Sakshi News home page

ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్

Published Tue, Nov 14 2023 10:13 AM

Actor Madhavan Reacts On The Performance Of Income Tax Department - Sakshi

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్‌ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్‌ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్‌ పొందడంతో ఆయన స్పందించారు.

అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది.

Advertisement

What’s your opinion

Advertisement