-
AP: జెట్ స్పీడ్గా సిట్ దర్యాప్తు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక బృందం(SIT) దర్యాప్తు జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో టీంను నియమించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సిట్ బృందం దర్యాప్తు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి నుంచి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది అధికారుల బృందం దర్యాప్తులోకి దిగింది. ఈ టీంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ వి శ్రీనివాసరావు, డీఎస్పీ రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు ఉన్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైనా ఆరాలు తీస్తోంది. ఈ మొత్తం ఘటనలపై ఆదివారం లోగా ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది.ఇంకా 144 సెక్షన్పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన హింస నాలుగు రోజుల పాటు కొనసాగింది. మాచర్ల, నరసరావుపేట, పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతిల్లో జరిగిన ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తాడిపత్రి, సత్తెనపల్లి, జమ్మలమడుగులో పోలీస్ పహారా ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల ఆఫీస్ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలీసుల పచ్చపాత వైఖరిమరోవైపు.. ఏపీలో పోలీసులు పక్షపాత వైఖరిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పల్నాడు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. దాడి చేసిన టీడీపీ నేతలను వదిలేసి.. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నేతలను, అలాగే వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండిస్తున్నారు. -
విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
విజయవాడ: ఓ మహిళా డాక్టర్ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఆ ఘటనను చూశారు. ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె.. ఉన్నపళంగా సీపీఆర్ చేశారు. కొన్ని నిమిషాల పాటు సీపీఆర్ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ షాక్తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్విజయవాడ - అయ్యప్పనగర్లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు… pic.twitter.com/qeLQ2tJRbv— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024 -
No Headline
● ఆహార నియమాలు పాటించాలి. ● క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ● బీఎంఐ 25 లోపు ఉంచుకోవాలి. ● ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. ● జన్యుపరమైన సమస్యలు ఉన్న వారు వారానికోసారి బీపీ పరీక్షించుకోవాలి. ● తల్లిదండ్రులకు బీపీ ఉంటే అప్రమత్తంగా ఉంటూ స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి. ● ప్రాసెసింగ్ ఫుడ్, నిల్వ ఉండే పచ్చళ్లు తినకుండా ఉండటం మంచిది. ● యోగా, మెడిటేషన్ వంటి వాటితో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందాలి. -
మధిర స్టేషన్లో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ–కాజీపేట సెక్షన్లో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణ పనుల కారణంగా మధిర రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు తాత్కాలికంగా హాల్టింగ్ నిలిపివేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17, 18 తేదీలలో ఎస్ఎంవీడీ కత్రా–చైన్నె సెంట్రల్ (16032), 19, 20 తేదీలలో సికింద్రాబాద్–తిరుపతి (12764), మహబూబ్నగర్–విశాఖపట్నం (12862), ఈ నెల 19న కరీంనగర్–తిరుపతి (12762), బీదర్–మచిలీ పట్నం (12750), సీఎస్టీ ముంబై–భువనేశ్వర్ (11019), సాయినగర్ షిర్డీ–కాకినాడ పోర్టు (17205) రైళ్లు మధిర స్టేషన్లలో ఆగవని పేర్కొన్నారు. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య నందిగామ: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఎస్ఐ పండు దొర తెలిపిన సమాచారం ప్రకారం పట్టణంలోని డీవీఆర్ కాలనీకి చెందిన ఎర్రం శెట్టి చందు (22) విజయవాడలో ఉంటాడు. ఈనెల 13న జరిగిన ఎన్నికలకు ఓటు వేసేందుకు నందిగామకు వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. మృతుడు కుటుంబానికి అదే ప్రాంతంలో రెండు గృహాలు ఉండడంతో మరో ఇంట్లో నిద్రపోయిన తల్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చందు ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెంది కనిపించాడు. ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారి కె. అప్పారావు గురువారం ఓ ప్రకటనలో కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 15 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి, తత్సమానమైన పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్లో పాసైన విద్యార్థులకు, పదో తరగతితో పాటు ఐటీఐ రెండు సంవత్సరాలు పాసైన వారికి సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సునకు ప్రవేశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలని, కోర్సు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1000, సెకండ్ ఇయర్లో నెలకు రూ. 1100, మూడో సంవత్సరంలో రూ.1200 స్టైఫండ్ ఇస్తారన్నారు. వెంకటగిరిలోని కళాశాలలో 53 సీట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9399936872, 9866169908లో సంప్రదించాలన్నారు. దరఖాస్తులు జూన్ 1వ తేదీలోగా ఆన్లైన్ చేయాలని ఈ అవకాశాన్ని సంబంధిత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
అదుపుతప్పి పంట బోదెలోకి బస్సు
సురక్షితంగా బయట పడిన ప్రయాణికులు పామర్రు: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకు పోయిన సంఘటన పామర్రులో గురువారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పామర్రు నుంచి అవనిగడ్డ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పామర్రు గ్రామం దాటుతూ ఉండగా ఎదురుగా వస్తున్న మరొక వాహనాన్ని తప్పించ బోయే సమయంలో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయటంతో బస్సు కొంత దూరం వెళ్లి ఆగింది. దీంతో బస్సులోని ప్రయాణికులు బస్సు దిగి ఊపిరి పీల్చుకున్నారు. బస్సుకు అదే సమయంలో బ్రేకు పడకపోతే ఎంతో పెద్ద పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఈ సంఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
ఈఏపీ పరీక్ష కేంద్రాల పరిశీలన
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఏపీఈఏపీ పరీక్ష కేంద్రాలను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. జ్ఞానమణి పరిశీలించారు. తొలిరోజు గురువారం మచిలీపట్నం ఎస్వీహెచ్ ఇంజినీరింగ్ కళాశాల, పెడన వాసవి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలు మేరకు ఈఏపీ పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు ఈ సందర్భంగా ఉపకులపతి జ్ఞానమణి తెలిపారు. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు చెప్పారు. -
అధిక రక్తపోటు.. ఆరోగ్యానికి చేటు
●● విజయవాడ రాణిగారితోటకు చెందిన 24 ఏళ్ల శ్రీనివాస్ ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తుంటారు. రాత్రి వేళల్లో ఫోన్లో వీడియోగేమ్స్ ఆడుతూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఒకరోజు ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా మొదడులో రక్తనాళాలు చిట్లి స్ట్రోక్కు గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్చగా రెండు రోజులకే మృత్యువాత పడ్డాడు. హై బీపీ కారణంగానే అతను స్ట్రోక్కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ● విజయవాడ గాంధీనగర్కు చెందిన వెంకట్ ప్రైవేటు ఉద్యోగి. పనిలో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కోవడంతో 33 ఏళ్లకు రెండేళ్ల కిందట రక్తపోటుకు గురయ్యాడు. ఒత్తిళ్లు పెరగడంతో బీపీ అదుపులో లేక, ఇటీవల గుండెపోటుకు గురయ్యాడు. అదృష్ణవశాత్తు సకాలంలో ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): అధిక రక్తపోటు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. నిత్యం ఎంతో మంది ఉద్యోగ విధుల్లో, వ్యాపారంలో, చదువులో తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ అధిక రక్తపోటుకు గురవుతున్నారు. ఫలితంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. హైపర్ టెన్షన్ అంటే.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం రక్తపోటు 120/80 ఎంఎంహెచ్జీ రీడింగ్ ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. 130/80 వరకూ ప్రీ హైపర్టెన్షన్గానూ ఆపై రీడింగ్ నమోదైతే వారికి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నట్లుగా నిర్ధారిస్తారు. కొందరిలో వ్యాయామం ఆహార నియమాల ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. సాధారణంగా 50 శాతం మందిలో జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒకటి, రెండు మందులతో హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుంది. కొందరిలో మూడు, అంతకంటే ఎక్కువ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి రిఫ్రాక్టరీ హైపర్టెన్షన్గా భావిస్తారు. ఇలా మందులు వాడినా అదుపులో లేని వారిని యాగ్జిల్ రేటర్ హైపర్టెన్షన్, మాలింగ్మెంట్ హైపర్ టెన్షన్గా నిర్ధారిస్తారు. రిఫ్రాక్టరీ హైపర్టెన్షన్కు గురయ్యే వారు 20 నుంచి 25 శాతం ఉంటారని, యాక్సిల్రేటర్తో పది నుంచి 15 శాతం, మాలిగ్మెంట్ హైపర్టెన్షన్కు ఐదు శాతం కంటే తక్కువ మంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. రిఫ్రాక్టరీ, యాక్సిల్రేటర్, మాలిగ్మెంట్కు గురయ్యే వారిలోనే అవయవాలపై ప్రభావం ఎక్కువగా ఉంటందని పేర్కొంటున్నారు. ఎలా అదుపులో ఉంచాలంటే.. హై బీపీతో ముప్పు 50 ఏళ్లు దాటిన వారిలో 40 శాతం మందికి హైబీపీ 30 ఏళ్లకే అధిక రక్తపోటుకు గురవుతున్న వైనం అసంక్రమిక వ్యాధుల్లో సైలెంట్ కిల్లర్గా గుర్తింపు గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ డే తరచూ పరీక్షించుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కిడ్నీల ద్వారా శరీరంలోని నీటిశాతం అదుపులో ఉంచుతాయి. లవణాలను క్రమబద్ధీకరిస్తాయి. కిడ్నీల్లో ఉండే స్పెషలైజ్డ్ సెల్స్ ద్వారా రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరోన్ సిస్టమ్ (ఆర్ఏఏఎస్) అనే వ్యవస్థ ద్వారా కిడ్నీల్లో ఉండే రక్తనాళాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కిడ్నీ వ్యాధులకు గురయ్యే వారిలో 50 శాతం మందికి అధిక రక్తపోటు కారణం కాగా, కిడ్నీ వ్యాధులు కూడా హైపర్టెన్షన్కు దారితీస్తాయి. హైపర్టెన్షన్ ఉన్న వారు రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. ఆరు నెలలకోసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ భీమవరపు భార్గవ్, నెఫ్రాలజిస్టు, విజయవాడ -
మిర్చి రైతులకు వ్యాపారి కుచ్చుటోపీ
66 మందికి ఇవ్వాల్సిన రూ. 1.76కోట్లు ఎగవేత కంచికచర్ల/పెనుగంచిప్రోలు/జగ్గయ్యపేట అర్బన్: కంచికచర్లకు చెందిన ఓ వ్యాపారి రైతుల నుంచి మిర్చి, పసుపు పంటను కొనుగోలు చేసి వారికి నగదు చెల్లించకుండా కుచ్చుటోపీ పెట్టిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం మేరకు.. కంచికచర్లకు చెందిన దొడ్డా వెంకట రామ నరసింహారావు, అతని కుమారుడు వాసుదేవకుమార్ గత 50 ఏళ్ల నుంచి కమీషన్ వ్యాపారం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పెనుగంచిప్రోలు మండలం కొల్లికూళ్ల, వెంకటాపురం, సుబ్బాయిగూడెంకు చెందిన 66మంది రైతుల నుంచి మిర్చి, పసుపు పంటను కొనుగోలు చేశారు. ఆ రైతులకు రూ. 1.76కోట్లు చెల్లించాల్సి ఉంది. కాని ఆరు నెలలైనా నగదు చెల్లించకపోవటంతో గురువారం కంచికచర్లలోని వెంకటరామ నరసింహారావు ఇంటికి రైతులు వచ్చారు. ఆ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని నిలదీశారు. ఆ వ్యాపారి బంధువులు నరసింహారావు ఐపీ పెట్టాడని.. ఇప్పటికే కోర్టులో నోటీసు దాఖలు చేశారని రైతులతో చెప్పారు. దీంతో రైతులు అక్కడే ఆందోళన చేయడానికి సిద్ధమవగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఫిర్యాదు చేయాలని నచ్చజెప్పి పంపించారు. అనంతరం రైతులు జగ్గయ్యపేట పట్టణానికి వచ్చి సీపీఐ పట్టణ కార్యదర్శి, న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావును కలసి తమకు న్యాయపరంగా సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం వారికి జరిగిన అన్యాయంపై మీడియాతో మాట్లాడారు. తాము తీవ్రంగా నష్టపోయామని.. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వేలేరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొనటంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుని వివరాలను గుర్తించేందుకు యత్నించారు. మృతుని దుస్తుల్లో లభించిన వివరాల ఆధారంగా ఏలూరు జిల్లా వెంకటాపురానికి చెందిన ఓలేటి రాధాకృష్ణ (46) అనే వ్యక్తిగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ డి.ఆదినారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారన్నారు.ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాలవారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్ ఎన్టీఆర్, వైఎస్సార్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి.’’ మంత్రి బొత్స చెప్పారు.‘‘మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి.. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. -
గవర్నర్ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, విజయవాడ: రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం గురువారం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యం పైనా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని.. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది. మంత్రి బొత్సతో పాటు గవర్నర్ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు: మంత్రి బొత్స బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము. అబర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాముదీపక్ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరాము -
రోడ్డు ప్రమాదంలో వృద్ధదంపతులు దుర్మరణం
బోనకల్(ఖమ్మం): కుమారుడికి వద్దకు వెళ్తున్న వృద్ధ దంపతులకు అదే ఆఖరి ప్రయాణమైంది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ(92) డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య రుక్మిణి(85)తో మధిరలోనే స్థిరపడ్డారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వృద్ధాప్యం కారణంగా వారి సంరక్షణ కోసం ఒకే కేర్టేకర్గా నియమించడంతో కుమారుల వద్ద కొన్నేసి రోజుల చొప్పున ఉంటున్నారు. బుధవారం మధిరలోని ఇంటి నుంచి ఖమ్మంలో ఉంటున్న పెద్దకుమారుడు వద్దకు మనవడు కొత్తూరు అనిల్, కేర్టేకర్ నాగరాజుతో కలిసి వెళ్తున్నాడు. కారును అనిల్ నడుపుతున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.ఈ ఘటనలో సూర్యనారాయణ, రుక్మిణి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. మనుమడు అనిల్, కేర్టేకర్ నాగరాజు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారు లాక్ పడి ఉండడంతో తలుపులు పగులగొట్టి మృతదేహాలు, క్షతగాత్రులను బయటకు తీశారు. కారు తలుపులను పగలగొట్టడంలో ఏమాత్రం ఆలస్యమైనా లోపల ఉన్న వారంతా మంటల్లో కాలిపోయే వారని తెలిసింది. -
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ, గుంటూరు డివిజన్లలో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 26 వరకు రాజమండ్రి–విజయవాడ (07466/07467), నర్సాపూర్–నిడదవోలు (07897/07771), నర్సాపూర్–విజయవాడ (17270/07862), నర్సాపూర్–రాజమండ్రి (07883/07884), విశాఖపట్నం–గుంటూరు (22701/22702/17239) రైళ్లు, 16 నుంచి 27 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), 16 నుంచి 31 వరకు నర్సాపూర్–గుంటూరు (17282), 17 నుంచి జూన్ 1 వరకు గుంటూరు–నర్సాపూర్ (17281), 16 నుంచి 31 వరకు హుబ్లీ–విజయవాడ (17329), 17 నుంచి జూన్ 1 వరకు విజయవాడ–హుబ్లీ (17330) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా రామవరప్పాడు–నర్సాపూర్ (07861) రైలును భీమవరం–నర్సాపూర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. -
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. -
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
సాక్షి, విజయవాడ: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్దసంఖ్యలో పోలింగ్ నమోదైందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు.పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు.11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. ఇప్పటివరకు 75 శాతం పోలింగ్ నమోదైంది. స్ట్రాంగ్ రూమ్లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని ఎంకే మీనా వెల్లడించారు. -
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ అరాచకం సృష్టించింది. టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నెల్లూరు: ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అభ్యర్థి మేరీగా మురళిపై దాడికి యత్నించారు. సంగం మండలం చెన్నవరప్పాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఢిల్లీ బాబు గాయపడ్డారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, ముసునూరులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. -
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం ఈసీని కలిసింది. టీడీపీ నేత చంద్రబాబు, ఈనాడు పత్రిక, ఆర్ టీవీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ.. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు, నంద్యాల సభల్లో చంద్రబాబు అప్రజాస్వామిక పదజాలం వాడారని, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ 230 ఫిర్యాదులు ఈసీకి ఇచ్చాం. ఎన్నికల సంఘం సరిగ్గా స్పదించలేదు. కూటమి ఫిర్యాదులపై వెంటనే స్పందించింది. ఈసీ ప్రభావం పడకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు కూటమి కట్టారని మల్లాది విష్ణు అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పును ఆపలేరు. ప్రజలు ధర్మం, న్యాయం, నిజం పక్కనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూతో ఆర్. టీవీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. మనుగడ కోల్పోతున్నామన్న భయంతోనే సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. -
ముగిసిన ప్రచారం.. ప్రలోభాలు ఆరంభం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైకులు మూగబోయాయి. శనివారం సాయంత్రం సరిగ్గా 6గంటలకు ఎన్నికల ప్రచారం సమాప్తమైంది. ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక సమరంలో ప్రధాన ఘట్టం పోలింగ్కు సమయం ఆసన్నమవడంతో అంతటా టెన్షన్ వాతావరణం ఉంది. ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. సుమారు 58 రోజుల పాటు ప్రజల్లో ఉంటూ ఓటర్లను ఆకర్షించేందుకు అనేక పాట్లు పడిన అభ్యర్థులు తాము గెలిస్తే చేసేది ఏమిటో చెప్పుకోలేక డబ్బులతో ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రలోభాల వల విసురుతున్నారు. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మొత్తం ఓటర్లలో 70 శాతం మందికి పైగా డబ్బు పంచేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. కొంత మంది శుక్రవారం నుంచే డబ్బు పంపిణీ ప్రారంభించి 50 శాతం పూర్తి చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొంత మంది అభ్యర్థులు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వరకు నగదు పంపిణీ చేస్తున్నారని సమాచారం. డబ్బు పంపిణీలో కొంత మంది ఎన్ఆర్ఐలు కీలకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. -
దుర్గగుడికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానం, ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్కు చెందిన భక్తులు శనివారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ ఎర్రామంజిల్కు చెందిన బండారు విశ్వనాథ్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా నిత్యాన్నదానానికి రూ. లక్ష, బంగారు తాపడం పనులకు మరో రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. విజయవాడ కరెన్సీ నగర్కు చెందిన చిటమట కనకాంబరం పేరిట సి. ఏడుకొండలు నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఉద్యోగులకు మెరుగైన సేవలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్ పర్సనల్ బ్రాంచ్ అధికారుల వినూత్న కార్యక్రమాలతో రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ సేవలు అందుతున్నాయని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పేర్కొన్నారు. పర్సనల్ బ్రాంచ్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘స్ట్రాటజిక్ వింగ్’ను డీఆర్ఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పర్సనల్ బ్రాంచ్ విభాగం కొత్తగా స్ట్రాటజిక్ వింగ్ ఏర్పాటు చేసిందన్నారు. అందులో ముఖ్యంగా కారుణ్య నియామకాలు, మెడికల్ డీ కేటగరెజ్డ్ ఉద్యోగుల స్క్రీనింగ్, సెలక్షన్స్, సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ తదితర కీలకమైన సమస్యలపై ఈ వింగ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందన్నారు. సీనియర్ డీపీఓ కట్టా ఆనంద్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేద సంస్కృతిని పరిరక్షించుకోవాలి విజయవాడ కల్చరల్: వేద సంస్కృతిని పరిరక్షించుకోవాలని వేద పండితులు విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ సలక్షణ ఘనాపాటి అన్నారు. కృష్ణామండల వేద విద్వత్ ప్రవర్థక సభ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో 76 వార్షిక వేద సభలు, వేద విద్యార్థులకు పరీక్షలను శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సర్వవేదాలకు ఆధార భూతమైనవి మన వేదాలుగా అభివర్ణించారు. 76ఏళ్లుగా వేద సభలను నిర్వహిస్తున్న నిర్వాహకుల కృషిని ఆయన అభినందించారు. కృష్ణా మండల వేద విద్వత్ ప్రవర్థక సభ ఇచ్చే పట్టాకు జాతీయ స్థాయి గుర్తింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఘనాపాటీలు క్రమాపాటీలు నాలుగు వేదాలను పఠించారు. చర్చాగోష్టులను నిర్వహించారు. 125 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వేద సభల నిర్వాహకులు మాగంటి వేణుగోపాల్, మద్దూరి యజ్ఞనారాయణ వాజపేయ సోమయాజి, మేనేజర్ శర్మ పర్యవేక్షించారు. మూతపడిన మద్యం దుకాణాలు నందిగామ: సార్వత్రిక ఎన్నికల్లో ఈనెల 13న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అధికారులు శనివారం సాయంత్రం ఆయా మద్యం దుకాణాలకు తాళం వేసి సీల్ వేశారు. తిరిగి పోలింగ్ తర్వాత తెరచుకోనున్నాయి. -
సికింద్రాబాద్–విశాఖ మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07097) ఈ నెల 12న ఆదివారం రాత్రి 7.45 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, మధ్య రాత్రి 12.38 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 12.40 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07098) 13న సోమవారం రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మధ్య రాత్రి 1 గంటకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి 1.05కి బయలుదేరి, మంగళవారం ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. -
రాష్ట్ర అభివృద్ధిపై విద్యార్థులు దృష్టి సారించాలి
రాష్ట్ర జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు తాడేపల్లి రూరల్: విద్యార్థులు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని, తద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలో లభిస్తాయని రాష్ట్ర జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి. శివశంకరరావు అన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ శనివారం నిర్వహించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలు నిలబెట్టేలా విద్యార్థులు ప్లేస్మెంట్స్ సాధించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచించాలన్నారు. సాంకేతిక విద్యావిధానంలో సృజనాత్మకత, పరిశోధనా సరళి అవసరమని, నాణ్యమైన విద్యావిధానం విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమన్నారు. కేఎల్యూలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, ప్రపంచస్థాయి మౌలిక వసతులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ మాట్లాడుతూ గత 43ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో స్థిర పడ్డారని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 4,000, అంతర్జాతీయ స్థాయిలో 26, ఇంటర్న్షిప్లు 29 మంది ఉద్యోగాలు సాధించారని వివరించారు. డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు నమోదైన అత్యధిక ప్యాకేజీ వార్షిక జీతం రూ.33.15 లక్షలుగా వివరించారు. ఉద్యోగ కల్పనల డీన్ డాక్టర్ ఎన్బీవీ ప్రసాద్ మాట్లాడుతూ 2005 నుంచి 18ఏళ్లుగా వందశాతం ప్లేస్మెంట్స్ సాధిస్తున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చేలా మొదటి సంవత్సరం నుంచే శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విల్శ్రీ గ్రూప్ చైర్మన్ ఎం.డి. విల్లియం కేర్ మానికొండ మాట్లాడుతూ కేఎల్యూలో అధునాతన లేబొరేటరీలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత అవకాశాలు లభించేలా వర్సిటీ అధ్యాపకులు కృషి చేయడం అభినందనీయన్నారు. అనంతరం యూనివర్సిటీ వీసీ, తదితరులు రాష్ట్ర జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి.శివశంకరరావును ఘనంగా సత్కరించారు. ప్రొ వైస్ చాన్స్లర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, స్టూడెంట్స్ ప్రొగ్రెషన్ నైపుణ్యాల అభివృద్ధి డీన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్, ప్లేస్మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్.బి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్కు పక్కా ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలింగ్ను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. నగరంలోని ఎన్నికల మీడియా కేంద్రంలో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ పోలింగ్కు చేసిన ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 13న జరిగే పోలింగ్కు సంబంధించి జిల్లాలోని 1,792 పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ పార్టీల ఏర్పాటుతో పాటు నియోజకవర్గాల వారీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఈవీఎం, ఇతర పోలింగ్ మెటీరియల్ను ఆదివారం పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్ మెటీరియల్కు, సిబ్బందికి ఎలాంటి కొరత లేదని, 13 వేల మందికి పైగా సిబ్బందిని, మెటీరియల్ను తరలించేందుకు జీపీఎస్ అనుసంధానం చేసిన 459 వాహనాలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. 176 సెక్టార్ల పరిధిలోని 186 రూట్లను ఏర్పాటు చేశామని.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల కల్లా పోలింగ్ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సాయం త్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉన్న కేంద్రాల వద్ద లైటింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. పోలింగ్ స్టేషన్లో మొదట పార్లమెంటు నియోజకవర్గ ఓటింగ్ కంపార్ట్మెంట్ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటాయన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 17 మంది, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 20 మంది పోటీలో నిలవడంతో ఆయా చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనున్నట్లు తెలిపారు. 16లక్షల మందికి వీఐఎస్ పంపిణీ.. జిల్లాలో 17.04లక్షల ఓటర్లు ఉన్నారని, వీరిలో 16.86 లక్షల మందికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ (వీఐఎస్)లను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ కారణాల వల్ల వీఐఎస్ పంపిణీ జరగని వారి సమాచారంతో ఏఎస్డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్డ్, ఎక్స్పైర్డ్, డూప్లికేట్) జాబితాలను పోలింగ్ స్టేషన్ల వారీగా తయారు చేస్తున్నామన్నారు. పటిష్ట ఏర్పాట్లు.. జిల్లాలో పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, రీపోలింగ్కు ఆస్కారం లేకుండా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గుర్తించిన పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 65–70 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్క్యాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉంటుందన్నారు. ఈవీఎంలకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే 15 నిమిషాల సమయంలో సరిదిద్దేందుకు అనువుగా ఏర్పాట్లు చేశామని, సెక్టార్ అధికారులు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు (ఏఎల్ఎంటీ)లతో పాటు ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు చొప్పున బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారన్నారు. స్ట్రాంగ్ రూమ్లు సిద్ధం.. పోలింగ్ పూర్తయిన అనంతరం జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరిగిన చోటే రిసెప్షన్ కేంద్రాలు ఉంటాయని.. అక్కడి ఇంటర్మీడియెట్ స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలను భద్రపరుస్తామని కలెక్టర్ చెప్పారు. అదే విధంగా విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం నియోజకవర్గాలకు సంబంధించి నోవా, నిమ్రా కళాశాలల్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశామని వివరించారు. నోవా, నిమ్రా కళాశాలల్లో 27 స్ట్రాంగ్ రూమ్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమలుతో పాటు అన్ని లిక్కర్ దుకాణాలు మూసివేసి ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 332 లొకేషన్స్ను క్రిటికల్గా గుర్తించామని, అదే విధంగా 267 లొకేషన్లను శాంతిభద్రతల పరంగా క్రిటికల్గా గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, నాగాలాండ్ స్పెషల్ పోలీస్ తదితర సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. 400 వరకు స్ట్రైకింగ్ ఫోర్స్ పనిచేయనున్నట్లు తెలిపారు. 5 వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది, 13 కంపెనీల ఆర్మ్డ్ ఫోర్స్తో పాటు 1,300 మంది ఎన్ఎస్ఎస్, 100 మంది ఎన్సీసీ వలంటీర్లు కూడా సేవలందించనున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీరావు -
పద్మశాలీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని పద్మశాలి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చి అండగా నిలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వానపల్లి త్రిమూర్తులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పద్మశాలి చేనేత కుటుంబాలకు రెండు ఎమ్మెల్సీలను కేటాయించి గౌరవించారని తెలిపారు. పోతుల సునీత, మురుగుడు హనుమంతరావులు ఎమ్మెల్సీలుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే మంగళగిరి సీటును చేనేత కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యకు, ఎమ్మిగనూరు సీటును బుట్టా రేణుకకు ఇచ్చారన్నారు. ఐదు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లుగా ఆప్కో, పద్మశాలి, దేవంగ, తొగట, సాలికుర్ని, సాలి కార్పొరేషన్లను ఇచ్చి గౌరవించారని తెలిపారు. చేనేత కులాలను రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా ఆయా వర్గాలకు ఐదేళ్లలో రూ.3,706 కోట్ల కోట్లు ఖర్చు చేశారన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేల రూపాయలు చొప్పున ఐదేళ్లలో ఇప్పటికే 1.20 లక్షల రూపాయలు అందించారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలి.. ఆప్కోకు గత ప్రభుత్వ పాత బకాయిలు రూ.103 కోట్లతో సహా మరో రూ.468 కోట్లు ఇప్పటికే చెల్లించారని చెప్పారు. మంగళగిరి, వెంకటగిరి, చీరాలలో చేనేత కస్టర్లు ఏర్పాటు చేసి ఎంతో మంది చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించారన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి వర్క్ అండ్ హౌస్గా ఇల్లు నిర్మించుకోవడానికి సహకరించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పద్మశాలి చేనేత సంఘీయునికి అండగా నిలిచారని వివరించారు. ఐదేళ్లలో అడుగడుగునా పద్మశాలీలకు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. వైఎస్సార్ సీపీ చేనేత విభాగ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వానపల్లి త్రిమూర్తులు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మరో రెండ్రోజులు వానలు
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
రోజు రూ.2 కోట్లకుపైగానే..
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అన్నదాతల అగచాట్లు
రోజు రూ.2 కోట్లకుపైగానే..
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement