‘కేంద్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే’ | Sakshi
Sakshi News home page

‘కేంద్రంలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే’

Published Sat, Apr 20 2024 1:30 AM

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దిలావర్‌పూర్‌
మండల నాయకులతో శ్రీహరిరావు - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ దిలావర్‌పూర్‌ మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ అక్షర అనిల్‌కుమార్‌, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ కె.రాజేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ బాపురావు, కదిలి దేవస్థానం చైర్మన్‌ వెంకట్‌రావుతోపాటు పలువురు శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతీ కార్యకర్త కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ దిలావర్‌పూర్‌ మండల అధ్యక్షుడు తక్కల సాగర్‌రెడ్డి, అరుగుల రమణ, నర్సాపూర్‌ మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌, శ్రీహరి, రాంపూర్‌ తాజా మాజీ సర్పంచ్‌ గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు.

సీఎం పర్యటన విజయవంతం చేయాలి

ఈనెల 22న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తెలిపారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్‌ దాఖలు, ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement