పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ఫుల్ బిజీగా ఉంది. రెండు నెలల క్రితం 'యానిమల్' మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్లో పాల్గొంటోంది. చిన్న గ్యాప్ దొరకడంతో జపాన్లోని టోక్యోకి వెళ్లింది. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ వేడుకకు ఆహ్వానం రావడంతోనే అక్కడికి వెళ్లింది. అయితే రష్మికని జపాన్ ఫ్యాన్స్ వేరే లెవల్లో సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోనే వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
టోక్యోలో శనివారం, క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ వేడుక జరగనుంది. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత్ నుంచి రష్మిక రిప్రెజంట్ చేస్తోంది. తద్వారా ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా నిలిచింది. అయితే టోక్యో విమానశ్రయంలోనే ఈమెకు.. జపాన్ ఫ్యాన్స్ అద్భుతమైన స్వాగతం చెప్పారు. రష్మిక ఫొటోస్తో డిజైన్ చేసిన ఫ్లకార్డులు చూపిస్తూ ఆమెను ఆహ్వానించారు.
జపాన్ ఎయిర్పోర్ట్లో తనకు ఈ రేంజ్ స్వాగతం దక్కడం చూసి రష్మిక షాక్ అయిపోయింది. నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకుని తన అభిమానులకు హాయ్ చెప్పింది. ఎన్టీఆర్, ప్రభాస్, రానా తదితర స్టార్స్ తర్వాత రష్మికకే జపాన్లో ఈ తరహా ఫ్యాన్స్ ఉన్నారు. ఏదేమైనా రష్మిక క్రేజ్ జపాన్ వరకు వెళ్లడం చూస్తుంటే వేరే లెవల్ అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా)
National crush @iamRashmika was warmly welcomed by her fans in Tokyo❤️#RashmikaMandanna #Pushpa2TheRule pic.twitter.com/lFWbaQLpvm
— Suresh PRO (@SureshPRO_) March 1, 2024