-
ఆర్థిక పరిపుష్టి దిశగా విజయనగరం
● శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ ● ఇక్కడ ఎంతో నేర్చుకున్నా.. మంచి సేవలు అందించే ప్రయత్నం చేస్తా.. విజయనగరం అర్బన్: రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచే దిశగా విజయనగరం జిల్లా అభివృద్ధి చెందుతోంది.. భోగాపురం ఎయిపోర్ట్ కార్యకలాపాలు మొద లయ్యాక ఈ ప్రాంతం ఆర్థికంగా వృద్ధి సాధిస్తుంది.. జిల్లాకు మంచి భవిష్యత్తు ఉందని ట్రైనీ సహా య కలెక్టర్ బి.సహదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. ఆయన జిల్లాలో ఏడాది శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా తన చాంబర్లో మీడియా తో మాట్లాడారు. జిల్లాలో తను గుర్తించిన అభివృద్ధి వనరులు, జిల్లా పరిస్థితులు, అధికారుల సహాయసహకారాలు తదితర వివరాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే... జిల్లాలో ఏడాది శిక్షణ ద్వారా వచ్చిన అనుభవంతో రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించగలననే నమ్మకం వచ్చింది. జిల్లాలో పనిచేసిన కాలంలో రైలు ప్రమాద దుర్ఘటన, సార్వత్రిక ఎన్నికల నిర్వహణతో పాటు ఇతర విపత్తుల సమయంలో పాలన సామర్ాధ్యన్ని నిరూపించుకో గలిగాను. విభిన్న పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలను నేర్చుకున్నాను. చీపురుపల్లిలో ఆర్డీఓగా, మెంటాడలో తహసీల్దార్గా తీసుకున్న శిక్షణ మంచి అనుభవాన్నిచ్చింది. వివిధ హోదాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏయే విధులు నిర్వహిస్తారనే అంశాలపై, ప్రోటోకాల్ నిర్వహణ అంశాలపై అవగాహన కలిగింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా చేపట్టిన ఓటర్ల చైతన్య కార్యక్రమం ‘స్వీప్’లో భాగస్వామ్యం ఎంతో తృప్తినిచ్చింది. స్వీప్ ద్వారా చేపట్టిన ప్రజా చైతన్య కార్యక్రమాల వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గతం కంటే రెండు శాతం మేరకు ఓటింగ్ పెంచగలిగాం. జిల్లాలోని ఎన్నికల నిర్వహణలో ఇచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్ బాధ్యత ఫలితాలు దృఽఢ సంకల్ప దృక్పథాన్ని పెంచింది. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని నియంత్రించేందుకు పలు చోట్ల దాడులు నిర్వహించి మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోవడంలో సమష్టి కృషి ఫలించింది. నెల్లిమర్లలో ఉన్న డిపో నుంచి మద్యం నిల్వలపై పర్యవేక్షణ బాధ్యత మంచి అనుభవాన్నిచ్చింది. జిల్లాలో శిక్షణ పొందిన కాలంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ల మయూర్ అశోక్, కార్తీక్లు తనకు ఎంతోగానో సహకరించి ప్రోత్సహిహించారు. తదుపరి శిక్షణలో భాగంగా రెండు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు న్యూఢిల్లీ వెళ్లనున్నట్టు త్రివినాగ్ తెలిపారు. హైదరాబాద్ ఐఐటీ నుంచి మెటలర్జికల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన తనకు తండ్రి బి.జయకుమార్ సివిల్ సర్వీసెస్ సాధనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చారని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కలిసి శిక్షణలో ఇచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధానం
విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయ న్న నిర్లక్ష్యం వద్దని, పల్లెలు, పట్టణాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని అధికారులకు సూచించారు. ఈ నెల 13న నిర్వ హించిన ఎన్నికలు తర్వాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖ రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపు రం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులతో విజ యనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువా రం సమీక్ష సమావేశం, జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా రేంజ్ పరిధిలో పోలీస్ అధికారు లు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించడం వల్ల చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించుకోగలిగామన్నారు. అందుకు కృషిచేసిన అధికారులు, సిబ్బందిని అభి నందించారు. మరో 15 రోజులు ప్రతిఒక్కరూ ఇదే నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, మన ప్రాంతంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య లు ఉత్పన్నం కాకుండా క్షేత్ర స్థాయిలో మరింత సమర్ధవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్కు కొద్దిరోజుల ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత గ్రామాల్లో చోటుచేసుకు న్న చిన్నచిన్న సంఘటనలు జరిగిన గ్రామాల్లో పర్యటించాలన్నారు. గ్రామస్తులతో మాట్లాడి వివాదాలను పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో రాజకీయంగా వివాదాలు సృష్టించే వారిని పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. అవసరమైతే పోలీస్ పికెట్ ఏర్పాటుచేయాలన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించి, వారు గ్రామానికి ఏ పనిమీద వచ్చారు, ఎందుకు వచ్చారన్న విషయం తెలుసుకోవాలని, ఆయా అంశాలను పాయింట్ బుక్లలో నమోదు చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేసినట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం అధికారుల తనిఖీలు చేపట్టి, భద్రతను పర్యవేక్షించాలన్నారు. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించే కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, వాటిని జిల్లా ఎస్పీలు ముందుగానే సమీక్షించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏఎస్ఆర్ జిల్లాల ఎస్పీలు ఎం.దీపిక, విక్రాంత్ పాటిల్, జి.ఆర్.రాధిక, కె.వి.మురళీకృష్ణ, తుషీం సిన్హా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా ల అదనపు ఎస్పీలు అస్మా ఫర్హీన్, ప్రేమ్కాజల్, దిలీప్కిరణ్, పార్వతీపురం ఏఎస్పీ సునీల్ షరోన్, ట్రైయినీ ఐపీఎస్ ఎం.జావలి, డీఎస్పీలు పి.శ్రీనివాసరావు, ఆర్.గోవిందరావు, ఎ.ఎస్.చక్రవర్తి, జి.మురళీధర్, జి.వి.కృష్ణారావు, ఎస్.అప్పలరాజు, బి.అప్పారావు, కె.వి.సత్యనారాయణ, డి.బాలచంద్రారె డ్డి, వై.సునీత, జి.నాగేశ్వరరెడ్డి, ట్రైనీ డీఎస్పీలు ఎస్.మహేంద్ర, సీహెచ్.రాజా, పలువురు సిఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని -
● పీజీ, పీజీ డిప్లమో కోర్సులకు ప్రవేశ పరీక్ష ● 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
జ్యోతిరావు పూలే కళాశాలలకు విద్యార్థుల ఎంపిక బొబ్బిలి: మండలంలోని కోమటిపల్లి వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన 13 మంది విద్యా ర్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే జూనియర్ కళాశా లల్లో ఇంటర్మీయట్ ప్రవేశాలకు అర్హత సాధించారని ప్రిన్సిపాల్ గుణుపూరు పురుషోత్తం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పి.ప్రశాంత్, ఎన్.మహేష్, కె.కె.ఎస్.ఎస్.గౌతమ్, బి.తరుణ్, వై.యశ్వంత్, ఎన్.ధనుంజయ, ఆర్.మురళీకృష్ణలు విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని కళాశాలకు, పి.వినయకుమార్ దొ ర, ఒ.సాయి, బి.రవిప్రకాశ్లు చిత్తూరు జిల్లా సౌధంలోని కళాశాలకు, పి.హేమంత్ నాయు డు, టి.రవీంద్ర నెల్లూరు జిల్లాలోని దొరవారి సత్రంలోని కళాశాలకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. తమ్మిరెడ్డికి డాక్టరేట్ వంగర: మండల పరిధి మగ్గూరు గ్రామానికి చెందిన సినీగీత రచయిత తమ్మిరెడ్డి ఉమామహేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు విభాగంలో గోల్డ్మెడల్ సాధించిన అనంతరం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి (తెలంగాణ సారస్వ త పరిషత్ అధ్యక్షుడు) పర్యవేక్షణలో ‘తెలుగు చలన చిత్ర గీతాలు–రసభావచిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేశారు. దీంతో ఆయనకు యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను అందజేశారు. 30 సినిమాల్లో వందకు పైగా గీతాలు రచించి ఈ ప్రాంత ప్రజల్లో అరుదైన గుర్తింపు పొందిన ఉమామహేశ్వరరావుకు డాక్టరేట్ లభించడంతో ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు. గిరిజన వర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి నోటిఫికేషన్కు సంబంధించిన వివరాల ను గురువారం వెల్లడించారు. పీజీ ప్రొగ్రామ్ల కు దరఖాస్తు చేసుకునేవారు పూర్తి వివరాలకు ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో చూడాలన్నారు. అర్హులై న విద్యార్థులు ఈ నెల 22వ తేదీ రాత్రి 11.55 నిమిషాలలోపు రిజిస్టర్ చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం యూనివ ర్సిటీ క్యాంపస్లో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ ను లేదా, మొబైల్ నంబర్ 63004 43499ను యూనివర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులివే... యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంఏ ట్రైబల్ స్టడీస్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లిష్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ), మాస్టర్ ఆఫ్ జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్, ఎంబీఏ రెండేళ్ల పీజీ కోర్సును ఏర్పాటు చేశారు. ఈ కోర్సునకు ఏదైనా మూడేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని అనుసరించి ప్రవేశ పరీక్ష మెరిట్ ఆధారంగా గిరిజనులకు, గిరిజనేతరులకు ప్రవేశాలు కల్పిస్తామని వీసీ తెలిపారు. సమాచారం ఇచ్చాకే పోస్టల్ బ్యాలెట్ల తరలింపు విజయనగరం అర్బన్: విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలోని స్ట్రాంగ్రూమ్లో ఉన్న విజయనగరం ఎంపీ స్థానం పరిధిలోని పోస్టల్ బ్యాలెట్లను కలెక్టరేట్కు గురువారం తరలించామని జేసీ కె.కార్తీక్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చామని, హాజరైనవారి సమక్షంలోనే తరలింపు, భద్రపరచడం, సీల్ వేయడం జరిగిందన్నారు. విజయనగరం రిటర్నింగ్ అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ తో పాటు చేపట్టామని తెలిపారు. కొన్ని పార్టీల అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా పోస్టల్ బ్యాలెట్లు తరలించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అన్ని రికార్డింగ్లు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో సాగిన కార్యక్రమంపై అపోహలు వీడాలన్నారు. గిజబలో ఏనుగుల గుంపుగరుగుబిల్లి: గిరిజన ప్రజలను ఏనుగులు బెడ ద వీడడం లేదు. కొద్ది నెలల నుంచి కొమరాడ, జియ్యమ్మవలస మండల పరిధిలో సంచరిస్తు న్న ఏనుగులు గురువారం గిజబ, నంది వానివలస గ్రామాల పరిసరాల్లోకి చేరుకున్నాయి. -
సాగుకు సన్నద్ధం
● ముందుగానే కరుణించిన వరుణుడు ● సాగుకు అనుకూల వాతావరణం ● వర్షాలతో ప్రారంభమైన వ్యవసాయ పనులు ● నువ్వు, వేరుశనగ పంటలు సాగు చేస్తున్న రైతులు ● ఖరీఫ్ సాగుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ విజయనగరం ఫోర్ట్: వరుణుడు కరుణించాడు. వర్షాలు ముందస్తుగా కురుస్తుండడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మెట్ట పంటల సాగును ఆరంభించారు. వరి సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. సాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో సంతోషిస్తున్నారు. ఈ ఏడాది మే నెల రెండో వారం నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొన్నిచోట్ల చెరువుల్లో నీరు చేరింది. పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలో సాగుచేసే పంటలు, సాగు విస్తీర్ణం, విత్తనం, ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల ఏ మేరకు అవసరమన్నది అంచనాలు రూపొందించి కేటాయింపునకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మెట్ట భూముల్లో నువ్వు, వేరుశనగ సాగు ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు విత్తనాలు విత్తారు. వర్షపాతం ఇలా... జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురిశాయి. బొబ్బిలి మండలంలో 10.4 మి.మీ, వేపాడలో 5.4, భోగాపురంలో 5.4, డెంకాడ–4.4, పూసపాటిరేగ– 3.8, రేగిడి ఆమదాలవలస–3.6, విజయనగరం– 3.6, జామి–3.2, గంట్యాడ–2.8, వంగర–2.8, సంతకవిటి 2.4, నెల్లిమర్ల 2.2, గుర్ల 1.2, దత్తిరాజే రు 1.2, తెర్లాంలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. విత్తన కేటాయింపు ఇలా.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగుకు వరి విత్తనాలు 46,530 క్వింటాళ్లు అవసరమని అధికా రులు నిర్ణయించారు. వీటిలో ఎంటీయూ 1121 రకం 35,154 క్వింటాళ్లు, ఎంటీయూ–1224 రకం 3,146, సోనా–1610, స్వర్ణ– 810, ఎంటీయూ– 1318 రకం 930, ఎంటీయూ–1064 రకం 2,500, ఆర్జీఎల్ (శ్రీకాకుళం సన్నాలు) 150, ఎంటీయూ 1064 రకం 40, తెలంగాణ సోనా 40, ఎన్ఎల్ఆర్ 34449 రకం 40 క్వింటాళ్లు కేటాయించారు. పిల్లి పెసర 156 క్వింటాళ్లు, జీలుగ 1667, కట్టె జనుము 694, మినుము 90, పెసర 50, వేరుశనగ 900, చోడి 55, కందులు 5, నువ్వులు 120 క్వింటాళ్లు కేటాయించారు. ఎరువుల కేటాయింపు ఇలా.. యూరియా 26,662 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11,164 మెట్రిక్ టన్నులు, పొటాష్ 2,235 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 9,871 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 1545 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,19,782 హెక్టార్లు: జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,19,782 హెక్టార్లు. వీటిలో వరి సా గు విస్తీర్ణం 90,050 హెక్టార్లు. మిగిలిన విస్తీర్ణంలో మొక్కజొన్న, చోడి, పత్తి, వేరుశనగ, గోగు, మిరుప, చెరకు తదితర పంటల సాగవ్వనున్నాయి. -
పకడ్బందీగా దోమల నివారణ మందు పిచికారీ
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పకడ్బదీగా మలేరియా మందు పిచికారీ చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి. జగన్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా మలేరియా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించామని, తొలివిడత స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. తొలి రెండు రోజుల్లో 42 గ్రామాల్లో స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. శుక్రవారం జిల్లాలోని 18గ్రామాల్లో పిచికారీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. డోకిశీల పీహెచ్సీ పరిధిలో 6, మామిడిపల్లి పీహెచ్సీ పరిధిలో 5, డోనుబాయి పీహెచ్సీ పరిధిలో 4, బాలేరు పీహెచ్సీ పరిధిలో 2, మాదలింగి పీహెచ్సీ పరిధిలో 1, తాడికొండ పీహెచ్సీ పరిధిలో 1 గ్రామాల్లో దోమల మందు పిచికారీ కార్యక్రమం చేపడతామని, జిల్లా వ్యాప్తంగా మలేరియా కేసులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తొలివిడత పూర్తయిన వెంటనే రెండవ విడత స్ప్రేయింగ్ కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టి. జగన్మోహన్రావు -
స్ట్రాంగ్రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లను గురువారం పార్వతీపురం తరలించారు. అక్కడి డా.వైఎస్సార్ ఉద్యాన కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్లో రాజకీయపార్టీల ప్రతినిధులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో భద్రపరిచారు. అరకు పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నిషాంత్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ సహాయ రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్.ఎస్.శోభిక, పాలకొండ, సాలూరు, కురు పాం, పార్వతీపురం శాసనసభ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు సి.విష్ణుచరణ్, శుభం బన్సా ల్, వి.వి.రమణ, కె.హేమలత పాల్గొన్నారు. -
ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం
● తొలిరోజు బైపీసీ విభాగ పరీక్ష ప్రశాంతం విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2024 గురువారం జిల్లాలో ప్రారంభమైంది. తొలిరోజున అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో రెండు కేంద్రాల్లో జరిగింది. జిల్లాలో తొలి రెండు రోజుల్లో 3,122 మంది అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష రాయనున్నారు. తొలిరోజున రెండు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 700 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగింది. -
No Headline
ఈ ఏడాది ముందస్తుగానే తొలకరించింది. తొలకరి చినుకులతో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మే నెల ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. విజయనగరం జిల్లా కేంద్రంలో గురువారం వేకువజాము నుంచి చిటపట చినుకులు పడుతుండగానే.. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. దీనికి ఈ చిత్రాలే సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం -
గ్రామాల్లో ఉపాధి
జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఉపాధి హామీ పథకం కింద జలసంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెరువుల్లోకి వర్షపు నీరు వెళ్లేందుకు ఫీడర్ చానలో పూడిక తీయించే పనులు ముమ్మరంగా చేస్తున్నారు. కాల్వల నుంచి పంట పొలాలకు వెళ్లే ఫీల్డ్ చానల్స్ను బాగుచేయిస్తున్నారు. అమృత్ సరోవర్లుగా గుర్తించిన చెరువులు, చెక్ డ్యామ్ పూడిక తీత పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. మేజర్ కెనాల్స్, బౌండరీ ట్రెంచెస్, ఫాంపాండ్స్ తవ్వకాల పనులు జరుగుతున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్, పండ్లతోటల అభివృద్ధికి ఉపాధి నిధులతోనే గుంతలు తవ్వుకునే పనులు కల్పిస్తున్నారు.పార్వతీపురంటౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు పనులు కల్పిస్తూ వేతనాలను సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో పనులు జోరుగా జరుగుతున్నాయి. వాస్తవానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో కోటి పనిదినాల లక్ష్యానికి గాను మార్చి 31 నాటికి లక్ష్యానికి మించా 1.23 కోట్ల మేర పనిదినాలు పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల కోసం రూ.376.95 కోట్లను ఖర్చు చేశారు. ఉపాధి పనులకు హాజరైన కూలీలకు సుమారు రూ.300.35 కోట్లను చెల్లించారు. రోజువారీ వేతనం రూ.296.69 అందించారు. గతంతో పోలిస్తే ఈ మొత్తం అధికం. వేతన చెల్లింపులను వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. పనుల పర్యవేక్షణకు క్లస్టర్ ఏపీడీలు, ప్రతి మండలంలో ఏపీఓ, ఈసీ, టీఏలు, బీఎఫ్టీలు, ఎఫ్ఎలు అందుబాటులో ఉంటున్నారు. కూలీలు చేసిన పనుల వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేందుకు వీలుగా కంప్యూటర్ ఆపరేటర్లు ప్రతి మండలంలో అందుబాటులో ఉన్నారు. 60 లక్షల పనిదినాలు లక్ష్యం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించారు. కూలీలకు రోజుకు రూ.296 వేతనం వచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన అనంతరం మరో 60 లక్షల పనిదినాలను ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉందని డ్వామా అధికారులు తెలిపారు. కోవిడ్ సమయంలోనూ ఆపన్నహస్తం కోవిడ్ సమయంలో పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లు, మాల్స్ అన్నీ మూతపడ్డాయి. పనుల్లేక పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బయటకొస్తే కోవిడ్ బారినపడతామనే భయంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి కూలీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కూలీలను ఉపాధి పనులు ఆదుకున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కూలీలకు పనులు కల్పించారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 94.29 లక్షల పనిదినాలను కల్పించగా, కూలీలకు వేతనాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. అక్రమాలకు తావు లేకుండా.. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) ద్వారా కూలీలకు హాజరు వేస్తున్నారు. గతంలో మస్టర్ మాన్యువల్గా వేస్తుండడం వల్ల బోగస్ హాజరు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. బోగసు కు తావు లేకుండా ఎన్ఎంఎంస్ యాప్లో రోజుకు రెండు సార్లు హాజరుతో పాటు ఫొటోలు తీసి అ ప్లోడ్ చేస్తున్నారు. ప్రతి రోజు రెండుసార్లు ఎన్ఎంఎంఎస్ ద్వారా హాజరు వేస్తుండడం వల్ల మస్టర్లో అక్రమాలు తగ్గేందుకు అవకాశం ఏర్పడింది. జిల్లాలో జోరందుకున్న పనులు ఇతర రాష్ట్రాలకు తగ్గిన వలసలుకూలీల సంఖ్యను పెంచుతాంఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పనిదినాల లక్ష్యాన్ని కేటాయించారు. దీన్ని పూర్తి చేసిన అనంతరం ఈ సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం రోజుకు 60 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వారి సంఖ్యను పెంచేలా చర్యలు చేపడుతున్నాం. కూలీలకు సంబంధించిన వేతనాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నాం. –రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం వేతనం తగ్గకుండా.. ఉపాధి కూలీల గరిష్ట వేతనం రూ.296 ఉంది. ఉపాధి పనులకు వచ్చే కూలీలందరూ ఈ వేతనం అందుకునే విధంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో అత్యధికంగా తుగ్గలి మండలంలో రోజుకు 10 వేలకుపైగా పనిదినాలు కల్పిస్తున్నారు. బలిజిపేట, మక్కువ, జియ్యమ్మవలస, కురుపాం మండలాలు టాప్లో ఉన్నాయి. -
No Headline
బొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పులు, కోరిన కోరికలు తీర్చే గొల్లపల్లి దాడితల్లి, పాత బొబ్బిలి సరేపోలమ్మ అమ్మవార్ల సిరిమానోత్సవ సంబరాలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. ఈనెల 19,20,21 తేదీల్లో ఉత్సవాలను అంగరంగ వైభవంగా అమ్మవార్ల పండగలు నిర్వహించేందుకు రెండు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 19న దేశతల్లి అమ్మవారి ఉత్సవంతో ప్రారంభమయ్యే పండగలో భాగంగా 20న సిరిమానోత్సవం జరుగుతుంది. 21న అనుపోత్సవం నిర్వహిస్తారు. ఈ జంట సంబరాలకు రెండు ప్రాంతాల్లో భక్తులు సన్నద్ధమయ్యారు. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండగను చుట్టుపక్కల 12 గ్రామాల వారు ఘనంగా జరుపుకుంటారు. అలాగే పాత బొబ్బిలిలో సరేపోలమ్మ ఉత్సవాలు కూడా ఈనెల 19నే ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రభల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గొల్లపల్లి, పాత బొబ్బిలి అమ్మవార్ల సిరిమానోత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతాయి. పాత బొబ్బిలి నుంచి పట్టణంలోకి సిరిమాను ప్రవేశించి పురవీధులన్నీ కలియదిరిగి భక్తులను పరవశింప చేస్తుంది. అలాగే గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమాను కూడా సోమవారం సాయంత్రం గొల్లపల్లి నుంచి ఊరేగింపుగా ప్రారంభమై పట్టణంలోకి ప్రవేశించి పట్టణంలోని అన్ని వీధుల్లోనూ కలియదిరుగుతుంది. ఉత్సవాలలో భాగంగా పాత బొబ్బిలి, గొల్లపల్లిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాము గరిడీలు, బిందెల డ్యాన్సులు, తప్పెట గుళ్లు, కోలాటం, భారీ లైటింగ్, బళ్ల వేషాలు, కాంతార హంస డ్యాన్స్, బాహుబలి ప్రదర్శన, తీన్మార్, డీజే, మందుగుండుసామగ్రి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఇప్పటికే పట్టణంలో అమ్మవార్ల ఘటాలు తిరుగుతూ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నాయి. -
పెరుగుతున్న రక్తపోటు
● ఏటా అధికసంఖ్యలో వ్యాధిగ్రస్తుల నమోదు ● జిల్లాలో బాధితులు 18, 322 మంది ● తగుజాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య నిపుణులు విజయనగరం ఫోర్ట్: మానవుడి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులతో పాటు ఉరుకులు పరుగులతో జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఉద్యోగులు పనిఒత్తిడికి, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారు జీవనం ఏవిధంగా సాగించాలనే ఆందోళన, విద్యార్థులకు మంచి భవిష్యత్తుపై ఆలోచనల ఫలితం హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటుకు)కు దారితీస్తోంది. శుక్రవారం వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. ప్రపంచ జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరు అధిక రక్తపోటుతోనే చనిపోతున్నారు. ప్రాణాంతకమైన వ్యాధుల్లో అధిక రక్తపోటు మూడోస్థానంలో ఉంది. హైపర్ టెన్షన్లో రెండు రకాలు హైపర్ టెన్షన్లో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఎసున్షయల్ హైపర్టెన్షన్, రెండోది సెకండరీ హైపర్ టెన్షన్ ఎసున్షయల్ హైపర్ టెన్షన్: అధిక ఒత్తిడి, అధికబరువు, వ్యాయమం లేకుండా ఎక్కువగా కూర్చుని పనిచేయడం, పొగతాగడం, అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఎసున్షయల్ హైపర్ టెన్షన్ వస్తుంది. సెకెండరీ హైపర్ టెన్షన్: కిడ్నీ సమస్యలు, హైపో థైరాయిడ్, కొన్ని హార్మోన్ల సమస్య వల్ల సెకెండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల అనర్థాలు హైపర్ టెన్షన్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. పక్షవాతం, గుండెపోటు, కిడ్నీలు చెడిపోవడం తదితర సమస్యలు వచ్చి ప్రాణం మీదకు వస్తుంది. నిత్యం పని ఒత్తిడిలో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే మొదటిగా వచ్చేది హైపర్ టెన్షనే. ఒకసారి ఈవ్యాధి వస్తే మరిన్ని వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వ్యాధిని గుర్తించడం వ్యాధిలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించవు. బీపీని వైద్యులు పరీక్షల ద్వారానే గుర్తించగలరు. రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో కష్టం, ఛాతీలో నొప్పి కనిపిస్తాయి. అధిక రక్తపోటు రక్తనాళాల్లో రక్తం సాధారణ ఒత్తిడికంటే ఎక్కువ ఒత్తిడితో ప్రసరించినప్పుడు దానిని అధిక రక్తపోటు అంటారు. బీపీ కొంతవ్యవధి పాటు 140/90 ఎంఎంహెచ్జీ లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యులు అధిక రక్తపోటుగా గుర్తిస్తారు. తరచూ రక్తపోటు తనిఖీ చేయించుకోవాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రక్తపరీక్ష చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. అధిక రక్తపోటుకు కారణం: నూడిల్స్, చాట్స్ పానీ పూరీ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల, టీవీ అధికంగా చూడడం, శారీరక వ్యాయమం లేకపోవడం, ఒకే చోట 8 నుంచి 12 గంటలు పాటు పనిచేయడం, మానసిక ఒత్తిడి, సంఘర్షణ, ఆత్మనూన్యత, పొగ, ఆల్కహాల్ తాగడం వంటి వాటి వల్ల అధిక రక్తపోటు వస్తుంది. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయమం చేయాలి. మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా గడపాలి. పొగతాగడం, మద్యంసేవించడం పూర్తిగా మానివేయాలి. యోగా, ధైవభక్తి పెంపొదించుకోవాలి. ఉప్పు, మసాలాలు తగ్గించుకోవాలి. 30 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. 18, 322 మంది రోగులు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం వేలాది మంది బీపీతో చికిత్స పొందుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్సీ, ఎన్పీడీ క్లినిక్స్కు వచ్చిన రోగులకు బీపీ చెక్ చేస్తారు. 2023ఏప్రిల్ నుంచి మార్చి 2024 వరకు 31,733 మందిని పరీక్షించగా వారిలో ఈఏడాది కొత్తగా 1997 మందికి బీపీ నిర్ధారణ అయింది. ప్రస్తుతం జిల్లాలో 18, 322 మంది బీపీకి చికిత్స పొందుతున్నారు. సర్వజన ఆస్పత్రిలో కొత్తగా115 మందికి బీపీ నిర్ధారణ అయింది. సర్వజన ఆస్పత్రి ఎన్సీడీ క్లినిక్ పరిధిలో 1623 మంది చికిత్స పొందుతున్నారు. మితిమీరిన ఆహారం ప్రమాదం ఆహారం మోతాదుకు మంచి తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాఽయమం చేయాలి. పొగతాగడం పూర్తిగా మానివేయాలి. పీచు పదార్థాలు ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తాజాపండ్లు తినాలి. డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
డోలీలో ప్రసవం
శృంగవరపుకోట: మేజర్ పంచాయతీ శృంగవరపుకోట పరిధిలోని గిరిశిఖర గ్రామమైన రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన గిరిజన మహిళ గురువారం డోలీలోనే ప్రసవించింది. ఎస్.కోట పట్టణానికి 9కి.మీ దూరంలో గిరిశిఖరాన ఉన్న రేగఫుణ్యగిరి గ్రామానికి చెందిన గిరిజన మహిళ వంతల కుషాయి గర్భిణి. ఆమెకు ఇది 5వ కాన్పు కాగా గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు ఆరంభమయ్యాయి. దీంతో ఆమెను డోలీలో ఆస్పత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో మధ్యాహ్నం 3గంటల సమయంలో డోలీలోనే ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను, బిడ్డను ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రి సిబ్బంది తల్లీబిడ్డలకు ప్రథమచికిత్స చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే క్షేమంగా ఉన్నారు. గుదిమెళ్లకు ‘దేశికాచార్య పురస్కారం’విజయనగరం టౌన్: స్థానిక రింగురోడ్డులోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 108 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించిన తిరుమల గుదిమెళ్ల అనంత వెంకట జగన్నాథచార్యస్వామిని శ్రీ దేశిక ట్రస్ట్, ఉత్తరాంధ్రా వైష్ణవ పీఠం తరఫున దేశికాచార్య పురస్కారంతో పాటు శ్రీరామాయణ పారాయణార్ణవ బిరుదుతో గురువారం ఘనంగా సత్కరించారు. శ్రీవారి ప్రసాదంగా దుశ్శాలువ, పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం పురస్కార గ్రహీత మాట్లాడుతూ వైభవోపేతమైన శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమంలో పురస్కారం అందుకోవడం తన జన్మ సార్థకమైందన్నారు. కార్యక్రమంలో తిరంగళ కుమారి, భాస్కరా సీతారామపావని లాస్యశ్రీ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గొల్లల ములగాంలో కొనసాగుతున్న పోలీస్ పికెట్చీపురుపల్లి రూరల్: మండలంలోని గొల్లల ములగాం గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఈనెల 13న గ్రామంలో జరిగిన ఎన్నికల పోలింగ్బూత్ వద్ద ఓ వృద్ధురాలు ఓటు వేసే అంశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే అంశంపై మరుసటి రోజు కూడా గ్రామంలోని రచ్చబండ వద్ద ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి స్వల్ప కొట్లాటకు దారి తీసింది.ఈ కొట్లాటలో ఇరువర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపచేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో బుధవారం నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, పోలీస్ పికెట్ కొనసాగుతుందని, గ్రామంలో ఘర్షణ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు పోలీస్ పికెట్ కొనసాగుతుందని ఎస్సై స్పష్టం చేశారు. నూతిలో పడి వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: ప్రమాదవశాత్తు నూతిలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. విజయనగరం మండలం పరిధిలో జరిగిన ఈ సంఘటనపై బాధితుల పిర్యాదుతో రూరల్ పోలీసులు గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. నర్సీపట్నంలోని బైరెడ్డిపాలెంకు చెందిన బి.చిన్ని నాయుడు (45) విజయనగరంలో ఉద్యోగరీత్యా ఉంటున్న భార్యాబిడ్డలను చూసేందుకు రెండురోజుల క్రితం వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం బయటకు వెళ్లివస్తానని చెప్పిన వెళ్లి తిరిగి ఇంటికి చేరకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు దర్యాప్తులో భాగంగా జొన్నవలస బైపాస్ రోడ్డు పక్కన ఉన్న నూతి దగ్గర అతని స్కూటీని గుర్తించారు. అనంతరం నూతిలో గాలించి గురువారం మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతునికి భార్య సుజాత, ఒక పాప ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై శ్యామలా దేవి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ.. దత్తిరాజేరు: మండలంలోని మరడాం పంచాయ తీ మర్రివలస సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ ఈశ్వరరావు గురువా రం తెలిపారు. వారం రోజుల క్రితం రైలు కింద పడి మృతి చెందిన మహిళ శరీర భాగం మురు గు కాలువలో ఉన్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసి న వారు ఫోన్ నంబర్ 9491813163, 99895 70010లకు సమాచారం అందించాలని కోరారు. -
ఏడిస్ దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి
విజయనగరం ఫోర్ట్: ఏడిస్ దోమ కాటు వల్ల డెంగీ వ్యాధి వస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో డెంగీ నిర్ధారణ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విజయనగరం, ప్రాంతీయ ఆసుపత్రి రాజాంలో ఉందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో డెంగీని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుగా రేపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇంట్లోను, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునన్నారు. డీఎంఓ వై.మణి, ఎపిడిమాలజిస్టు డాక్టర్ జి. వెంకటేష్, బి.మహాలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షయ బాధితులకు టీకా వేయాలి క్షయ టీకా (బీసీజీ వ్యాక్సిన్)ను జిల్లాలో గుర్తించిన బాధితులందరికీ వేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తెలిపారు. వయోజనులకు వేసే క్షయ టీకా కార్యక్రమాన్ని పలు ప్రాంతాల్లో గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసేటప్పడు వైద్య సిబ్బంది ఆరు ప్రమాణాలను పాటించాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో క్షయ వ్యాధి వచ్చి తగ్గిపోయిన వారికి, 18 ఏళ్లు నిండిన వారికి, పొగ తాగేవారికి, మధుమేమ వ్యాధిగ్రస్తులకు, క్షయ రోగులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారికి టీకా వేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ అచ్చుతకుమారి, డాక్టర్ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
పోలీసుల అదుపులో నకిలీ పుడ్ ఇన్స్పెక్టర్లు
విజయనగరం క్రైమ్: నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు విజయనగరం పట్టణంలో ఓ హోటల్ యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో రంగంలోకి దిగిన వన్టౌన్ సీఐ బి.వెంకటరావు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి. గరివిడికి చెందిన గొర్లె మహేశ్వరరావు బీటెక్ (ఈఈఈ) చదివి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెంబర్గా కారుపై బోర్డు పెట్టుకుని విశాఖ జిల్లా మధురవాడకు చెందిన పాస్టర్ అరసాడ కిరణ్, యూట్యూబ్ చానెల్ ఎంఎస్99డిజిటల్ న్యూస్ సీఈఓగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురానికి చెందిన తర్లాడ దయానంద్, తెర్లాంకు చెందిన లావేటి కామేశ్వరరావులు ఈ నెల 10న పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఓ ప్రైవేట్ హోటల్కు వెళ్లి తమ ప్రతాపాన్ని చూపించారు. అయితే ఆ రోజు సంబంధిత హో టల్ యజమాని లేకపోవడంతో గురువారం మళ్లీ వచ్చారు. పథకం ప్రకారం పుడ్ ఇన్స్పెక్టర్లా హడావిడి చేసి రూ.50వేలు డిమాండ్ చేశా రు. దీంతో అనుమానం వచ్చిన సదరు యజ మాని వెంటనే పోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగంలోకి దిగిన వన్టౌన్ సీఐ బి.వెంకటరావు, ఎస్సై హరిబాబునాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. బాధిత యజమాని పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
విత్తన ఎంపికే కీలకం
పాటించాల్సిన జాగ్రత్తలు... ● వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు సమయంలో తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. బిల్లుపై విక్రయదారుడిపేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్, నికరతూకం, నికర ధర, లాట్ నంబర్, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్ సంతకం ఉండేలా జాగ్రత్తపడాలి. లూజు విత్తనాలను కొనుగోలు చేయరాదు. గడువుదాటిన విత్తనాల జోలికి వెళ్లవద్దు. కొనుగోలు చేసే విత్తనాల ప్యాకెట్లు నుంచి సంచి, డబ్బాలపై సీల్ ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి. విక్రయదారులు ఇచ్చే కరపత్రాలు తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలను పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. ● మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయాధికారిని సంప్రదించాలి. విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ● నాణ్యమైన విత్తనాలతో దిగుబడి బాగు ● చీడపీడలు దూరం ● ఆర్బీకేల్లో సర్టిఫైడ్ విత్తనాలు అమ్మకం ● పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లులను భద్రపరచుకోవాలి సీతంపేట: వ్యవసాయంలో అత్యంత ప్రధానమైనది విత్తన ఎంపిక. ఇది పంట దశ, దిశను మార్చుతుంది. విత్తన ఎంపిక, కొనుగోలులో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అన్నదాత నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నది వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన. వచ్చేనెల నుంచి ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. వేసవి దుక్కులు చేయడంలో రైతులు బిజీ అయ్యారు. వరి నారు, వెదలు జల్లేందుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్బీకేలలో విక్రయించే సర్టిఫైడ్ విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. విత్తనాల లభ్యత ఇలా... విత్తనాలు బ్రీడర్ పౌండేషన్ సర్టిఫైడ్ ట్రూత్ ఫుల్ లేబుళ్లలో లభిస్తాయి. వీటిని సాగు చేసి మళ్లీ విత్తనాలుగా వినియోగించవచ్చు. దీనివల్ల రైతులకు విత్తన భారం తగ్గుతుంది. బ్రీడర్ విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానాలు, యూనివర్సిటీలు, విత్తన కంపెనీల శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. ఈ విత్తనాల ధర ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలు షాపుల్లో లభ్యం కావు. బ్రీడర్ విత్తనం నుంచి ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు. వివిధ ఉత్పత్తి సంస్థలు సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. ఫౌండేషన్ విత్తనానికి తెలుపు రంగు ట్యాగ్ చేస్తారు. ఫౌండేషన్ సీడ్ నుంచి వచ్చే విత్తనాన్ని సర్టిఫైడ్ సీడ్గా వ్యవహరిస్తారు. దీనికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు. సర్టిఫైడ్ సీడ్ నుంచి వచ్చే విత్తనాలను ట్రూత్ లేబుల్ విత్తనంగా వ్యవహరిస్తారు. దీనికి ఆకుపచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. సాధ్యమైనంత వరకు రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) లభించే విత్తనాలు కొనుగోలు చేయడం మంచిదని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. మొలక శాతం పరీక్షించాలి తప్పనిసరి పరిస్థితుల్లో విత్తనాలు బయట కొనుగోలు చేయాల్సి వస్తే లైసెన్సు ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల మొలకశాతం చెక్ చేసుకోవాలి. మొలకశాతం తక్కువ ఉన్న విత్తనాలు తీసుకోవద్దు. – హరికృష్ణ, ప్రాజెక్టు అగ్రికల్చర్ ఆఫీసర్, ఐటీడీఏ, సీతంపేట -
వైఎస్సార్ సీపీ వైపే.. ప్రజా తీర్పు
విజయనగరం: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ వైపు ఉండబోతుందని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, ఆ పార్టీ రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 నాటి ఫలితాలు పునరావృతం అవుతాయని చెప్పారు. విజయనగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం, పార్వతీపురంమన్యం, శ్రీకా కుళం జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బరిలో దిగిన 19 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా, నలుగురు ఎంపీలుగా విజయబావుటా ఎగురవేస్తారన్నారు. విజయనగరం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు వేకువజామున 3 గంటల వరకు ఓటింగ్ జరగడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఐదేళ్ల సంక్షేమ పాలనకు మద్దతుగా ప్రజలంతా ఓటు వేసేందుకు తరలివచ్చినట్టు పేర్కొన్నారు. నా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ పేద, బడుగు, బలహీన వర్గాలకు జరిగిన మంచిని గుర్తించుకుని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన డం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సైతం తన ప్రభుత్వంలో మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయాలని పిలుపునివ్వడం ఓటర్లలో స్ఫూర్తిని నింపిందన్నారు. అందుకు అనుగుణంగానే తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసు కునేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నా రని చెప్పారు. కరోనా కష్ట కాలంలో ఇబ్బందులకు ఎదురొడ్డి ఇచ్చిన హమీలను అమలు చేయడంతో పాటు ప్రజలకు ధైర్యం చెప్పి అండగా నిలిచిన వైనాన్ని రాష్ట్ర ప్రజలంతా మర్చిపోలేదన్నారు. ఓటమి భయంతో కూటమి నేతలు హింసాత్మక చర్యలు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో కూటమి నాయకులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యా ప్రయత్నానికి ఒడిగట్టినా వెనుకడుగు వేయకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారన్నారు. మరో వైపు వారికి అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వ పాలనపై బురదచల్లినా ప్రజలు నమ్మలేదన్నారు. గెలుపుకోసం ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు బెదిరింపులకు దిగినా... కుట్రలు.. కుతంత్రాలకు తెరలేపినా వాటికి బెదరకుండా జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కొనసాగించుకునేందుకు రేయింబవళ్లు కష్టించి పనిచేసిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు, బూత్ కన్వీనర్లకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ నిర్వహణలో యంత్రాంగం సేవలు అభినందనీయం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా యంత్రాంగం అందించిన సేవలు అభినందనీయమని మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చేపట్టిన పటిష్ట చర్యలు సత్ఫలితాన్నిచ్చాయని చెప్పారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నెక్కల నాయుడుబాబు, కె.వి. సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పునరావృతం కానున్న 2019 ఫలితాలు జగన్ నాయకత్వంలో సంక్షేమ పాలనకు మద్దతుగా పెరిగిన పోలింగ్ శాతం ఓటమి భయంతో రాష్ట్రంలో కూటమి నేతల హింసాత్మక చర్యలు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు -
ఎన్నికల భృతిలో కోతపెట్టడం తగదు
విజయనగరం అర్బన్: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో విధుల నిర్వహించిన వివిధ కేడర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గౌరవ వేతనంలో కోతవేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఎన్నికల అధికారులను నిలదీశారు. భోజనం పేరుతో కొన్నిచోట్ల వేత నంలో కోతపెట్టారని ఆరోపించారు. దీనిని సరిచేయాలంటూ కలెక్టరేట్లో ఏఓ శ్రీనివాసరావుకు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. శిక్షణ తరగతులని చెప్పి మూడురోజుల, నియోజకవర్గం కేంద్రం నుంచి మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి రిసెప్షన్ (కౌంటింగ్ కేంద్రం) సెంటర్కు మెటీరియల్ మరో మూడు రోజులు పనిచేస్తే కేవలం రెండు రోజులకు సరిపడే గౌర వవేతనం ఇచ్చారని ఆరోపించారు. అందులోని రూ.250 వరకు భోజన సౌకర్యం కల్పించామని చెప్పి కొన్ని పోలింగ్ కేంద్రాలలో తగ్గించారని విమర్శించారు. మూడు రోజులకు వేతన ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలిక వ్యాధు లు ఉన్నాయని, విధులకు మినహాయింపు ఇవ్వాలని వినతి ఇచ్చినా రిజర్వ్డ్ విధులను చేయాలని మొండి చేయడంతో రిసెప్షన్ సెంటర్ వద్దే కూలిపోయిన ఉద్యోగికి మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు జేఏవీఆర్కే ఈశ్వరరావు, డి.శ్యామ్, ఇజ్జపు రామునాయు డు, జె.రమేష్చంద్రపట్నాయక్, డి.రాము, వెంకటనాయుడు, పి.రాంప్రసాద్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ తెలిపారు. ఈ నెల 22వ తేదీలోగా సంబంధిత కళాశాలకు దరఖాస్తులు అందజేయాలన్నారు. నెలాఖరులోగా తొలివిడత ప్రవేశాలను ముగించి, వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందన్నారు. జిల్లా లో 18 ప్రభుత్వ కళాశాలలు, 105 ప్రైవేటు కళాశాలలున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ కోర్సు లలో 4,070 మందికి ప్రవేశాలు జరిగాయని, ఈ ఏడాది పదోతరగతి ఉత్తీర్ణత శాతం పెరిగిన నేపథ్యంలో కనీసం 5 వేలు తగ్గకుండా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం బొండపల్లి: వారంతా రాత్రంతా కష్టపడి చదివారు. ఉదయం ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం సెమిస్టర్ పరీక్షకు నెల్లిమర్ల మండలంలోని చందకపేట రెవెన్యూ పరిధిలోని సెంచూరియన్ యూనివర్సిటీకి వర్సిటీ బస్సులో బయలుదేరారు. గజపతినగరం నుంచి ఎన్హెచ్–26పై ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. కొద్ది నిమిషాల్లో కళాశాలకు చేరుకుంటామన్న సమయంలో విద్యార్థులు వెళ్తున్న బస్సును బొండపల్లి మండల కేంద్రానికి సమీపంలో టిప్పర్ బలంగా ఢీకొంది. విద్యార్థుల హాహాకారాలతో ఆ ప్రాంత వాసులు పరుగున వచ్చారు. ప్రమాదంలో గాయపడిన 8 మంది విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్ కృష్టంరాజును కిందకు దించారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్తో పాటు వసంతకుమారి అనే విద్యార్థినిని విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి 108లో తరలించారు. మిగిలిన వారిని గజపతినగరం సీహెచ్సీకి తీసుకెళ్లారు. రాకపోకలకు అంతరాయం జాతీయ రహదారిపై ప్రమాదం జరగడం, మధ్యలో వాహనాలు ఉండిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నాలుగు కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిపోయాయి. గజపతినగరం సీఐ ప్రభాకరరావుతో పాటు బొండపల్లి ఎస్సై కె.లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాలను పక్కకు తీయించారు. రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. -
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2024 గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈ నెల 16, 17 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పరీక్షను 12,819 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 3,122 మంది అగ్రికల్చర్, ఫార్మశీ పరీక్షను ఆన్లైన్లో రాయనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వివరాలు.. ఈఏపీసెట్ పరీక్ష కోసం విజయనగరంలోని గాజులరేగలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాల, అదే ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ జోన్ ఐడీజెడ్, అవంతి ఇంజినీరింగ్ కళాశాల, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల, బొబ్బిలిలోని స్వామి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులను తీసుకురావాలి ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్టికెట్తోపాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష రోజున కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులను ఉదయం సెషన్కు సంబంధించి 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ 16,17న బైపీసీ విభాగానికి..18 నుంచి 23 వరకు ఎంపీసీ విభాగానికి పరీక్ష జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ పరీక్షకు 12,819 మంది... అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 3,122 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయితలు శ్రీరామ చక్రధర్, శారద దీప్తి శిక్షణ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు, పెద్దలకు వ్యక్తిత్వ వికాస సూత్రాలను వివరించారు. మనిషి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమయ్యే వ్యక్తిత్వం, గుణగణాలను వివరించారు. శిక్షణ శిబిరానికి 200 మంది హాజరు కాగా ఆలయ అర్చకులు చాణక్య, హర్షలు శాంతి మంత్రాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, చీఫ్ ఆడిటర్ బాలాజీ, ఉమాదేవి దంపతులు, జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకేలో చోరీమక్కువ: మండలంలోని కాశీపట్నం పంచాయతీలో గల రైతుభరోసా కేంద్రంలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఎస్సై పి.నరసింహమూర్తి బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీపట్నం గ్రామంలో ఆర్అండ్బీ రహదారి సమీపంలోని ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గొట్టాపు సతీష్కుమార్ ఈనెల 10వతేదీన విధులు నిర్వహించి, రైతుభరోసాకేంద్రం తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. మళ్లీ ఈనెల 14వతేదీన ఆర్బీకేలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఆయన తలుపులు తీసి, చూడగా టీవీ, కంప్యూటర్ మానిటర్, ప్రింటర్ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. దీంతో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సతీష్కుమార్ ఫిర్యాదుచేయడంతో కేసునమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీతంపేటలో భారీ వర్షం
సీతంపేట: మండల కేంద్రం సీతంపేటలో బుధవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. జీడిమామిడి తోటలకు ఈ వర్షం వల్ల నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనసాగుతున్న వర్షాలుభామిని: మండలంలో రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్ల బడింది. రోడ్లు గోతులు, వంతెనలలో వర్షపు నీరు చేరుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పోలాల్లోకి వర్షపు నీరు చేరుతుండండంతో కూరగాయల పంటల రైతులకు ఊరట కలిగిస్తోంది. -
ఇంటింటా పాడిపంట
● సాగులో పోటీ..దిగుబడిలో మేటి ● ఏటా లక్షల్లో ఆదాయం ● కరువును జయిస్తున్న రైతులు రామభద్రపురం: పేరుకే అది పల్లె. చూస్తే పట్టణాన్ని తలపిస్తుంది. ఈ పల్లె చుట్టూ సారవంతమైన భూములు, కనుచూపు మేర ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు, పండ్ల తోటలు, కూరగాయల పంటలు, పాడి పశువులు. పాడి పంటలు తప్ప అన్యమెరుగని ఊరు ఇది. పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచిన ఆ ఊరే రామభద్రపురం. సుమారు 3500 పైబడి కుటుంబాలు ఉన్న ఈ గ్రామం పాడి,పంటలతో తులతూగుతూ మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పశుపోషణతో పాటు ఉద్యాన పంటలతో విరాజిల్లుతోంది. జిల్లాలోని పల్లెల్లో రామభద్రపురంలో దాదాపుగా 70 నుంచి 80 శాతం వరకు ప్రతి ఇంటిలోనూ ఉద్యాన పంటలు పండించడంతో పాటు పాడిపశువులు పెంచేందుకు గ్రామస్తులు చేస్తున్న కృషి ఎందరికో ఆదర్శం. ఇక్కడి రైతులు వరితో పాటు అన్ని రకాల కూరగాయ పంటలు సాగుచేస్తారు. ఆకుకూరలు, బెండ, దొండ, టమాటో, బీర, స్వీట్కార్న్, వంగ, కాలిఫ్లవర్, క్యాబేజీ తదితర కూరగాయల పంటలు, బంతి, కనకంబరాలు వంటి పూలు పండిస్తున్నారు. పంటల సాగులో పోటీత్వతం గ్రామంలో తాము ఏ పంట సాగు చేస్తున్నమనే దానికంటే అవతలి రైతు కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనే పోటీతత్వం ఇక్కడి రైతుల్లో ఉంది. సుమారు 50 శాతం మంది రైతులు నేలబావులు, సొంత డబ్బుతో చిన్న చిన్న బోరుబావులు తవ్వుకుని వాటి ద్వారా సాగునీరు అందిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు దిగుబడులు సాధిస్తున్నారు. ఒక్కో రైతు కనీసం అరెకరాకు తగ్గకుండా అంతర పంటల సాగుతో కూరగాయ పంటలు సాగు చేస్తూ వేల రూపాయలు ఆదాయం పొందుతున్నాడు. గ్రామంలో అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్ ఉండడంతో ఇక్కడికి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వ్యాపారులే కాకుండా ఇతర రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వ్యాపారులు నేరుగా వ్యాన్లతో వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. 2వేల వరకు పాడి పశువులు గ్రామంలో ఆవులు, గేదెలు 2వేల వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దాదాపు 20 సెంట్ల నుంచి అరెకరా వరకూ పాడి పశువులకు పచ్చ గడ్డి సాగుచేస్తున్నారు. ఆ గడ్డితో పాడి పశువుల దాణా ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పాల దిగుబడి పెంచుకుంటూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏడాదికి ఈ గ్రామంలో రైతులు సుమారు రూ.కోటి వరకూ ఆదాయం పొందుతున్నారు. తీవ్ర వర్షాభావంతో వరి సాగు లేక కరువు ఏర్పడినా కూడా దాన్ని సైతం జయిస్తూ రైతన్నలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రైతుభరోసా పథకం పేరుతో అందజేస్తున్న పెట్టుబడి సాయం తమకు కలిసి వస్తోందని, మరింత ఉత్సాహంతో పంటలు సాగుచేస్తున్నామని రైతులు చెబుతున్నారు. మహిళా బాగస్వామ్యంతో ఇంటికి ఇల్లాలే వెలుగన్న నానుడి ఇక్కడ రుజువవుతుంది.ఆ గ్రామంలో పాడి పశువుల పోషణలోను, పంటలు పండించడంలోనూ మహిళలదే కీలకపాత్ర. నిత్యం పశుగ్రాసం అందించడం మొదలు..పంటలు దిగుబడి సాధించేవరకూ కుటుంబ యజమానికి చేదోడు వాదోడుగా మహిళలు నిలుస్తున్నారు. ప్రతిరోజూ వేకువ జామునే లేచి పంట పొలాలకు వెళ్లి కూరగాయలు కోయడం, మార్కెట్కు తెచ్చి విక్రయించడం చేస్తుంటారు. పాడి పంటలతో ఆదాయం పెరగడంతో తమ చిన్నారులను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారు.పంటలే జీవనాధారం మా గ్రామంలో సుమారు ప్రతి ఇంటికి పాడి ఆవులు, ఉద్యాన పంటలు ఉన్నాయి. నేను రెండు పాడి పశువులు పోషించడంతో పాటు కూరగాయలు వేశాను. పొట్టి చిక్కుడు పంటలో అంతర పంటగా బీర పంట వేశాను, బీర సాగు వట్టిపోయింది.కొద్ది రోజుల్లో పొట్టి చిక్కుడు పంట కోతకు అందివస్తుంది. మర్రాపు బంగారమ్మ, రైతు, రామభద్రపురంపంటల సాగుపైనే చర్చ పాడి పంటలకు రామభద్రపురం ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలోని రైతులు వ్యవసాయ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గ్రామంలోని ఏ ఇద్దరు రైతులు కలిసినా పాడి పశువుల పోషణ, పంటల సాగుపైనే చర్చిస్తుంటారు. ఎలాంటి పంట పెట్టాలి? పాడి ఆవు ఎన్ని పాలు ఇస్తుంది.పెట్టుబడి ఎంతవుతుంది.పంటలో దిగుబడి సాధించేందుకు ఏం చేయాలనే అంశాలపైనే మాట్లాడుతుంటారు. ఇదే విషయాలపై వ్యవసాయాధికారుల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. మంచి సారవంతమైన భూములు కలిగి ఉండడంతో పాటు శ్రమించే గుణం ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడి రైతులు పాడి పంటల సాగులో ఆదర్శంగా నిల్తస్తున్నారు. వి.హైమ, వీహెచ్ఏ, రామభద్రపురం -
హోంగార్డ్ కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ పార్వతీపురం మన్యం ఆర్టీఎ విభాగంలో విధులు నిర్వహిస్తూ, ఇటీవల హార్ట్స్ట్రోక్తో మృతిచెందిన కె.మహేశ్వరరావు కుటుంబానికి సిబ్బంది ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు హోంగార్డు చేయూత కింద ఒకరోజు అలవెన్స్ రూ.3.20 లక్షల చెక్కును మృతుడి సతీమణి కె.ధనలక్ష్మికి ఎస్పీ ఎం.దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రభాకరరావు, హోంగార్డ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెట్టంగిలో కొనసాగుతున్న పోలీస్ పికెట్వీరఘట్టం: మండలంలోని తెట్టంగిలో పోలీస్ పికెట్ కొనసాగుతోంది.ఈనెల 13న ఎన్నికల రోజున గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన తగాదాతో అప్రమత్తమైన పోలీసులు ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం వచ్చేంతవరకు పోలీసు పికెట్ ఉంటుందని ఎస్సై షేక్ ఫకృద్దీన్ సోమవారం తెలిపారు. కొఠియా గ్రామాల్లో విద్యుత్ మీటర్లుసాలూరు రూరల్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలైన కొఠియా పంచాయతీలోని గంజాయిభద్ర తదితర గ్రామాల్లో విద్యుత్ మీటర్లు అమర్చినట్లు గంజాయిభద్ర మజీ సర్పంచ్ గెమ్మెల బీసు తెలిపారు. ఆయన మంగళవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడుతూ మార్చి 28వ తేదీన ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది కొఠియా గ్రామాల్లో ఇంటింటికీ విద్యుత్ మీటర్లు అమర్చే ఏర్పాట్లు చేస్తుంటే ఒడిశా అధికారులు వారిని అడ్డుకున్న విషయం తెలిసిందేనన్నారు. అయితే ఆ విద్యుత్ మీటర్లును ఇంటింటికీ గ్రామపెద్దగా పంపిణీ చేశామన్నారు. అయితే ప్రస్తుతం ఆ మీటర్లను ఇంటింటికీ బిగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాల గిరిజనులకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఏటీఎంలో చోరీ యత్నంచీపురుపల్లి: పట్టణంలోని ఆంజనేయపురంలో గల కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. దీనిపై కెనరా బ్యాంక్ మేనేజర్ ఆమిటి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని ఆంజనేయపురంలో కెనరా బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం కేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు చొరబడి ఏటీఎం ఫ్రంట్ డోర్ పగలగొట్టి చోరీకి యత్నించారు. అయితే ఏటీఎం నుంచి ఎలాంటి నగదు చోరీ జరగలేదని మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏటీఎంలో చోరీకి వచ్చిన దుండగుడు మాస్క్ వేసుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాగైనా నిందితుడిని పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. -
ప్రకృతిసాగుతో ఆరోగ్యం
విజయనగరం ఫోర్ట్: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చేవి. ఇప్పుడు 20, 30 ఏళ్లకే ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మానవుని ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో పాటు పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం కారణంగా తక్కువ వయసులోనే వ్యాఽధుల బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సాగు పద్ధతిలో పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు చెబుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. రసాయన ఎరువులతో సాగు చేసే పంటల ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు చీడ, పీడల బెడద కూడా ఉంటుంది. ప్రకృతిసాగు పద్ధతిలో అయితే చీడపీడల బెడద పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో వరి, మొక్కజొన్న, పెసర, మినుము, కూరగాయలు, పండ్ల తోటలు ప్రకృతి సాగు పద్ధతిలో చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆచరిస్తున్న రైతులు 2016లో ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటైనప్పుడు ప్రకృతి సాగు పద్ధతులను కేవలం 10 మండలాల్లో మాత్రమే రైతులు పాటించేవారు. ప్రస్తుతం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులు పాటిస్తున్నారు. సమాజంలో కొత్త, కొత్త రోగాలు వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు కూడా ఆరోగ్యపై శ్రద్ధ వహిస్తున్నారు. 8 ఏళ్లలో గణనీయంగా పెరిగిన ప్రకృతి సాగు ప్రకృతి సాగు పద్ధతిని రైతులు గతంలో పెద్దగా ఆచరించేవారు కాదు. అయినప్పటికీ కొన్నేళ్లుగా ప్రకృతి సాగు పెరుగుతూ వస్తోంది. గడిచిన 8 ఏళ్ల కాలంలో గణనీయంగా ప్రకృతి సాగు పెరిగింది. 2016లో 1368 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. ఈ ఏడాదిఖరీఫ్లో 58,882 ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రకృతి సాగులో భాగంగా వరి పంట 32,461 ఎకరాల్లో, మొక్కజొన్న పంట 3434, నువ్వు పంట 17,326 ఎకరాల్లో, పండ్ల తోటలు 5661 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. ఈ ఖరీఫ్ లక్ష్యం వేల 58,882 ఎకరాలు ప్రకృతి సాగు చేసే రైతులు 58,279 వేల మంది -
జూలైలో ఖరీఫ్కు తోటపల్లి నీరు విడుదల
వీరఘట్టం: పాత ఆయకట్టుకు ప్రతి ఏటా ఖరీఫ్లో పూర్తిస్థాయిలో నీరందిస్తూ పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తోటపల్లి జలాశయం సస్యశ్యామలం చేస్తోంది. ఈ మేరకు గడిచిన ఐదు ఖరీఫ్ సీజన్లలో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా జలవనరులశాఖ అధికారులు ప్రణాళికా బద్ధంగా నీటిని పంపిణీ చేశారు. అంతేకాకుండా ఓ పక్క కాలువల ఆధునికీకరణ పనులు చేపడుతూనే మరో పక్క సాగునీరు పంపిణీ చేస్తూ సాగును సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్లుగా పంటల దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సకాలంలో నీటిని పంపిణీ చేసేందుకు జలవనరులశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూలై మొదటివారంలో తోటపల్లి పాత ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. ఇంతవరకు జరిగిన ఆధునికీకరణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై దృష్టి సారించింది.37.536 కి.మీలు పొడవున్న ఎడమ కాలువలో ఇంతవరకు 16.843 కి.మీ వరకు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. అలాగే 17.616 కి.మీ పొడవున్న కుడికాలువలో 9.376 కి.మీ వరకు కాంక్రీట్ పనులు చేపట్టారు. మొత్తం 55.152 కి.మీకు గాను ఇంతవరకు 26.919 కి.మీ అనగా 48 శాతం పనులు చేపట్టారు. అంతేకాకుండా ఎడమకాలువలో అచ్చపుపలస వద్ద, 6వ బ్రాంచ్ వద్ద, ఎం.రాజపురం వద్ద, కత్తులకవిటి వద్ద వెడల్పయిన వంతెనలు నిర్మించి వాహనరాకపోకలకు మార్గం సుగమం చేశారు. ఇలా నీటి పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత ఖరీఫ్లో చర్యలు చేపట్టి శివారు వరకు సాగునీరందించారు. ఇలా ఒక పక్క ఆధునికీకరణ పనులు చేపడుతూ మరో పక్క గత ఐదు ఖరీఫ్ సీజన్లలో సకాలంలో కాలువలకు సాగునీరందిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోటపల్లి ఆయకట్టును సస్యశ్యామలం చేసింది. ఈ ఏడాది కూడా సకాలంలో నీరు విడుదల చేసి శివారు ఆయకట్టుకు తొలి ప్రాధాన్యంగా నీటి పంపిణీ చేయనున్నారు.తోటపల్లి జలాశయం గత ఐదు సీజన్లలో తోటపల్లి పాత ఆయకట్టుకు నీటి పంపిణీ శివారు ఆయకట్టులో పెరిగిన పంటల దిగుబడిజూలైలో నీటి విడుదల గత ఖరీఫ్ సీజన్లో శివారు రైతులు ఇబ్బందులు పడకుండా సాగునీరు పుష్కలంగా అందించాం. దీంతో గతేడాది పంటల దిగుబడి కూడా బాగా వచ్చింది. శివారు ప్రాంతంలో కాలువల్లో, డిస్ట్రిబ్యూటరీ చానల్స్లో, బ్రాంచ్ కాలువల్లో ప్రస్తుతం పేరుకుపోయిన పిచ్చి మొక్కలు తొలగించి జూలైలో నీటి విడుదలకు చర్యలు చేపడుతున్నాం. దమలపాటి రవికుమార్, డీఈఈ జలవనరులశాఖ, పాలకొండ డివిజన్ -
రాజీయే రాజమార్గం
● సీనియర్ సివిల్ జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్ రాజాం సిటీ: సివిల్ తగాదాలు, భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేలా మధ్యవర్తిత్వం చేయాలని, రాజీయే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ అన్నారు. రాజాం కోర్టు సముదాయంలో న్యాయవాదులతో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భార్యాభర్తల గొడవల విషయంలో మధ్యవర్తిత్వం ఆవశ్యకతను వివరించారు. గొడవలు పడుతున్నవారిని మధ్యవర్తిత్వ కేంద్రాలకు పంపుతామని, అక్కడ శిక్షణ పొందిన న్యాయవాదులు, ఉపాధ్యాయులు, సోషల్ వర్కర్స్, ఎన్జీఓ సంబంధిత వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారని వెల్లడించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. నిర్దేశించిన కాలంలో మధ్యవర్తిత్వం జరిపి రిపోర్టును న్యాయ సంస్థలకు అందజేయాలని సూచించారు. అది కూడా విఫలమైతే సంబంధిత కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. రాజాం బార్ అసోసియేషన్లో ఇప్పటికే శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తులుగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి పీఎస్వీబీ కృష్ణసాయితేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రామినాయుడు, వై.ఈశ్వరరావు, ఎస్.పోలారావు, తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement