-
మొక్కలతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
2024–25 సంవత్సరంలో పచ్చదనం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. పండ్లతోటల అభివృద్ధి ద్వారా దాదాపు 7.25 లక్షల పండ్ల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవెన్యూ, కెనాల్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాం. ఈ ఏడాది ఉపాధి నిధులతో జలసంరక్షణ పనులు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అమృత్సరోవర్లు, మినీ అమృత్ సరోవర్లు, ఫాంపాండ్స్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మొక్కలు నాటడం, జలసంరక్షణ పనులు చేపట్టడం వల్ల జిల్లాను అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చు. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులునంద్యాల(న్యూటౌన్): ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని రిటర్నింగ్, నోడల్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలలో నిర్వహించే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండాలన్నారు. ఇందుకు 760 మంది సిబ్బంది అవసరం అవుతారని, వారిని సిద్ధం చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు మెటీరియల్ను సిద్ధం చేసుకోవాలన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తరువాతనే ఈవీఎంల లెక్కింపు ప్రారంభించాలన్నారు. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ పద్మజ, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం
ఉపాఽధి పనుల్లో భాగంగా జలసంరక్షణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఊరూరా చేపట్టిన పనుల్లో 95 శాతం భూగర్భ జలాల అభివృద్ది, జలసంరక్షణ పనులే చేపడుతున్నారు. ఫీడర్ చానల్స్ల్లో పేరుకుపోయిన పూడిక తీయడం వల్ల వర్షపు నీరు చెరువుకు చేరుతుంది. ఉపాధి నిధులతో 50 అమృత్ సరోవర్లు, 960 మినీ అమృత్ సరోవర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. చెరువులను అమృత్ సరోవర్లుగా, కుంటలు వంటి వాటిని మినీ అమృత్ సరోవర్లుగా అభివృద్ధి చేస్తారు. అమృత్ సరోవర్లతో పూడిక తీయడం, కట్టలు బలోపేతం చేయడం చెరువు కట్టలపై మొక్కలు నాటడం వంటి పనులు చేపడుతారు. అలాగే 9,600 ఫాంపాండ్స్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. వీటితో పాటు పర్కులేషన్ ట్యాంకులు, మేజర్ కెనాల్స్, బౌండరీ ట్రెంచెస్ తవ్వకాల పనులు జరుగుతున్నాయి. ● మొక్కల పెంపకంపై జిల్లా నీటియాజమాన్య సంస్థ దృష్టి ● 200 కిలోమీటర్లలో అవెన్యూ, కెనాల్ ప్లాంటేషన్ ● 10,350 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనే లక్ష్యం ● ఉద్యమ తరహాలో జలసంరక్షణ పనులు ● అమృత్ సరోవర్లు, ఫాంపాండ్లకు ప్రాధాన్యత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఏడాది వరకు వేసవిలో గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది అవి 47 డిగ్రీలు దాటాయి. ఇందుకు ప్రధాన కారణం పచ్చదనం లేకపోవడమేనని జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సంకల్పించారు. ఇందులో భాగంగా 200 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు. కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, గాజుల దిన్నె ప్రాజెక్టు వంటి వాటి పరిధిలో కెనాల్ ప్లాంటేషన్ కింద కిలోమీటరుకు 400చొప్పున 100 కిలోమీటర్ల మేర మొక్కలు నాటనున్నారు. మొత్తం 4 లక్షల మొక్కలు నాటే అవకాశం ఉంది. అలాగే అవెన్యూ ప్లాంటేషన్ కింద మరో 100 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. వీటిని సంరక్షించే బాధ్యత జిల్లా నీటియాజమాన్య సంస్థ తీసుకోనుంది. అంతేగాక ఇస్టిట్యూషనల్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆలూరు, ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ, ఎమ్మిగనూరు మండలం బనవాసిలో నర్సరీలు ఉండగా.. అవెన్యూ, కెనాల్ ప్లాంటేషన్కు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏర్పాటు చేసిన నర్సరీల నుంచి రైతులకు అవరమైన మొక్కలు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండ్లతోటల అభివృద్ధి.. జిల్లాలో ఈ ఏడాది 10,350 ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధ్దికి చర్యలు చేపట్టారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉండి, జాబ్ కార్డు కలిగిన రైతులందరూ పండ్లతోటల అభివృద్ధికి అర్హులే. ప్రస్తుతం అర్హులైన రైతులను ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. సాధారణంగా ఈ పాటికి జిల్లా కలెక్టర్ నుంచి పరిపాలనా అనుమతులు తీసుకోవడం, పిట్టింగ్ పనులు చేపట్టడం జరిగేది. ఈ సారి సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా పరిపాలనా అనుమతులు తీసుకునే ప్రక్రియ మొదలు కాలేదు. అయితే పండ్లతోటల అభివృద్ధిపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించే కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. ఇప్పటికే 4,000 ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధ్దికి అర్హులైన రైతులను గుర్తించారు. మామిడి, సపోట, జామ, దానిమ్మ, డ్రాగన్ప్రూట్స్, చీనీ, నిమ్మ ఇలా అన్ని రకాల పండ్లతోటలు 100 శాతం సబ్సిడీతో అభివృద్ధి చేసుకోవచ్చు. ఎకరాకు సగటున 70 మొక్కలు నాటుతారు. పండ్లతోటల అభివృద్ధి ద్వారా 7.25 లక్షల మొక్కలు నాటే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భగ్గుమన్న మండు టెండలు ప్రజలను భయపెట్టాయి. పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండటంతో మొక్కలు నాటే కార్యక్రమంపై జిల్లా నీటియాజమాన్య సంస్థఽ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం కెనాల్, అవెన్యూ ప్లాంటేషన్ను విస్తృతంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. అంతేకాకుండా వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ , రిజిస్ట్రార్ డాక్టర్ నాగుల అంకన్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం సెషన్లో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 9,803 మందికి 8,866, బీఈడీ మూడో సెమిస్టర్కు 3,306 మంది విద్యార్థులకుగాను 3,089 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో జరిగిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 60 మందికి 55 మంది, బీఈడీ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1355 మందికి 12260 మంది విద్యార్థులు హాజరయ్యారని వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. -
కాయ్.. రాజా.. కాయ్...!
పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొన సాగించారు. ముఖ్యంగా యువత కోసం ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. మహిళలకు పలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పేద వర్గాల ప్రజల కోసం ఇంత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే వారికి మేలు చేకూర్చింది. పోలింగ్ తీరును పరిశీలిస్తే ..మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈ ఓటు బ్యాంకు అంతా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.బస్సుల్లో, ఆటోల్లో, సెలూన్లలో, హోటళ్లలో.. ఇలా ప్రతి చోటా పల్లె.. పట్టణం అన్న తేడా లేకుండా ఏ నలుగురు గుమికూడినా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతోంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అభ్యర్థులకు వచ్చే మెజార్టీలు.. తదితర అంశాలపై తమకు తెలిసింది, అక్కడక్కడ విన్నది చెబుతున్నారు. పోలింగ్ జరిగిన తీరును బేరీజు వేసుకుంటూ పలువురు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. స్థాయిని బట్టి రూ. వేల నుంచి రూ. కోట్లలో బెట్టింగ్ కడుతున్నారు.సాక్షి, నంద్యాల/ఆళ్లగడ్డ: సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. దీంతో గెలుపోటములు, మెజార్టీలపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ధపా పోలింగ్ శాతం పెరిగింది. ఓటర్లు పోలింగ్ ప్రారంభానికి ముందుగానే క్యూలైన్లలో బారులుతీరి నిలబడి ఓర్పుతో ఓటెయ్యడం.. అందులో మహిళలు, వృద్ధులు ఉండటం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనే దానిపై అంచనాలు వేస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు గ్రామ, మండలాల వారీగా కూడికలు, తీసివేతల పనిలో నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాలు, గ్రూపులు, వర్గాల వారీగా కూడా అంచనాలు వేసుకుంటూ ఎవరికివారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఫలితాలకు సమయం ఉండడంతో ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్ల హవా నడుస్తోంది. స్థాయిని, మెజారిటీని బట్టి రేట్లు రాజకీయాలపై ఆసక్తి ఉన్న కొందరు ‘మీ నియోజకవర్గంలో ఎలా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది.. ఎంత మేర మెజార్టీ రావచ్చు’ అని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులను, పరిచయస్తులకు ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు. కొందరు నాయకులు చేసిన అబివృద్ధి, అభ్యర్థుల వ్యక్తిత్వం, వ్యతిరేకత, పంపిణీ చేసిన నగదు తదితర అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. జిల్లాలో అభ్యర్థుల మెజారిటీలతో పాటు ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే ప్రధానంగా పందేలు నడుస్తున్నాయి. వైఎస్సార్సీపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని జోరుగా పందేలు కాస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా పందేలకు మాత్రం దూకుడుగా ముందుకు రావడం లేదని బెట్టింగ్ రాయుళ్లు చెబుతున్నారు. అసెంబ్లీకి ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది.. ఎంపీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందన్న అంశాలే బెట్టింగ్ రాయుళ్లకు ప్రధానాంశాలుగా మారాయి. మెజారిటీ ఎక్కువగా వస్తుందని పందెం వేస్తే ఒకటికి మూడు, నాలుగు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపైనా... జిల్లాలో పందెం రాయుళ్ల హాట్ ఫేవరేట్గా పిఠాపురం నిలుస్తోంది. అక్కడ పోటీలో ఉన్న పవన్ కల్యాణ్, వంగా గీతలో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై పందెం కాస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి పవన్కల్యాణ్ ఓడిపోవడంతో ఈ సారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారా? లేక అలవాటైన రీతిలో ఓడిపోతారా? అని ఆరా తీస్తున్నారు. మంగళగిరి, హిందూపురం, కుప్పం స్థానాలపైనా పందేలు నడుస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు మెజార్టీ తగ్గుతుందని పందెం కాయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు. టీడీపీ వైపు ముందుకురాని పందెంరాయుళ్లు నంద్యాల జిల్లాలో వైఎస్సార్ సీపీ గెలిచే స్థానాలపై పందెం కాసేందుకు టీడీపీ అభిమానులు ముందుకు రావడం లేదు. 2014లో ఒక్క బనగానపల్లె మినహా అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ గెలిచింది. 2019లో ఉమ్మడి జిల్లా క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఐదేళ్లలో సంక్షేమం ఇంటి ముంగిటకే రావడంతో ప్రజలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. తాజాగా జరిగిన పోలింగ్లోనూ ఇదే అంశం ప్రస్ఫుటమైనట్లు భావిస్తున్నారు. దీంతో మరోసారి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనాలు ఉండడంతో పందెం కాయడానికి టీడీపీ వారు ముందుకు రావడం లేదని పంటర్స్ చెబుతున్నారు. మెజారిటీలపై.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ గెలుపు గ్యారంటీ అని, గత ఎన్నికలతో పోలిస్తే కాస్త మెజారిటీ అటు ఇటుగా ఉంటుందని.. మెజారిటీలపై పందెం కాయడానికి సిద్ధమని టీడీపీ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు పంటర్స్ చెబుతుండడం గమనార్హం. అలాగే డోన్ నుంచి ఈ సారి మంత్రి బుగ్గన హ్యాట్రిక్ సాధిస్తారని ఎక్కువ మంది పందెం కాయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, బనగానపల్లెలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మెజారిటీలపై జోరుగా పందేలు కాస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇద్దరి మధ్య పందెం సెట్ చేసి పెద్ద మత్తంలో పంటర్స్ కమీషన్ తీసుకుంటున్నారు. టీడీపీ నేతల మేకపోతు గాంభీర్యం ఓటమి తప్పదని తెలిసినప్పటికీ టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొన్నటి దాక భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ప్రచారం నిర్వహించుకున్నారు. నిన్నటి వరకు స్వల్ప మెజార్టీతో అయినా గెలుపు మాదే అంటున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీకి గతంలో వచ్చిన అంత మెజార్టీ రాదు తక్కువ మెజార్టీతో బయట పడొచ్చు అని చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ధైర్యం జిల్లాలో జోరుగా సాగుతున్న పందేలు పోలింగ్ ముగియడంతో గెలుపోటములపై బెట్టింగ్లు మరోసారి వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న విశ్లేషకులు ఇరు పార్టీల మధ్య పందెం సెట్ చేసి కమీషన్ తీసుకుంటున్న మధ్యవర్తులు -
ఇసుక అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు
కర్నూలు (న్యూటౌన్): పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక రీచ్లలో తవ్వకాలు చేయకూడదని, ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ టి రాజశేఖర్ హెచ్చరించారు. సి బెళగల్ మండలం పల్దొడ్డి గ్రామంలోని ఇసుక రీచ్ను గురువారం జిల్లా మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక తరలింపుపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలిచ్చిందన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక రీచ్లలో తవ్వకాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసిందన్నారు. 15 రోజుల కిందటే ఇసుక రీచ్లలో తవ్వకాల పనులు ఆపేశారని చెప్పారు. అలాగే సి బెళగల్ మండలం కె సింగవరం వద్ద బోటు ద్వారా ఇసుకను తీసే ప్రదేశాన్ని తనిఖీ చేశామన్నారు. అక్కడే ఉన్న బోటులను వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తనిఖీల్లో జిల్లా మైనింగ్ విజిలెన్స్ ఏడీ బైరాగినాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూంల పర్యవేక్షణ
పాణ్యం: ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల వద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుందని, సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. గురువారం స్ట్రాంగ్ రూంలను వారు తనిఖీ చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీ ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లుపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దంచికొట్టిన వాన జూపాడుబంగ్లా: మండలంలోని పారుమంచాల, తాటిపాడు, జూపాడుబంగ్లా, తంగడంచ, తూడిచెర్ల తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం వాన దంచికొట్టింది. 45 నిమిషాల పాటు కురిసిన వర్షం దాటికి పారుమంచాల గ్రామశివారులోని నల్లవాగు ప్రవహించింది. చెక్డ్యాంలు, కుంటల్లో వర్షం నీరు చేరింది. పొలాలు పదునెక్కడంతో దుక్కులు ప్రారంభించి రైతులు ఖరీఫ్కు సన్నద్ధమవుతున్నారు. మొదటిరోజు ఈఏపీ సెట్కు 65మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్కు గురువారం మొదటి రోజు 65 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 100 మందికి 98 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 99 మందికి 93మంది హాజరయ్యారు. అలాగే శ్రీరామకృష్ణ పీజీ కాలేజీలో ఉదయం జరిగిన పరీక్షకు 170 మందికి 152 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 169 మందికి 161 మంది, ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 360 మందికి 346 మంది , మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 358 మందికి 341 మంది హాజరయ్యారు. విద్యార్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోగా.. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించారు. -
మామిడి ధరకు రెక్కలు
● దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు ● 100 పండ్ల ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలు బేతంచెర్ల: పండ్లలో మధు రాజ ఫలంగా పేరుగాంచిన మామిడి పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో ధరలు రెట్టింపయ్యాయి. ఫలింగా సామాన్యుడు కొని తినలేని పరిస్థితి దాపురించింది. మండలంలోని ముద్దవరం, యంబాయి, ముసలాయిచెర్వు, గూటుపల్లె, ఆర్ఎస్ రంగాపురం, కొలుములపల్లె, శంకలాపురం, మండ్లవానిపల్లె, రుద్రవరం గ్రామాల్లో మామిడి తోటలు ఉన్నాయి. యంబాయి గ్రామ పరిసరాల్లో సాగయ్యే మామిడి పండ్లకు మంచి పేరుంది. ఇక్కడ బేనిషాన్, మలగుబా, రెడ్డిపసంద్, సువర్ణ సుందరి రకాలు కూడా లభిస్తాయి. ఈఏడాది పూత లు బాగానే వచ్చినా వాతావరణంలో మార్పుల కారణంగా పూత, పిందె రాలిపోవడంతో దిగుబడి మీద ప్రభావం చూపింది. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడులు రావాల్సిన మామిడి.. ఈ ఏడాది ఒకటిన్నర టన్నుకు మించి రావడం లేదు. ఫలితంగా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సరైన వర్షాలు లేక పోవడంతో పాటు డిసెంబర్, జనవరి నెలలో పూత రావాల్సిన మామిడి తోటలు ఆలస్యంగా ఫిబ్రవరిలో పూత వచ్చి వాతావరణ పరిస్థితులు అనుకూలించక పూత, పిందెలు రాలిపోయాయి. దీంతో మామిడి తోటలు కొనుగోలుచేసిన రైతన్నలు నష్టాలు చవిచూస్తున్నారు. రూ.లక్షలు పెట్టి మామిడి తోటలు కొనుగోలుచేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అరకొరగా వచ్చిన దిగుబడులను పక్వానికి రాకముందే ధర బాగా ఉందనే కారణంతో మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 100 పండ్ల ధరలు సైజ్ను బట్టి రూ. 4వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఆకాశాన్నటుంతున్న ధరలను చూసి సామాన్యులు కొని తినలేని పరిస్థితి దాపురించింది. -
స్ట్రాంగ్ రూంలకు మూడంచెల భద్రత
నంద్యాల: పట్టణ శివారు ప్రాంతం పాణ్యం మండలం నెరవాడ గ్రామం సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో భద్రపరచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. అత్యంత కట్టుదిట్టమైన మూడంచెల భద్రత నడుమ ఉన్న స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీసీ టీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చూసుకునెలా పార్టిషన్ చేయాలని ఆర్అండ్బీ ఎస్ఈని, విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్లను ఏర్పాటు చేయాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. కాలేజీలో ఉన్న లైబ్రరీ హాలులో మీడియా రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.పద్మజ, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ ఉన్నారు. -
టీబీ నివారణకు బీసీజీ వ్యాక్సినేషన్
నంద్యాలటౌన్: క్షయ వ్యాఽధి నిర్మూలన కోసం 18 ఏళ్లు పైబడిన వయోజనులకు గురువారం నుంచి అన్ని సచివాలయాల్లో బీసీజీ టీకా వేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సచివాలయాల వారిగా సీహెచ్ఓలు, ఆశా, ఏఎన్ఎం, టీబీ చాంపియన్లు బృందాలుగా ఏర్పడి నిర్వహించిన సర్వేలో ఐదేళ్ల నుంచి టీబీ మందులు వాడి వ్యాధి నయమైనవారు, టీబీ వ్యాధిగ్రస్తులకు, షుగర్ పేషంట్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి సచివాలయాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా ప్రతి గురువారం బీసీజీ టీకాలను వేస్తామన్నారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగుతుందన్నారు. టీకా వేయించుకున్న వారిని ఆశా, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారన్నారు. -
జగమేలు నాయక.. జగదానంద కారక
● వైభవంగా నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో నృరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలంలో యోగా నృసింహ గారుడ వాహనముపై దేదీప్యమానంగా వెలుగొందిన లక్ష్మీనారసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు తరించారు. లక్ష్మీనరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం తెల్లవారు జామునే మూలమూర్తి జ్వాలనరసింహస్వామి, చెంచు లక్ష్మి అమ్మవార్లను మేలుకొలిపి, సుప్రభాత సేవ, నిత్యపూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జ్వాలనరసింహ స్వామి ఉభయ దేవేరులతో ప్రత్యేకాలంకరణ గావించిన యోగానంద గరుడ విమాన వాహనంలో కొలువై ఆస్థాన విధ్వాంసుల మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. నేటి నుంచి ఈఏపీ సెట్ ● జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్షల నిర్వహణ నంద్యాల(న్యూటౌన్): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీఈఏపీసెట్)–2024 గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న పరీక్షలకు అధికారులు రామకృష్ణ డిగ్రీ, పీజీ, ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలను కేంద్రాలుగు ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అగ్రికల్చరల్ ఫార్మసీ(బైపీసీ) విద్యార్థులకు ఈనెల 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్ స్ట్రీమ్(ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్కు 5,478 మంది, అగ్రికల్చల్ ఫార్మసీకి 2,517 మంది హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజు రెండు సెషన్స్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. హాల్టికెట్తో పాటు ఏదైనా ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజే కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నేడు సీడీసీ డీన్లతో సమీక్ష కర్నూలు కల్చరల్: విజయవాడలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీడీసీ) డీన్లతో గురువారం యాప్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. డిగ్రీ కళాశాలల అఫ్లియేషన్ అంశంపై చర్చించనున్నారు. శుక్రవారం వర్సిటీల అకడమిక్ అఫైర్స్ డీన్లు, పరీక్షల విభాగం డీన్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లతో సమీక్షిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలండర్, పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. రాయలసీమ విశ్వ విద్యాలయం నుంచి సీడీసీ, అకడమిక్ అఫైర్స్, ఎగ్జామినేషన్స్ డీన్లు పాల్గొననున్నారు. 17న ఉరుకుందలో వేలం పాటలు కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 17న వివిధ వ్యాపారాల లైసెన్స్ కోసం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్, ట్రస్టుబోర్డు చైర్మన్ నాగరాజ్గౌడ్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. 18న స్వామివారి హుండీ ఆదాయం లెక్కించనున్నట్లు తెలిపారు. -
వికసిస్తున్న ‘సిరి’మల్లె
మల్లె పూలు సువాసన వెదజల్లడమే కాదు ఎంతో మందికి సిరులు కురిపిస్తున్నాయి. పూలు తెంపడంతోపాటు ప్యాకింగ్, రవాణా తదితర పనులతో వందల మందికి ఉపాధినిస్తున్నాయి. ప్రధానం వాణిజ్య పంటగా గుర్తింపు పొందిన మల్లె పూలు మండల పరిధిలో దాదాపు 2,500 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతోంది. జనవరి నుంచి దిగుబడులు ప్రారంభమై ఆగస్టు నెల వరకు పంట చేతికి వస్తుంది. ఈ 8 నెలల పాటు పలువురికి ఉపాధి లభిస్తోంది. మల్లెపూలు తెంపుతున్న కూలీలు చాగలమర్రి మండీలో కుప్పగా పోసిన మల్లెపూలుకూలీల కొరత ఉంది మల్లె పూల సాగు కష్టంతో కూడుకొని ఉంది. పూలు కోయటానికి కూలీలు దొరకడం కష్టం. సీజన్ మొదలయ్యే సమయానికి ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో కూలీలు పనికి రావడానికి భయపడుతారు. ఎక్కువ మంది రైతులు పూల సాగు చేపట్టడంతో అందరికీ ఒకేసారి కూలీల అవసరం ఏర్పడటం కూడా కూలీల కొరతకు కారణమవుతోంది. ఒక్కోసారి ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల నుంచి కూడా కూలీలను ఆటోలలో తెచ్చుకుంటుంటాం. – మహబూబ్ షరీఫ్, రైతు చాగలమర్రి రూ.3 లక్షల ఆదాయం రెండు ఎకరాల్లో నాలుగేళ్లుగా మల్లె పూల సాగు చేస్తున్నాను. ఎకరాకు ఏటా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తోంది. 60 నుంచి 70 శాతం కూలీ, ఎరువులు, క్రిమి సంహారక మందులకు పోనూ 20 నుంచి 30 శాతం ఆదాయం మిగులుతుంది. – షేక్ షరీఫ్, రైతు, ముత్యాలపాడు గ్రామం ఉపాధి హామీలోకి చేర్చాలి మల్లె పూల సాగుకు కూలీల కొరత చాలా ఉంది. పూల తోటల పనులను కూడా ఉపాధి పనుల్లో చేర్చాలి. ఎరువులు, క్రిమి సంహారక మందులు, పూలు కోయటానికి కూలీలకు చెల్లించే కూలీ డబ్బులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పూల ధరలు మాత్రం మార్కెట్లో గిరాకీని బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. – ముల్లా ఖాదర్బాషా, కౌలు రైతు, చాగలమర్రి చాగలమర్రి: ఉద్యాన పంట అయిన మల్లె సాగుపై మండల రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండి నీటి తడుతులు ఇవ్వడం, ఎరువులు వేయడం, క్రిమి సంహారక మందులు చల్లడం తదితర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రతి 10, 15 రోజులకు ఒకసారి పంటకు సాగునీరు అందివ్వడంతో పాటు దిగుబడి తగ్గకుండా నెలకు ఒక సారి ఎరువుల యాజమాన్యాన్ని పాటిస్తూ కాపాడుకుంటున్నారు. గతంతలో వాతావరణ మార్పులను బట్టి మొగ్గ దశలోనే పూలకు ఎర్రనల్లి తెగులు సోకేది. దీంతో పురుగు పూలను మొగ్గ దశలోనే కొరకడం వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండేది. వ్యవసాయాధికారి సలహాలతో అవసరమైన క్రిమిసంహారక మందులను పిచికారీ చేసేవారు. అయితే నాలుగేళ్లుగా జగనన్న ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఉద్యాన, వ్యవసాయ అసిస్టెంట్లను నియమించి, రైతులకు సలహాలు ఇస్తున్నారు. దీని వల్ల తెగులు బారిన పడిన పంటను రైతులు తక్కువ సమయంలోనే కాపాడుకోగలుగుతున్నారు. రైతుల నుంచి మండీ యజమానులు కొనుగోలు రైతుల నుంచి చాగలమర్రిలో ఉన్న పూల మండీల యజమానులు పూలను కొనుగోలు చేస్తారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉదయం 10.00 గంటలకు నిర్ణయించిన ధరతో కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలుకు రైతు నుంచి ప్రతి రూ.100కు 4 పైసల కమీషన్ను మండీల యజమానులు తీసుకుంటారు. మండీ యజమాని 10 పైసల కమీషన్కు హైదరాబాద్కు విక్రయిస్తాడు. ప్రతి పూల మండీలో అకౌంటెంట్ రైతులు తీసుకొచ్చిన పూలను తూకం వేసి, వారి ఖాతా పుస్తకంలో తూకంతో పాటు ధర నమోదు చేసి, మండీ ఖాతా పుస్తకంలో కూడా రైతుల పూల తూకం, ధర, డబ్బుల మొత్తం వివరాలను నమోదు చేస్తారు. హైదరాబాదుకు చెందిన పూల మండీ నిర్వాహకులు 10 రోజులకు ఒక సారి డబ్బు మొత్తాన్ని చాగలమర్రిలోని మండీలకు పంపిణీ చేయగా, వీరు అదే రోజు స్థానిక రైతులకు పంపిణీ చేస్తారు. రోజుకు 10 టన్నుల దిగుబడి మండల పరిధిలో సాగు చేస్తున్న 2,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రతి రోజు సుమారు 10 టన్నుల మేర పూల దిగుబడి వస్తోంది. ఈ దిగుబడిని చాగలమర్రి పట్టణంలోని 4 పూల మండీల యజమానులు సేకరిస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరలోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలిస్తారు. థర్మోకోల్ బాక్సులలో కేజీ పరిమితి ఐస్ గడ్డలు ప్లాస్టిక్ కవర్లలో వేసి ఒక్కో బాక్సులో 10 నుంచి 15 ఐస్ కవర్లు వేసి వాటి మధ్యలో 30 నుంచి 50 కేజీల పూల బాక్సును ఉంచి ప్రతిరోజు బొలేరో వాహనాల్లో హైదరాబాదుకు తరలిస్తారు. తెంపిన 6 గంటల్లోపే గుడిమల్కాపూర్ పూల మార్కెట్టుకు తరలిస్తారు. 1 కేజీ మల్లెపూల ధర రూ.150 నుంచి రూ.400 వరకు పలుకుతుంది. పూల తరలింపులో ఆలస్యమైతే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. పూలు తరలించే వాహనానికి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు మండీ యజమాని అద్దె చెల్లిస్తాడు. కుటీర పరిశ్రమగా అభివృద్ధి మల్లెపూల సాగు చాగలమర్రిలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. పూలను విడిగా అమ్మడం ఒక ఎత్తైతే, పూలను అల్లి కూడా ఎగుమతి చేయడం మరోఎత్తు. పూల అల్లకం కోసం మండీ యజమానులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఏంజెంట్లకు 1 కేజీ పూల అల్లకానికి రూ.60 కూలీ చెల్లిస్తారు. ప్రతి రోజు 100 నుంచి 150 కేజీల విడి పూలను మండీ నుంచి తీసుకొని, 250 గ్రాముల బరువుతో ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తారు. ఈ ప్యాక్ చేసిన పూల పొట్లాలను మోటారు సైకిల్పై మధ్యాహ్నం 1 గంటకు వీధుల్లో పూలు అల్లే గృహిణులకు ఒక్కో ఇంట్లో 10 నుంచి 15 ప్యాకెట్ల పూలను పంపిణీ చేస్తారు. ఒక్కో పాకెట్ పూలు అల్లినందుకు రూ.10 చెల్లిస్తారు. అంటే సగటున 1 కేజీకి రూ.40 కూలీ చెల్లిస్తారు. ఏజెంటుకు రూ.20 కమీషన్ లభిస్తుంది. ఇలా ఏజెంటుకు ప్రతి రోజు పూల తూకాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ వస్తుంది. అల్లిన పూలను తిరిగి సాయంత్రం 6.00 గంటలకు తీసుకెళ్లి మండీ వారికి అప్పగిస్తారు. ఒక ఇంట్లో ఐదుగురు, ఆరుగురు, నలుగురు ఉంటే ఇంట్లోనే ఉంటూ ప్రతి రోజు ఒక్కొక్కరు రూ.300 నుంచి రూ.500 వరకు ఆదాయం పొందుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థినులు ఇళ్ల వద్దే ఉంటూ వారి తల్లులకు సాయం చేస్తున్నారు. ఇలా చాగలమర్రిలో మల్లె పూల సాగు వల్ల రైతులతో పాటు పూలు కోసే కూలీలకు, ప్యాకింగ్ చేసే యువకులకు, ఎగుమతి చేసే వాహనదారులకు, ఏజెంట్లకు, గృహిణులకు ఉపాధి లభిస్తోంది. వాణిజ్య పంటగా మల్లెపూల సాగు మండలంలో 2,500 ఎకరాల్లో సాగు రోజుకు 10 టన్నుల దిగుబడి 8 నెలల పాటు కాపు హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్కు తరలింపు కూలీలకు చేతినిండా ఉపాధి కుటీర పరిశ్రమగా మల్లె పూల అల్లకం -
ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి
శ్రీశైలం: ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఈఓ పెద్దిరాజు కోరారు. బుధవారం ఆయన దేవస్థానం పరిపాలన విభాగంలో సత్రాల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులు వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులను తిని జంతువులు మరణిస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, సంచులు, గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించరాదని ఆదేశించారు. ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ ఫోర్క్లు, ప్లాస్టిక్ కప్పులు తదితరవాటిని పూర్తిగా నిషేధించామన్నారు. మట్టి, స్టీల్, రాగి, గాజు పాత్రలను వినియోగించాలన్నారు. ఈ ఆదేశాలను క్షేత్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సత్రాల యజమానులు పాటించాలన్నారు. ఆయా సత్రాలకు వచ్చే భక్తులకు భోజనానికి అరటి ఆకులు, విస్తర్లు ఉపయోగిచాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రామకృష్ణ, శానిటేషన్, రెవెన్యూ ఏఈఓ మల్లికార్జున రెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, సెక్యూరిటీ విభాగం అధికారి అయ్యన్న, రెవెన్యూ సూపరింటెండెంట్లతో పాటు ఏపీఆర్వో శివారెడ్డి పాల్గొన్నారు. -
ఏవీ వర్సెస్ భూమా అఖిల
● ఆళ్లగడ్డలో మళ్లీ పురుడుపోసుకున్న ఫ్యాక్షన్ ● టీడీపీ నేతల నిర్వాకంతో ఆందోళనలో ప్రజలు సాక్షి, నంద్యాల: ప్రశాంతమైన పల్లెల్లో తెలుగుదేశం పార్టీ నేతలు చిచ్చు రగిలిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు మళ్లీ పురుడుపోసుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై హత్యాయత్నం జరగడంతో ఆళ్లగడ్డ ఉలిక్కిపడింది. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడం కోసం దాడులను ప్రోత్సహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పూ.. నిప్పులా ఏవీ, అఖిల ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఉప్పూ నిప్పులా వ్యవహరిస్తున్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత తమ ఆస్తులను ఏవీ సుబ్బారెడ్డి అక్రమంగా హస్తగతం చేసుకున్నాడని అఖిలప్రియ ఆరోపిస్తూ వస్తున్నారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో అడుగుపెడితే ఊరుకునేది లేదని బహిరంగంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. గత ఏడాది ఆళ్లగడ్డలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అఖిలప్రియ సమక్షంలోనే ఏవీపై దాడి జరిగింది. అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ ఏవీ చొక్కా పట్టుకొని పక్కకు లాగేసి ముఖం మీద పిడిగుద్దులు కురిపించడంతో సుబ్బారె డ్డికి రక్త గాయాలయ్యాయి. లోకేష్ ఉండగానే పరస్పరం ఘర్షణలకు పాల్పడడంతో ఇద్దరిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఎన్నికలు ముగిసే వరకు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుబ్బారెడ్డి నంద్యాలకే పరిమితమయ్యారు. ఆళ్లగడ్డలో అడుగు పెడితే బాగోదు.. యువగళం ఘటన నాటి నుంచి ఏవీ, అఖిలప్రియ ఎదురుపడే సందర్భం రాలేదు. ఈ ఫిబ్రవరిలో ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రా.. కదలి రా సభలో పాల్గొనేందుకు ఏవీ ప్రయత్నం చేశారు. సభకు ఏవీ హాజరైతే తీవ్రంగా స్పందిస్తానని అఖిలప్రియ బహిరంగంగానే హెచ్చరించింది. మరోవైపు ఆళ్లగడ్డకు రావొద్దు అనడానికి ఆమె ఎవరంటూ ఏవీ ప్రశ్నించడంతో పాటు సభకు హాజరవుతానని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముంగింట్లో పార్టీలోని నేతలు గొడవలకు పాల్పడితే పార్టీ పరువు బజారున పడుతుందని భయపడిన ఆ పార్టీ నేతలు ఏవీకి సర్ది చెప్పి సభకు రాకుండా ఆపగలిగారు. పగతో రగిలిపోతున్న సుబ్బారెడ్డి అఖిలప్రియ వ్యవహారశైలితో ఏవీ సుబ్బారెడ్డి విసిగిపోయారు. ఆమె చర్యల వల్ల తన పరువుకు భంగం వాటిల్లుతుందని గ్రహించారు. మరోవైపు దాడి చేసిన వాడిని వదిలేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని అనుచరులు చెప్పడంతో తగిన బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి ఏవీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగియగానే పక్కా ప్రణాళికతో నిఖిల్పై దాడి చేశారు. అఖిలప్రియ ఇంటి వద్దే దాడి చేసి తమ జోలికి వస్తే తాము తీవ్రంగా స్పందిస్తామనే సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. తీవ్రంగా గాయపడిన నిఖిల్ నిఖిల్ కదలికలపై కొద్దిరోజులుగా రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోంది. భూమా అఖిల ఇంటి వద్దే నిఖిల్ను మట్టుబెట్టాలనే ఆదేశానుసారం బాధితునిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కారుతో ఢీకొట్టి తర్వాత ఒక్కసారిగా విచక్షణారహితంగా కత్తులతో దాడి చేయడంతో నిఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏ ఒక్కడూ ఊర్లో ఉండడు ఇది ఇలా ఉండగా పోలింగ్ రోజు సాయంత్రం రుద్రవరం మండలంలో అఖిల సోదరుడు భూమా జగత్విఖ్యాత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే ఏ ఒక్కడినీ వదిలిపెట్టేది లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. మన సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కడూ ఊరిలో ఉండడు. ఊరిని వదిలించే బాధ్యత తీసుకుంటా. భూమా నాగిరెడ్డి రాజకీయాన్ని మళ్లీ చూస్తారు.. అంటూ బహిరంగంగానే హెచ్చరించారు. తమ ఆధిపత్యం కోసం ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు రగిలిస్తూ ఉండడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశాజనకంగాఎండుమిర్చి ధరలు
నంద్యాల(సెంట్రల్): పట్టణంలోని మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. బుధవారం సూపర్–10 రకం జనరల్ క్వింటాలు గరిష్ట ధర రూ.17,200, మధ్యస్థ ధర రూ.14,000, కనిష్ట ధర రూ.9,500 గా నమోదైంది. ఇదే రకం తాలుకాయ జనరల్ గరిష్ట ధర క్వింటాలు రూ.6,300, మధ్యస్థ ధర రూ.5,700, కనిష్ట ధర రూ.4,500 పలికినట్లు యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోకుండా యార్డులోని ఽధ్రువీకృత వ్యాపారుల వద్ద సరకు అమ్ముకొని మంచి ధరను పొందాలని సూచించారు. -
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 82.09 శాతం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో జరిగిన ఒక ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో 1,711 పోలింగ్ కేంద్రాల్లో 82.09 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 13,89,307 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,40,432 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 6,80,402 మంది పురుషుల ఓటర్లు ఉండగా 5,63,838 మంది, 7,08,647 మంది మహిళల్లో 5,76,451 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా నందికొట్కూరులో 2,18,047 మంది ఓటర్లు ఉండగా అందులో 1,84,892 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 84.70 శాతం నమోదైంది. అత్యల్పంగా జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ స్థానంలో 2,73,938 మంది ఓటర్లు ఉండగా అందులో 2,05,190 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 74.90 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు వృద్ధులు, మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం మొతం ఓట్లు పోలైన ఓట్లు శాతం ఆళ్లగడ్డ 2,32,676 1,95,582 84.06 శ్రీశైలం 1,96,116 1,62,760 82.99 నందికొట్కూరు 2,18,047 1,84,892 84.79 నంద్యాల 2,73,938 2,05,190 74.90 బనగానపల్లె 2,41,179 2,03,839 84.52 డోన్ 2,27,351 1,88,169 82.77 మొత్తం 13,89,307 11,40,432 82.09 -
వైభవంగా నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి అనంతరం పట్టు పీతాంబారలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం అధిరోహించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను కటాక్షించారు. -
ముచ్చటగా మూడోసారి గెలుపు మనదే
● మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల: డోన్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందామని, 2024 ఎన్నికల్లో ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ సాధిస్తానని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడారు. అందరి సమిష్టి కృషితోనే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. జూన్ 4 వెలువడే ఎన్నికల ఫలితాలో ప్రజలందరి ఆశీర్వాదంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఆలయాలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. సమావేశంలో గిడ్డంగుల శాఖ డైరక్టర్ బాబుల్ రెడ్డి, స్టేట్ ఉర్దూ అకాడమీ డైరక్టర్ ముర్తుజావలీ, మద్దిలేటి స్వామి ఆలయ చైర్మన్ రామచంద్రుడు, సింగిల్ విండో అధ్యక్షులు నారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు నాగేశ్వర్రెడ్డి, గూని నాగరాజు, దస్తగిరి, తిరుమలేశ్వర్ రెడ్డి, యాకోబ్, ఆయా గ్రామాల సర్పంచ్లు శ్రీరాములు, వెంకటేశ్వర్లు, రాజు, యుగంధర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సమరంలో బిజీబిజీగా గడిపిన మంత్రి బుగ్గన పోలింగ్ అనంతరం మంగళవారం నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సరళిని విశ్లేషిస్తూ కనిపించారు. తన వాహన డ్రైవర్ శివ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు. -
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కొలిమిగుండ్ల: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ఈ ఎన్నికల్లో పాజిటివ్ ఓటింగ్ భారీగా నమోదై మరో సారి వైఎస్సార్సీపీ విజయం సాధించబోతుందని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పోలింగ్ జరిగిందన్నారు. మహిళలు, వృద్ధులు, యువత వైఎస్సార్సీపీకి మద్దతు పలికారన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సొంత పనులు మానుకొని పార్టీ కోసం పని చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామంలో ఆయా గ్రామాల పార్టీ శ్రేణులు కష్టపడి ఐదారు సార్లు విస్తృత ప్రచారం నిర్వహించారన్నారు. కొలిమిగుండ్ల మండలంలో 88 శాతం పోలింగ్ నమోదైందన్నారు. బనగానపల్లెలో మరో సారి వైఎస్సార్సీపీ జెండా ఎగురబోతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, జేసీఈఎస్ మండల కన్వీనర్ మొలక రాజారెడ్డి, నాయకులు సత్తిగారి రామిరెడ్డి, పేరం బయపురెడ్డి, కొప్పుల నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, నీలం సంజీవకుమార్రెడ్డి, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్.. శుభారంభం
● 90 శాతం వేసవి దుక్కులు పూర్తి ● అనుకూలిస్తున్న వాతావరణం ● మొదలైన మెట్ట పైర్ల విత్తనాలు ● జిల్లాలో సాగు అంచనా 2.30 లక్షల హెక్టార్లు ● విత్తనాలు, ఎరువుల సరఫరాపై యంత్రాంగం దృష్టి ● మొదలైన సబ్బిడీ విత్తనాల పంపిణీ ● ఆర్బీకేలు కేంద్రంగా సాగు ప్రణాళికలు అమలు సాగుకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సన్నద్ధం అయ్యాం. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రైతులు ముందస్తు సాగు చేపట్టారు. ఆళ్లగడ్డ సబ్డివిజన్ పరిధిలో ఉద్యాన పంటల సాగు మొదలు పెట్టారు. త్వరలో జీలుగలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విత్తనాలు, ఎరువుల కేటాయింపులకు సంబంధించి అంచనా కంటే ఎక్కువగా వచ్చేలా ప్రతిపాదనలు పంపాం. ఈ నెలాఖరుకు ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటు ఉంచి పంపిణీ చేస్తాం. – రామ్మోహన్రెడ్డి, ఏడీఏ, ఆళ్లగడ్డ ఎరువుల ధరలు తగ్గించాలి రసాయనిక ఎరువులు వేయందే పంటలు పండవు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు రోజురోజుకు విపరీతంగా పెంచుతోంది. ఎరుల ధరలను తగ్గించేందుకు కృషి చేయాలి. ఎరువుల ధరలు తగ్గిస్తే రైతులు లాభపడతారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించుకుండా చర్యలు తీసుకోవాలి. – వాసుడు, రైతు, చాగరాజుమేముల ఆర్బీకేలు ఎంతో మేలు ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక్కడే నాణ్యమైన ఎరువులు, విత్తనాలతో పాటు పురుగు మందులు సరసమైన ధరకు అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం చాలా బాగుంది. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతో మంచి జరుగుతోంది. – శ్రీనివాసులు, అర్జునాపురం కొత్తపల్లి మండలం దుద్యాల సమీప పొలంలో నిలిచిన వర్షపు నీరు ఆళ్లగడ్డ: రెండు నెలల విరామం అనంతరం రైతు కోటి ఆశలతో ఖరీఫ్కు సన్నద్ధమవుతున్నాడు. వేసవి దుక్కులు దున్నడం, పొలాల్లో గడ్డి, కొయ్యకాళ్లు ఏరివేస్తూ.. గట్ల వెంట ఉన్న కంప చెట్లు, పిచ్చిమొక్కలను తొలగిస్తూ సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణం చల్లబడి అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాది ఖరీఫ్ జోరుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు 2024 ఖరీఫ్ సాగు ప్రణాళికను ఆర్బీకేలా వారీగా సిద్ధం చేశారు. జిల్లాలో 28 మండలాల పరిధిలో 3,35,887 మంది రైతులు ఉండగా వ్యవసాయ భూమి 2.50 లక్షల హెక్టార్లు ఉంది. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 2.27 లక్షల హెక్టార్లు సాగు జరుగుతుండగా ఈ ఏడాది 2.30 లక్షల హెక్టార్ల వరకు సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ సీజన్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, మిరప, పత్తి, శనగ, కంది, అరటి, పసుపు పంటలు సాగు చేయనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 50 శాతం పైగా భూముల్లో మొదటి దుక్కుల సేద్యం పనులు పూర్తయ్యాయి. మెట్ట భూముల్లో రైతులు విత్తనాలు జల్లుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో రైతులు పొలం పనుల్లో నిమగ్నం కానున్నారు. ఖరీఫ్ వ్యసాయ ప్రణాళిక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో పంటల సాగుపై వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. గత ఏడాది కంటే అదనంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 12,870 క్వింటాళ్ల విత్తనాలు, 1,92,336 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని ప్రతిపాదనలు తయారు చేసి నివేదికలు ఉన్నతాధికారులకు పంపించారు. అవసరమైన విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపాదనలు అంచనా కంటే కాస్త ఎక్కు వగానే పంపించారు. దీంతో ప్రభుత్వం ఆ మేరకు విత్తనాలు, ఎరువులను జిల్లాకు కేటాయించడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. చిరుధాన్యాల వైపు చూపు.. 2023లో ఐక్యరాజ్య సమితి మిల్లెట్ ఇయర్ (చిరుధాన్యాల సంవత్సరం)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ చిరుధాన్యాల సాగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్లో వంద హెక్టార్లకు తగ్గకుండా చిరుధాన్యాల పంటలు సాగు చేపట్టేలా లక్ష్యాలను నిర్ణయించింది. ఒక్కో హెక్టార్కు రూ. 6 వేల విలువ చేసే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించనుంది. 2023 – 24లో 482, 2024 – 25లో 957, 2025 – 26లో 1,247, 2026 – 27 లో 1,657 హెక్టార్లలో చిరుధాన్యాల పంటలు సాగు చేపట్టాలని జిల్లాకు లక్ష్యాలను ఇచ్చింది. రైతుకు భరోసా.. పంటల సాగు చేసే సమయంలో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఖరీప్ సాగుకు ముందే ప్రతి ఏడాది అన్నదాతల ఖాతాల్లో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రూ. 5,500 చొప్పున పెట్టు బడి సాయాన్ని జమ చేస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల నేపథ్యంలో వీటిని జమ చేస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బటన్ నొక్కిన పథకాల సొమ్ములనే జమ కాకుండా ఆపాలని ఎన్నికల కమిషన్కు లెటర్ రాసి అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడైనా రైతు భరోసా నిధులు విడుదల చేయనిస్తారా లేదా వేచి చూడాల్సి వస్తోంది. 2024 – 25 సంవత్సరానికి గాను రైతు భరోసా నిధుల కోసం జిల్లాలో సుమారు 2,20,497 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. రకం కేటాయింపు యూరియా 59,018 డీఏపీ 24,013 ఎంఓపీ 8,677 సూపర్ 2,605 కాంప్లెక్స్ 98,023 సబ్ డివిజన్ వారీగా విత్తనాల కేటాయింపు (క్వింటాళ్లలో..) ఖరీఫ్లో జిల్లాకు కేటాయించిన మొత్తం ఎరువులు ( మెట్రిక్ టన్నులు) -
పలు రైళ్లు రద్దు
నంద్యాల (సిటీ): రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, సాంకేతిక కారణాలతో రైల్వే అధికారులు గుంటూరు డివిజన్ పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. గుంటూరు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను ఈ నెల 16 నుంచి జూన్ 1వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చీఫ్ ప్యాసింజర్ ట్రాఫికింగ్ మేనేజర్ ఏ.సురేష్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, గుంతకల్లు మధ్య నడి చే రైళ్లలో గుంటూరు – కాచిగూడ, కాచిగూడ – గుంటూరు (17251/17252), హుబ్లీ–విజయవాడ, విజయవాడ – హుబ్లీ 17329/17330 నంబర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఎంసెట్ పరీక్ష కేంద్రాల మార్పు కోవెలకుంట్ల: 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లాలోని వివిధ కళాశాలలతోపాటు ఆర్జీఎం, శాంతిరాం కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఇటీవలే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆర్జీఎం, శాంతిరాం కళాశాలల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈ కారణంగా పరీక్ష కేంద్రాల జాబితా నుంచి ఆ రెండు కళాశాలలను తొలగించారు. గతంలో హాల్టికెట్లు పొందిన విద్యార్థులకు ఈ కళాశాలలు పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అయితే మరలా కొత్తగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేపటి నుంచి బీఈడీ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలకు రెగ్యులర్ 3012 మంది, సప్లిమెంటరీకి 568, బీపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ 104, సప్లిమెంటరీకి 19, 4వ సెమిస్టర్ రెగ్యులర్ 71, సప్లిమెంటరీకి 36, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ 84, సప్లిమెంటరీకి 16, 4వ సెమిస్టర్ రెగ్యులర్ 122, సప్లిమెంటరీకి 16 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. ఓర్వకల్లులో 56 మి.మీ వర్షపాతం కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఉష్ణోగ్రతలు 47.7 డిగ్రీలకు చేరాయి. ఆ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ఉమ్మడి జిల్లాలో పలు చెరువులకు భారీగా నీరు వచ్చింది. హంద్రీ కూడా ప్రవహించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం రాత్రి ఓర్వకల్లులో 56 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా కౌతాళంలో అత్యధికంగా 39.4 డిగ్రీలు, అత్యల్పంగా తుగ్గలిలో 35.5 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 39.9, అత్యల్పంగా బేతంచెర్లలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. 16 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 16 నుంచి జూన్ 15వ తేదీ వరకు డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 61 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండవ సెమిస్టర్ పరీక్షలకు రెగ్యులర్ 7,531 మంది, సప్లిమెంటరీకి 9,167, నాలుగో సెమిస్టర్ రెగ్యు లర్ 6,625,సప్లిమెంటరీకి 9,097 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 3,374 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
నంద్యాల, సాక్షి: పోలింగ్ ముగియడంతో జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి!. గత అర్ధరాత్రి ఆళ్లగడ్డలో ఒక యువకుడిపై హత్యాయత్నం జరిగింది. సదరు యువకుడ్ని టీడీపీ నేత భూమా అఖిలప్రియ దగ్గర పని చేసే బాడీగార్డుగా గుర్తించగా.. ఏవీ సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారనే అనుమానాలు తలెత్తున్నాయి.కిందటి ఏడాది మే నెలలో జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. అఖిల ప్రియ వర్గీయులు కొత్తపల్లిరోడ్డులో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. ఆ సమయంలో నిఖిల్ ఆయనపై చేయి చేసుకున్నాడు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు. పైగా ఆమె ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇరువురిని ఎన్నికలయ్యేదాకా గొడవపడొద్దని మందలించినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. ఏడాది తర్వాత నిన్న అర్ధరాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై దాడి జరిగింది. తొలుత కారుతో నిఖిల్కు ఢీ కొట్టారు. ఆ తర్వాత అతనిపై రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నిఖిల్ తీవ్రంగా గాయపడగా.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పగతో సుబ్బారెడ్డి మనుషులే ఈ పని చేయించి ఉంటారని స్థానిక చర్చ నడుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. అయితే దాడికి ఉపయోగించిన వాహనం నంద్యాలకు చెందిందిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
పగిడ్యాల: పడమర ప్రాతకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి విజయుడుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో కర్నూలుకు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు గంగి హరిప్రసాద్ గత రెండు రోజులుగా వాట్సాప్ స్టేటస్లో నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దారా సుధీర్, సచివాలయ మండల కన్వీనర్ రమేష్నాయుడును ధూషిస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టింగ్లు పెడుతున్నాడు. అలాంటి పోస్ట్లు పెట్టవద్దని హరిప్రసాద్ తండ్రి గంగిరమణను మంగళవారం రమేష్నాయుడు సూచించాడు. అయితే ఈ విషయంపై వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రమేష్నాయుడు అనుచరుడు చాకలి విజయుడు పగిడ్యాలకు వెళ్తుండగా సంతమార్కెట్ వద్ద తెలుగు వెంకటేశ్వర్లు, గంగి హరిప్రసాద్, గంగి రమణ, తెలుగు లక్ష్మన్న, కర్ణ, చిన్నస్వాములు దుర్భాషలాడుతూ రాళ్లతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే బాధితుడిని నందికొట్కూరు ఆసుప్రతికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కర్నూలుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్ సీఆర్పీ బలగాలతో పర్యవేక్షించి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నలుగురిపై కేసు నమోదు: ముచ్చుమర్రి స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో మంగళవారం ఉదయం తెలుగు బలరాముడు అనే వ్యక్తిని కాళ్లు, చేతులతో తన్ని, కొట్టిన నలుగురి నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయశేఖర్ తెలిపారు. గ్రామానికి చెందిన రమేష్నాయుడు, నరసింహ, స్వాములు, మల్లయ్యలు బలరామడుపై దాడికి పాల్పడినట్లు బాధితుడు స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. ● తలపై బండరాయితో మోదిన టీడీపీ వర్గీయులు -
బాలుడికి పాముకాటు
మహానంది: బహిర్భూమికి వెళ్లిన నాలుగేళ్ల బాలుడు పాముకాటుకు గురవడంతో పరిస్థితి విషమంగా ఉంది. గాజులపల్లె గ్రామానికి చెందిన శీలం ఓబులేసు, గంగాదేవిలకు ముగ్గురు సంతానం కాగా నాలుగేళ్ల వయసున్న అక్షయ్ చిన్నవాడు. అయితే సోమవారం మధ్యాహ్నం బహిర్భూమికి అని ఇంటి బయలు ప్రదేశంలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ పాము చేతికి కాటేసింది. ఏడుస్తున్న అక్షయ్ను ఓదార్చే క్రమంలో నోట్లో నుంచి నురగ రావడంతో చేతికి ఉన్న కాట్లను గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలకు తరలించారు. మందుల కోసం వచ్చి చైన్ స్నాచింగ్కు యత్నం వెల్దుర్తి(కృష్ణగిరి): మందుల కోసం మెడికల్షాపుకొచ్చిన ఓ యువకుడు దుకాణంలోని మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణకు యత్నించాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి వెల్దుర్తిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దికెరకు చెందిన యువకుడు షాహిద్ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని శేఖర్ మెడికల్ స్టోర్కు వెళ్లాడు. టాబ్లెట్లు కావాలని అడిగాడు. ఆ సమయంలో దుకాణంలో శేఖర్ భార్య సుధారాణి, కుమార్తె సుమాంజలి ఉన్నారు. యువకుడు అడిగిన మాత్రలు సుధారాణి తీసుకొచ్చి ఇస్తుండగా హఠాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని బైక్పై వెళ్లేందుకు యత్నించాడు. గమనించిన దుకాణదారురాలి కుమార్తె పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఆ యువకుడు బైక్ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ విషయంలో పోలీసులకు తెలియజేయడంతో వారు గాలించి పాతబస్టాండ్ సమీపంలో ఆ యువకుడిని పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. -
బైక్ ఢీకొని యువకుడి మృతి
నందికొట్కూరు: పట్టణంలోని మిడుతూరు రోడ్డులో గోశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. టౌన్ సీఐ ప్రకాష్కుమార్ తెలిపిన వివరాల మేరకు .. పట్టణంలోని హజీనగర్కు చెందిన షేక్ మహమ్మద్ రఫి కుమారుడు షేక్ ఆరీఫ్ (18) బజారు నుంచి రాత్రి ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో కొణిదెల గ్రామానికి చెందిన శ్రీనివాసులు మద్యం మత్తులో బైక్పై వెళ్తు ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆరీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement