‘నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుదాం’ అంటున్నారు కామాక్ష్మి, విశాల సిస్టర్స్. ముంబైకి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ‘ది సౌండ్ స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తాము నేర్చుకున్న సంగీతాన్ని పేద పిల్లల చెంతకు తీసుకువెళుతున్నారు. గత పది సంవత్సరాలుగా కామాక్షి, విశాల సిస్టర్స్ పది వేలమంది పిల్లలకు సంగీత పాఠాలు బోధించారు. టైమ్తో అప్డెట్ అవుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలను డిజైన్ చేశారు.
‘జీవితంలో ప్రతి దశలో సంగీతం ఆహ్లాదాన్ని, శక్తిని ఇస్తుంది. సంగీతం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ల కోసమే అనే భావనను మార్చాలనుకున్నాం’ అంటుంది కామాక్షి. విశాల, కామాక్షి లక్నో యూనివర్శిటీలో మ్యూజిక్ కోర్సు చేశారు. ‘చదువు, ఆరోగ్యం... మొదలైనవి మాత్రమే పిల్లలకు ముఖ్యం అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కోవిడ్ కల్లోల కాలంలో మ్యూజిక్ థెరపి గొప్పదనం ఏమిటో తెలిసింది’ అంటుంది విశాల.
Breadcrumb
'కోవిడ్ సమయంలో మ్యూజిక్ థెరపి గొప్పదనం తెలిసింది'..
Published Fri, Nov 17 2023 10:57 AM
Related news
-
బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా గుప్పిట పెట్టుకుని ఆడిస్తోందని.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధంతో ఎన్నికల కమిషన్ వైఖరి బయటపడిందని విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైషమ్యాలు రెచ్చగొడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను తిడుతూ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా బీజేపీ విషం చిమ్ముతోంది. బీజేపీ కాకుండా ఇతరులు అధికారంలోకి వస్తే.. సంపదను ఎక్కువ పిల్లలున్న ముస్లింలకు దోచిపెడతారంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నుంచి ఉలుకూపలుకూ లేదు. ఆ వ్యాఖ్యలపై 20వేల మందికిపైగా పౌరులు ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే ధైర్యం లేక.. మోదీకి బదులుగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో దేవుడు, మతాన్ని ప్రస్తావించడం నేరమని తెలిసీ.. అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు శ్రీరాముడి ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. అయినా వారికి నోటీసులు, చర్యలు లేవు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలు ఈసీకి కనిపించడం లేదు. కేసీఆర్పై రాకెట్ వేగంతో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే.. మోదీ, రేవంత్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వైఖరి ఉంది. ఒక పార్టీ, కొందరు నాయకులు ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మాటలేమైనా ప్రవచనాలా? ‘నిరోధ్లు, పాపడాలు అమ్ముకోండి..’అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల పాటు మాట్లాడకుండా గొంతు నొక్కారు. బీఆర్ఎస్ నుంచి సీఎం రేవంత్పై ఎనిమిది ఫిర్యాదులు.. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరుల వ్యాఖ్యలపై 27 ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించలేదు. ఏప్రిల్ 10న తుక్కుగూడ సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సుభాíÙతాలు, సూక్తుల్లా కనిపించాయా? రేవంత్ మాటలను ఉటంకించడానికి సంస్కారం అడ్డువస్తోంది. అలాంటి వ్యాఖ్యలపై ఈసీ చర్యలేవి? కూడబలుక్కుని నిషేధం పెట్టారు కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారనే వార్తలు, నిఘా సంస్థల నివేదికలు వారికి కంటగింపుగా మారాయి. బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తుండటం, జన స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. దీంతో బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్ కూడబలుక్కుని కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లకుండా నిషేధం పెట్టారు. ఈ అప్రజాస్వామిక ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. కేసీఆర్ ప్రచారాన్ని నిషేధించింది. కొందరిని మాత్రం ప్రజలు, ప్రత్యర్థుల మీదకు అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేసింది.రేవంత్పై క్రిమినల్ కేసు పెట్టాలి హాస్టళ్ల మూసివేతపై ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ గతేడాది ఇచ్చిన సర్క్యులర్, స్టాంప్ను ఫోర్జరీ చేసి ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేసిన సీఎం రేవంత్రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి. ఉస్మానియా వర్సిటీ చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దాంతో ఓయూ చీఫ్ వార్డెన్కు రిజి్రస్టార్, సదరన్ డిస్కం నుంచి నోటీసులు ఇప్పించారు. అంతటితో ఆగకుండా గత ఏడాది చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను రేవంత్ పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. రేవంత్ ఫోర్జరీ డాక్యుమెంట్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు అని ఓయూ అధికారులు నిరూపిస్తే.. చంచల్గూడ జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. రేవంత్పై ఓయూ విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్పై చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
దేశ ప్రజల భవిష్యత్ కోసమే ఇండియా కూటమి
నడిగూడెం: దేశ ప్రజల భవిష్యత్ కోసమే ఇండియా కూటమి ఏర్పాటు అయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో కోదాడ ఎమ్యెల్యే పద్మావతి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డిలతో కలిసి నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకమని, బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో దేశ ప్రజల కోసం చేసిందేమీ లేదని అన్నారు.బీజేపీ సర్కార్ మతపరంగా ప్రజలను విభజించి పాలిస్తోందన్నారు. మోదీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారన్నారు. దీంతో ప్రజలకు భారంగా మారిందన్నారు. దేశంలో మెజారిటీ లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పదేళ్లలో బీఆర్ఎస్ కూడా చేసిందేమీ లేదని, లోక్సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీ మనుగడలేకుండా పోతుందని అన్నారు. కేసీఆర్ పాలనలో అధికార దుర్వినియోగం జరిగిందని, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, పోలీసు శాఖను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల అనంతరం అర్హులైన పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్యెల్యే వేనేపల్లి చందర్రావు ఈ సభలో పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: వావ్! గెనీబెన్!!
గెనీబెన్ నాగాజీ ఠాకోర్. ఉత్తర గుజరాత్లో కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో పారీ్టకి బలమైన గొంతుక. సభలో ధాటైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది కలిగిన ప్రజాప్రతినిధి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుమ కూడా వావ్ స్థానం నుంచి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించే నాయకురాలు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా హాజరవుతారు. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగి బీజేపీకి గట్టి సవాలే విసురుతున్నారు... పంచాయతీ నుంచి... 2017 అసెంబ్లీ ఎన్నికలు గెనీబెన్ రాజకీయ జీవితంలో కీలక మలుపు. వావ్ నుంచి బీజేపీ సీనియర్ నేత, మంత్రి శంకర్ చౌదరీని ఓడించడంతో ఆమె పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. ఆమెకు కేవలం రెండో ఎన్నికలవి. జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ నుంచి పొలిటికల్ సైన్స్ చదువుతూ గ్రాడ్యుయేషన్ మధ్యలోనే వదిలేశారు. పంచాయతీ సభ్యురాలిగా చేశారు. 2012లో కాంగ్రెస్ వావ్ నుంచి టికెటిచి్చంది. అప్పుడు 12వేల ఓట్లతో ఓడినా 2017లో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒకరు.క్రౌడ్ ఫండింగ్తో నిధుల సేకరణ... బనస్కాంత జిల్లాలో అన్ని సామాజికవర్గాల వారూ తనను సోదరిగా భావిస్తారంటారు గెనీబెన్. ఎన్నికల ఖర్చు కోసం నియోజకవర్గంలో క్యూ ఆర్ కోడ్ను క్రియేట్ చేసి మరీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ‘‘బీజేపీకి బలమైన ఆర్థిక వనరులున్నాయి. నాకున్నది విలువలు, సామాజిక సూత్రాలే. అయినా బలమైన సిద్ధాంతంతో పోరాడేవారిని ఎవరూ ఓడించలేరు. కనుక దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడానికి తోచిన సాయం చేయండి’’ అని ప్రజలను కోరుతున్నారు. రాజస్తాన్, పాకిస్తాన్తో సరిహద్దులో ఉన్న లోక్సభ స్థానం బనస్కాంత. ‘సీమ దర్శన్’ పేరుతో ఇక్కడ సరిహద్దు పర్యాటక స్థలం కూడా ఉంది. ఇక్కడ ఠాకోర్ ఓటర్లు 18 శాతం, చౌదరి ఓటర్లు 13 శాతం ఉన్నారు.వివాదాస్పద వ్యాఖ్యలు... కులాంతర, మతాంత వివాహాలను నిషేధిస్తు ఠాకోర్ సామాజికవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గెనీబెన్ సమరి్థంచడం వివాదం రేపింది. యువతులకు మొబైల్ఫోన్లను నిషేధించడాన్ని కూడా ఆమె సమరి్థంచారు. ‘‘బాలికలకు మొబైల్ఫోన్లను నిషేధించడంలో తప్పు లేదు. మొబైల్స్కు దూరంగా ఉండి బాగా చదువుకోవాలి’’ అని సూచించడంపై చాలా విమర్శలే వచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ను నమ్మి గ్రామీణులు మోసపోయారు
మూసాపేట/రహమత్నగర్: గ్రామాల్లోని ప్రజలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు చెప్పారు. ఆరు గ్యారంటీల పేరు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఇంకా ఆ హా మీలను అమలు చేయట్లేదని ఆరోపించారు. లోక్సభ ఎ న్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు 10–12 సీట్లు అందిస్తే బీజేపీ, కాంగ్రెస్లను కూకటివేళ్లతో పెకిలించి తెలంగాణ రాష్ట్రా న్ని కేసీఆర్ శాసిస్తారని చెప్పారు. పార్టీ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తరఫున గురువారం హైదరాబాద్లోని మూసాపేట, రహమత్నగర్ డివిజన్ శ్రీరాంనగర్లలో నిర్వహించిన రో డ్షోలలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు నగర పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలను గెలిపించినట్లుగానే నగరంలోని లోక్సభ స్థానా ల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోత.. నీటి కొరత కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు లేవని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రోజుకు 4–5 సార్లు కరెంటు పోతోందన్నారు. మంచినీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి తెచ్చిన కంపెనీలు గుజరాత్, తమిళనాడుకు వెళ్లిపోయాయని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న అవకాశాలను పోగొట్టే అసమర్థ సీఎం రేవంత్రెడ్డి అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి డమ్మీ అని, ఆమెను ఎక్కడి నుంచో ఇక్కడకు తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీవి మత రాజకీయాలు.. ప్రధాని మోదీ తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ తీసుకురాలేదని, మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, మూసీ సుందరీకరణకు నిధులు ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణతోపాటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు కూడా మోదీ ఏమి చేయలేదని విమర్శించారు. బీజేపీ అక్కరకు రాని చుట్టమంటూ ఎద్దేవా చేశారు. ఆయన కేవలం హిందూ ముస్లింల పేరుతో ఓట్లు దండుకొని మత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ పునర్నిర్మించినా ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదని చెప్పారు. దేవుళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయవచ్చా? అని ప్రశ్నించారు. మోదీ, రేవంత్లు బడే భాయ్, చోటే భాయ్ బడే భాయ్ మోదీ, చోటా భాయ్ రేవంత్రెడ్డి మాటలను నమ్మొద్దని కేటీఆర్ ప్రజలను హెచ్చరించారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ మాయల మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చిన రేవంత్రెడ్డి.. పేదవారిని ఆదుకొనే ఒక్క పథకమైనా చేశారా అని ప్రశ్నించారు. నాలుగున్నర నెలల్లో చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప రేవంత్ ఏమీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే రేవంత్ నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. జూన్ 2న హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ కుట్రపన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో కేసీఆర్ పంపే గులాబీదళం ఉండాలన్నారు. అందుకోసం మల్కాజిగిరి ప్రజల తరఫున మాట్లాడే రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయా రోడ్ షోలలో కేటీఆర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్, శంబీపూర్ రాజు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
సాక్షి, యాదాద్రి: ఈసారి భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, తొలిసారి పాగా వేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకసారి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరోసారి గెలుపు కోసం పోరాడుతోంది. సీపీఎం మాత్రం లక్ష ఓట్ల సాధన లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యేరసవత్తర పోరు సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, 2019లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున చామల కిరణ్కుమార్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లే‹Ù, సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పోటీలో ఉన్నారు. బూర నర్సయ్యగౌడ్ బీజేపీబీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి బూరభువనగిరిలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా 2022లో బీజేపీలో చేరారు. తొలి విడతలోనే బీజేపీ టికెట్ సంపాదించారు. ప్రధాని మోదీ చరిష్మాతోపాటు తనకున్న వ్యక్తిగత పరిచయాలు, తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. చెప్పుకోదగ్గ ఓట్లు కూడా ఆ ఎన్నికల్లో రాబట్టుకోలేకపోయింది. గౌడ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండడం, బీసీ నినాదం, బీఆర్ఎస్ లోని పాత పరిచయాలతో క్రాస్ ఓటింగ్, మాదిగ ఓట్లు బీజేపీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. క్యామ మల్లేష్ బీఆర్ఎస్సామాజికవర్గ సమీకరణలో క్యామ మల్లేష్రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన క్యామ మల్లేష్ బీఆర్ఎస్లో చేరారు. క్యామ మల్లేష్ది గొల్లకుర్మ సామాజికవర్గం. కేసీఆర్ చరిష్మా, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రచారాన్ని సాగిస్తున్నా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక జనగామలో తప్ప, ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలను ఎండగడు తూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై అధికంగా ఆధారపడ్డారు. దీనికితోడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసివస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. బీసీ నినాదం కూడా వినిపిస్తున్నారు. గులాబీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్కోమటిరెడ్డి ఆధ్వర్యంలో చామల కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి గెలుపు బాధ్యతలను భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీసుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు, అభ్యర్థితో కలిసి ప్రచారం చేశారు. కోమటిరెడ్డి సోదరులను గెలిపించిన భువనగిరి ప్రజలు తన సోదరుడులాంటి చామలను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. తన సామాజికవర్గ ఓట్లు, మైనార్టీ ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఇస్తోంది. సెమీ అర్బన్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ స్థానం పరిధి సెమీ అర్బన్గా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, ఆలేరులోని కొంతప్రాంతం హెచ్ఎండీఏలో ఉంది. జనగామ, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి అంతంగా మాత్రంగానే ఉంది. హైదరాబాద్కు ఈస్ట్కు శివారులో ఉన్నా, ప్రగతి మాత్రం వెనుకబడి ఉంది. పోటీలో సీపీఎం రాష్ట్రం మొత్తంలో సీపీఎం పోటీ చేస్తున్న ఏకైక లోక్సభ నియోజకవర్గం భువనగిరి. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ను అభ్యర్థిగా పోటీలో నిలిపింది. లక్ష ఓట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వివిధ వర్గాల కారి్మకుల ఓట్లపై కన్నేసింది. ప్రభావితం చేసే అంశాలు పెండింగ్ రైల్వే, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ రహదారుల విస్తరణ జాప్యం కాళేశ్వరం భూసేకరణలో కోల్పోయిన భూములకు పరిహారం చేనేత కార్మికుల, ఐటీ కారిడార్, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు టూరిజం, డ్రైపోర్టు, ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్యం గౌడ, గొల్లకుర్మ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, పద్మశాలి, మున్నూరుకాపు, రెడ్డి సామాజికవర్గ ఓటర్లు 2019 లోక్సభ ఎన్నికల ప్రధానపార్టీల అభ్యర్థుల ఓట్లు ఇలా... కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్) 5,32,795 (44.37 శాతం) బూరనర్సయ్యగౌడ్ (టీఆర్ఎస్) 5,27,576 (43.94 శాతం) పీవీ శ్యాంసుందర్రావు (బీజేపీ) 65,451 (5.45 శాతం)
Related News by category
-
Rahul Gandhi: 400 మంది మహిళలపై అఘాయిత్యం
శివమొగ్గ/రాయ్చూర్: కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ అంటూ జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయ్చూర్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈ సెక్స్ కుంభకోణం గురించి మోదీకి ముందే తెలుసు. తలచుకుంటే సెకన్లలో ప్రజ్వల్ను అరెస్ట్చేసేవారు. సీబీఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి? ప్రజ్వల్ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి?’’ అని మోదీని రాహుల్ నిలదీశారు. కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు ‘‘అధికారం, కూటమి కోసం ప్రజ్వల్ను కాపాడుతున్నారని కర్ణాటక మహిళలు గ్రహించారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని, హోం మంత్రి ప్రజ్వల్ను రక్షిస్తున్నారు. ఇదే మాకు, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా. అధికారం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ఘటన తర్వాత కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు. రాష్ట్రంలో పాల్గొనాల్సిన అన్ని సమావేశాలు, ర్యాలీలను మోదీ రద్దుచేసుకున్నారు’’ అని అన్నారు. ‘‘ బాధితుల్లో మైనర్లూ ఉన్నారు. అంతా తెల్సి కేంద్ర హోం మంత్రి అమిత్షా మౌనంగా ఉన్నారు. నిజంగా ఇది నేరం. ఆయనపై కేసు నమోదుచేయాలి. రేపిస్ట్కు మద్దతుగా ఓట్లు అడిగినందుకు దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లకు మోదీ క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ చేసింది తెల్సి కూడా మీ ఓట్లను మోదీ అడిగారని కర్ణాటక మహిళలు గ్రహించాలి. బీజేపీ నేతలకు ప్రజ్వల్ రేపిస్ట్ అని ముందే తెలుసు. అయినాసరే ఆయనకు మద్దతు పలికి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు. సమానత్వం కోరితే నక్సలైట్లు అంటున్నారు ‘‘సమానత్వం కోరితే వారిని బీజేపీ చీఫ్ నడ్డా నక్సలైట్ అంటున్నారు. దళితులు, వెనుకబడిన వాళ్లు, గిరిజనులు సమానత్వం కావాలంటున్నారు. అంతమాత్రాన వారంతా నక్సలైట్లు అయిపోతారా? ఇలా మాట్లాడిన నడ్డా వెంటనే తన పార్టీ చీఫ్ పదవికి రాజీనామాచేయాలి. నడ్డా వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు
విశాఖ సిటీ: ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. రిజి్రస్టేషన్ తర్వాత జిరాక్స్ కాపీ ఇస్తారనడం... తెల్లకాగితం మీద రిజి్రస్టేషన్ చేస్తారనడం పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం రూపొందించిన ముసాయిదా ప్రకారం మన రాష్ట్రంలోని ఏ ఒక్కరి ప్రయోజనాలకు భంగం కలగకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రూపొందించాం. అందరి ఆమోదం తర్వాతే అమలుచేస్తాం. చంద్రబాబు మాయమాటలను ఎవరూ నమ్మవద్దు’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన గురువారం విశాఖ లాసెన్స్బే కాలనీలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదనతోనే... ‘దేశంలో సమగ్రమైన రిజి్రస్టేషన్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా తయారుచేసింది. దానిప్రకారం మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా కేంద్రం ఇచ్చిన ముసాయిదాకు తుది మెరుగులు దిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు రూపొందించింది. రిజి్రస్టేషన్శాఖలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసెంబ్లీలో మూడుస్లార్లు చర్చ జరిగింది. కేంద్రానికి పంపిన తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశాం. ప్రస్తుతం ఈ యాక్ట్ కోర్టు పరిధిలో ఉంది. ఈ చట్టాన్ని అమలుచేసే ముందు సమగ్ర భూసర్వే పూర్తయిన ప్రతి గ్రామంలో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపడతాం. ఆ గ్రామంలో మొత్తం భూముల వివరాలు, వ్యక్తిగత, ప్రభుత్వ భూములు, వాటి హద్దులు.. ఇలా అన్నింటినీ ప్రజల ముందు పెడతాం. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వాటన్నింటినీ సరిచేసిన తర్వాత వారి ఆమోదంతోనే ఆ గ్రామాన్ని చట్టం పరిధిలోకి తీసుకువస్తాం. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఈ చట్టాన్ని అమలుచేయబోం. ఈ చట్టం ద్వారా ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. లిటిగెంట్లకు, దళారులకు మాత్రమే ఈ చట్టం కారణంగా నష్టం కలుగుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. ప్రజల ఆస్తికి ప్రభుత్వం జవాబుదారీ.’ అని మంత్రి బొత్స చెప్పారు. చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశమివ్వడు ‘ఆలూ లేదు.. చూలులేదు అన్న సామెతలా ఉంది చంద్రబాబు పరిస్థితి. చట్టం అమల్లోకే రాలేదు. అయినా ఆయన అధికారంలోకి వచి్చన వెంటనే దానిని రద్దు చేస్తానని చెబుతున్నాడు. రద్దు చేయడానికి ఆ చట్టంలో ఉన్న తప్పేంటో చెప్పగలడా? అయినా చంద్రబాబుకు దేవుడు ఆ అవకాశం ఇవ్వడు. పచ్చ మీడియా కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అసత్య ప్రచారంచేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్ తర్వాత జిరాక్సు కాపీలు ఇస్తారని ఎవడు చెప్పాడు రామోజీకి? ఎన్నికలు జరుగుతున్నాయి.. లేదంటే ఇలాంటి తప్పుడు రాతలు రాసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నందుకు ఎల్లో మీడియాపై చర్యలు తీసుకునేవాళ్లం.’ అని మంత్రి బొత్స చెప్పారు. మోదీ బొమ్మ ఎందుకు లేదు? ‘బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పుడు మేనిఫెస్టోలో మోదీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్, ఎనీ్టఆర్ బొమ్మలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఇద్దరు ఏమయ్యారు? కూటమిలోని పార్టీయే మీ మేనిఫెస్టోను అంగీకరించనప్పుడు ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు చంద్రబాబు? దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఆయన 2019, 2024లో తీసుకొచ్చిన మేనిఫెస్టోలు దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. 2014లో చంద్రబాబు 50పేజీల మేనిఫెస్టో ప్రింట్ చేశాడు. ఇప్పుడు ఐదు పేజీలకు దిగివచ్చాడు. ఈ కూటమి ముఠా... జగన్ మేనిఫెస్టోలోని అంశాలనే కాదు.. పేజీల సంఖ్యను సైతం కాపీ కొట్టింది.’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. -
మోసాల బాబు మరో అబద్ధం..
సాక్షి, అమరావతి: నిజం చెప్పకపోవడం.. మాటమీద నిలబడకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన సహజ లక్షణం. అందుకే ఆయన ఎన్నికలొచ్చిన ప్రతీసారి అలవోకగా ఎడాపెడా హామీలిచ్చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటివి ఎన్నో ప్రకటించారు. అందులో మూడ్రోజుల క్రితం ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో ‘స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు’ అన్న ఓ అబద్ధపు హామీ కూడా ఇలాంటిదే. నిజానికి.. ఇది ఏ విధంగా చూసినా ఆచరణ సాధ్యంకాదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ స్థాయిలో రాష్ట్రంలోని 82.29 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో భారీ మొత్తాన్నే ఈ ఒక్క పథకానికే ఖర్చుచేయాల్సి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన ఈ హామీని వారు వట్టి మాటగా కొట్టిపడేస్తున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో చెబుతూ ఏటా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ‘యూనిఫైడ్ డి్రస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) కింద నివేదికను అందజేస్తుంటాయి. దీని ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో 1–10 తరగతుల్లో 71,77,637 మంది, ఇంటర్మీడియట్లో 10,52,221 మంది కలిపి మొత్తం 82,29,858 మంది విద్యార్థులున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా వీరందరికీ రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే ఏడాదికి అక్షరాలా రూ.1,23,44,78,70,000లు అవసరమవుతుంది. సులభంగా చెప్పాలంటే రూ.1,234 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. అంటే.. ప్రస్తుత ప్రభుత్వం ఏటా అమ్మఒడి కింద రూ.6,452 కోట్లు ఖర్చుచేస్తుండగా, దీనికి రెండింతలు ఇస్తానని చంద్రబాబు అలవోకగా ఓ అందమైన అబద్ధపు హామీని ఇచ్చిపడేశారు. ప్రభుత్వ విద్యపై చంద్రబాబు కక్ష.. వాస్తవానికి.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు చంద్రబాబునాయుడు కొమ్ముకాశారు. 2014–19 మధ్య సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవని, వాటిని కల్పించే పరిస్థితి లేదని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో బహిరంగంగా ప్రకటించారు. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి బడికి వెళ్లే పిల్లలకు రూ.15 వేలు ఇస్తానని ప్రకటించడం ఒక ఎత్తయితే.. 117 జీఓను రద్దుచేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు విద్యకు దూరం కావడం ఖాయం. ఇక గతంలో ఒక స్కూలుకు మంజూరైన పోస్టులను పిల్లలున్నా లేకున్నా కొనసాగించే పరిస్థితి ఉండేది. కానీ, జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం బడిలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నేపథ్యంలో.. తక్కువ విద్యార్థులు, ఎక్కువమంది ఉపాధ్యాయులున్న పాఠశాల నుంచి ఎక్కువ విద్యార్థులున్న స్కూలుకు వారిని బదిలీ చేసేందుకు వీలుగా 2022 జూన్లో జీఓ–117 తీసుకొచ్చింది. దీంతో పోస్టులను రద్దుచేయకుండా అదనపు ఉపాధ్యాయులను ఎక్కువమంది పిల్లలున్న స్కూలుకు బదిలీ చేయవచ్చు. పేద విద్యార్థులకు ఎంతో మేలుచేసిన ఈ జీఓను ఉపాధ్యాయ వర్గాలూ స్వాగతించాయి. ఫలితంగా.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులోకి వచ్చారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 117 జీఓను రద్దుచేస్తే.. ప్రభుత్వ విద్య నాశనం కావడంతో పాటు, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ఉపాధ్యాయ పోస్టులను రద్దుచేసేందుకు ఆస్కారం ఉంది.జగన్ సర్కారులో విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం2019లో ప్రభుత్వం ఏర్పాటుచేశాక సీఎం జగన్ ప్రభుత్వ విద్యపై దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలన్న సమున్నత లక్ష్యంతో అంగన్వాడీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం కరిక్యులమ్లో మార్పులు చేశారు. ఉదా.. » ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తేవడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు, తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రభుత్వం ఉచితంగా అందించింది. » ప్రతి పేదింటి బిడ్డను బడికి పంపించాలని, ఇలా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసింది. » విద్యార్థి తప్పనిసరిగా బడిలో ఉండేలా చూసేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. » కోవిడ్ రెండేళ్లు మినహా మిగిలిన సంవత్సరాల్లో హాజరును పరిగణనలోకి తీసుకుని నాలుగు పర్యాయాలు రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేసింది.సగటున ఏటా రూ.6,452 కోట్లు జమ ఈ పథకం కింద 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6349.6 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.4 కోట్లు, 2021–22లో 42,62,419 మందికి రూ.6,393.6 కోట్లు, 2022–23 విద్యా సంవత్సరంలో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.9 కోట్లు.. ఇలా మొత్తంగా రూ.25,809.50 కోట్లు అందించింది. అంటే.. సగటున ఏడాదికి రూ.6,452.37 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేసింది. అలాగే, 2024 మేని ఫెస్టోలో రూ.15వేల అమ్మఒడి మొత్తాన్ని రూ.17 వేలకు పెంచి అమలుచేయనుంది. కానీ, చంద్రబాబు మాత్రం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఇస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. -
‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
సాక్షి, అమరావతి: వ్యవసాయమే దండగన్న చంద్రబాబు పాలనలో కాలం చెల్లిన ట్రాన్స్ఫార్మర్ల వల్ల వ్యవసాయ మోటార్లు పదే పదే కాలిపోయేవి. సరిగ్గా విద్యుత్ సరఫరా లేక.. నీరు అందక పంటలు ఎండిపోయేవి. అదే చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్ల నాణ్యత పెంచుతానంటూ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా.. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కాపీ కొట్టేసి మరీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంపుసెట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వ్యవసాయంతో పాటు మున్సిపాలిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా విద్యుత్ ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చడం ద్వారా పంపుసెట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. కొత్త సాంకేతికతతో మోటారు తయారీ.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటీరియర్ పరి్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్(ఐపీఎంఎస్ఎం) సాంకేతికతతో ‘ఎనర్జీ ఎఫీషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్’ను ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ తయారు చేసింది. దీని ద్వారా విద్యుత్ను భారీగా ఆదా చేయవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) నిధులతో తొలుత కొన్ని వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్ఎం సాంకేతికత ప్రయోగాత్మక అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చేపట్టింది. ఐపీఎంఎస్ మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయం. పవర్ ఫ్యాక్టర్ మెరుగుదలకు, మోటారు మన్నికను పెంచడానికి దోహదపడతాయి. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లు కాగా.. ఐపీఎంఎస్ మోటారు సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుంది. ఇండక్షన్ మోటారుతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. టీటీడీ, మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ ఆదా పంపుసెట్లు ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ సామర్థ్య సాంకేతికతలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల.. విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీటీడీలోని పాత పంప్సెట్ల స్థానంలో ఈ ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చుతోంది.అలాగే ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వినియోగిస్తున్న మోటార్ల స్థానంలో విద్యుత్ను ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లను అమర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూనుకుంది. దీనిపై మున్సిపల్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయ మోటార్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫీడర్లను ఆధునీకరించింది. వాటి ద్వారా మోటార్లకు వెళ్లే విద్యుత్లో ఇంకా ఏవైనా లోపాలుంటే స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకుని వెంటనే సరిచేయడం ద్వారా పంపుసెట్ల నాణ్యత పెరుగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తుంటే.. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు మోసపూరిత హామీలతో మరోసారి రైతులను, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. -
నేడు టీ కాంగ్రెస్ మేనిఫెస్టో!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ఈ ‘తెలంగాణ మేనిఫెస్టో’ను విడుదల చేయనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.నిజానికి గత నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. 23కుపైగా హామీలతో దానిని సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం విడుదల చేయనున్నారు.టీపీసీసీ తెలంగాణ మేనిఫెస్టోలో హామీలివే!ఐటీఐఆర్ ఏర్పాటు; ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ; బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ; హైదరాబాద్లో ఐఐఎం; హైదరాబాద్, విజయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం; మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు; భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం; పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా; హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం; కొత్త ఎయిర్పోర్టులు; రామగుండం–మణుగూరు రైల్వే లైన్; కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్లు; కేంద్రీయ విశ్వ విద్యాలయాల పెంపు; నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు; నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్ఈఆర్ ) ఏర్పాటు; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్; నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ; ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు; అధునాతన వైద్య, ఆరోగ్య పరిశోధన కేంద్రం; 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు; ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ యూనిట్; ఐదు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం (హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్– నాగ్పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్); ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్; మేడారం జాతరకు జాతీయ హోదా; న్యూ డ్రైపోర్టు; హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారంతా ఎక్కడ?
ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
ఆ కంఫర్ట్ కోసమే నిర్మాతగా మారా: దర్శకుడు
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
Viveka Case: అవినాష్రెడ్డికి ఊరట
ఇంత బాగా నేర్చుకుంటానని అనుకోలేదు
పేదల కలను జగన్ మామ నిజం చేశారు
చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్ చదువు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement