ప్రచార సభలో ప్రధాని మోదీ భావోద్వేగం..కారణమిదే | Sakshi
Sakshi News home page

ప్రచార సభలో ప్రధాని మోదీ భావోద్వేగం..కారణమిదే

Published Fri, Apr 19 2024 8:26 PM

Modi Got Emotional After Seeing Mother Pic In Public Meeting - Sakshi

భోపాల్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం(ఏప్రిల్‌ 19) ఒకేరోజు ఆయన ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో సుడిగాలి ప్రచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ప్రదర్శించిన చిత్రాన్ని చూసి మోదీ ఉద్వేగానికి గురయ్యారు.

సభలో ప్రధాని మాట్లాడుతుండగా ఆ యువకుడు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్‌ ఉన్న చిత్రాన్ని ప్రదర్శించాడు. ఇది గమనించిన ప్రధాని మాటలు రాక ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు. అనంతరం చిత్రాన్నిపెన్సిల్‌తో గీసి తీసుకువచ్చిన యువకుడిని అభినందించారు. ఫొటో వెనుక అతడి పేరు, చిరునామా రాసివ్వాలని యువకుడిని కోరారు.   

ఇదీ చదవండి.. రాహుల్‌గాంధీకి అమిత్‌ షా కౌంటర్‌ 

Advertisement
Advertisement