-
సీఎంవో వరకు వస్తుంది
అమిత్ షా ఫేక్ వీడియో కేసుబీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య హిమాయత్ నగర్: అమిత్ షా ఫేక్ వీడియో కేసు సీఎం రేవంత్రెడ్డి కార్యాలయం వరకు వస్తుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు, రాసిపెట్టుకోండి, ఇంకా లోతుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది’అని బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీజేపీ అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మికి చెందిన వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లెట్స్ ఓట్ క్యాంపెయిన్ పేరుతో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాల మైదానంలో మ్యూజికల్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తేజస్వి సూర్య మాట్లాడుతూ.. ఈ ఎన్నికలలో తెలంగాణలో 15 సీట్లలో బీజేపీ విజయం సాఽధిస్తుందని, దక్షిణ భారతంలో కొత్త రికార్డ్ సృష్టిస్తుందన్నారు. -
దానం నాగేందర్ను గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అబిడ్స్: సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్ షోల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అయిదేళ్లుగా ఎంపీగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్ ప్రజలకు ఏ ఒక్కరోజు అందుబాటులో లేరన్నారు. ఎన్నికలు ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండే దానం నాగేందర్ను గెలిపిస్తే సికింద్రాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆరు గ్యారంటీలను తాము ఇచ్చిన హామీ ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి.. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్లు తట్టుకోలేక పోతున్నాయన్నారు. దానం నాగేందర్ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండి సేవలందిస్తానన్నారు. ఒక్కరోజు కూడా ప్రజల వద్దకు రాని కిషన్రెడ్డిని ఓడించాలని కోరారు. కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఫిరోజ్ఖాన్, నాయకులు కొండల్, వినోద్కుమార్, శ్రీశైలం యాదవ్, సత్యనారాయణ్, ఫరీద్, కంచెర్ల చంద్రశేఖర్రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సికింద్రాబాద్కు కిషన్రెడ్డి చేసిందేమీ లేదు
బన్సీలాల్పేట్: సికింద్రాబాద్ ఎంపీగా నియోజకవర్గాన్ని పట్టించుకోని బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డిని, రాజకీయ నిలకడలేని కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్లను ప్రజలు ఓడించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్లు కోరారు. బన్సీలాల్పేట్ డివిజన్ భోలక్పూర్, న్యూబోయిగూడ, ఐడీహెచ్ కాలనీ, గొల్లకొమురయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో మంగళవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, నాలా విస్తరణ, డబుల్ బెడ్రూం ఇళ్లు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించి సికింద్రాబాద్కు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నగర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. నగరంలో కరెంట్ కోతలు, నీటి సరఫరా, ఇతరత్రా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ● దానం నాగేందర్కు రాజకీయ నిలకడ లేదు ● బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు, ఎమ్మెల్యే తలసాని -
అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్కే
చార్మినార్: అన్ని వర్గాల ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉందని తెలంగాణ ప్రచార, ప్రణాళిక కమిటీ కన్వీనర్ అలీ మస్కతి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రచారం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్టంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని వర్గాల ఓటర్లతో పాటు ముస్లిం ఓటర్లు తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించనున్నారని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్లో మత రాజకీయాలకు స్థానికులు స్వస్తి చెప్పనున్నారన్నారు. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్కు ఓటు వేయడానికి ఇరు వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలతో సంతృప్తి చెందుతున్న ఇరు వర్గాల ఓటర్లు తమ పార్టీకే ఓటు వేయనున్నారన్నారు. -
ఐపీఎల్ మ్యాచ్కు ప్రత్యేక బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 8వ తేదీన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్–20 క్రికెట్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈసీఐఎల్, ఎల్బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్పల్లి హౌసింగ్బోర్డ్, జూబ్లీ బస్స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. అ లాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement