,63,200 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు దళితులపై దూషణలు చేయడం.. అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అతనిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. మాగుంట వద్ద ఉన్నది రూ.18 వేలేనట దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ.. ఆయన చేతిలో ఉన్న నగదు రూ.18,529 మాత్రమేనట. టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగుంట శ్రీనివాసులరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తన చేతిలో ఉన్న నగదుతో పాటు భార్య వద్ద రూ.6,68,134, ఉమ్మడి కుటుంబ సభ్యుల (హెచ్యూఎఫ్) వద్ద రూ.67,854 నగదు ఉందని తెలిపారు. చరాస్థుల కింద తనకు రూ.4,58,30,319 ఉండగా.. భార్య పేరిట రూ.17,98,70,139, ఉమ్మడి కుటుంబం కింద రూ.4,24,94,762 ఉన్నట్టు తెలిపారు. తన పేరిట రూ.1.09 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. భార్య పేరిట రూ.30,04,44,600, ఉమ్మడి కుటుంబ సభ్యుల కింద రూ.4,29,44,876 ఉన్నట్టు పేర్కొన్నారు. కేసుల చిట్టా విప్పిన బొండా ఉమా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు (ఉమా) ఎన్నికల అఫిడవిట్లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో తనపై 23 కేసుల నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ల వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా రూ.98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. కావలి అభ్యర్థికీ కారు లేదట! కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) ఆస్తుల విలువ రూ.153.27 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అతని పేరున రూ.115.67 కోట్లు, భార్య శ్రీలత పేరిట రూ.31.92 కోట్లు, కుమార్తె వెన్నెల పేరిట రూ.5.67 కోట్లు చర, స్థిరాస్తులున్నట్టు చూపారు. కృష్ణారెడ్డి కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తులు విలువ రూ.715.62 కోట్లుగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రశాంతిరెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, ప్రభాకర్రెడ్డి పేరుతో రూ.639.26 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.17 కోట్లు ఉండగా.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.10.62 కోట్లు ఉన్నాయి. ఆ దంపతులిద్దరికీ రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్టు తెలిపారు. -
‘సహనం నా బ్లడ్లోనే లేదు..’ అభిమానులపై బాలయ్య పంచుల పర్వం
-
అభిమానిపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
సాక్షి, సత్యసాయి: ఎన్నికల ప్రచారం మొదలుపెట్టక ముందే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన శైలిలో దబ్బిడి దిబ్బిడి షురూ చేసేశారు. సహనం కోల్పోయి ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇవాళ్టి నుంచి బాలయ్య బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్లో కదిరికి ఆయన చేరుకున్నారు. ఆయన ల్యాండ్ కాగానే అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా.. బాలయ్య సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై చెయ్యి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అభిమానులపైనా ఆగ్రహం ప్రదర్శించారు. పక్కనే ఉన్న నేతలు సైతం ఆ అభిమానిని దూరంగా నెట్టేశారు. ఇదీ చదవండి: బాలయ్య కోపం ఎవరి మీద?.. అభిమానులు జర జాగ్రత్త! -
బాలయ్య కోపం ఎవరి మీద?
ఇప్పటిదాకా ఒక లెక్క. ఈసారి మాత్రం ఓ లెక్క. హిందూపురం కంచుకోటను బద్ధలు కొట్టి టీడీపీని ఓడించేందుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా దీపికకు సీటు కేటాయించింది. తద్వారా గత ఐదేళ్లలో మొక్కుబడిగా నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. అయితే నామినేషన్ల పర్వం దగ్గర పడింది కదా!. బహుశా అందుకేనేమో షూటింగ్కు బాలయ్య పేకప్ చెప్పినట్లున్నారు. ప్చ్.. హిందూపురంలో ఈసారి బాలయ్య గెలుపు కష్టమే. టీడీపీ తమ కంచుకోటగా భావిస్తూ వస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.. అదీ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న బలంగా వినిపిస్తున్న టాక్ ఇదే. ఈ నేపథ్యంలో.. శనివారం నుంచి కదిరి నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారానికి బాలయ్య సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా.. ఎన్డీయే అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారట. విశేషం ఏంటంటే.. ‘బాలయ్య అన్స్టాపబుల్’ పేరుతో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బస్సును కూడా రూపొందించారు. ఆ బస్సు గురించి చివర్లో ఓ ముచ్చట చెప్పుకుందాం. అది ఎన్టీఆర్ క్రేజ్ వల్లే.. హిందూపురం.. ఈ సీటు నుంచే స్వర్గీయ నందమూరి తారక రామారావు 1985లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మరోసారి గెలిచారు. 1994లో మూడవసారి గెలిచి 1996లో మరణించేటంతవరకూ కొనసాగారు. అంటే.. పదకొండేళ్ల పాటు ఏకధాటిగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన మరణించాక జరిగిన ఉప ఎన్నికలో అదే సీటు నుంచి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ గెలిచారు ఆయన 1999 దాకా దాదాపుగా మూడున్నరేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లోనూ అక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. ఆ సమయంలో హిందూపురం నుంచి పోటీ చేసి బాలయ్య ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారు. అయితే..ఆ సమయంలో బాలయ్య 16 వేల ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై గెలిచారు. ఇక రెండోసారి 2019 ఎన్నికల్లోనూ 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండు ఎన్నికల్లోనూ పది శాతం ఓట్ల తేడాతో బాలయ్య నెగ్గారు. ఈ రెండుసార్లూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల కారణంగా ఓట్లు చీల్చాయి. అంటే.. ఏ లెక్కన చూసుకున్నా బాలయ్య ‘అఖండ’ మెజారిటీ ఏం గెలవలేదు. పైగా ఈసారి బాలయ్యపై వ్యతిరేకతకు అదనంగా.. సీఎం జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో ఆదరణ, రాయలసీమ ఎన్నికల బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి తీసుకోవడంతో.. బాలయ్యకు హిందూపురంలో ఈసారి టీడీపీకి గడ్డు పరిస్థితే ఎదురుకావొచ్చనే చర్చా బాగా నడుస్తోంది. దూరం దూరం.. పీఏల యవ్వారం! అభివృద్ధి పనులా?.. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ సందర్శించింది వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. షూటింగ్ల బిజీలతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు, దున్నపోతుల మీద బాలయ్య పేర్లు రాసి ధర్నాలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. మొదటి దఫాగా గెలిచిన సమయంలోనే కాదు.. ప్రతిపక్ష హోదాలో రెండోసారి కూడా అదే తీరును బాలయ్య కనబరుస్తూ వచ్చారు. అందుకే అక్కడి ప్రజల్లో ఆయన తీరుపై వ్యతిరేకత బలంగా ఉంది. అంతెందుకు.. ఇప్పుడు ఆయన చేపడుతున్న బస్సు యాత్ర హడావిడి కూడా.. ఎన్నికల నేపథ్యంలోనే అదీ సుదీర్ఘకాలం పది నెలల తర్వాత ఆయన మళ్లీ నియోజకవర్గం వైపు అడుగులేయిస్తోన్నదే. వీటన్నింటికి తోడు ఆయన పీఏలపై వచ్చిన ఆరోపణలు ఆయన ఇమేజ్ను మరింత పల్చన చేశాయి. గతంలో హిందూపురంలో బాలయ్య తీరుకు నిరసనగా సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు అభిమానులు జర జాగ్రత్త! నెలల తరబడి నియోజకవర్గంలో బాలకృష్ణ కానరాక టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం పేరుకుపోయి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పర్యటన ఖరారైంది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, బాలయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి జరుగుతున్న చమక్కులు చూస్తున్నదే. అభిమానులు, కార్యకర్తలతో బాలయ్య వ్యవహరించే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల్ని నెట్టేయడం, కుదిరితే కొట్టడం.. దానిని ‘ప్రేమ’ అంటూ ప్రచారం చేసే ఎల్లో సోషల్ మీడియా పేజీలు, అభిమాన సంఘాలు అబ్బో.. ఈసారి కూడా సోషల్ మీడియా ఆ స్టఫ్ను బాగానే పంచే అవకాశమూ లేకపోలేదు. బస్సుపై బాలయ్య గుస్సా అన్స్టాపబుల్ పేరుతో ఆయన ఓ ఓటీటీలో హోస్ట్ షో నిర్వహించుకున్నారు. ఫస్ట్ సిరీస్ ఏదో బాగానే ఆడింది. కానీ, రెండోది పాపం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ప్రచార యాత్ర బస్సుకు కూడా అన్స్టాపబుల్ అని పేరు పెట్టారు. దాని మీద ఓ మూలకు టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రాన్ని ఉంచారు. ఇంకోపక్కన కూటమి నేతల ఫొటోలతో పాటు బాలయ్య ఫొటోను ఉంచారు. ఇంతకీ బస్సు మీద(పోస్టర్లో) బాలయ్య గుర్రుగా చూస్తుంది ‘అలగ జాతి, సంకర జాతి’ అని అవమానించిన బ్రదర్నా?.. లేదంటే ‘మక్కీ చూస్’ అంటూ గతంలో తిట్టిపోసిన మోదీనా? ఈ రెండూ కాకుంటే.. తండ్రి నుంచి సీటు లాక్కుని, పవన్తో పొత్తుల విషయం తనతో మాట వరుసకు కూడా చర్చించకుండా, స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం టీడీపీ మెయిన్ సీట్లో కూర్చోనివ్వకుండా అడ్డుకున్న వియ్యంకుడు చంద్రబాబు నాయుడ్నా?..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement