-
కిక్కిస పొదలకు నిప్పు
కై కలూరు: అక్రమ చేపల సాగు కోసం కొల్లేరు ప్రాంతంలో కిక్కిసను కొందరు తగలబెడుతున్నారు. సాధారణ సమయంలో నీటిలో కిక్కిస పొదలను తొలగించడం కష్టం. వేసవిలో చిన్న నిప్పురవ్వ మొత్తం కిక్కిసను తుడుచిపెడుతోంది. ఇదే అవకాశంగా చేసుకుని కొంతమంది ప్రతీ వేసవిలో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కిక్కిసను తగలబెడుతున్నారు. పెదఎడ్లగాడి వంతెన సమీపంలోని ఏలూరు జిల్లా కలకర్రు ప్రాంతంలో గురువారం పెద్ద ఎత్తున కిక్కిసను తగలబెట్టారు. దీంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. ఈ విషయమై అటవీశాఖ రేంజర్ కుమార్ను వివరణ కోరగా కిక్కిసను తగలబెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కొల్లేరు కిక్కిస పొదల్లో అరుదైన పక్షి జాతులు నివాసం ఉంటాయని.. పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెనుగొండ: వడలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. పెనుగొండ ఎస్సై షేక్ సుభాని తెలిపిన వివరాల ప్రకారం వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన యరకరాజు దుర్గాభవాని(39), చిన్న కుమార్తె మాధురీలత, పెద్ద కుమార్తె కుమారుడు హరీష్తో కలిసి మోటారు సైకిల్పై కోనసీమ జిల్లా పేరవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వడలిలోని రైసుమిల్లు సమీపంలోకి వచ్చే సరికి సిద్ధాంతం నుంచి పెనుగొండ వెళ్తున్న లారీ ఢీకొనడంతో దుర్గాభవాని సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మాధురీలత తీవ్రంగా గాయపడడంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. గత రెండు రోజులుగా వరి చేల నుంచి మట్టి తవ్వకాలు జరుగుతుండడంతో రోడ్డుపై పడిన మట్టికి తోడు గురువారం వర్షం పడడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయని, అందువల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
గత వైభవం కనుమరుగు
నరసాపురం: మొగల్తూరు పేరు చెపితే.. రాజుల పాలనా వైభవం, తీర ప్రాంత చేపల రుచులు మాత్రమే కాదు.. వేసవిలో మామిడిపళ్లు నోరూరిస్తాయి. ఇసుక నేల సారం వల్ల అద్భుత రుచి ఉండే మొగల్తూరు మామిడికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు ఏటా వేసవి సీజన్లో మొగల్తూరు మామిడిపళ్లను పంపుతారు. నూజివీడు మామిడికి సమానంగా మొగల్తూరు మామిడికి పేరుంది. ఇప్పుడు మొగల్తూరు మామిడి ప్రాభవం కోల్పోతుంది. పెరుగుతున్న పట్టణీకరణతో తోటలు కొట్టేస్తున్నారు. దీంతో విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇక తోటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీంతో కాపు తగ్గుతోంది. మొగల్తూరు మామిడా.. మజాకా! మొగల్తూరు, పేరుపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 1500 ఎకరాల్లో మామిడితోటలున్నాయి. చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొత్తపల్లి కొబ్బరి ఇక్కడ ఫేమస్. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. ఆవకాయ పచ్చళ్లకు సంబంధించి సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లకు డిమాండ్ ఉంది. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచే కాకుండా, పక్క జిల్లాల నుంచి అటు మామిడిపళ్లు, ఇటు పచ్చడి రకాలు కొంటారు. వేసవి సీజన్ వచ్చిందంటే మొగల్తూరు మామిడి మార్కెట్ కిటకిటలాడుతుంది. తెగుళ్ల బారిన తోటలు మచ్చతెగులు, మంచు తెగులు వంటి వ్యాధులు ఇటీవల సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో ఇళ్ల స్థలాలకు లేఅవుట్ల కోసం తోటలు నరికేస్తున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గిపోతుంది. ఒకప్పుడు 5 వేల ఎకరాల్లో మొగల్తూరు చుట్టుపక్కల మామిడి తోటలుండేవి. ఇప్పుడు విస్తీర్ణం 2 వేల ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుతం తోటల కంటే ఇక్కడ ప్రతి ఇంటి పెరట్లో కొన్ని చెట్లు ఉంటున్నాయి. ప్రతి ఇంటి పెరట్లో, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో మామిడి చెట్లు పెంచుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా గాలి దుమారంతో పిందెలు, కాయలు కూడా రాలిపోవడం వంటి కారణాలతో కూడా కాపు తగ్గుతుంది. మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ విక్రయిస్తుంటారు. చెట్ల కాపును బట్టి వ్యాపారులు కొని కాయలు తయారయ్యాక విక్రయిస్తారు. సీజన్లో ప్రతి రోజూ ఉదయం మొగల్తూరులో మార్కెట్ జరుగుతుంది. మొగల్తూరు నుంచి సీతారామపురం వరకూ 216 జాతీయ రహదారి దారిపొడవునా మామిడిపళ్లు విక్రయిస్తారు. లేట్గా వచ్చినా టేస్ట్లో బెస్ట్ మొగల్తూరు మామిడి పళ్లు ఆలస్యంగా కాపుకు వస్తాయి. జిల్లాలో చాలాచోట్ల మొగల్తూరు మామిడి పేరుతో, వేరే ప్రాంతాల నుంచి తెచ్చిన పళ్లను విక్రయిస్తారు. మే రెండోవారం నుంచి జూన్, జూలై నెలల్లో కూడా మొగల్తూరు మామిడిపళ్లు దొరుకుతాయి. మొగల్తూరు మామిడిపళ్లు పరక రూ.200 వరకూ అమ్ముతారు. బంగినపల్లి రకం కాయ డిమాండ్ బట్టి రూ 30 నుంచి రూ.70 వరకూ పలుకుతుంది. మొగల్తూరులో మామిడి తోటలు తగ్గుతున్న మొగల్తూరు మామిడి విస్తీర్ణం గతంలో 5 వేల ఎకరాల్లో తోటలు ప్రస్తుతం 2 వేల ఎకరాల లోపే తగ్గిపోతున్న తోటలు తోటలు తగ్గిపోతున్నాయి. కాపు తగ్గిపోతుంది. తోటలు నరికేసి లేఅవుట్లు వేస్తున్నారు. మా చిన్నప్పుడు కాపు ఇప్పుడు లేదు. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. మిగిలిన చోట్ల సీజన్ అయిపోతుంటే మాకు ప్రారంభమవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి బయట దేశాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు మామిడి కాయలు పంపిస్తారు. – బి.భోగేశ్వరారవు, పేరుపాలెం, రైతుకాపు అంతంత మాత్రమే ఈ ఏడాది కాపు అంతంత మాత్రమే.. గత మూడేళ్ల నుంచి కాపు సరిగా లేక, మరోపక్క తెగుళ్లతో ఇబ్బంది పడ్డాం. తోటలతో సరైన ఆదాయం రాలేదు. ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుందని అనుకున్నాం. కాపు తక్కువగా ఉన్నా రేటు బాగుంది. ఇప్పటికే మామిడికాయల కోసం వ్యాపారులు వచ్చి కలుస్తున్నారు. మొగల్తూరు మామిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. – మన్నె ముత్యాలరావు,, మొగల్తూరు, రైతు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
భీమడోలు: సూరప్పగూడెం ఫ్లైఓవర్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. విజయనగరం జిల్లా పలాసకు చెందిన బద్రి లోకేష్ భీమడోలు రైల్వేస్టేషన్లో ట్రాక్మెన్గా పనిచేస్తున్నాడు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా బైక్పై వెళ్తున్నాడు. మంగళగిరికి చెందిన పఠాన్ నాగూర్బీ, తన కుమారుడు తారక్, కుమార్తె నానుతో కలిసి బైక్పై ద్వారకాతిరుమలలో స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి బయల్దేరారు. తారక్ బైక్ నడుపుతుండగా మధ్యలో నాను, చివర నాగూర్బీ కూర్చుంది. తారక్ ముందు వెళ్తున్న లోకేష్ బైక్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో బద్రి లోకేష్(28) తలకు తీవ్రగాయాలై అక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో నాగూర్బీ(41) తలకు తీవ్ర గాయమైంది. నాగూర్ బీను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడ్డ తారక్, నానులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచానామా నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు భీమడోలు : గుండుగొలనులోని రేషన్ దుకాణంపై గురువారం విజిలెన్స్, సివిల్ సప్లయిస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో అదనంగా ఉన్న 122 కేజీల బియ్యం, 7 ప్యాకెట్ల పంచదార, గోధుమ పిండి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. డీలర్ ఎన్.లక్ష్మీ శివకుమారిపై కేసు నమోదు చేసారు. తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్లలో ఉండాల్సిన సరుకు కన్నా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో వి.వెంకటేశ్వరరావు పంచనామా నిర్వహించారు. 18న త్రోబాల్ సబ్ జూనియర్ నేషనల్స్ సెలెక్షన్స్ తాడేపల్లిగూడెం (టీఓసీ): విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (ఐజీఎంసీ)లో ఈ నెల 18న ఉదయం 9 గంటల నుంచి త్రోబాల్ సబ్ జూనియర్ నేషనల్స్ సెలక్షన్లు జరుగుతాయని త్రోబాల్ పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ఏఆర్కే వర్మ, సెక్రటరీ ఎన్.ఎం.శ్రీనాఽఽథ్ తెలిపారు. సెలక్షన్స్లో ప్రతిభ చూపిన విద్యార్థులు పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. 01.01.2010 తరువాత పుట్టిన వారై ఉండాలని, ఆధార్ కార్డు జిరాక్స్, ఎనిమిది పాస్పోర్టు సైజ్ ఫోటోలు అందించాలని, మరిన్ని వివరాలకు 97012 03030, 72879 65417 నెంబర్లలో సంప్రదించాలన్నారు. హత్య చేసిన వ్యక్తి అరెస్టు టి.నరసాపురం: టి.నరసాపురంలో వ్యక్తిని హత్య చేసిన పెసరగంటి మంగయ్యను గురువారం జీలుగుమిల్లి సీఐ పి.క్రాంతి కుమార్ అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. టి.నరసాపురం తూర్పుగూడానికి చెందిన రాయల వీరాస్వామి భార్యతో అదే గ్రామానికి చెందిన మంగయ్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం వీరాస్వామికి తెలియడంతో.. వీరాస్వామిని అడ్డు తొలగించుకోవాలని మంగయ్య ప్లాన్ వేశారు. ఈ నెల 10న తూర్పుగూడెం శివారు పామాయిల్ తోట దగ్గరకు వీరాస్వామిని మంగయ్య తీసుకువెళ్లి మద్యం తాగించాడు. తరువాత అతనితో గొడవపడి వీరాస్వామిని కత్తితో పొడిచాడు. గాయపడిన వీరాస్వామి చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందాడు. టి.నరసాపురం పోలీసులు హత్య కేసు నమోదు చేయగా, కేసును సీఐ క్రాంతికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. మంగయ్యను గురువారం అరెస్టు చేసి చింతలపూడి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
సేంద్రియ, జీవన ఎరువులే మేలు
నూజివీడు: భూమిలో పోషకాల లోపం ఉంటే భర్తీకి రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించేటప్పుడు కొన్ని పోషకాలు అధికంగా ఇవ్వడం, మరికొన్ని తక్కువగా ఇవ్వడం వల్ల పోషక లభ్యతలో సమతుల్యత లేక పంటల ఉత్పాదకత తగ్గిపోతుంది. పోషకాలను రసాయన ఎరువుల రూపంలో అవసరానికి మించి వాడటంతో భూభౌతిక లక్షణాలు మారిపోయి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితులలో భూములు ఎక్కువ కాలం సాగుకు పనికివచ్చేలా ఉండాలంటే రైతులు రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ, జీవన ఎరువులను వాడాలని నూజివీడు వ్యవసాయాధికారిణి ఆలూరు చాముండేశ్వరి పేర్కొన్నారు. సేంద్రియ, జీవన ఎరువుల వల్ల ఉపయోగాల గురించి ఆమె సూచనలు అందించారు. రసాయన ఎరువులతో నష్టాలు నేలలోని పోషకాల సమతుల్యత దెబ్బతినడమే కాకుండా నేల ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం వల్ల నేలలో కాలుష్యం పెరిగి సహజత్వం దెబ్బతింటుంది. చౌడు సమస్య ఏర్పడటంతో పాటు సూక్ష్మపోషక లోపాలు ఏర్పడతాయి. దీంతో చీడపీడలు పంటలను ఎక్కువగా ఆశిస్తాయి. చివరకు మొక్కలు బలహీనంగా పెరిగి దిగుబడి తగ్గిపోతుంది. సేంద్రియ ఎరువులలో పచ్చిరొట్ట ఎరువులు పచ్చిరొట్ట విత్తనాలు పొలంలో చల్లుకుని పంట పూత దశలలో భూమిలోనే కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల 30 నుంచి 35 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఖరీఫ్ పంటకు ముందు వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాలి. జీలుగు, జనుము, అలచంద, పిల్లిపెసర, పెసర తదితర పచ్చిరొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయి. కంపోస్టు ఎరువు వ్యవసాయ వ్యర్థాలు, ఆకులు తదితర వాటిని కొంతకాలం పాటు కుళ్లించిన తరువాత ఎరువుగా వాడతారు. అలాగే వానపాముల నుంచి వచ్చిన విసర్జనను ఎరువుగా వాడతారు. వీటి వాడకం వల్ల కూడా భూసారం పెరుగుతుంది. వానపాముల నుంచి వచ్చిన విసర్జనను వర్మీకంపోస్టు అంటారు. దీనిని ఎకరాకు ఒకటి నుంచి ఒకటిన్నర టన్ను వరకు ఉపయోగించవచ్చు. వరిపంటకు నాటిన తరువాత, మిగతా పంటలలో దుక్కిలో వేసి కలియదున్నాలి. అలాగే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువులు వాడుకోవాలి. సేంద్రియ ఎరువుల వల్ల లాభాలు నేలలో నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. భూసారం పెరగడంతోపాటు వివిధ పోషకాలు మార్పిడి చెందే శక్తి నెలలో పెరుగుతుంది. మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది. నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది సుస్థిర దిగుబడులు సాధించవచ్చు. దిగుబడులు పెరుగుతాయి. నేలలో కాలుష్యం తగ్గుతుంది. ప్రకృతిలోగల సూక్ష్మజీవులు మొక్కలతోను కలిసి జీవించేటప్పుడు పంటలకు కావాల్సిన పోషకాలను వాతావరణం నుంచి గ్రహించి మొక్కలకు అందిస్తాయి. అందుకే వీటిని జీవన ఎరువులుగా గుర్తించారు. రైజోబియం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, అజటోబాక్టర్ తదితర జీవన ఎరువులు ఉన్నాయి. ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి. జీవన ఎరువుల వల్ల లాభాలు ఇవి మొక్కలకు ఎరువులను, పోషకాలను, వివిధ హార్మోనులను, విటమిన్లు, ఎంజైములు చేరుస్తాయి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను, చీడలను అరికడతాయి. 25 శాతం వరకు నత్రజని, భాస్వరం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. మిత్రపురుగులకు ఎలాంటి హాని జరగదు. దీంతో నేలలో కాలుష్యం తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుంది. 20 శాతం వరకు దిగుబడులు పెరుగుతాయి. -
శ్రీ షిర్డీసాయి విద్యార్థులకు జాతీయ ర్యాంకులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలో తమ విద్యార్థులు సత్తా చాటారని రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ టి.శ్రీవిద్య గురువారం తెలిపారు. తమ డాఫ్నీ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మిజోరం రాష్ట్రానికి చెందిన ఐన్ల ఏవో ఆలిండియా 2వ ర్యాంకు సాధించిందన్నారు. జి.ప్రసన్నసాయి ఆలిండియా 328వ ర్యాంకు, ఎన్.భావన 504వ ర్యాంకు సాధించి ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించడానికి అర్హత సాధించారన్నారు. దేశవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాలలో కేవలం 4,051 సీట్లు మాత్రమే ఉంటాయని, అందులో ముగ్గురు తమ విద్యార్థులే కావడం ఆనందదాయకమన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ఐఐటీ, నీట్ వంటి రెగ్యులర్ కోర్సులతో పాటు సివిల్స్, క్లాట్, ఐపీమ్యాట్, క్యూట్ వంటి కోర్సులను తమ విద్యార్థులు ఎంపిక చేసుకోవడం హర్షణీయమన్నారు. -
డయేరియాతో చిన్నారి మృతి
కుక్కునూరు: డయేరియాతో భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుములతోగు గ్రామానికి చెందిన దేవరాజు (5) మృతి చెందాడు. దామరచర్ల పంచాయతీ కురుములతోగు గ్రామానికి చెందిన గిరిజనులు కలుషిత నీటిని తాగడంతో అనారోగ్యానికి గురయ్యారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో దేవరాజ్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ముగ్గురు మహిళలు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. డయోరియాతో బుధవారం బొజ్జమ్మ అనే మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే.. బాధిత కుటుంబాలను గురువారం కేఆర్ పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ పరామర్శించారు. కురుములతోగులో గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వెంటనే గ్రామంలో హ్యాండ్బోర్ వేయించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు నిత్యవసర సరుకులను అందించనున్నట్టు చెప్పారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించేలా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. గ్రామస్తులు తాగేందుకు మినరల్ వాటర్ను ఏర్పాటు చేశారు. పీఓతో పాటు డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్.శర్మిష్ట, డీఎల్పీఓ రజావుల్లా, వైస్ ఎంపీపీ తాండ్ర రాజేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహారాజు, రావు వినోద్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. వైద్యశిబిరం ఏర్పాటు బాధిత గ్రామాల్లో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గురువారం మండలంలోని కురుములతోగు, గుత్తికోయ గ్రామాల్లో వైద్యశిబిరం నిర్వహించారు. ఇప్పటికే కురుమలతోగు గ్రామానికి చెందిన 10 మంది అస్వస్థతకు గురికాగా, వీరిలో ఇద్దరు మరణించారు. గురువారం గుత్తికోయలో మరో ముగ్గురు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా, వారిని వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మండలంలోని డయరియా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాధి తీవ్రత తగ్గేంతవరకు వైద్యశిబిరాలు కొనసాగిస్తామని డీఎల్పీవో రజావుల్ల తెలిపారు. నీటి కాలుష్యం కారణం కాదు డయేరియాకు కారణం గిరిజనులు తాగిన నీరు కాదని ఎంపీడీవో నరసింహారావు చెప్పారు. నీటి నమూనాలు పరీక్షలకు పంపించగా.. అందులో ఎలాంటి కాలుష్యం లేనట్టు తేలిందన్నారు. కురుములతోగు, గుత్తికోయ గ్రామాల్లో వైద్య శిబిరాలు బాధిత కుటుంబాల్ని పరామర్శించిన ఐటీడీఓ పీవో -
కాలువలకు అడ్డుకట్ట
పాలకొల్లు సెంట్రల్: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పాలకొల్లు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యల్లో భాగంగా కాలువకు అడ్డుకట్ట వేశారు. రెండు రోజుల క్రితం కాలువలు కట్టివేయడంతో బుధవారం అధికారులు స్థానిక దాసరి నారాయణరావు కాలిబాట వంతెన వద్ద కాలువకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. మున్సిపల్ డీఈ రాజ్కుమార్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేశామన్నారు. మళ్లీ కాలువలకు వచ్చేనెల 10న నీటిని విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అప్పటి వర కూ పట్టణంలో రెండు పూటలా నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్డుకట్టతో మరో పది రోజులు కాలువ నీటిని వాడుకోవడానికి అవకాశం ఉందన్నారు. అనంతరం ఎస్ఎస్ ట్యాంకుల్లో స్టోరేజ్ చేసిన నీటిని వినియోగిస్తామన్నారు. ఇప్పటికే ఎస్ఎస్ ట్యాంకుల్లో 12 అడుగుల వరకూ నీటిని నిల్వ చేశామన్నారు. ఏఈ సాంబశివుడు ఉన్నారు. ఐటీఐలో ప్రవేశాలు ఉండి: జిల్లాలో 2 ప్రభుత్వ, 16 ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు బుధ వారం ప్రకటనలో తెలిపారు. 2024–25లో వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తప్పనిసరిగా తమకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట)లో ఒరిజినల్ సర్టిఫికెట్స్తో వెరిఫికేషన్ చేయించుకుని రసీదు పొందాలని తెలిపారు. కౌన్సెలింగ్ సమయంలో రసీదు తప్పనిసరిగా చూపించాలని లేకుంటే కౌన్సెలింగ్కు అనర్హులను పేర్కొన్నారు. దరఖాస్తులకు, వెరిఫికేషన్కు జూన్ 10 తుది గడువు అని తెలిపారు. మరిన్ని వివరాలకు ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐకి నేరుగా వచ్చి లేదా 08816 297093 నంబర్లో సంప్రదించాలని సూచించారు. 21న క్రికెట్ సెలెక్షన్స్ ఏలూరు రూరల్: భీమవరం డీఎన్నార్ కళాశాల మైదానంలో ఈనెల 21న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహిళల క్రికెట్ జట్లు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఏసీఏ ఇంటర్ డిస్ట్రిక్స్ పోటీల్లో భాగంగా అండర్–15, 19, 23 విభాగాలతో పాటు సీనియర్ ఉమెన్ జట్లు ఎంపిక పక్రియ చేపట్టామన్నారు. 1–9–2009 నుంచి 31–8–2011 మధ్య పుట్టినవారు అండర్–15 విభాగంలో పాల్గొనేందుకు అర్హులన్నారు. 1–9–2005 తర్వాత పుట్టినవారు అండర్–19 విభాగం, 1–9–2001 తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్, జెరాక్స్ కాఫీలతో పాటు సొంత కిట్తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు కోచ్ ఎస్.రమాదేవి, సెల్ 79891 53917లో సంప్రదించాలని సూచించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీపై శిక్షణ తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీపై 8, 9,10వ తరగతి విద్యార్థులకు ఐదు రోజుల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని బుధవారం కార్యక్రమ కో–ఆర్డినేటర్ డాక్టర్ కార్తికేయశర్మ తెలిపారు. జూన్ 3 నుంచి 7 వరకు రోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలోనే విద్యార్థులను తీసుకుంటామని, ఆసక్తి ఉన్నవా రు ఈనెల 25లోపు పేరు నమోదు చేసు కో వాలని సూచించారు. పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలని తెలిపారు. విద్యా ర్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు శిక్షణ దోహదపడుతుందన్నారు. వివరాలకు సెల్ 99854 57227, 90101 01065 నంబర్లలో సంప్రదించాలని కోరారు. నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ భీమవరం: జిల్లాలో గురువారం నుంచి ఏపీఈఏపీ సెట్–2024 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. భీమవరంలో 4, తాడేపల్లిగూడెంలో 2, నరసాపురంలో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటుచేశారు. 16,17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ పరీక్షలకు 4,087 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 18 నుంచి 23 వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు 9,928 మంది హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించరు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. -
ఎండు గడ్డికి యమ గిరాకీ
● యంత్రాల ద్వారా మాసూళ్లు ● గడ్డిని ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు ● కట్టలు కట్టి వినియోగిస్తున్న వైనం భీమవరం: జిల్లాలో వరి సాగు కొంతపుంతలు తొక్కుతోంది. రైతులు ఎక్కువగా యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చేలలో దుక్కుదున్నడం, గట్టు లంకలు వేయడం నుంచి వరి నాట్లు, పురుగుల మందుల పిచికారీ, మాసూళ్లు, ఎండుగడ్డిని కట్టలు కట్టించడం వరకు యంత్రాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఎండు గడ్డిని గిరాకీ ఉండటంతో రైతులు గడ్డిని ఒబ్బిడి చేసి విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. జిల్లాలో సుమారు 2.19 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా దాళ్వా సీజన్లో కోతలు దాదాపు పూర్తికావచ్చాయి. యంత్రాల ద్వా రా మాసూళ్లతో గడ్డి ముక్కలుగా మారుతుంది. దీనిని యంత్రం సాయంతోనే ఒబ్బిడి చేయించి కట్టలు కట్టించి విక్రయిస్తున్నారు. కట్టకు రూ.35 ఖర్చు యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన వరి పంటలో ఎండు గడ్డిని కూలీలతో మోపులు కట్టించి గడ్డి వాములు వేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో రైతులు గడ్డి కట్టలు కట్టడానికీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చేలలోని గడ్డిని ప్రత్యేక యంత్రం ద్వారా కట్టలు కట్టించి ట్రాక్టర్స్తో గట్టుకుచేర్చి గడ్డివాములుగా వేస్తున్నారు. యంత్రం ద్వారా కట్టలు కట్టడానికి ఒక్క కట్టకు రూ.35 వసూలు చేస్తున్నారు. దీంతో యంత్రం ద్వారా ఎకరా గడ్డి ఒబ్బిడి చేయడానికి సుమారు రూ.2 వేలు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. ఇతర జిల్లాల్లో గడ్డిని కొనుగోలు చేసే కంటే స్థానికంగా ఉన్న గడ్డిని ఒబ్బిడి చేసుకుని విక్రయించడమే మేలంటున్నారు. సుమారు 2.50 లక్షల పశువులు : రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు పశువుల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో సుమారు 45,539 ఆవుజాతి పశువులు, 1,78,137 గేదె జాతి పశువులు ఉన్నట్టు అంచనా. పశువుల సంఖ్య పెరగడంతో వరి గడ్డికి డిమాండ్ పెరిగింది. దీంతో కోత యంత్రాలతో మాసూళ్లు చేసిన వరి గడ్డిని పశు దాణాగా వినియోగిస్తున్నారు. యంత్రాలతో మాసూళ్లు తర్వాత గడ్డిని చేలలోనే నాలుగైదు రోజులు ఎండ బెట్టి తర్వాత ప్రత్యేక యంత్రాలతో కట్టలు కట్టించి వాములుగా వేసి దాణాగా ఉపయోగిస్తున్నారు. పోషక విలువలు తగ్గవు వరికోత యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన వరి గడ్డిలో ఏమాత్రం పోషక విలువలు తగ్గవు. గడ్డి పొడవుగా కాకుండా చిన్న ముక్కలుగా ఉండటం వల్ల పశువులు సులభంగా తినగలుగుతాయి. అందువల్ల రైతులు పశువులకు గడ్డి వాడకంలో ఎటువంటి సంకోచం లేకుండా వినియోగించవచ్చు. – కె.మురళీకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, భీమవరం మాసూళ్లు చేసిన గడ్డినే.. గడ్డికి తీవ్ర కొరత ఏర్పడటంతో యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన పంటలోని గడ్డిని మరో యంత్రంతో కట్టలు కట్టించి వాముగా వేసి పశువులకు ఉపయోగిస్తున్నాం, గడ్డి కట్టలు కట్టడానికి కట్టకు రూ.35 తీసుకుంటున్నారు. ఈ గడ్డిని పశువులు సులభంగా తినగలుగుతున్నాయి. – పంజా శేషగిరిబాబు, రైతు, ముగ్గుళ్ల -
స్వీప్తో సత్ఫలితం
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాలు (స్వీప్) సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదపడ్డాయి. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83.67 ఓటింగ్ శాతం నమోదు కాగా ప్రస్తుత ఎన్నికల్లో తుది గణాంకాలు సంకలనం పూర్తయ్యేసరికి పోస్టల్ బ్యాలెట్తో కలిసి దాదాపు 84.82 శాతానికి ఓటింగ్ పెరిగింది. 90 రోజులు నిర్విరామంగా.. కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ గత ఎన్నికల పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో 90 రోజులు నిర్విరామంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్స్ టర్న్అవుట్ ఇప్లిమెంటేషన్ ప్రణాళికను ఆమోదించి స్వీప్ నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ను నియమించి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. ఓటర్లలో చైతన్య అవగాహన కార్యక్రమాలు, ఓటు హక్కు ప్రాధాన్యత, గిరిజన, గ్రామీణ ప్రాంత ఓటర్లలో, బూత్ స్థాయిలో అసోషియేషన్ గ్రూపుల ఏర్పాటు, కశాశాల విద్యార్థులతో క్యాంపస్ అంబాసిడర్లు వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. మహిళా సంఘాలతో చర్చావేదికలు, మొదటిసారిగా ఓటు హక్కు నమోదుచేసుకున్న ఓటర్లతో ముఖాముఖీ కార్యక్రమాలు, ఓటు వేయాలని ప్రత్యేక ఆహ్వాన పత్రిక ద్వారా పిలుపు జిల్లాలో పోలింగ్ శాతం పెరగడానికి దోహద పడ్డాయి. అలాగే ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, సీ–విజిల్, సాక్ష్యం యాప్, 1950 టోల్ఫ్రీ నంబర్, జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వృద్ధాశ్రమాల్లో ‘హోం ఓటింగ్’పై అవగాహన కల్పించడం, పోలీస్ కవాతులు వంటివి నిర్వహించారు. స్వీప్ కార్యక్రమాల్లో కళాశాల విద్యార్థులు, మహిళా సంఘాలు, ఉపాధి హామీ కార్మికులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో స్వాగతం పోలింగ్ రోజు స్వీప్ నోడల్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ బృందం తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులలో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లను ఘనంగా స్వాగతించడం, ఓటు వేసిన ప్రతి ఓటరుకు ‘గో గ్రీన్’ అనే నినాదంతో పచ్చని మొక్కలు ఇచ్చి వీడ్కోలు పలకడం జిల్లా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. పోటెత్తిన ఓటరు చైతన్యం అధికారుల కార్యక్రమాలతోపెరిగిన పోలింగ్ ఎన్నికల కమిషన్ నుంచి అభినందనలు -
క్షేత్రంలో గో దత్తత పథకం
ద్వారకాతిరుమల: ప్రకృతి వ్యవసాయం చేసే రైతు లు ద్వారకాతిరుమల శ్రీవారి గో దత్తత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు కోరారు. ద్వారకాతిరుమలలోని కొండపైన గోసంరక్షణ శాలలో గతనెల 24న గో దత్తత పథకాన్ని పునః ప్రారంభించినట్టు చెప్పారు. గోవులను స్వీకరించదలచిన ప్రకృతి వ్యవసాయ రైతులు పొలం పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్, రూ.100 స్టాంప్ పేపర్, ఆధార్ కార్డు జెరాక్స్, నివాస ధ్రువీకరణపత్రంతో గోసంరక్షణ శాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 99891 09349లో సంప్రదించాలని కోరారు. 144 సెక్షన్ పొడిగింపు ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రి య ముగిసే జూన్ 6వ తేదీ వరకు 144వ సెక్షన్ అ మలులో ఉంటుందని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తె లిపారు. జిల్లాలో పోలింగ్ అనంతరం కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతలకు అవాంతరం కలిగే అవకాశం ఉన్నందున ఈనెల 14 వరకు ఉన్న 144 సెక్షన్ను జూన్ 6 వరకు పొడిగించామన్నారు. చట్టవిరుద్ధమైన సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. -
భూసార పరీక్షలకు సన్నద్ధం
గురువారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2024●ఆకివీడు: దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, మద్దతు ధర లభించడంతో రైతులు ఖరీఫ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఖరీఫ్, రబీ సాగు దిగుబడులు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇదే ఉత్సాహంతో వచ్చే ఖరీఫ్ సాగుకు జిల్లాలో రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచారు. ఈ నెలాఖరు నాటికి రబీ మాసూళ్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే జిల్లాలో మాసూళ్లు పూర్తయిన ప్రాంతాల్లో రైతులు పచ్చిరొట్ట సాగు చేపట్టారు. దీని ద్వారా భూసారం పెరిగే అవకాశం ఉంది. భూసార పరీక్ష.. పంటకు రక్ష భూసార పరీక్షలతో అధిక దిగుబడులు సాధించేలా యంత్రాంగం దృష్టి పెట్టింది. జిల్లాలో 5 వేల మట్టి నమూనాలు సేకరించి వాటిని పరీక్షించే దిశలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించే సర్వే నంబర్లను గుర్తించారు. నెలాఖరులోపు శాంపిల్స్ సేకరించి, పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. జూన్ రెండో వారం నాటికి భూసార పరీక్షా ఫలితాల్ని ఆయా రైతులకు తెలియజేస్తారు. భూమిలో చౌడు, ఆమల గుణాల స్థాయిని నిర్ధారించి, సంబంధిత భూముల్లో సాగు చేయబోయే పంటలకు ఏఏ ఎరువులను వినియోగించాలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేస్తారు. తద్వారా భూసారాన్ని పెంచి, పంటలకు మంచి పోషకాల్ని అందజేసేందుకు కృషి చేస్తారు. మట్టి పరీక్షలతోనే పంటలకు సరైన బలాన్ని అందించి, అధిక దిగుబడుల దిశగా సాగును తీసుకువెళుతున్నారు. చౌడు, ఉప్పునీటిని తట్టుకునే సాగు పశ్చిమ డెల్టాలో రొయ్యల సాగుకు ఉపయోగించే ఉప్పునీరు (సెలనిటీ) శాతం అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూసారం క్షీణిస్తుంది. ఉప్పుటేరు, ఇతర ప్రాంతాల్లో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చౌడును, సెలినిటీని తట్టుకుని సాగు చేసుకునేలా వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. మచిలీపట్టణం వరి పరిశోధనా కేంద్రానికి చెందిన ఎంసీఎం 100 వంగడం చౌడు, సెలినిటీని తట్టుకుని దిగుబడులు ఇస్తుంది. మార్టేరు వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా రూపొందించిన వంగడాలు ఎంటీయూ 1273, ఎంటీయూ 1293 మినీకిట్ల దశలో ఉన్నాయి. ఎంటీయూ 1318పై ఆసక్తి : ఖరీఫ్ సాగుకు ఎంటీయూ 1318 రకం వంగడాన్ని రైతులు ఎక్కువగా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రకం వంగడాల్ని విత్తనాల కోసం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఇటీవల స్వర్ణ వంగడాన్ని మళ్లీ అధికంగా సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్వర్ణ రకం బియ్యాన్ని స్థానికంగా వినియోగించేందుకు ప్రజలు ఇష్టపడటంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు ప్రైవేట్ విత్తనం సంపద స్వర్ణ వంగడాన్ని కూడా సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విత్తన శాంపిల్స్ పరీక్షలను వ్యవసాయశాఖ అధికారులు చేపట్టనున్నారు. న్యూస్రీల్ జిల్లాలో 5 వేల భూసార పరీక్షల లక్ష్యం ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఎంటీయూ 1318 వంగడానికి మొగ్గు ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ సాగు ఖరీఫ్ సాగును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు భూసార పరీక్షలతో పాటు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పరీక్షలకు శాంపిల్స్ సేకరణను త్వరలో చేపడతాం. ఖరీఫ్కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. రబీ మాసూళ్లు పూర్తయిన వెంటనే ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ సాగుకు వెళతాం. – జెడ్.వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ జేడీ, పశ్చిమగోదావరి జిల్లా -
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో చిన వెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 18 నుంచి 25 వరకు జరుగనున్న శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా 22న రాత్రి స్వామివారి కల్యాణం, 23న రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఆలయ పరిసరాలను, దర్శనం క్యూలైన్లను సిబ్బంది రంగులతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే స్వా మివారి పాదుకా మండప ప్రాంతంలో, ఆలయ ధ్వజస్తంభం వద్ద తాటాకు పందిళ్లను నిర్మిస్తున్నారు. అలాగే గుడి సెంటర్లోని ప్రధాన కూడలిలో 40 అడుగుల శ్రీవారి భారీ విద్యుత్ కటౌట్ను నిర్మిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యుద్దీప అలంకారాలు, ఇతర పనులు పూర్తి కానున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు కోరారు. 18 నుంచి చిన వెంకన్న ఉత్సవాలు -
సంప్రదాయబద్ధంగా అతిరాత్ర మహాయాగం
భీమవరం(ప్రకాశం చౌక్): శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్టు (నెలమూరు) ఆధ్వర్యంలో 11 రోజుల పాటు జరిగే రాజా శ్యామల దశమహా విద్య సహిత అతిరాత్ర మహాయాగాన్ని బుధవారం భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభించారు. డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), ఉమా రామలింగేశ్వర వేద పాఠశాల జంధ్యాల నివాస సుబ్రహ్మణ్యశర్మ, ప్రవచనకర్త గజల్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి యాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహరాజు, గాదిరాజు బాబు మాట్లాడుతూ 76వ యాగం భీమవరంలో నిర్వహించడం ఈ ప్రాంతానికి సుభిక్షమన్నారు. 11 రోజులపాటు 26 మంది రుత్వికులచే 4 విభాగాల్లో యాగాలు నిర్వహిస్తామని, ఈనెల 25న శౌత్ర స్మార్త పుత్రకామేష్టి యాగంతో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. అందరూ భాగస్వాములు కావాలని కోరారు. యాగ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి, కాంతేటి వెంకటరాజు, ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, గోక రాజు పాండు రంగరాజు, కొత్తపల్లి శివరామరాజు, గన్నాబత్తుల శ్రీనివాస్, కనుమూరి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
మూడంచెల భద్రత
ఉండి: సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లకు చేర్చి మూడంచెల పటిష్ట ఽభద్రత ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య బుధవారం తెలిపారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరుగనున్న దృష్ట్యా ఇంకా 19 రోజుల వ్యవధి ఉందన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలోని స్ట్రాంగ్రూములకు కట్టుదిట్టంగా భధ్రత ఏర్పాటు చేశామని, స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయ న్నారు. అగ్నిప్రమాదాలకు అవకాశం లేకుండా అగ్నిమాపక అధికారులు సైతం అందుబాటు ఉంటారన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఒక సీఐ, నలుగురు ఎస్సైలతో పాటు ఇతర సిబ్బందితో 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. స్ట్రాంగ్రూమ్స్ వద్ద పటిష్ట బందోబస్తు భీమవరం: జిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎం బాక్సులను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్టు జిల్లా ఎస్పీ అజిత బుధవారం తెలిపారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద ఏర్పాటుచేసిన మూడంచెల కేంద్ర పోలీస్ బలగాలు, జిల్లా ఆర్మ్డ్ పోలీస్, సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి ఆమె సూచనలు, ఆదేశాలను జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్స్కు నలువైపులా పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటుచేశామని, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెరు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలకు కూడా తావు ఇవ్వరాదన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతూ సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలనీ ఆదేశించారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో భవన్స్ విద్యార్థుల ప్రతిభ
భీమవరం: సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో భారతీయ విద్యాభవన్స్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని స్కూల్ చైర్మన్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సెక్రటరీ యూకే విశ్వనాథరాజు, ప్రిన్సిపాల్ ఎల్వీ రమాదేవి చెప్పారు. బుధవారం భీమవరంలో ఫలితాల వివరాలను వెల్లడించారు. పశ్చిమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని తమ స్కూల్స్లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు 98 శాతం పర్సంటేజ్తో ప్రథమస్థానంలో నిలిచారన్నారు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల్లో 490 మార్కులతో తరుణ్ కుమార్ పాండా ప్రథమస్థానంలో నిలవగా, వేగిరాజు సాయిఅన్విత 475 మార్కులతో ద్వితీయ, కనుమూరి శ్రావ్య, దండు శ్రీచైతన్యవర్మ ఇద్దరూ 474 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్లో బల్ల పవన్ నాగ వెంకట సాయి 574 మార్కులు, ఎస్.రంజని 546 మార్కులు, పెన్మెత్స అక్షర 540 మార్కులు సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను శ్రీరంగనాథరాజు, విశ్వనాథరాజు, భవన్స్ వైస్ చైర్మన్ బీహెచ్ అచ్యుతరామరాజు, జిల్లా రైస్ మిలర్స్ అసోసియేషన్ చైర్మన్ సామంతపూడి శ్రీరామరాజు, కోశాధికారి కొత్త శ్రీనివాస్ అభినందించారు. -
17 నుంచి కొంతేరులో నాటికల పోటీలు
యలమంచిలి : కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో ఈ నెల 17, 18, 19 తేదీలలో 42వ వార్షిక అఖిల భారత స్థాయి నాటిక పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యూత్ క్లబ్ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నాటిక పోటీల ప్రదర్శనలకు ఏడు నాటికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి ప్రదర్శనగా కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ వారిచే కౌసల్యా సుప్రజా రామా, మలి ప్రదర్శనగా చిలకలూరిపేట సుకృతి క్రియేషన్స్ వారిచే ‘మిణుగురు వెలుగులు’ ప్రదర్శిస్తామన్నారు. రెండో రోజు నెల్లూరి శ్రీక్రాంతి ఆర్ట్స్ థియేటర్స్ వారిచే ‘ఓ మనిషి కావాలి’, రెండవ ప్రదర్శనగా అనకాపల్లి శ్రీ షిర్డీ సాయి కల్చరల్ క్రియేషన్స్ వారిచే ‘మలి సంధ్య’, మూడవ ప్రదర్శనగా శ్రీకాకుళం శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య వారిచే ‘ఆసరసాల’ నాటికలు ప్రదర్శిస్తారన్నారు. మూడో రోజు హైదరాబాద్ శ్రీయువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ వారిచే ‘బూడిద’, రెండవ నాటికగా గుడివాడ శ్రీ కృష్ణ తెలుగు ధియేటర్ ఆర్ట్స్ వారిచే ‘మళ్లీ కలిసి జీవిద్దాం’ నాటికలు ప్రదర్శిస్తామని మురళీకృష్ణ వివరించారు. నాటిక ప్రియులంతా పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
అతిసారకు గురై మహిళ మృతి
కుక్కునూరు: మండలంలోని కురుములతోగు గ్రామంలో అతిసారకు ప్రబలి ఓ మహిళ మృతి చెందగా, మరో తొమ్మిది అస్వస్థతకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. దామరచర్ల పంచాయతీ కురుములతోగు అటవీ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒడిశా, చత్తీస్ఘడ్ నుంచి వలస వచ్చిన గుత్తి కోయ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాగా, గత రెండు రోజులుగా గ్రామంలో పలువురు అతిసార వ్యాధికి గురై వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో కారం బొజ్జమ్మ (45) అనే మహిళ మృతి చెందింది. గ్రామ పెద్దలు ఈ విషయాన్ని సీపీఐఎంఎల్ ప్రజాపంధా (మాస్లైన్) దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్థానిక విలేకరులకు సమాచారం అందించారు. దీంతో బుధవారం విషయం వెలుగులోకి వచ్చి అమరవరం పీహెచ్సీ వైద్యులకు తెలియజేయగా, సిబ్బందితో కలిసి కురుములతోగు గ్రామానికి వెళ్లి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు వెంటనే చికిత్సను అందించారు. అమరవరం పీహెచ్సీ వైద్యులు అనంత్ మాట్లాడుతూ కలుషిత నీటితో పాటు ఫుడ్ పాయిజన్ కావడంతో గిరిజనులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు తగిన చికిత్స అందించామని ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు. 9 మంది గిరిజనులకు అస్వస్థత కరుములతోగు గ్రామంలో ఘటన -
ఎన్నికల విధులు ముగించుకుని తిరిగి వెళుతూ..
పాలకొల్లు సెంట్రల్: ఎన్నికల విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతూ నిద్రమత్తులో అదుపుతప్పి గాయాలపాలై స్పృహలో లేని స్థితిలో ఉన్న ఓ ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు గుర్తించి సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కారు. వివరాలిలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన ఎం.మార్కండేయులు ఎన్నికల విధుల్లో భాగంగా భీమవరంలో ఓటింగ్ యంత్రాలను అప్పగించి మంగళవారం ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. వీరవాసరం గ్రామం సమీపంలోని మురుగుకాలువ వంతెన వద్దకు వచ్చేసరికి నిద్రమత్తులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయాలపాలై ఘటనా స్థలంలో స్పృహలేని స్థితిలో ఉండగా, వెనుకే వచ్చిన ఉపాధ్యాయుడు జి.లక్ష్మీనారాయణ, మరికొందరు వెంటనే అతనిని గుర్తించి 108 వాహనంలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడ నుంచి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల సహకారంతో ప్రాణాపాయం నుంచి గట్టెక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
సుందరయ్యపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి
ఏలూరు (టూటౌన్): ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ సుందరయ్య అక్రమ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ కోరారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో ఒక పత్రికలో వచ్చిన వార్తను సాకుగా చూపి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే నెపంతో అధికారులు సస్పెండ్ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ఉద్యోగ సంఘాల సమావేశంలో పాల్గొనడం మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పరిధిలోకి రాదని, ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు ఓటు వేయమని ప్రేరేపించడం, రాజకీయ పార్టీల తరుపున ప్రచారం చేయడం మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పరిధిలోకి వస్తాయన్నారు. దురద్దేశపూర్వకంగా అధికారులు సుందరయ్యను అక్రమంగా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా కుట్ర పన్ని ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు దీనిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సుందరయ్యను తక్షణమే విధుల్లోకి తీసకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.జగన్నాథం, వి.సాయిబాబు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు దురదృష్టకరం
దెందులూరు : ఎన్నికల్లో ఓటమి భయంతో చింతమనేని, టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేయడం దురదృష్టకరమని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. బుధవారం కొవ్వలిలో టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన సొసైటీ డైరెక్టర్ గొతికల నాగభూషణంను ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో గాయపడిన కనకరాజును పరామర్శించారు. దాడి చేసిన వారిని, సహకరించిన వారిని, ప్రేరేపించిన వారిని చట్టం వదిలిపెట్టదనిన్నారు. దాడులు, దౌర్జన్యాలు చేస్తే తలరాత మారదని, టీడీపీ శ్రేణులు గమనించాలన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటి సుధాకర్, కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొమ్మిన రాము, సర్పంచ్ ఇంటేటి మధులత, వైస్ ఎంపీపీ గొల్ల నాగరాజు, ఎంపీటీసీ గొరిపర్తి వరలక్ష్మి, నాయకులు సోమేశ్వరరావు, పోలయ్య ఉన్నారు. దెందులూరులో ఇటీవల మృతి చెందిన కట్టా సుకాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. దెందులూరులో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు లెర్లి శివ, కిషోర్లను ఎమ్మెల్యే పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు పోకల రాంబాబు, జిల్లా కార్యదర్శులు చల్లా మేరిరాజు, కట్టా ఏసుబాబు, ఏఎంసీ డైరెక్టర్ పి.శ్యామలాదేవి, సొసైటీ చైర్మన్ కొలుసు గణపతిరావు, ఎంపీటీసీలు తాళ్లూరి నాగరాజు, తోట విజయకుమారి, మండల యువజన విభాగ అధ్యక్షులు గొరిపర్తి శ్రీనివాసరావు ఉన్నారు. -
యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్టు
ఏలూరు టౌన్: నగరంలోని కొత్తపేట గాడివారి వీధిలో ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏలూరు టూటౌన్ సీఐ ప్రభాకర్ చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపేట గాడివారి వీధిలో చీపుల్ల గణేష్ అనే యువకుడితో లీలాసాయి, చిన్ని, అనిల్ అలియాస్ మచ్చ అనే ముగ్గురు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో గణేష్కు మెడపై గాయం కావటంతో ఇరువర్గాల వారు హాస్పిటల్ వద్దకు చేరటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులు కత్తితో దాడి చేశారంటూ హాస్పిటల్ వద్ద నిరసనకు దిగారు. దీనిపై వెంటనే స్పందించి హాస్పిటల్ వద్ద వన్టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు సాధిక్, భాషా, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయటంతోపాటు, ఘటనా స్థలంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా చర్యలు చేపట్టారు. గణేష్పై కత్తితో దాడి చేయలేదని, ఘర్షణలో అతని మెడపై గాయం అయ్యిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ స్పష్టం చేశారు. నగరంలో అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జాతీయ నైపుణ్య పోటీలకు ఐటీఐ విద్యార్థి
ఏలూరు (ఆర్ఆర్పేట): వట్లూరులోని ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విద్యార్థి కాట్రు సిద్ధు త్వరలో జాతీయ స్థాయిలో జరుగనున్న నైపుణ్య పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ పి.రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీలోని యశోభూమి ఎక్స్పో సెంటర్లో జరిగే జాతీయ నైపుణ్య పోటీల్లో సిద్ధు పాల్గొననున్నట్లు వివరించారు. -
వైఎస్సార్ సీపీ విజయం నల్లేరుపై నడకే
భీమవరం: సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రంధి శ్రీనివాస్ విజయం నల్లేరుపై నడకేనని, ఓటింగ్ సరళిని చూస్తుంటే శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాఽధించడం ఖాయమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భీమవరంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పైనే శ్రీనివాస్ సునాయాసంగా విజయం సాధించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నో జిమ్మిక్కులు చేసి అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మకుండా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. నాయకులు పొన్నమండ బాలకృష్ణ, సీహెచ్ గోపి, బి.సునీల్బాబు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తాపీ కూలీ మృతి తణుకు: తణుకు పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ఈతకోట అన్నవరం (41) తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం మోటారు సైకిల్పై తణుకు వస్తుండగా జాతీయ రహదారిపై పాత బెల్లంమార్కెట్ సమీపంలో మోటారు సైకిల్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అన్నవరం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాలపై కేసుల నమోదు భీమవరం అర్బన్: పాత గొడవల నేపథ్యంలో బుధవారం జరిగిన కొట్లాటపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జి.రాజు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కరుకువాడ బేతపూడి గ్రామానికి కొల్లి నాగసత్యవతి, భర్త శ్రీనివాస్ ఇద్దరు పిల్లలతో భీమవరంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 13 ఎన్నికలకు ఓట్లు వేయడానికి తన సొంత గ్రామానికి వచ్చింది. ఈ నెల 14న నాగసత్యవతికి అన్నయ్య రావుల ఆదినారాయణ, మేనత్తకు బంగారం విషయమై మళ్లీ ఇరువర్గాలు కొట్లాడుకున్నాయి. గాయాలపాలైన ఇరు వర్గాలవారు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొల్లేరు చుట్టూనే రాజకీయం
కొల్లేరులో ఓట్లు సరళి ఇలా.. కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు మండలంలో నత్తగుళ్లపాడు, చటాకాయి, శృంగవరప్పాడు, గుమ్మళ్ళపాడు, పందిరిపల్లిగూడెం, కొట్టాడ, పెంచికలమర్రు, మండవల్లి మండలంలో ఇంగిలిపాకలంక, పెనుమాకలంక, కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు వంటి కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రెండు మండలాల్లో కొల్లేరు గ్రామాల ఓట్లు 19,896 ఉండగా 17,995 పోలయ్యాయి. ప్రస్తుత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొల్లేరు గ్రామాల ఓట్లు 20,667 ఉండగా 18,154 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 771 మంది ఓటర్లు పెరిగారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ కేటాయించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి ఆయన ప్రచారం చేశారు. ఇక కై కలూరు మండలం చటాకాయి గ్రామంలో 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి కామినేనికి కేవలం 2 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కామినేనికి ఇదే గ్రామం నుంచి 826 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి రాంప్రసాద్కు కేవలం 8 ఓట్లు వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో ఇదే చటాకాయి గ్రామం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుకు కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా కొల్లేరు గ్రామాల ఓటింగ్ సరళి ఉంటోంది. కై కలూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో కొల్లేరు గ్రామాల ఓట్లు కీలకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ పోటీల్లో ఉన్న అభ్యర్థుల జయాపజయాలపై లంక గ్రామాల ఓటర్లు ప్రభావం చూపనున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొల్లేరు గ్రామాల్లో అందరికీ సంక్షేమ పథకాలు దక్కాయి. గ్రామాల్లో సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూ.1.50కి తగ్గించారు. రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.412 కోట్లను కేటాయించారు. వడ్డీల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ టీడీపీ మండల ఇన్చార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ సీపీలో చేరి ఎమ్మెల్సీ పదవిని చేపట్టగా, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తో కలిసి కొల్లేరు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. ఇవే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా కై కలూరు ఇటీవల వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సర్వే పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రికార్డులు వచ్చిన తర్వాత కొల్లేరులో మిగులు భూములను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. భూముల పంపినీకి స్వయంగా తానే హాజరవుతానని హమీ ఇవ్వడంతో కొల్లేరు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొల్లేరు గ్రామాల ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు చెబుతున్నారు. పునర్విభజనలో ఒకే గూటికి కొల్లేరు జిల్లాల పునర్విభజనలో భాగంగా పూర్వ కృష్ణా జిల్లా నుంచి కై కలూరు నియోజకవర్గం చేరడంతో దాదాపు కొల్లేరు మొత్తం ఒకే గూటికి చేరింది. ఇంతవరకు పశ్చిమగోదావరిలో దెందులూరు, ఉండి, ఉంగుటూరు, పెదపాడు, ఏలూరు, నిడమర్రు, భీమడోలు, కృష్ణా జిల్లాలో కై కలూరు, మండవల్లి మండలాలు ఉండేవి. వీటిలో ఒక్క ఉండి మండలం మినహా మిగతావన్నీ ఏలూరు జిల్లాలో కలిపేశారు. దీంతో ఏలూరు పార్లమెంటు పరిధిలో కొల్లేరు గ్రామాల ఓట్లు కీలకంగా మారాయి. 122 గ్రామాల్లో 1.70 లక్షల మంది ఓటర్లు ఏలూరు జిల్లాలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 కొల్లేరు పరివాహక గ్రామాల్లో 82 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 3లక్షల 30 వేల మంది నివసిస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు లక్షా 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. కుల కట్టుబాట్లు పనిచేసేనా? కొల్లేరు గ్రామాల్లో పెద్దల కట్టుబాట్లు కనిపిస్తాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే 2009లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకు 11,857 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యెర్నేని రాజారామచందర్కు 1,985 ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు 10,582 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి వైఎస్సార్ సీపీకి చెందిన ఉప్పాల రాంప్రసాద్కు 4,673 ఓట్లు పడ్డాయి. ఇక 2019 ఎన్నికల్లో తిరిగి కొల్లేరు గ్రామాల సామాజికవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణకు టీడీపీ సీటు కేటాయించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) 9,357 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విధంగా కొల్లేరు ఓట్లు అభ్యర్థుల విజయంలో కీలకంగా మారుతున్నాయి. అభ్యర్థుల జయాపజయాల్లో కీలకం కానున్న లంకగ్రామాలు లంక గ్రామాల్లో పెరిగిన ఓట్లు.. పెద్దల కట్టుబాట్లు పనిచేసేనా ఎమ్మెల్సీ జయమంగళ కొల్లేరు గ్రామాల్లో విస్తృత ప్రచారం కొల్లేరు మిగులు భూములపై హామీ ఇచ్చిన సీఎం జగన్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జగన్ మాటలతో కూటమిలో వణుకు..చంద్రబాబును ప్రజలు నమ్మలేదు
జూన్ 09..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను..
ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. సినిమా టెంపుల్.. అమ్మపల్లి గుడిని చూశారా? (ఫొటోలు)
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
ధ్రువపత్రాల కోసం తహసీల్ చుట్టూ చక్కర్లు
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్ల్లు దగ్ధం
మగ్గం వర్క్తో మంచి ఆదాయం
రేపటి నుంచి సీపీగెట్కు దరఖాస్తుల స్వీకరణ
ఎన్నికల వేళ జోరుగా ‘ఉపాధి’ చెల్లింపులు
ఐటీఐలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement