- మరాఠ్వాడ నుంచి ప్రారంభం
- వెల్లడించిన ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు తట్కరే
- నవీముంబై గెలుపు ఆత్మవిశ్వాసం పెంచిందని వెల్లడి
సాక్షి, ముంబై: కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యటనలో పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు, పదాధికారులు పాల్గొంటారు. మే ఒకటో తేదీన మహారాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాతి రోజు నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్ల నుంచి వరుసగా కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న మరాఠ్వాడ రీజయన్ నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది.
ఇటీవల జరిగిన నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో ఎన్సీపీలో ఆవిరైన ఆశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్రంలో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే ధీమా పార్టీ నాయకుల్లో నింపాయి. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ నాలుగో స్థానానికే పరిమితమైంది. వరుస పరాజయాలతో కుంగిపోయిన పదాధికారులకు, కార్యకర్తలకు నవీముంబై ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని కలిగించాయి.
శాసనసభ ఎన్నికల తరువాత ఎన్సీపీకి బీజేపీ దగ్గర కావడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. దీంతో సందిగ్ధాన్ని తొలగించేందుకు పుణే, అలీబాగ్ ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించనున్నారు. నవీముంబైలో గణేశ్ నాయిక్ వల్లే ఎన్సీపీ విజయం సాధించిందని, అది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేసిందని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇందు కోసమే పవార్ పర్యటనను ఖరారు చేసినట్లు తెలిపారు. మరాఠ్వాడ పర్యటన అనంతరం విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పవార్ పర్యటిస్తారని తట్కరే చెప్పారు. ఆయనతోపాటు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, దిలీప్ వల్సే పాటిల్ తదితర కీలక నేతలు కూడా పర్యటిస్తారని తట్కరే చెప్పారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోయిందని, ఆ స్థానం ఆక్రమించాలని కార్యకర్తలకు ఉద్బోధించాలన్నారు.
త్వరలో పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటన
Published Sat, Apr 25 2015 10:54 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
Anasuya Sengupta: 'కేన్స్'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
కడుపులో అల్సర్స్ తగ్గాలంటే..!
ఫుల్ వ్యాలిడిటీ.. ఈ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసా?
ఒక్క ఆలోచనతో రూ.15780 కోట్ల బిజినెస్.. ఎవరీ 'ప్రతీక్ సూరి'?
65వ సెంచరీ నమోదు చేసిన పుజారా
మెత్తబడ్డ తైవాన్.. చైనాకు స్నేహ హస్తం
టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్సీపీ
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement