Sakshi News home page

టీడీపీ ప్రచారంలో విమ్స్‌ ఉద్యోగి

Published Wed, Apr 17 2024 5:45 AM

భగత్‌సింగ్‌నగర్‌లోఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడితో విమ్స్‌ ఉద్యోగి నూకరాజు(సర్కిల్‌)  - Sakshi

ఆరిలోవ: కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో విమ్స్‌ ఉద్యోగి పాల్గొని నిబంధనలు ఉల్లంఘించాడు. జీవీఎంసీ 13వ వార్డు పరిధి భగత్‌సింగ్‌నగర్‌లో మంగళవారం కూటమి అభ్యర్థి(టీడీపీ) వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరులతో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇదే వార్డుకు చెందిన పి.నూకరాజు ఎమ్మెల్యేతో కలసి వీధుల్లో ప్రచారం చేశాడు. ప్రస్తుతం నూకరాజు విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించడం ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లేనని.. అతనిపై చర్యలు తీసుకోవాలని మిగిలిన పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement
Advertisement