బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపని ఆ పార్టీ నాయకులు చెప్పారు. భారీ మెజార్టీ కోసం కలిసి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆదివారం ఈ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ భారీ విజయం సాధించేందుకు అందరూ కలిసి పనిచేద్దామని చెప్పారు.
20 రోజుల పాటు ఆయా నియోజకవర్గ నాయకులు ఓటర్లను కలిసి అత్యధిక మెజార్టీ సాధించే దిశగా పనిచేయాలని కోరారు. బూత్స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇంకా ఓటు నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులంతా ఓటర్లుగా చేరేలా దృష్టి సారించాలని కోరారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పట్టభద్రులు టీడీపీ, బీజేపీ నాయకుల మాయమాటలను నమ్మవద్దని కోరారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమ పార్టీ ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని తెలిపారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబు, సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
విజయం మనదే.. భారీ మెజార్టీకి కృషి
Published Mon, Feb 20 2023 4:40 AM
Advertisement
Advertisement
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
ఎన్డీఏ కూటమి కీలక సమావేశం..
హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు
T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్..
కేంద్ర కేబినెట్ లో ఏపీకి 4 లేదా 5 మంత్రి పదవులు
18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!
చాలా కాలం తరువాత లవ్స్టోరీతో వస్తున్న సిద్ధార్థ్
Gaming: గురి తప్పకుండా..
సౌత్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న సల్మాన్ ఖాన్!
పొద్దు పోతున్నది...
భారత్లోకి ఎయిర్ టాక్సీ.. ధరలు ఎలా ఉంటాయంటే?
తప్పక చదవండి
- హైదరాబాద్ పబ్ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
- 'లవ్ మౌళి' సినిమా రివ్యూ
- Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
- పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
- మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
- జోసా కౌన్సెలింగ్కు సర్వం సిద్ధం!
- అరాచకాన్ని అరికట్టండి
- ఊరూరా విధ్వంసం.. అదే టీడీపీ లక్ష్యం
- టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
- ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు
Advertisement