-
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థులు.. ఒక్కసారి ఆట ముగియగానే స్నేహితులు.. దాదాపు క్రీడాకారులంతా ఇలాగే ఉంటారు. ముఖ్యంగా లీగ్ క్రికెట్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.ఐపీఎల్-2024లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్- సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్తో ముచ్చటించాడు.పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని ముచ్చట్లలో మునిగిపోయిన వేళ.. కమిన్స్ తన వేలి గాయం గురించి పాండ్యా, సూర్యలకు చెప్పాడు. తన కుడిచేతి మధ్యవేలు ముందరి భాగం చిన్నప్పుడే విరిగిపోయిందని కమిన్స్ చెప్పగానే వాళ్లిద్దరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే.. ‘‘అయ్యె అవునా?’’ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. సాటి ఫాస్ట్ బౌలర్గా కమిన్స్ కష్టాన్ని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. ‘‘నాకు నాలుగేళ్ల వయసున్నపుడు.. డోర్ మధ్య వేలు ఇరుక్కోవడంతో పైభాగంలో సెంటీమీటర్ మేర విరిగిపోయింది. అయినా.. నా బౌలింగ్ యాక్షన్పై ఎలాంటి ప్రభావం పడలేదు.ఎందుకంటే నా వేళ్లు అన్నీ దాదాపుగా ఒకే లెంగ్త్తో ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికీ నా సోదరి బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తనే డోర్ వేసింది’’ అని కమిన్స్ తెలిపాడు. అదన్న మాట సంగతి!ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం నాటి మ్యాచ్లో ముంబై సన్రైజర్స్ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ వీరోచిత అజేయ శతకం(51 బంతుల్లో 102)తో రాణించి ముంబై ఇండియన్స్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో కమిన్స్ బ్యాట్(17 బంతుల్లో 35)తో రాణించడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా మూడు కీలక వికెట్లు తీసి సన్రైజర్స్ ఓటమిలో సూర్యతో పాటు తానూ కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik's reaction 😱 pic.twitter.com/oinHeW99mn— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024 -
T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ను టాపార్డర్కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్తో మ్యాచ్తో తాజా వరల్డ్కప్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్లోనే బ్యాటింగ్కు పంపాలి. వన్డౌన్లోనే అతడు ఆడాలి.టాపార్డర్లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్డౌన్లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే.. -
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ నాలుగో విజయం నమోదు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం నాటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ వల్లే ముంబైకి ఈ గెలుపు సాధ్యమైంది.తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదం నుంచి ముంబై తప్పించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు.సూర్యలాంటి విధ్వంసకర బ్యాటర్ తమ జట్టులో ఉండటం అదృష్టమంటూ అతడిని కొనియాడాడు. అదే విధంగా.. విజయానంతరం కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నుంచి ఎదురైన ప్రశ్నకు హార్దిక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా?ప్లే ఆఫ్స్ రేసు గురించి మంజ్రేకర్ ప్రస్తావించగా.. ‘‘మీరు ఏ సమీకరణల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నాం’’ అని హార్దిక్ బదులిచ్చాడు.ఇక సన్రైజర్స్తో మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘మేము 10- 15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం. ఏదేమైనా మా బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. ఇక నేను కూడా ఈరోజు మెరుగ్గా బౌలింగ్ చేయగలిగాను.అత్యుత్తమ బ్యాటర్పరిస్థితులకు అనుగుణంగా నా వ్యూహాలను అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక ‘స్కై’ గురించి చెప్పేదేముంది. తనలోని అత్యుత్తమ బ్యాటర్ మరోసారి బయటకు వచ్చాడు.ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఒత్తిడిలో కూరుకుపోయేలా చేశాడు. ఆత్మవిశ్వాసంతో అతడు బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడి సొంతం’’ అని సూర్యకుమార్ యాదవ్పై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు.ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు:👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్: ముంబై.. బౌలింగ్👉హైదరాబాద్ స్కోరు: 173/8 (20)👉ముంబై స్కోరు: 174/3 (17.2)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్పై ముంబై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 102 రన్స్- నాటౌట్).చదవండి: తండ్రిని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన జూనియర్ బుమ్రా..!💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
IPL 2024: ముంబై ఆశలకు సూర్య ఊపిరి
ముంబై: ఐపీఎల్ నుంచి ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా ని్రష్కమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్స్లు) తప్పించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘనవిజయం సాధించింది. మొదట సన్రైజర్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ (30 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పియూశ్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్కు అండగా తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) నిలిచాడు. ఆదుకున్న హెడ్ ఆరంభంలో హెడ్, ఆఖర్లో కమిన్స్ మెరుపులు మినహా సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో బోర్ కొట్టించింది. పవర్ప్లేలో 56/1 స్కోరు చేసిన హైదరాబాద్ 10 ఓవర్ల దాకా 88/2 స్కోరుతో పటిష్టంగానే కనిపించింది. అభిషేక్ (11), మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 20; 2 ఫోర్లు), క్లాసెన్ (2)... ఇలా కీలక బ్యాటర్లందరినీ వరుస విరామంలో కోల్పోవడంతో హైదరాబాద్ కోలుకోలేదు. 16వ ఓవర్ వేసిన పాండ్యా... షహబాజ్ అహ్మద్ (10), మార్కో జాన్సెన్ (17)లను అవుట్ చేయగా, సమద్ (3)ను చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 136 పరుగులకే 8 వికెట్లు పడిపోవడంతో డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడే స్పెషలిస్టు బ్యాటరే కరువయ్యాడు. అయితే కెపె్టన్ కమిన్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తాచాటడంతో హైదరాబాద్ 170 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ‘సూర్య’ మేటి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రోహిత్ (4) అవుటవగానే సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందే ఇషాన్ కిషన్ (9) పెవిలియన్లో కూర్చుకున్నాడు. ఆ తర్వాత నమన్ ధీర్ (0) డకౌటయ్యాడు. ముంబై స్కోరు 31/3. సంబరాల్లో హైదరాబాద్! ఒత్తిడిలో ముంబై... ఈ దశలో తిలక్ వర్మ అండతో ముంబైని పీకల్లోతు కష్టాల్లోంచి ఘనవిజయం దాకా సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో బౌండరీలతో జట్టును నడిపించిన ‘భారత 360’ డిగ్రీ బ్యాటర్ తర్వాత భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో జట్టు స్కోరు ఆరో ఓవర్లో 50 దాటగా... 12వ ఓవర్లో వంద పరుగుల్ని అధిగమించింది. ఈ భాగస్వామ్యం మెరుపులతో లక్ష్యాన్ని చేరింది. 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న సూర్య... శతక్కొట్టేందుకు మరో 21 బంతుల్లే అవసరమయ్యాయి. 18వ ఓవర్లో భారీ సిక్సర్తో 51 బంతుల్లో సెంచరీని పూర్తిచేసుకోవడంతోనే మ్యాచ్ కూడా ముగిసింది. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) తిలక్ వర్మ (బి) చావ్లా 48; అభిõÙక్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 11; మయాంక్ (బి) అన్షుల్ 5; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అన్షుల్ (బి) హార్దిక్ 20; క్లాసెన్ (బి) చావ్లా 2; జాన్సెన్ (బి) హార్దిక్ 17; షహబాజ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 10; సమద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చావ్లా 3; కమిన్స్ (నాటౌట్) 35; సనీ్వర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–56, 2–68, 3–90, 4–92, 5–96, 6–120, 7–124, 8–136. బౌలింగ్: తుషార 4–0–42–0, అన్షుల్ 4–0–42–1, బుమ్రా 4–0–23–1, హార్దిక్ పాండ్యా 4–0–31–3, పియూశ్ చావ్లా 4–0–33–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) మయాంక్ (బి) జాన్సెన్ 9; రోహిత్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 4; నమన్ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; సూర్యకుమార్ (నాటౌట్) 102; తిలక్ వర్మ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 22; మొత్తం (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–26, 2–31, 3–31. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–22–1, జాన్సెన్ 3–0–45–1, కమిన్స్ 4–1–35–1, నటరాజన్ 3.2–0–31–0, నితీశ్ కుమార్ రెడ్డి 2–0–16–0, షహబాజ్ 1–0–11–0. -
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
టీమిండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న హార్దిక్ ప్రపంచకప్-2024లో కీలక పాత్ర పోషించగలడని జోస్యం చెప్పాడు.ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ప్రభావం చూపగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన పాండ్యా ఇటు కెప్టెన్గా.. అటు ఆల్రౌండర్గా విఫలమవుతున్నాడు.అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆడిన పది మ్యాచ్లలో మూడు మాత్రమే గెలిచింది. ఇక పేస్ ఆల్రౌండర్ పాండ్యా 197 పరుగులు స్కోరు చేయడంతో పాటు.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ధారాళంగా పరుగులు(ఎకానమీ 11) ఇచ్చి ఈ మాత్రం వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన మహ్మద్ కైఫ్.. పాండ్యాకు అండగా నిలిచాడు.‘‘ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ఇంపాక్ట్ చూపగలడని నేను భావిస్తున్నా. పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ల సందర్భంగా ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది.మెల్బోర్న్లో కోహ్లి 82 పరుగులు చేసినపుడు.. హార్దిక్ పాండ్యా 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు.ఆసియా కప్ టోర్నీలో పాక్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫినిషింగ్ టచ్తో ఆకట్టుకున్నాడు. నవాజ్ బౌలింగ్లో ఆఖరి ఓవర్లో దుమ్ములేపాడు. దినేశ్ కార్తిక్, జడేజా అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడి జట్టును గట్టెక్కించాడు’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో గుర్తుచేశాడు.మేజర్ ఈవెంట్లలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుతో ఉండటం ఎంత అవసరమో ఈ ఉదాహరణల ద్వారా వివరించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్కప్ ఆరంభం కానుండగా.. టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. -
T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వికెట్ కీపర్ కోటాలోతన జట్టులో టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్కు మాత్రం మొండిచేయి చూపాడు.ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్ను కూడా ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. -
PBKS Vs MI: గట్టెక్కిన ముంబై
ముల్లాన్పూర్: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన పెద్ద లక్ష్యం ముందు పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో ఆరంభంలోనే మోకరిల్లింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మల మెరుపులు కింగ్స్ను గెలుపు ట్రాక్లో పడేశాయి. కానీ వికెట్లు అందుబాటులో లేక 6 బంతుల్లో సులువైన 12 పరుగుల్ని చేయలేక చివరకు పంజాబ్ ఆలౌటైంది. దీంతో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై 9 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ (53 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. హర్షల్ పటేల్ 3, స్యామ్ కరన్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్స్లు), శశాంక్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆశలు రేపారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా, కొయెట్జీ చెరో 3 వికెట్లు తీశారు. సూర్య ప్రతాపం... ఆరంభంలోనే ఇషాన్ (8) అవుట్ కాగా... కెరీర్లో 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ (25 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ పవర్ ప్లేలో జట్టు స్కోరును 54/1కు తీసుకెళ్లారు. తర్వాత సూర్య దూకుడు కొనసాగడంతో పరుగుల వేగం పెరిగింది. సగం ఓవర్లు ముగిసేసరికి ముంబై 86/1 స్కోరు చేసింది. ఆ మరుసటి ఓవర్లోనే సూర్యకుమార్ 34 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అయితే 12వ ఓవర్ వేసిన స్యామ్ కరన్... రోహిత్ ఆట ముగించడంతో రెండో వికెట్కు 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో ముంబై వంద పరుగులను చేరుకుంది. 14 ఓవర్లలో 115/2 స్కోరు చేసిన ముంబై... సూర్య, తిలక్ ధాటిగా ఆడటంతో మిగిలిన 6 ఓవర్లలో 77 పరుగుల్ని సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) తక్కువే చేసినా... తిలక్ మెరుపులు ముంబై జోరుకు దోహదం చేశాయి. హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ (14), షెఫర్డ్ (1), నబీ (0) అవుట్ కావడంతో కేవలం 7 పరుగులే వచ్చాయి. 14/4 అయినా... వణికించిన అశుతోష్! పంజాబ్ ఇన్నింగ్స్ ఇలా మొదలైందో లేదో... అలా కుదేలైంది. 2.1 ఓవర్లలోనే 14/4 స్కోరు వద్ద పీకల్లోతు కష్టాల్లో పడింది. అటు కొయెట్జీ, ఇటు బుమ్రా ధాటికి ఓపెనర్లు స్యామ్ కరన్ (6), ప్రభ్సిమ్రన్ (0), రోసో (1), లివింగ్స్టోన్ (1) పెవిలియన్కు దారి కట్టారు. ఈ దశలో శశాంక్, అశుతోష్ సిక్సర్లతో అలరించారు. కానీ 12.1 ఓవర్లలో 111/7 వద్ద శశాంక్ నిష్క్రమించడంతో పంజాబ్కు ఓటమి ఖాయమైంది. ఈ దశలో అశుతోష్, హర్ప్రీత్ బ్రార్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎనిమిదో వికెట్కు చకచకా 57 పరుగుల జోడించడంతో ఊహించని ఉత్కంఠ వచ్చేసింది. కానీ 168 పరుగుల వద్ద అశుతోష్ ఎనిమిదో వికెట్గా నిష్క్రమించడంతో పంజాబ్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) హర్ప్రీత్ (బి) రబడ 8; రోహిత్ (సి) హర్ప్రీత్ (బి) స్యామ్ కరన్ 36; సూర్యకుమార్ (సి) ప్రభ్సిమ్రన్ (బి) సామ్ కరన్ 78; తిలక్ వర్మ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి) హర్ప్రీత్ (బి) హర్షల్ 10; డేవిడ్ (సి) స్యామ్ కరన్ (బి) హర్షల్ 14; షెఫర్డ్ (సి) శశాంక్ (బి) హర్షల్ 1; నబీ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–18, 2–99, 3–148, 4–167, 5–190, 6–192, 7–192. బౌలింగ్: లివింగ్స్టోన్ 2–0–16–0, అర్‡్షదీప్ 3–0–35–0, రబడ 4–0–42–1, హర్షల్ 4–0–31–3, స్యామ్ కరన్ 4–0–41–2, హర్ప్రీత్ బ్రార్ 3–0–21–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 6; ప్రభ్సిమ్రన్ (సి) ఇషాన్ (బి) కొయెట్జీ 0; రోసో (బి) బుమ్రా 1; లివింగ్స్టోన్ (సి అండ్ బి) కొయెట్జీ 1; హర్ప్రీత్ సింగ్ (సి అండ్ బి) గోపాల్ 13; శశాంక్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 41; జితేశ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆకాశ్ 9; అశుతోష్ (సి) నబీ (బి) కొయెట్జీ 61; హర్ప్రీత్ బ్రార్ (సి) నబీ (బి) పాండ్యా 21; హర్షల్ (నాటౌట్) 1; రబడ (రనౌట్) 8; ఎక్స్ట్రాలు 21; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–10, 2–13, 3–14, 4–14, 5–49, 6–77, 7–111, 8–168, 9–174, 10–183. బౌలింగ్: కొయెట్జీ 4–0–32–3, బుమ్రా 4–0–21–3, ఆకాశ్ మధ్వాల్ 3.1–0–46–1, పాండ్యా 4–0–33–1, శ్రేయస్ గోపాల్ 2–0–26–1, షెఫర్డ్ 2–0–20–0. ఐపీఎల్లో నేడు లక్నో X చెన్నై వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్ బాగా ఆడాడు.. బుమ్రా నా జట్టులో ఉండటం అదృష్టం: పాండ్యా
సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ మరోసారి సత్తా చాటింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో పాయింట్ల ఖాతా తెరిచిన పాండ్యా సేన.. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది. అద్భుత ఆట తీరుతో గురువారం నాటి మ్యాచ్లో ఆర్సీబీని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి.. ఐపీఎల్-2024లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఐదు వికెట్లు పడగొట్టి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 మరోవైపు.. హార్డ్ హిట్టర్, ఇంపాక్ట్ ప్లేయర్గా దిగిన సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 52)తో తిరిగి ఫామ్లోకి రావడంతో.. ముంబై శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఇద్దరు ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ICYMI - Surya lighting up the night SKY with a flurry of SIXES 🔥🔥🔥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB | @surya_14kumar pic.twitter.com/7CiLtcwTyI — IndianPremierLeague (@IPL) April 11, 2024 వరుసగా రెండో విజయం సాధించడంపై స్పందిస్తూ.. ‘‘ గెలవడం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్లో గెలిచిన తీరు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కెప్టెన్గా నాకు కాస్త వెసలుబాటు కల్పించిందనే చెప్పాలి. రోహిత్(24 బంతుల్లో 38), ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. వాళ్లిద్దరూ కలిసి మా విజయానికి పునాది వేశారు. నెట్ రన్ రేటు మెరుగుపరచుకునే క్రమంలో త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నది మా ప్రణాళిక. బుమ్రా లాంటి అద్భుతమైన బౌలర్ నా జట్టులో ఉండటం నా అదృష్టం. ప్రతి ఓవర్లోనూ ప్రభావం చూపాడు. నేను తనకు అప్పగించిన పని పూర్తి చేశాడు. తను జట్టు కోసం ఏం చేయగలడో అదంతా చేశాడు. ఏ మ్యాచ్కు ముందైనా సరే నెట్స్లో తను తీవ్రంగా శ్రమిస్తాడు. అతడి నైపుణ్యాలు అమోఘం. ఇక నువ్వు ఫిఫ్టీ కొట్టడమే నీకు వెల్కమ్ బ్యాక్ లాంటిదని సూర్యకు చెప్పాను. సూర్య జట్టుతో ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు. అపోజిషన్ కెప్టెన్గా ఉన్నపుడు కూడా తనను అవుట్ చేసేందుకు పదునైన వ్యూహాలు రచించాల్సి వచ్చేది. కొన్ని ఏరియాల్లో అతడు మాత్రమే హిట్టింగ్ ఆడగలడు. నేను ఇంతకు ముందు అలాంటి బ్యాటర్ను చూడలేదు’’ అని హార్దిక్ పాండ్యా.. బుమ్రా, సూర్యలను కొనియాడాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: టాస్: ముంబై.. బౌలింగ్ ఆర్సీబీ స్కోరు: 196/8 (20) ముంబై స్కోరు: 199/3 (15.3) ఫలితం: ఏడు వికెట్ల తేడాతో బెంగళూరుపై ముంబై విజయం చదవండి: చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు! లేదంటేనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
RCB Vs MI Highlights Photos: ఇషాన్, సూర్యకుమార్ల విధ్వంసం ముంబై ఘనవిజయం (ఫొటోలు)
-
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్దీప్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్దీప్ 3.3–0–55–1, మ్యాక్స్వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్.. మిస్టర్ 360 వచ్చేశాడు
ఐపీఎల్-2024లో వరుస ఓటములతో సతమతవుతున్న ముంబై ఇండియన్స్కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఎట్టకేలకు నేషనల్ క్రికెట్ అకాడమీ మిస్టర్ 360 క్లియరన్స్ సర్టిఫికేట్ పొందాడు. ఈ క్రమంలో సూర్య కుమార్ ముంబై జట్టుతో కలిశాడు. ముంబై జట్టులో చేరిన సూర్యకుమార్ యాదవ్.. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు. నెట్స్లో సూర్య తన ట్రేడ్ మార్క్ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముంబై జట్టు సెలక్షన్కు సూర్య అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. సూర్య రాకతోనైనా ముంబై తలరాత మారుతుందో లేదో చూడాలి. -
గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం
IPL 2024- MI Vs RR: ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు.అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్లో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.ఈ మూడింటిలో టైటాన్స్తో మ్యాచ్లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్రైజర్స్తో మ్యాచ్లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్తో మ్యాచ్లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1— IndianPremierLeague (@IPL) April 1, 2024ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.‘‘ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సేవలను కచ్చితంగా మిస్ అవుతోంది. సూర్యకుమార్ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు.అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్ గేమ్ చేంజర్’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు..@rajasthanroyals’ Lethal Start 🔥They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏After 7 overs, it is 58/4Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV— IndianPremierLeague (@IPL) April 1, 2024కాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఈ టీమిండియా స్టార్.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.ఇక గత సీజన్లో రోహిత్ శర్మకు బదులు కొన్ని మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం.చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా -
గేమ్ చేంజర్.. అతడు ఉంటే ముంబై గెలిచేది: టీమిండియా దిగ్గజం
IPL 2024- MI Vs RR: ఐపీఎల్-2024లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో ఒక్కటీ గెలవలేక హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. అతడి చెత్త నిర్ణయాల కారణంగా జట్టు మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాగా పదిహేడో ఎడిషన్లో తమ తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మూడింటిలో టైటాన్స్తో మ్యాచ్లో మాత్రమే ముంబై కాస్త మెరుగైన ప్రదర్శన కనబరిచింది. సన్రైజర్స్తో మ్యాచ్లో బౌలర్లు తేలిపోగా.. రాజస్తాన్తో మ్యాచ్లో బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్తాన్ చేతిలో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 𝙄𝙣 𝙎𝙩𝙮𝙡𝙚 😎 Riyan Parag's innings help @rajasthanroyals reach 🔝 of the table 💪#RR are the 2️⃣nd team to win an away fixture this season 👏👏 Scorecard ▶️ https://t.co/XL2RWMFLbE#TATAIPL | #MIvRR pic.twitter.com/ZsVk9rvam1 — IndianPremierLeague (@IPL) April 1, 2024 ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుతో లేకపోవడం ముంబై ఇండియన్స్కు భారీ ఎదురుదెబ్బ అన్నాడు. అతడు గనుక అందుబాటులో ఉండి ఉంటే మ్యాచ్ ఫలితాలను కచ్చితంగా ప్రభావితం చేసేవాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘‘ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సేవలను కచ్చితంగా మిస్ అవుతోంది. సూర్యకుమార్ ఉంటే మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. కానీ ప్రస్తుతం అతడు జట్టుతో లేడు. అతడు త్వరగా తిరిగి రావాలని ముంబై ఇండియన్స్ బహుశా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉంటే కచ్చితంగా ఫలితాలను తారుమారుచేయగలడు. అతడొక గేమ్ గేమ్ చేంజర్’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. .@rajasthanroyals’ Lethal Start 🔥 They run through #MI’s top order courtesy Trent Boult & Nandre Burger 👏 After 7 overs, it is 58/4 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #MIvRR pic.twitter.com/mEUocuD0EV — IndianPremierLeague (@IPL) April 1, 2024 కాగా ముంబై ఇండియన్స్ టాపార్డర్కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముక లాంటివాడు. ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన ఈ టీమిండియా స్టార్.. ఈ ఏడాది జనవరిలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అయితే, అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఇక గత సీజన్లో రోహిత్ శర్మకు బదులు కొన్ని మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్-2023లో మొత్తంగా ఆడిన 16 మ్యాచ్లో 605 పరుగులు సాధించాడు. ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోని సమయంలో టీమిండియాకు కూడా సారథిగా వ్యవహరించి జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సూర్య... ఇంకొన్ని మ్యాచ్ల తర్వాతే!
ప్రపంచ నంబర్వన్ టి20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఇంకొంత సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. జూన్లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తొందరపడి సూర్యను ఐపీఎల్లో వెంటనే బరిలోకి దించాలని బోర్డు భావించడం లేదు. జనవరిలో సూర్యకు ‘స్పోర్ట్స్ హెర్నియా’ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. -
‘టాప్’ ర్యాంక్లోనే సూర్యకుమార్
గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఐర్లాండ్తో జరిగిన టి20 సిరీస్లో రాణించిన రషీద్ ఖాన్ నాలుగు స్థానాలు ఎగబాకి పదో ర్యాంక్కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 4వ ర్యాంక్లో ఉన్నాడు. -
ధనాధన్ దంచికొట్టుడు.. పులి ఆకలి మీదున్నట్లు ఉంది!
ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో అర్ధ శతకం సాధించాడు. కేవలం 55 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్లో ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ధర్మశాలలో జరుగుతున్న తాజా మ్యాచ్లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ సూపర్ ఇన్నింగ్స్కు తెరపడింది. అయితే, క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్పై మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘పులి బాగా ఆకలి మీద ఉన్నట్లుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకితభావాన్ని చాటిచెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తాజా సిరీస్లో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) సెంచరీలకు తోడు.. అరంగేట్ర బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆట ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. Wood's got pace? Sarfaraz has the answer 😎#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSport pic.twitter.com/htRkcp57X1 — JioCinema (@JioCinema) March 8, 2024 చదవండి: అది ముమ్మాటికి తప్పే.. తనిప్పుడు పెద్దవాడు అయ్యాడు కాబట్టే: గిల్ తండ్రి -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్లు ఆడి 155.95 స్ట్రయిక్రేట్తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్కప్లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్కప్నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవ, అర్ష్దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
టీమిండియాను వదలని గాయాల బెడద.. అతడు కూడా అవుట్?
Ind vs Eng Test Series- 2024: టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా అతడు ఇప్పట్లో మైదానంలో దిగడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఐసీసీ టోర్నీలో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ స్టార్ పేసర్.. 24 వికెట్లు పడగొట్టాడు. తద్వారా తాజా ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవార్డు అందుకున్నాడున. చీలమండ నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటూ ఈ ఈవెంట్ను పూర్తి చేశాడు షమీ. ప్రపంచకప్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న షమీ.. గాయం నుంచి కోలుకొని కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. తాజా సమాచారం ప్రకారం అతడు ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘షమీ ఇప్పటికీ బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కాబట్టి ఇంగ్లండ్తో తొలి రెండు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అదరగొట్టారు. వీరిద్దరి విజృంభణ కారణంగా కేప్టౌన్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 1-1తో డ్రా చేసుకోగలిగింది. అయితే, అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ సందర్భంగా వీరిద్దరికి మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఇంగ్లండ్తో టెస్టులకు వీరిలో ఒక్కరు అందుబాటులోకి వచ్చినా షమీ లేనిలోటు తెలియదు. అలాకాక ఇద్దరికీ రెస్ట్ పొడిగిస్తే.. యువ ఫాస్ట్బౌలర్లకు అవకాశం దక్కొచ్చు. అయితే, ఉపఖండ పిచ్లపై స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపగలరు కాబట్టి.. పేస్ దళం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాగా టీమిండియా ప్రస్తుతం గాయాల బెడదతో సతమతమవుతోంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే ఆటకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. జనవరి 11- 17 మధ్య అఫ్గనన్తో టీ20 సిరీస్ ఆడనున్న టీమిండియా.. తదుపరి జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. చదవండి: ‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’ -
IPL 2024: ముంబై ఇండియన్స్కు మరో బిగ్ షాక్!
Suryakumar Yadav- Setback To Mumbai Indians Ahead IPL 2024?: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మరి కొన్నాళ్లపాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్ బ్యాటర్ ను మరో ఆరోగ్య సమస్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ హెర్నియా వల్ల అతడు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. సర్జరీ కోసం జర్మనీకి ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్ జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెలువరించింది. ‘‘సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. రానున్న రెండు- మూడు రోజుల్లో అతడు సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్కు పయనమవుతాడు. కాబట్టి రంజీ ట్రోఫీ టోర్నీతో పాటు ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లకు సూర్య దూరంగా ఉంటాడు. రంజీలు ఆడడు.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం! రంజీల్లో ముంబై తరఫున ఆడటం వీలుపడదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉండడు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. జూన్లోనే టీ20 వరల్డ్కప్-2024 మొదలుకానుంది కాబట్టి.. సూర్య పూర్తిగా కోలుకునేలా మేనేజ్మెంట్ అన్ని రకాల చర్యలు చేపట్టిందని సదరు వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. కాగా చీలమండ నొప్పి వల్ల సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పటికే హార్దిక్ దూరమయ్యాడు! ఇదిలా ఉంటే.. సూర్య గనుక ఆరంభ మ్యాచ్లకు దూరమైతే ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బ తగినట్లే! ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చీలమండ నొప్పితో ఆటకు దూరంగా ఉన్నాడు. అతడు ఎప్పుడు జట్టుతో చేరతాడన్న అంశంలో స్పష్టత లేదు. ఇప్పుడు సూర్య కూడా దూరం కావడంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే ముంబై ఐపీఎల్-2024 సీజన్ను ఆరంభించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ హెర్నియా అంటే? WebMD హెల్త్ అండ్ ఫిట్నెస్ గైడ్ ప్రకారం.. కండరాల్లో నొప్పి లేదంటే గజ్జల్లో గాయం.. లేదంటే పొట్ట దిగువన(మృదువైన కణజాలం) తీవ్రమైన నొప్పి రావడాన్ని సాధారణంగా స్పోర్ట్స్ హెర్నియాగా వ్యవహరిస్తారు. కేవలం ప్రొఫెషనల్ ప్లేయర్లే గాకుండా.. ఆటలు ఆడే చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్యే ఇది. మెడికల్ ప్రొఫెషనల్స్ దీనిని స్పోర్ట్స్ హెర్నియా లేదంటే.. అథ్లెటిక్ పబల్గియాగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉంటే.. మానవ శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు మరొక భాగంలోకి చొచ్చుకువచ్చే స్థితిని సాధారణంగా హెర్నియా అని పిలుస్తారు. స్పోర్ట్స్ హెర్నియా, దీని లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. చదవండి: అఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.. రోహిత్, కోహ్లి రీఎంట్రీ, సంజూకు ఛాన్స్ -
Tilak Varma: క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే: అక్షర్ పటేల్
Tilak VarmaTraining Video: టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్లో చెమటోడుస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తిలక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘కొత్త ఏడాది చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటాను. 2024ను ఆరంభించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు’’ అని తిలక్ వర్మ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు బదులుగా టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ‘‘నీకు ఇలాంటి నకిలీ క్యాప్షన్లు ఎవరు ఇస్తారు’’ అంటూ సరదాగా ట్రోల్ చేశాడు. క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే మరో టీమిండియా స్టార్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా సూర్యకు వత్తాసు పలుకుతూ.. ‘‘క్యాప్షన్ ఒక్కటే కాదు.. ఆ వీడియో కూడా నకిలీదే. డిసెంబరు 30నాటి ట్రెయినింగ్ సెషన్కు సంబంధించిన వీడియో అది’’ అంటూ తిలక్ వర్మను ఆటపట్టించాడు. తిలక్ను ఉద్దేశించి సూర్య, అక్షర్ చేసిన కామెంట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా కాగా అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్-2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లోనూ ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 15 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 310, 68 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పార్ట్టైమ్ స్పిన్నర్. తదుపరి జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్ సిరీస్లో తనను తాను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ ముందుకుసాగుతున్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! View this post on Instagram A post shared by Tilak Varma (@tilakvarma9) -
IPL 2024: పాండ్యా దూరం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడే?
IPL 2024- Mimbai Indians Captain: ఐపీఎల్ స్టార్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ 2023లో కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకోవడమే గాక.. కెప్టెన్గానూ నియమించింది. ఐదుసార్లు తమను చాంపియన్గా నిలిపిన భారత జట్టు సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. టీమిండియా భావి కెప్టెన్గా భావిస్తున్న హార్దిక్ పాండ్యాను తిరిగి తమ జట్టులో చేర్చుకోవడం ద్వారా బ్రాండ్ వాల్యూను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ముంబై ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే వంద కోట్ల రూపాయాలకు పైగా వెచ్చించి అతడిని ట్రేడ్ చేసుకుందనే ఊహాగానాలు వినిపించాయి. పాండ్యా దూరమైతే జట్టును నడిపించేది ఎవరు? అయితే, వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా గాయపడ్డ పాండ్యా ఇప్పటికీ కోలుకోకపోవడంతో ముంబైకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఐపీఎల్-2024కు కూడా అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గనుక ఈ ఏడాది ఎడిషన్ మొత్తానికి దూరమైతే అతడి స్థానంలో ఎవరు నాయకుడిగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆ ఛాన్సే లేదు రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్గా ప్రకటించాలని అభిమానులు ఆశిస్తున్నా.. తాను ఆటగాడిగా కొనసాగేందుకు ఇష్టపడుతున్నట్లు హిట్మ్యాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అంతేగాక.. తనను తప్పించిన తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపడం సహజం. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా లేదంటే భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైని నడిపించే అవకాశం ఉంది. సూర్యకు కూడా గాయం కానీ పాండ్యా మాదిరే సూర్య కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడి చీలమండకు గాయం కాగా నొప్పి తీవ్రతరం కావడంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుభజ్ఞుడు బుమ్రా వైపే మొగ్గు ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచీ బుమ్రా ముంబై ఇండియన్స్తోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు. సీనియర్ ప్లేయర్గా డ్రెస్సింగ్రూం వాతావరణం, కల్చర్ గురించి అతడికి బాగా తెలుసు. అంతేగాక.. టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. టెస్టు జట్టుతో పాటు ఐర్లాండ్ సిరీస్లో టీమిండియా టీ20 కెప్టెన్గా బుమ్రా వ్యవహరించాడు. కాబట్టి ఫ్రాంఛైజీ అతడి వైపై మొగ్గు చూపే అవకాశం ఉంది. చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్లో ఎంట్రీ.. దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్గా వార్నర్ -
టీమిండియాకు ఊహించని షాక్.. సూర్యకుమార్ గాయం తీవ్రం! ఇక నుంచి..
Suryakumar Yadav out of action till..: అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు నెలన్నర పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో అఫ్గనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ కానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా వన్డే వరల్డ్కప్-2023లో ప్రభావం చూపలేకపోయిన సూర్య.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి ఫార్మాట్ సిరీస్లో దుమ్ములేపాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో కెప్టెన్గా సత్తా సొంతగడ్డపై.. తొలిసారిగా టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్.. 4-1తో ఆసీస్పై ఐదు మ్యాచ్ల సిరీస్ నెగ్గాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ను 1-1తో సమం చేసి సత్తా చాటాడు. ఆటగాడిగా, సారథిగా అద్భుతంగా రాణించి సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టుతో ట్రోఫీని పంచుకున్నాడు. సౌతాఫ్రికాలో సుడిగాలి శతకంతో చెలరేగి ముఖ్యంగా సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. 56 బంతుల్లోనే 100 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్తో టీమిండియా 106 పరుగుల తేడాతో భారీ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగానే సూర్యకుమార్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. జొహన్నస్బర్గ్లో డిసెంబరు 16న జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయం తీవ్రం.. దీంతో అతడి మడిమ మెలిక పడింది. ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడిన సూర్యను పర్యవేక్షించి చికిత్స అందించింది వైద్య బృందం. ఈ నేపథ్యంలో సూర్య మైదానాన్ని వీడగా రవీంద్ర జడేజా సారథిగా వ్యవహరించాడు. అయితే, మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. సూర్య చీలమండ నొప్పి తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘కోలుకోవడానికి సూర్యకుమార్కు మరికొంత సమయం కావాలి. అఫ్గనిస్తాన్తో సిరీస్కు దూరం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అనంతరం ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. అయితే, అతడు కచ్చితంగా అఫ్గనిస్తాన్ సిరీస్కు మాత్రం దూరమవుతాడు’’ అని పేర్కొన్నాయి. కాగా జనవరి 11 నుంచి స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉండగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆటకు విరామం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో కెప్టెన్గా వచ్చిన సూర్య సైతం ఇలా జట్టుకు దూరం కావడం టీమిండియాలో ఆందోళనకు కారణమైంది. జూన్ నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఇలా వరుస ఎదురుదెబ్బలు తగలడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా అఫ్గన్తో తమ ఆఖరిసారి టీ20 సిరీస్ ఆడనుంది. చదవండి: అది గతం.. ఇప్పుడు రోహిత్ మునుపటిలా లేడు.. ఈసారి కచ్చితంగా: మంజ్రేకర్ -
రోహిత్ శర్మను తప్పించడం సరైన నిర్ణయం: డివిలియర్స్
AB de Villiers backs MI's decision: కెప్టెన్ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్ సరైన నిర్ణయం తీసుకుందని సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కానీ హార్దిక్ పాండ్యా నియామకం విషయంలో ఎంఐ అభిమానుల నుంచి ఇంతటి నెగిటివిటీని ఊహించలేదన్నాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఫ్రాంఛైజీ పట్ల విశ్వాసంగా ఉన్న మాట వాస్తమేనన్న డివిలియర్స్.. ఇప్పుడు హార్దిక్ తిరిగి వచ్చినందు వల్ల అతడికి పగ్గాలు అప్పజెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. రోహిత్ శర్మను తప్పిస్తూ ముంబై తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024కు ముందు తిరిగి సొంతగూటికి చేరిన విషయం తెలిసిందే. తనకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్కి మళ్లీ ఆడేందుకు సిద్ధమైన పాండ్యా ఈసారి కెప్టెన్గా అవతారమెత్తనున్నాడు. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు ఇదిలా ఉంటే.. ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని పాండ్యాను సారథి చేయడంతో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. లెజెండ్ పట్ల మీరు చూపే గౌరవం ఇదేనా.. "RIP MUMBAI INDIANS" అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐ ఇన్స్టా, ఎక్స్ పేజీల ఫాలోవర్లు లక్షల్లో తగ్గిపోయారు. బ్యాటర్గా ఆటను ఆస్వాదించాలనే? ఈ విషయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించి ఏబీడీ.. ‘‘ఈ వార్త తెలిసిన తర్వాత కొంతమంది సంతోషపడితే.. మరికొంత మంది బాధపడుతున్నారు. అంతేకాదు కెప్టెన్ మార్పు ప్రకటన తర్వాత ఎంఐ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కోల్పోయిందని చదివాను. రోహిత్ స్థానాన్ని హార్దిక్ భర్తీ చేయడాన్ని చాలా మంది పర్సనల్గా తీసుకుని ఉంటారు. అయితే, ముంబై హార్దిక్ను కెప్టెన్ చేయడం చెత్త నిర్ణయమని నేను భావించను. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ప్రస్తుతం తను టీమిండియా కెప్టెన్గా కూడా ఉన్నాడు. కాబట్టి కనీసం ఫ్రాంఛైజీ క్రికెట్లో అయినా.. ఒత్తిడిని తగ్గించుకుని బ్యాటర్గా ఆటను ఆస్వాదించాలని భావించి ఉంటాడు. మరో మాట.. సూర్య, బుమ్రా ముంబై పట్ల విశ్వాసంగానే ఉన్నారు. అయితే, ఇప్పుడు హార్దిక్ తిరిగి వచ్చాడు. కాబట్టి తనను కెప్టెన్ చేయడంలో తప్పేముంది? ఈ నిర్ణయాన్ని ఎందుకింత ప్రతికూల దృష్టితో చూస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే.. ఈ ప్రతికూలత తగ్గే అవకాశం ఉందని ఈ సందర్బంగా ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. -
బుమ్రా, సూర్యకు షాకిచ్చిన ముంబై!.. పోస్ట్ డిలీట్ చేసిన దేవిశా
Suryakumar Yadav Heartbreak Emoji- His Wife shares cryptic post: క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు గురించే చర్చ నడుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై జట్టును ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను.. సారథ్య బాధ్యతల నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వద్దని వదిలేసుకున్న హార్దిక్ పాండ్యాను తిరిగి రప్పించడం బాగానే ఉన్నా.. హిట్మ్యాన్ ఉండగా అతడిని కెప్టెన్గా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు. ఇలా చేయడానికి సిగ్గుండాలి ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నందుకు.. ‘‘మీరు సిగ్గుపడాలి’’ అంటూ #ShameOnMI అంటూ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తూ ముంబై ఫ్రాంఛైజీని ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మకు మద్దతుగా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని అయితే.. ముంబై జెర్సీని కాల్చివేస్తానంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాడు. కెప్టెన్ కావాలని భావించిన బుమ్రా, సూర్య ఇక అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా ఫ్రాంఛైజీ నిర్ణయంతో కంగుతిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ కావాలని భావించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వరల్డ్నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ను తప్పిస్తూ పాండ్యాను తమ కెప్టెన్గా నియమించినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించగానే సూర్యకుమార్.. ‘‘హృదయం ముక్కలైంది’’ అంటూ హార్ట్బ్రేక్ ఎమోజీని షేర్ చేయడం గమనార్హం. కాగా సూర్యకు రోహిత్ శర్మ ఆది నుంచి అండగా నిలబడిన విషయం తెలిసిందే. వెంటనే పోస్ట్ డిలీట్ చేసిన సూర్య భార్య అంతేగాకుండా గత సీజన్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా పలు మ్యాచ్లలో బరిలోకి దిగినపుడు సూర్య కెప్టెన్గా వ్యవహరించాడు. ప్రస్తుతం రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో టీమిండియా సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు కూడా రోహిత్ శర్మ తర్వాతి కాలంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాగలడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, హార్దిక్ పాండ్యా రాకతో సూర్య కలలు ఇక కల్లలైనట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి నెట్టింట ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘‘మీ చుట్టూ ఉన్న వాళ్ల పట్ల మీరెలా వ్యవహరించాన్న విషయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది’’ అని దేవిశా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే, వెంటనే దానిని డిలీట్ చేయడం చర్చకు తావిచ్చింది. చదవండి: భారత జట్టులోనూ ‘వై నాట్ ఏపీ’.. సీఎం జగన్ విజన్!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మరో రెండ్రోజులు వానలు
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
రోజు రూ.2 కోట్లకుపైగానే..
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అన్నదాతల అగచాట్లు
రోజు రూ.2 కోట్లకుపైగానే..
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement