-
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్గా ధోని మాత్రమే నిలవగలిగాడు.తదుపరి తన వారసుడిగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.ఇక చాలా ఏళ్లుగా సీఎస్కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.నిజానికి సీఎస్కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు. కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్కే కోచ్ స్పందన ఇదే!
రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’గా అవుటైన మూడో బ్యాటర్గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్-2024 నేపథ్యంలో చెపాక్ వేదికగా చెన్నై- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్ను ఓడించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఇదిలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్లో ఆరోస్థానంలో బ్యాటింగ్కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ నిబంధన కింద అవుటయ్యాడు.అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్ వికెట్ కీపర్, కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.మైక్ హస్సీ స్పందనఈ నేపథ్యంలో రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు టీవీ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ జడ్డూను ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూల్ కింద అవుట్గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు.‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్గా పరిగెత్తేక్రమంలో యాంగిల్ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్ హస్సీ స్పష్టం చేశాడు.చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్ Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV— JioCinema (@JioCinema) May 12, 2024 -
రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
ధర్మశాల: ఐపీఎల్ టోరీ్నలో వరుసగా ఆరోసారి చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించాలనుకున్న పంజాబ్ కింగ్స్ ఆశలను రవీంద్ర జడేజా వమ్ము చేశాడు. 2021 నుంచి పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరోసారి మాత్రం గెలుపు బావుటా ఎగురవేసింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచి గత బుధవారం పంజాబ్ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ముందుగా జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బంతితోనూ మెరిసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ స్యామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), డరైల్ మిచెల్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి రెండో వికెట్కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతుల్లో రుతురాజ్, శివమ్ దూబే (0)లను అవుట్ చేయగా... మిచెల్ను హర్షల్ పటేల్ పెవిలియన్కు పంపించాడు. దాంతో చెన్నై 69/1 నుంచి 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్ పాండే (2/35) ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బెయిర్స్టో, రోసో లను అవుట్ చేసి పంజాబ్ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రభ్సిమ్రన్, కరన్, అశుతోష్లను జడేజా... శశాంక్ను సాన్ట్నెర్ అవుట్ చేయడంతో పంజాబ్ గెలుపుపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రబడ (బి) అర్‡్షదీప్ 9; రుతురాజ్ (సి) జితేశ్ (బి) చహర్ 32; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ 30; శివమ్ దూబే (సి) జితేశ్ (బి) చహర్ 0; మొయిన్ అలీ (సి) బెయిర్స్టో (బి) స్యామ్ కరన్ 17; జడేజా (సి) స్యామ్ కరన్ (బి) అర్‡్షదీప్ 43; సాన్ట్నెర్ (సి) స్యామ్ కరన్ (బి) చహర్ 11; శార్దుల్ (బి) హర్షల్ 17; ధోని (బి) హర్షల్ 0; తుషార్ (నాటౌట్) 0; గ్లీసన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–69, 4–75, 5–101, 6–122, 7–150, 8–150, 9–164. బౌలింగ్: రబడ 3–0–24–0, అర్‡్షదీప్ 4–0–42–2, స్యామ్ కరన్ 4–0–34–1, హర్ప్రీత్ బ్రార్ 1–0–19–0, రాహుల్ చహర్ 4–0–23–3, హర్షల్ పటేల్ 4–0–24–3. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) జడేజా 30; బెయిర్స్టో (బి) తుషార్ 7; రోసో (బి) తుషార్ 0; శశాంక్ (సి) సిమర్జీత్ (బి) సాన్ట్నెర్ 27; స్యామ్ కరన్ (సి) సాన్ట్నెర్ (బి) జడేజా 7; జితేశ్ (సి) ధోని (బి) సిమర్జీత్ (బి) 0; అశుతోష్ శర్మ (సి) సిమర్జీత్ (బి) జడేజా 3; బ్రార్ (నాటౌట్) 17; హర్షల్ (సి) సబ్–సమీర్ రిజ్వీ (బి) సిమర్జీత్ 12; చహర్ (బి) శార్దుల్ 16; రబడ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–62, 4–68, 5–69, 6–77, 7–78, 8–90, 9–117. బౌలింగ్: సాన్ట్నెర్ 3–0–10–1, తుషార్ దేశ్పాండే 4–0–35–2, గ్లీసన్ 4–0–41–0, జడేజా 4–0– 20–3, సిమర్జీత్ 3–0–16–2, శార్దుల్ 2–0–12–1. -
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్లో తొలుత బ్యాటింగ్లో 42 పరుగులతో అదరగొట్టిన జడ్డూ.. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను జడ్డూకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరిచింది.ఈ క్రమంలో జడేజా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. జడేజా ఇప్పటివరకు ఈ క్యాష్రిచ్ లీగ్లో 16 సార్లు మ్యాన్ ఆఫ్ది అవార్డులను గెలుచుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(15) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో ధోని రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. అదేవిధంగా మరో రికార్డును జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 40 పైగా పరుగులు, 3 వికెట్లు తీసిన ప్లేయర్గా యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్ సరసన జడేజా చేరాడు. జడేజా ఇప్పటివరకు మూడు సార్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశాడు. యువీ, వాట్సన్ కూడా మూడు సార్లు ర్లు 40 ప్లస్ స్కోర్, 3 వికెట్లు తీశారు. -
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్-2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. చెన్నై బౌలర్ల దాటికి 9 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్(30) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలయ్యారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్పాండే, సిమ్రాజిత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్లోనూ రవీంద్ర జడేజా సత్తాచాటాడు. 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్-2024లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 43 పరుగులు చేయగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డార్లీ మిచెల్(30) పరుగులు చేశాడు. మరోవైపు పంజాబ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్ రెండు, సామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. -
వారెవ్వా జడేజా.. క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో చెన్నై స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. జడ్డూ అద్బుతమైన క్యాచ్తో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను పెవిలియన్కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మతీషా పతిరానా బౌలింగ్లో తొలి బంతిని రాహుల్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. ఎడమవైపున్కు జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్తో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారెవ్వా జడ్డూ సూపర్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. జడేజా(57), ధోని(28 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్(53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డికాక్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, పతిరానా తలా వికెట్ సాధించారు. Ravi Shastri - "What a Catch, is that the Catch of IPL, WOW, that was Flying like a Trace of Bullet" Ravindra Jadeja took "One of the Greatest Catch of IPL 2024" 👏#CSKvLSG #CSKvsLSGpic.twitter.com/SQDFOz9Lmo — Richard Kettleborough (@RichKettle07) April 19, 2024 -
‘సూపర్’ పోరులో జెయింట్స్ పైచేయి
ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కోలుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది. ఛేదనలో కేఎల్ రాహుల్, డికాక్ కీలక పాత్ర పోషించగా... రెండు వరుస విజయాల తర్వాత చెన్నై తలవంచింది. లక్నో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో లక్నో కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో 8 వికెట్ల తేడాతో ఐదుసార్లు చాంపియన్ చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... రహానే (24 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (20 బంతుల్లో 30; 3 సిక్స్లు), ధోని (9 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 90 బంతుల్లోనే 134 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. ధోని మెరుపులు... ఓపెనర్ రచిన్ రవీంద్ర (0) టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగించగా... మరో ఎండ్లో రహానే కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్ప్లే ముగిసేసరికి చెన్నై 51 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (17) ప్రభావం చూపలేకపోగా, నాలుగో స్థానంలో వచ్చిన జడేజా పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే రహానేతో పాటు ఫామ్లో ఉన్న శివమ్ దూబే (3), సమీర్ రిజ్వీ (1)లను తక్కువ వ్యవధిలో అవుట్ చేసి లక్నో ఆధిక్యం ప్రదర్శించింది. ఈ సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా చెన్నై బ్యాటర్లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఒకదశలో వరుసగా 34 బంతుల పాటు బౌండరీనే రాలేదు! 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 113/5. అయితే చివరి 4 ఓవర్లలో సూపర్ కింగ్స్ చెలరేగి 63 పరుగులు రాబట్టింది. మొహసిన్ ఓవర్లో సిక్సర్తో 34 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... బిష్ణోయ్ వేసిన తర్వాతి ఓవర్లో అలీ వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. అనంతరం 19వ ఓవర్లో 4, 6 కొట్టిన ధోని... ఆఖరి ఓవర్లో మరో 2 ఫోర్లు, సిక్స్తో చెలరేగాడు. ఏడో వికెట్కు ధోని, జడేజా 13 బంతుల్లో 35 పరుగులు జోడించారు. శతక భాగస్వామ్యం... ఛేదనను రాహుల్, డికాక్ ఘనంగా ఆరంభించారు. వీరిద్దరిని ఇబ్బంది పెట్టడంలో చెన్నై బౌలర్లంతా విఫలమయ్యారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో 54 పరుగులు రాగా... 10.5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు దాటింది. 31 పరుగుల స్కోరు వద్ద డికాక్ ఇచ్చిన క్యాచ్ను పతిరణ వదిలేయగా, 31 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 41 బంతుల్లో డికాక్ కూడా హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. విజయానికి చేరువైన దశలో తక్కువ వ్యవధిలో వీరిద్దరు అవుటైనా... లక్ష్యం చేరేందుకు లక్నోకు ఇబ్బంది ఎదురు కాలేదు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (బి) కృనాల్ 36; రచిన్ (బి) మొహసిన్ 0; రుతురాజ్ (సి) రాహుల్ (బి) యశ్ 17; జడేజా (నాటౌట్) 57; దూబే (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 3; రిజ్వీ (స్టంప్డ్) రాహుల్ (బి) కృనాల్ 1; అలీ (సి) బదోని (బి) బిష్ణోయ్ 30; ధోని (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు 176. వికెట్ల పతనం: 1–4, 2–33, 3–68, 4–87, 5–90, 6–141. బౌలింగ్: హెన్రీ 3–0–26–0, మొహసిన్ 4–0–37–1, యశ్ ఠాకూర్ 4–0–45–1, కృనాల్ పాండ్యా 3–0–16–2, రవి బిష్ణోయ్ 4–0–44–1, స్టొయినిస్ 2–0–7–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) ముస్తఫిజుర్ 54; రాహుల్ (సి) జడేజా (బి) పతిరణ 82; పూరన్ (నాటౌట్) 23; స్టొయినిస్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–134, 2–161. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–26–0, తుషార్ 4–0–42–0, ముస్తఫిజుర్ 4–0–43–1, జడేజా 3–0–32–0, పతిరణ 4–0–29–1, అలీ 1–0–5–0. ఐపీఎల్లో నేడు ఢిల్లీ X హైదరాబాద్ వేదిక: న్యూఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి క్రికెటర్గా
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సార్లు నాటౌట్గా నిలిచిన బ్యాటర్గా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్ష్య ఛేదనలో ధోని ఒక్క పరుగుతో ఆజేయంగా నిలిచాడు. తద్వారా ఈ అరుదైన రికార్డను మిస్టర్ కూల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ధోని ఛేజింగ్లో అత్యధికంగా 28 సార్లు అజేయంగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడ్డూ 27 సార్లు అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్తో జడేజా ఆల్టైమ్ రికార్డును ధోని బ్రేక్ చేశాడు. ధోని, జడేజా తర్వాత స్ధానాల్లో దినేష్ కార్తీక్(23), యూసుఫ్ పఠాన్ (22), డేవిడ్ మిల్లర్(22) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IPL 2024 CSK VS KKR: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ -
IPL 2024: చరిత్రలో ఒకే ఒక్కడు.. రవీంద్ర జడేజా
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎవరికీ సాధ్యం కాని ఘనతను సీఎస్కే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సాధించాడు. 17 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో 1000 పరుగులు సాధించి, 100 వికెట్లు పడగొట్టి, 100 క్యాచ్లు పట్టుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం ద్వారా జడ్డూ క్యాష్ రిచ్ లీగ్లో 100 క్యాచ్ల మైలురాయిని తాకాడు. 231 మ్యాచ్ల ఐపీఎల్ కెరీర్లో జడేజా 2776 పరుగులు చేసి 156 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ ఖాతాలో రెండు అర్దసెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది. కేకేఆర్తో మ్యాచ్లో శ్రేయస్ క్యాచ్తో పాటు ఫిలిప్ సాల్ట్ క్యాచ్ కూడా పట్టుకున్న జడేజా.. బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో, ఫీల్డింగ్లో అద్భుత ప్రదర్శనలకు గాను జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024 CSK VS KKR: ధోని రికార్డు సమం చేసిన జడేజా
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Ravindra Jadeja - The Game Changer of CSK with ball. 🔥pic.twitter.com/HsyMhbDsTJ — Johns. (@CricCrazyJohns) April 8, 2024 బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్లో ధోని సైతం సీఎస్కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024: సొంత అభిమానులనే ఆట పట్టించిన జడ్డూ.. వైరల్ వీడియో
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎస్కే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సొంత అభిమానులనే ఆటపట్టించాడు. సీఎస్కే లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. జడ్డూ ధోని కంటే ముందే బ్యాటింగ్కు దిగుతున్నట్లు ప్రాంక్ చేసి ఫ్యాన్స్ను టీజ్ చేశాడు. సీఎస్కే గెలుపు ఖరారైన దశలో శివమ్ దూబే ఔట్ కాగా.. ఆ దశలో ధోని బ్యాటింగ్కు దిగాల్సి ఉంది. అయితే జడ్డూ ధోని కంటే ముందే బరిలోకి దిగుతున్నట్లు నటించి అభిమానులను టీజ్ చేశాడు. కొంత దూరం వెళ్లి అభిమానులు కేకలు పెట్టడంతో జడ్డూ తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. అనంతరం ధోని బరిలోకి దిగి జట్టును విజయతీరాలకు చేర్చడంలో భాగమయ్యాడు. జడ్డూ సరదాగా చేసిన ఈ పని నవ్వులు పూయించింది. స్టేడియంలో ఉన్నవారంతా కాసేపు తనివితీరా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. Ravindra Jadeja teased the Chepauk crowd by coming ahead of MS Dhoni then going back. 🤣 - This is amazing!! ❤️👌 pic.twitter.com/KPp4FewM17 — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. We thought it was a Prank by Jadeja but it was a Prank from Thala to Fans. Look How all Teammates enjoying it 😂💛 pic.twitter.com/YrzQbP7WNV — 🎰 (@StanMSD) April 9, 2024 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
IPL 2024: చెన్నై చెలరేగింది
చెన్నై: ఈ సీజన్లో భారీ స్కోర్లతో, హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్కతా నైట్రైడర్స్పై చెన్నై సూపర్కింగ్స్ చెలరేగింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఆల్రౌండ్ షో ముందు నైట్రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సూపర్కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్! సూపర్కింగ్స్ బౌలర్లు రవీంద్ర జడేజా (3/18), తుషార్ దేశ్పాండే (3/33), ముస్తఫిజుర్ (2/22) మూకుమ్మడిగా వికెట్లను పడేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు) రాణించగా, శివమ్ దూబే (18 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్లు) మెరిపించాడు. కోల్కతా విలవిల... నైట్రైడర్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆఖరిదాకా కష్టాలతోనే సాగింది. తుషార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0) డకౌటయ్యాడు. ఓపెనర్గా చెలరేగిపోతున్న సునీల్ నరైన్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రఘువంశీ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కాసేపు ధాటిగా ఆడారంతే! పవర్ప్లేలో జట్టు 56/1 స్కోరు చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... జడేజా బౌలింగ్కు దిగడంతో కోల్కతా కష్టాల పాలైంది. తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7వ) వాళ్లిద్దర్నీ అవుట్ చేసిన జడేజా మరుసటి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (3)ను పెవిలియన్ చేర్చాడు. 64 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. రమణ్దీప్ (13) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. శ్రేయస్ చేసిన ఆమాత్రం స్కోరుతో కష్టంగా వంద పరుగులు దాటింది. తర్వాత తుషార్ దెబ్బకు కోల్కతా కుదేలైంది. హిట్టర్లు రింకూ సింగ్ (9), రసెల్ (10)లను అవుట్ చేయడంతో స్కోరులో జోరుకు ఆస్కారమే లేకపోయింది. రుతురాజ్ అర్ధసెంచరీ సులువైన లక్ష్యం కావడంతో హిట్టింగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ఆరంభంలోనే అవుటైనా చెన్నై దూకుడుకు ఢోకా లేకపోయింది. రుతురాజ్, మిచెల్ (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్ను సాఫీగా నడిపించారు. తొలి సగం (10) ఓవర్లలో 81/1 స్కోరు చేసింది. రుతురాజ్ 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్ను అవుట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడగొట్టాడు. దీంతో రెండో వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లక్ష్యానికి చేరువలో దూబే బౌల్డవగా లాంఛనాన్ని ధోని (1 నాటౌట్), రుతురాజ్ ముగించారు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) తుషార్ 0; నరైన్ (సి) తీక్షణ (బి) జడేజా 27; రఘువంశీ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 24; శ్రేయస్ (సి) జడేజా (బి) ముస్తఫిజుర్ 34; వెంకటేశ్ (సి) మిచెల్ (బి) జడేజా 3; రమణ్దీప్ (బి) తీక్షణ 13; రింకూ (బి) తుషార్ 9; రసెల్ (సి) మిచెల్ (బి) తుషార్ 10; అనుకుల్ (నాటౌట్) 3; స్టార్క్ (సి) రవీంద్ర (బి) ముస్తఫిజుర్ 0; వైభవ్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–0, 2–56, 3–60, 4–64, 5–85, 6–112, 7–127, 8–135, 9–135. బౌలింగ్ : తుషార్ 4–0–33–3, ముస్తఫిజుర్ 4–0 –22–2, శార్దుల్ 3–0–27–0, తీక్షణ 4–0–28–1, జడేజా 4–0–18–3, రచిన్ 1–0–4–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) వరుణ్ (బి) వైభవ్ 15; రుతురాజ్ (నాటౌట్) 67; మిచెల్ (బి) నరైన్ 25; దూబే (బి) వైభవ్ 28; ధోని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1–27, 2–97, 3–135. బౌలింగ్: స్టార్క్ 3–0–29–0, వైభవ్ 4–0–28–2, అనుకుల్ 1.4–0– 18–0, నరైన్ 4–0–30–1, వరుణ్ చక్రవర్తి 4–0– 26–0, రసెల్ 1–0–8–0. -
IPL 2024: 'సెంచరీ' కొట్టిన రవీంద్ర జడేజా..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 100 క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల క్లబ్లో జడ్డూ చేరాడు చేరాడు. ఈ మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్గా జడేజా నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో రెండు క్యాచ్లు పట్టిన జడ్డూ.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(110) టాప్లో ఉండగా.. సురేశ్ రైనా(109), రోహిత్ శర్మ(100), రవీంద్ర జడేజా(100), శిఖర్ ధావన్(98) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కెకేఆర్పై 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే తలా మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్ రెండు, థీక్షణ ఒక్క వికెట్సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సీఎస్కే 17. 4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(28) మరోసారి అదరగొట్టాడు.కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా రెండు వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఒక్క వికెట్ సాధించాడు. Jadeja 𝙰̶𝚃̶ ON POINT 💛🔥#IPLonJioCinema #TATAIPL #CSKvKKR #IPLinTamil pic.twitter.com/Cppty7aGqX — JioCinema (@JioCinema) April 8, 2024 -
SRH: ధోని రావొద్దనే కమిన్స్ ‘కన్నింగ్’ ప్లాన్?!
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో కమిన్స్ కెప్టెన్సీని ప్రస్తావిస్తూ.. టీ20 ప్రపంచకప్లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తావా అంటూ ప్రశ్నలు సంధించాడు. ఫలితంగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?!... ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ శుక్రవారం ఉప్పల్ వేదికగా సీఎస్కేతో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్లో వికెట్ మీద రన్స్ రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు ఇబ్బంది పడగా.. పిచ్ పరిస్థితులను రైజర్స్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేయగలిగారు. శివం దూబే ఒక్కడు ధనాధన్ ఇన్నింగ్స్(24 బంతుల్లో 45) ఆడగా.. అతడిని కమిన్స్ తన బౌలింగ్లోనే అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. దూబే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇక పందొమ్మిదో ఓవర్ నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో జడ్డూ రనౌట్ కావాల్సింది. అయితే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు యత్నించిన జడ్డూ.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డు తగిలినట్లుగా కనిపించింది. దీంతో రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్కు సిగ్నల్ ఇచ్చాడు. అయితే, కెప్టెన్ కమిన్స్ మాత్రం జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా జడ్డూకు లైఫ్ వచ్చింది. ఇక డారిల్ మిచెల్ స్థానంలో మైదానంలోకి వచ్చిన ధోని ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇదిలా ఉంటే.. జడ్డూ విషయంలో కమిన్స్ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద ఎత్తు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పందిస్తూ.. ‘‘జడేజా అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్న ప్యాట్ కమిన్స్కు రెండు ప్రశ్నలు.. పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజులోనే ఉండనిచ్చి ధోనిని డ్రెసింగ్రూంకే పరిమితం చేసేందుకు పన్నిన వ్యూహమా? ఒకవేళ టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో కూడా ఇలాగే చేస్తాడా?’’ అని కమిన్స్ను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ధోనిని మైదానంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు.. అతడు బ్యాట్ ఝులిపించకుండా ఉండేందుకు ఇలా చేశాడని కైఫ్ పరోక్షంగా కమిన్స్ను తప్పుబట్టాడు. అదే సమయంలో.. వరల్డ్కప్ లాంటి ఈవెంట్లలో కూడా ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తావా అని ప్రశ్నించాడు. అయితే, కైఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గెలుపు కోసం కెప్టెన్లు తమదైన వ్యూహాలు అమలు చేయడంలో తప్పు లేదు అని కొంతమంది అంటుండగా.. అసలు వరల్డ్కప్నకు దీనికి సంబంధం ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. Two questions to Pat Cummins on withdrawing the obstructing the field appeal against Jadeja. Was it a tactical call to let a struggling Jadeja be the crease and keep Dhoni indoors? Would he have done the same if it was Virat Kohli at World T20? — Mohammad Kaif (@MohammadKaif) April 5, 2024 మరికొందరేమో.. ‘‘ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ మార్ష్. కమిన్స్ కాదు. మీరు కావాలనే విరాట్ కోహ్లి పేరును ప్రస్తావించి హైలైట్ అవ్వాలని చూస్తున్నారు కదా’’అని సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో చెన్నైపై సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: #Kavya Maran: పట్టపగ్గాల్లేని సంతోషం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి? Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 -
CSK: ఆ రెండు తప్పుల వల్లే ఓడిపోయాం: రుతురాజ్
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మెరుగైన ఆరంభం అందుకున్నా .. దానిని నిలబెట్టుకోలేకపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఉప్పల్ పిచ్పై 170- 175 పరుగులు చేసి ఉంటే ఫలితం కాస్త వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా సన్రైజర్స్ ఆటగాళ్లు తెలివిగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024లో సీఎస్కే తమ నాలుగో మ్యాచ్లో సన్రైజర్స్తో తలపడింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో రచిన్ రవీంద్ర(12) మరోసారి తేలిపోగా.. రుతురాజ్ గైక్వాడ్(26) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక ఉప్పల్ పిచ్ స్లోగా ఉండటంతో రన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డ రహానే 30 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేయగా.. శివం దూబే మాత్రం మెరుపులు(24 బంతుల్లో 45) మెరిపించాడు. స్పిన్నర్లను అటాక్ చేస్తూ పరుగులు రాబట్టాడు. 𝘿𝙪𝙗𝙚 𝘿𝙚𝙢𝙤𝙡𝙞𝙩𝙞𝙤𝙣 💥#SRHvCSK #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/j2pCdp0VAF — JioCinema (@JioCinema) April 5, 2024 దీంతో స్పిన్నర్లను పక్కనపెట్టి పేసర్లను దించిన రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ తన బౌలింగ్లో దూబేను అవుట్ చేశాడు. అనంతరం జడ్డూ(31- నాటౌట్), డారిల్ మిచెల్(13) కాసేపు బ్యాట్ ఝులిపించినా.. ఆఖరి ఐదు ఓవర్లలో సీఎస్కేకు కేవలం 38 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సీఎస్కే 165 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఆరంభంలో ట్రవిస్ హెడ్ క్యాచ్ను మొయిన్ అలీ మిస్ చేయగా అతడికి లైఫ్ లభించింది. ఇక పవర్ ప్లేలో విధ్వంసరచన చేసిన అభిషేక్ శర్మ (12 బంతుల్లోనే 37 రన్స్)రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 ఆ రెండు తప్పులే కొంపముంచాయి ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ‘‘ఈ పిచ్ చాలా స్లోగా ఉంది. వాళ్ల బౌలర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని మమ్మల్ని దెబ్బకొట్టారు. ఆరంభంలో మేము బాగానే ఆడాం. అయితే, తర్వాత వాళ్లు పైచేయి సాధించారు. ఇది నల్లరేగడి పిచ్.. నెమ్మదిగా ఉంటుందని ముందే అంచనా వేశాం. కానీ.. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లో అయిపోయింది. పవర్ ప్లేలో మేము ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం, ఓ క్యాచ్ మిస్ చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రత్యర్థిని 19వ ఓవర్ వరకు తీసుకువచ్చాం’’ అని పేర్కొన్నాడు. ఆఖరి వరకు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడమని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పవర్ ప్లేలో రైజర్స్ను కట్టడి చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని రుతురాజ్ గైక్వాడ్ అంగీకరించాడు. చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వైరల్
IPL 2024- SRH Crush CSK By 6 Wickets: ఐపీఎల్-2024లో సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయ గర్జన చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను మట్టికరిపించి ఉప్పల్లో జయభేరి మోగించింది. హోం గ్రౌండ్లో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రైజర్స్.. సీఎస్కేను 165 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి పదకొండు బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. ఆరు వికెట్ల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ పిచ్పై పరుగులు రాబట్టేందుకు సీఎస్కే బ్యాటర్లు కష్టపడుతున్న వేళ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. నిజానికి 19వ ఓవర్ నాలుగో బంతికే జడ్డూ అవుట్ కావాల్సింది. సన్రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో షాట్కు యత్నించిన జడేజా విఫలమయ్యాడు. పరుగు కోసం క్రీజును వీడిన జడ్డూ.. భువీ చేతికి బంతి చిక్కడాన్ని గమనించి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రనౌట్ కాకుండా.. ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డుతగిలినట్లు కనిపించింది. విషయాన్ని గమనించిన సన్రైజర్స్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ నిబంధనల ప్రకారం.. ‘‘అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్’’కు సిగ్నల్ ఇచ్చాడు. అంపైర్లు సైతం ఈ విషయం గురించి స్పష్టత కోసం థర్డ్ అంపైర్ను సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. అయితే, అనూహ్యంగా సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జడేజా విషయంలో అప్పీలును వెనక్కి తీసుకున్నాడు. ఫలితంగా లైఫ్ పొందిన జడ్డూ ఆఖరి వరకు నాటౌట్గా నిలిచాడు. Obstructing or not? 🤔 Skipper Pat Cummins opts not to appeal 👏👏#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/l85UXQEa4S — JioCinema (@JioCinema) April 5, 2024 ఈ క్రమంలో జడ్డూ ‘అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్’ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్.. ప్యాట్ కమిన్స్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం ధోని ముందుగా బ్యాటింగ్కు రావడాన్ని అడ్డుకునేందుకే కమిన్స్.. జడ్డూ విషయంలో అప్పీలు వెనక్కి తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్? ఫీల్డింగ్ చేస్తున్న జట్టుకు తన మాటలు లేదంటే చర్యల ద్వారా ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా అడ్డుతగిలితే.. అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ నిబంధన కింద అతడిని అవుట్గా ప్రకటిస్తారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విధ్వంసకర వీరుడు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆల్రౌండర్గా!
వెస్టిండీస్ ఆల్రౌండర్, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆండ్రీ రసెల్ చరిత్ర సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో రసెల్ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్ గ్రీన్(33), రజత్ పాటిదార్(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్ హిట్టర్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండా చేశారు కేకేఆర్ బ్యాటర్లు. ధనాధన్ ఇన్నింగ్స్తో 16.5 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసి ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీపై కోల్కతా విజయానికి కారణమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన ఆండ్రీ రసెల్ ఐపీఎల్లో సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. 𝐃𝐊 🤝𝐕𝐊 The @RCBTweets batters flourish with high octane maximums💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa #TATAIPL | #RCBvKKR pic.twitter.com/t112XqH29R — IndianPremierLeague (@IPL) March 29, 2024 లీగ్ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు కనీసం వంద వికెట్లు తీసిన రెండో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ ఆల్రౌండర్, టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. జడ్డూ ఇప్పటి వరకు 228 ఐపీఎల్ మ్యాచ్లలో కలిపి 2724 పరుగులు సాధించడంతో పాటు.. 152 వికెట్లు తీశాడు. ఇక రైటార్మ్ పేస్ బౌలర్ అయిన రసెల్ 114 మ్యాచ్లలో 2326 రన్స్ పూర్తి చేసుకుని 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా 2012లో ఢిల్లీ డేర్డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున రసెల్ క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు కేకేఆర్ శిబిరంలో చేరిన అతడు పదేళ్లుగా అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రసెల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్లో రసెల్ రెండు వికెట్లు తీశాడు కూడా! నరైన్ @ 500 వెస్టిండీస్ ఆఫ్స్పిన్నర్ సునీల్ నరైన్ టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్తో అతను ఈ ఫార్మాట్లో అతను 500 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా అతను నిలిచాడు. నరైన్కు ముందు పొలార్డ్ (660), డ్వేన్ బ్రేవో (573), షోయబ్ మలిక్ (542) అతనికంటే ముందు 500 మ్యాచ్లు ఆడారు. 35 ఏళ్ల నరైన్ ఈ సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 17 టి20 జట్లకు ప్రాతినిధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ సహా మొత్తం 10 టైటిల్స్ విజయాల్లో అతను భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో 2012నుంచి వరుసగా 13 సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్ తరఫున 164 మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో కూడా ఓపెనర్గా, పించ్ హిట్టర్గా బరిలోకి దిగి కేకేఆర్ పలు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్ కామెంట్ -
కోహ్లిని ‘బెదిరించిన’ జడ్డూ.. ఆర్సీబీ స్టార్ రియాక్షన్ అదుర్స్!
ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి పరస్పరం టీజ్ చేసుకోవడం హైలైట్గా నిలిచింది. చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే- ఆర్సీబీ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు తెరలేచిన విషయం తెలిసిందే. సొంతమైదానంలో బెంగళూరుపై ఆధిపత్యం చాటుకుంటూ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో సీజన్ను ఆరంభించింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేసే క్రమంలో రవీంద్ర జడేజా కోహ్లిని ఆటపట్టించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పదకొండో ఓవర్లో జడ్డూ.. కామెరాన్ గ్రీన్ను తన బౌలింగ్తో బెంబేలెత్తించాడు. అదే సమయంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లి వద్దకు వెళ్లి.. బాల్ అతడి ముఖానికి దగ్గరగా తీసుకువెళ్లి రనౌట్ చేస్తానంటూ సరదాగా బెదిరించాడు. వెంటనే పొజిషన్లోకి వచ్చిన కోహ్లి.. ‘‘పాపం.. అతడిని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు’’ అంటూ కామెరాన్ గ్రీన్ను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు అంటూ జడ్డూకు బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంఘటన అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా అండర్-19 స్థాయి నుంచే కోహ్లి- జడ్డూ మధ్య స్నేహం ఉంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ కోహ్లి 21 పరుగులకే పరిమితం కాగా.. సీఎస్కే కీలక ఆల్రౌండర్ జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 25 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? Shining on #CSK Debut ✨ Home Support 💛 Finishing touch 💪 Summing up @ChennaiIPL's opening win of the season with Shivam Dube & Debutant Rachin Ravindra 👌👌 - By @RajalArora #TATAIPL | #CSKvRCB pic.twitter.com/r65i4T0zb9 — IndianPremierLeague (@IPL) March 23, 2024 -
జడేజా స్పిన్ మయాజాలం.. 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
రాంఛీ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ జట్టు 353 పరుగులకు ఆలౌటైంది. 302/7 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన స్టోక్స్ సేన అదనంగా 51 పరుగులు చేసి ఆలౌటైంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చిక్కుకున్నారు. ఆఖరి మూడు వికెట్లను కూడా జడ్డూనే పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(122 నాటౌట్) అద్భుత శతకంతో చెలరేగగా.. బెన్ ఫోక్స్(47), ఓలీ రాబిన్సన్(58) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. -
అరె బాబు.. నన్నేం చూస్తున్నావు.. రోహిత్ శర్మ ఆగ్రహం
India vs England, 4th Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత కూల్గా ఉంటాడో.. తేడా వస్తే అంతే సీరియస్ అవుతాడు. కీలక సమయంలో ఆటగాళ్లు సరైన రీతిలో ఆడకపోతే ఫీల్డ్లోనే వాళ్లపై గట్టిగా అరవడానికి కూడా వెనుకాడడు హిట్మ్యాన్. ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తొలుత రోహిత్ శర్మ ఆగ్రహాన్ని చవిచూశాడు. ఓవైపు అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ చక్కగా వికెట్లు తీస్తుంటే.. సిరాజ్ మాత్రం అనుభవలేమి బౌలర్లా పేలవ ప్రదర్శన కనబరిచాడు. తొలి సెషన్లో భాగంగా వేసిన తొలి ఆరు ఓవర్లలోనే ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ సాబ్కు కోపమొచ్చింది. ఇక శుక్రవారం నాటి మ్యాచ్లో సిరాజ్ తర్వాత.. అదే స్థాయిలో రోహిత్ ఆగ్రహానికి గురైంది ఎవరైనా ఉన్నారంటే కెమెరామెన్. అవునండీ.. గంభీర వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో కెమెరామెన్ చేసిన పని వల్ల రోహిత్ తీవ్ర అసహానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 59.3వ ఓవర్లో వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ క్రీజులో ఉన్న సమయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుట్ కోసం అప్పీలు చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన బాల్ ట్రాకింగ్ కాకుండా.. ఆ సమయంలో రోహిత్ శర్మ రియాక్షన్పై దృష్టి సారించిన కెమెరామెన్.. బిగ్స్క్రీన్పై రోహిత్ రూపాన్ని ప్రదర్శించాడు. దీంతో సహనం కోల్పోయిన రోహిత్.. ‘‘ఏయ్ నన్నెందుకు చూపిస్తున్నావు? ఏంటిది?’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు.. ఈ రివ్యూను టీమిండియా కోల్పోవడంతో రోహిత్ కోపం రెట్టింపైంది. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ 106, ఓలీ రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. A reverse swing masterclass ft. Siraj 🔥 The 🇮🇳 pacer sends Tom Hartley 𝙥𝙖𝙘𝙠𝙞𝙣𝙜! 🤩#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports#INDvENG pic.twitter.com/qQFpOlX0xn — JioCinema (@JioCinema) February 23, 2024 చదవండి: Ind vs Eng: ‘బజ్బాల్ కాదు’.. జో రూట్ సరికొత్త చరిత్ర! ఒకే ఒక్కడు.. Captain Rohit Sharma is a pure entertainer 😄#INDvsENG #T20WorldCuppic.twitter.com/mo9Lp9T5Wt — Ajmul Cap (@AjmulCap2) February 23, 2024 Rohit Sharma's reaction to camera man to focus on DRS not on me🤣🤣#INDvsENG #Rohitsharma #AkashDeep #Siraj #Pope #CricketTwitter #JoeRoot pic.twitter.com/Ikv2wZ68d1 — Shahid wani (@shayu9682) February 23, 2024 -
జడేజా సూపర్ డెలివరీ.. స్టోక్స్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్ ఔటయ్యాడు. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతితో స్టోక్సీని బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన జడేజా తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్ అయ్యి స్టోక్స్ ఫ్రంట్ప్యాడ్ను తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ సైతం అంతే వేగంగా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్ కనీసం రివ్యూ కూడా తీసుకోకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్లో 40 ఓవర్లకు ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. pic.twitter.com/nNAMrv788e — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
దూసుకుపోతున్న రవీంద్ర జడేజా
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాఇటీవలికాలంలో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్గానే కాకుండా బ్యాటర్గానూ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్ట్లో ఆల్రౌండ్ షోతో ఇరగదీసిన జడ్డూ భాయ్.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కిన జడ్డూ.. అనంతరం బంతితో విజృంభించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. సెకెండ్ ఇన్నింగ్స్లో విశ్వరూపం ప్రదర్శించి ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 122 పరుగులకే కుప్పకూలి 434 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండో టెస్ట్ మిస్ అయిన జడేజా తొలి మ్యాచ్లోనూ సత్తా చాటాడు. ఆ మ్యాచ్లోనూ అతను ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడగొట్టిన జడేజా.. బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్లో 87, సెకెండ్ ఇన్నింగ్స్లో 2 పరుగులు చేశాడు. టెస్ట్ల్లో పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా రాటుదేలిన జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు అతని గణాంకాలే సాక్ష్యం. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్లు ఆడిన జడేజా బ్యాటింగ్లో 49.95 సగటున 1520 పరుగులు చేసి బౌలింగ్లో 25.08 సగటున 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ఈ టోర్నీలో జడ్డూ మూడు సెంచరీలు, 10 అర్దసెంచరీలు బాదాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) విషయానికొస్తే.. జడేజా ఇప్పటివరకు (ఇంగ్లండ్తో మూడో టెస్ట్) 5 మ్యాచ్లు ఆడి సెంచరీ, రెండు అర్దసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. బౌలింగ్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. -
నా భార్యకు అంకితం.. జడ్డూ ఎందుకిలా చేశావు?
ఇంగ్లండ్తో మూడో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చి.. సొంత మైదానం ‘రాజ్కోట్’లో రాజులా తలెత్తుకున్నాడు. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి.. ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’’ అందుకున్నాడు. అనంతరం అవార్డును భార్య రివాబాకు అంకితమిస్తూ ఆమెపై ప్రేమను చాటుకున్నాడు జడ్డూ. కాగా రాజ్కోట్ టెస్టుకు ముందు జడ్డూ- రివాబాపై అతడి తండ్రి అనిరుద్ సిన్హ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడని.. కోడలి వల్లే తమకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రివాబా రాకతో కుటుంబం విఛ్చిన్నమైపోయిందని.. కనీసం తన మనవరాలిని ఒక్కసారి కూడా చూడనివ్వలేదని వాపోయాడు. తాను కష్టపడి కుమారుడిని క్రికెటర్ను చేశానని పేర్కొన్న అనిరుద్ సిన్హ.. రవీంద్ర సంపాదనపై అతడి భార్య, అత్తమామల పెత్తనం ఎక్కువైపోయిందని ఆరోపించాడు. అయితే, ఇందుకు సోషల్ మీడియా వేదికగా బదులిచ్చిన రవీంద్ర జడేజా.. తన భార్య, బీజేపీ ఎమ్మెల్యే అయిన రివాబాపై బురద జల్లేందుకే ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూలు అని మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన అవార్డును భార్యకు ఇలా అంకితమివ్వడం విశేషం. జడ్డూ ఎందుకిలా చేశావు? తద్వారా సతీమణిపై తనకున్న ప్రేమను జడ్డూ మరోసారి చాటుకున్నాడని అభిమానులు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం.. ‘‘జడ్డూ చేష్టలు అతడి తండ్రిని మరింత బాధపెట్టేవిగా.. రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. నిజానికి అతడు క్రికెటర్గా ఎదగడంలో తండ్రి, సోదరిది కీలక పాత్ర తనే గతంలో చెప్పాడు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా హైదరాబాద్ టెస్టులో బ్యాటింగ్తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఈ క్రమంలో వైజాగ్లో రెండో మ్యాచ్కు దూరమైన అతడు.. మూడో టెస్టుతో తిరిగి వచ్చాడు. శతకం(112) బాదడంతో పాటు మొత్తంగా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్పై టీమిండియా చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు. -
ఎక్కడైనా గెలవగలం: గంగూలీకి రోహిత్ కౌంటర్?!
ఎలాంటి పిచ్ల మీదైనా గెలవగల సత్తా టీమిండియాకు ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. సౌతాఫ్రికాలో టెస్టు మ్యాచ్ గెలవడమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్లే కావాలని పట్టుబట్టే రకం తాము కాదని.. అయినా పిచ్ రూపకల్పన పూర్తిగా క్యూరేటర్ నిర్ణయమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో తాజా సిరీస్లో ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లకు ఎదురొడ్డి విజయాలు నమోదు చేస్తున్నామని జట్టును ప్రశంసించాడు. కాగా ఉపఖండ పిచ్లు సాధారణంగా స్పిన్కు అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. అదే విధంగా విదేశాల్లో ముఖ్యంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామంగా ఉంటాయి. అయితే, ఇంగ్లండ్ భారత గడ్డపై టెస్టులు ఆడుతున్నపుడల్లా.. ముఖ్యంగా గత సిరీస్ సమయంలో మ్యాచ్లు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంతో మైకేల్ వాన్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. టీమిండియాకు అనుకూల పిచ్లు రూపొందించారంటూ .. బంతి ఇంతలా టర్న్ అవడం ఏమిటని ప్రశ్నించారు. సొంతగడ్డపై ఆడుతున్నపుడు హోం టీమ్కు కాస్త అడ్వాంటేజ్ ఉంటుందనే విషయాన్ని మరిచి టీమిండియా ప్రతిభను తక్కువ చేసేలా మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ సైతం ర్యాంక్ టర్నర్స్(స్పిన్ అనుకూల పిచ్లు) మాత్రమే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి వరల్డ్క్లాస్ పేసర్లు జట్టులో ఉన్నారని.. వాళ్లు కూడా స్పిన్నర్ల మాదిరే పది వికెట్లు తీస్తే చూడాలని ఉందని దాదా పేర్కొన్నాడు. ఈ విషయంపై ఇప్పటికే హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించగా.. మూడో టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం రెస్పాండ్ అయ్యాడు. ఈ మేరకు.. ‘‘ఇలాంటి పిచ్లపై మేము గతంలో చాలా మ్యాచ్లు గెలిచాం. నిజానికి బంతి టర్న్ అయితే.. దానిని మాకు అనుకూలంగా మార్చుకోవడం మాకున్న బలం. జట్టు సమతూకంగా ఉండటానికి ఇది దోహదం చేస్తుంది. అయితే, పిచ్ ఎలా ఉండాలన్న అంశాన్ని మేము డిసైడ్ చేయం కదా! మ్యాచ్కు రెండు రోజుల ముందు వేదిక దగ్గరకు వస్తాం. ఆ రెండు రోజుల్లో మేము ఎలాంటి మార్పులు చేయగలం. క్యూరేటర్ల నిర్ణయానుసారమే పిచ్ రూపకల్పన జరుగుతుంది. అయితే, వికెట్ ఎలా ఉన్నా ఆడి గెలవడమే మా బలం. సౌతాఫ్రికాలో కేప్టౌన్ టెస్టులో ఎలాంటి పిచ్ మీద మేము అద్భుత విజయం సాధించామో చూశారు కదా! ఈ సిరీస్లో గత మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లు ఎదుర్కొన్నాం. హైదరాబాద్లో బాల్ స్పిన్ అయింది. వికెట్ కాస్త స్లోగా ఉంది. వైజాగ్లో మ్యాచ్ సాగుతున్న కొద్దీ మరింత స్లోగా మారింది. ఇక్కడ తొలి మూడు రోజులు కూడా బాగానే ఉంది. నాలుగో రోజు మాత్రం కాస్త ఎక్కువగా టర్న్ అయింది. ఇండియాలో పిచ్లు ఇలాగే ఉంటాయి’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టే తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అద్బుత స్పెల్(5/41) కూడా వేశాడని రోహిత్ ఈ సందర్భంగా ప్రశంసించాడు. కాగా రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్పై 434 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 2-1తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు జరుగనుంది. చదవండి: Ind vs Eng: అతడి ఇన్నింగ్స్ అద్భుతం.. సిరీస్ గెలిచి తీరతాం: స్టోక్స్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement