ఓటు హక్కు ఎంతో విలువైనది | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు ఎంతో విలువైనది

Published Sat, Apr 20 2024 1:55 AM

ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న నోడల్‌ అధికారి వినోద్‌కుమార్‌ - Sakshi

జనగామ రూరల్‌: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి వినోద్‌కుమార్‌ అన్నారు. ఓటు హక్కు– వినియోగంపై శుక్రవారం పెంబర్తిలో ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు అవగాహన కల్పించారు. అర్హులంతా ఓటరు జాబితాలో పేర్లు సరిచూసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలా కు లోనుకాకుండా ఓటు వేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని అన్నారు.

జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి వినోద్‌కుమార్‌

Advertisement
Advertisement